Feb 9, 2020

రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్

02.01.20202
v రాజధాని పేరుతో జూదం
v ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం మార్చి1, 2014
v మార్చి 28న శివరామకృష్ణణ్ కమిటీ
v సెప్టెంబర్ 4, 2014 కమిటీ నివేదిక రాకుండానే రాజధాని ప్రాంత ప్రకటన
v కమిటీని పూర్తిగా పక్కన పెట్టి తన మంత్రులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు.
v ఆగస్టు 27, 2014న శివరామకృష్ణణ్ కమిటీ నివేదిక. దానిని పూర్తిగా పక్కన పెట్టి మంగళగిరి, తాడేపల్లి, తుళ్లూరు మండలాల్లోని 25 గ్రామాలతో రాజధాని ప్రకటన.
v డిసెంబర్ 30, 2014న ఏపీ సీఆర్డీఏ చట్టం ఆమోదం.
v మూడు పంటలు పండే ఈ ప్రాంతాన్ని ఎంపిక చేస్తే  వ్యవసాయ ఉత్పత్తులు, ధాన్యాగారం, పర్యావరణం దెబ్బతింటుందని శివరామకృష్ణణ్ పేర్కొన్నారు.
v రాజధాని ఎక్కడ వస్తుందో తెలిసిన ప్రభుత్వ పెద్దలు సెప్టెంబర్ 4, 2014 కు ముందు మంగళగిరి, తాడేపల్లి ప్రాంతంలోని భూములను  రైతుల వద్ద  అతి తక్కువ ధరలకు కొనుగోలు చేశారు.
v ఇష్టానుసారంగా రాజధాని, సీఆర్డీఏ సరిహద్దులు, అలైన్ మెంట్లు చేశారు.
v లంకలు, పోరంబోకు, ప్రభుత్వ భూములు దోచారు.  సమీకరణకు ఇచ్చి ప్రతిఫలంగా ప్లాట్లు
v రైతులకు ప్లాట్ల కేటాయింపుల్లో కూడా అక్రమాలు. ప్రభుత్వ పెద్దలకు మంచి స్థలాల్లో ప్లాట్లు, రైతులకు రేటు రాని ప్రాంతాల్లో ప్లాట్లు.
v 1975 నాటి అసైన్డ్ లాండ్ చట్టాన్ని గాలికి వదిలారు. బెదిరించి కారు చౌకగా అసైన్డ్ భూములు కొట్టేశారు.
v అవినీతి, పక్షపాతం, అప్రజాస్వామ్యకంగా అమరాతి రాజధాని పునాధులు లేచాయి.
v అంతర్జాతీయ భూ కుంభకోణం
v ప్రభుత్వ పెద్దలు రాజధాని ఎక్కడ పెట్టాలో ముందుగానే నిర్ణయించుకున్నారు. కానీ నూజివీడు, నాగార్జున యూనివర్సిటీ అని లీకులు ఇచ్చారు. గందరగోళం సృష్టించారు.
v అమరావతి ప్రాంతంలో 29 గ్రామాలలో చవకగా భూములు కొనుగోలు చేశారు.
v జూన్ 1, 2014 నుంచి డిసెంబర్ 31, 2014 వరకు ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగింది.
v గుంటూరు జిల్లాలోని తుళ్లూరు, అమరావతి, తాడికొండ, పెదరకూరపాడు, మంగళగిరి, పెదకాకాని, తాడేపల్లి, కృష్ణా జిల్లాలోని  ఇబ్రహీంపట్నం, పెనమలూరు, విజయవాడరూరల్, చందర్లపాడు మండలాల్లో భూ లావేదేవీలు జరిగాయి.
v గుంటూరు జిల్లాలో 2279.91 ఎకరాలు, కృష్ణా జిల్లాలో 1,790 ఎకరాలు కొనుగోలు చేశారు.
v జూన్ 2014లో 530.69 ఎకరాలు
v జూలైలో 685.34 ఎకరాలు
v ఆగస్టులో 353.03 ఎకరాలు
v సెప్టెంబర్ లో 567.26 ఎకరాలు
v అక్టోబరులో 564.91 ఎకరాలు
v నవంబర్ లో 836.81 ఎకరాలు
v డిసెంబర్ లో 531.90 ఎకరాలు
v మొత్తం 4,069.95 ఎకరాలు కొనుగోలు
v తాడికొండ మండలం కంతేరు గ్రామంలో హెరిటేజ్ కోసం 14.22 ఎకరాలు కొనుగోలు.
v చంద్రబాబు సీఎం అయిన నెల రోజులకే కొనుగోలు చేశారు.
v ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ స్వప్రయోజనాలకు ఉపయోగించుకున్నారు.
v పయ్యావుల కేశవ్ తమ కుమారుడు విక్రమ సింహ, పయ్యావుల హారిక, పయ్యావుల శ్రీనివాస్ ల పేరుపై రాజధాని ప్రకటనకు ముందే భూములు కొన్నారు.
v తెలంగాణకు చెందిన వ్యాపార భాగస్వామి వేం నరేంద్ర రెడ్డి కూడా వేం ఐశ్వర్యరెడ్డి, వేం కృష్ణ కీర్తి పేర్లపై  15.30 ఎకరాలు కొన్నారు.
v పల్లె రఘునాధ్ రెడ్డి పల్లె వెంకట కృష్ణ, కిషోర్ రెడ్డి పేర్లపై రాజధానిలో  7.5 ఎకరాలు కొన్నారు.
v కొమ్మాలపాటి శ్రీధర్ తన బీనామీ కంపెనీ అభినందన హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుమీద రాజధాని ప్రాంతానికి ఆనుకొని 68.6 ఎకరాలు కొనుగోలు చేశారు.
v లంకా దినకర్, కంభంపాటి రామ్మోహన్ తన కుమార్తె కంభంపాటి స్వాతి పేరుపై రాజధానిలో భూములు కొనుగోలు చేశారు.
v పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్, అల్లుడు వడ్లమూడు శ్రీహర్ష కుటుంబ సభ్యులు నడుపుతున్నా ఆర్ఆర్ ఇన్ప్రా అవెన్యూ సంస్థ పేరుపై తక్కువ రేటుకు భూములు కొన్నారు.
v యనమల రామకృష్ణుడు అల్లుడు పుట్టా మహేష్ యాదవ్ రాజధాని ప్రకటనకు ముందు ఏడు ఎకరాలు కొనుగోలు చేశారు.
v కోడెల శివప్రసాద్ తన బినామీ కంపెనీ  శశి ఇన్ ఫ్రా పేరిట 15.13 ఎకరాలు కొనుగోలు చేశారు.
v పత్తిపాటి పుల్లారావు 38.84 ఎకరాలు తన బినామీ గుమ్మడి సురేష్ పేరుపై కొన్నారు. రాజధాని నగరంలోనే కాదు, సరిహద్దులను ఆనుకొని ఈ భూములు ఉన్నాయి.
v గుమ్మడి సురేష్ నారా లోకేష్ కు బీనామీగా వ్యవహరించినట్లు సమాచారం.
v దూళిపాళ్ల నరేంద్ర చౌదరి దూళిపాళ్ల వీరవైష్ణవి, బినామి దేవరపు పునియ్య పేరుపై 13.5 ఎకరాలు కొనుగోలు చేశారు. కొండంరాజుపాలెం గ్రామ సమీపంలో ఈ కొనుగోళ్లు జరిగాయి.
v పొంగూరి నారాయణ తన వద్ద పని చేసే ఆవుల మునిశంకర్, రావూరి సాంబశివరావు, పొట్లూరి ప్రమిల, కోటపు వరుణ్ కుమార్ పేరుపైన 52.2 ఎకరాలు కొన్నారు.
v ఇవన్నీ సెప్టెంబర్ 4, 2014 రాజధాని ప్రకటనకు ముందే కొనుగోలు చేశారు.
v రావెల కిషోర్ బాబు విశాఖకు చెందిన మైత్రీ ఇన్ఫ్రా పేరున 40.85 ఎకరాలు కొన్నారు.
v జీవీ ఆంజనేయులు తుళ్లూరు, అమరావతి మండలాల్లో  కొనుగుంట్ల లక్ష్మీ సౌజన్య, కొనుగుంట్ల సత్యనారాయణ పేర్లపై రాజధానిలో 53.48 ఎకరాలు కొన్నారు.
v వేమూరి హరికృష్ణ ప్రసాద్ సోదరుడు వేమూరి రవి కుమార్  తుళ్లూరు, అమరావతి,తాడికొండ మండలంలో 25.68  ఎకరాలు కొనుగోలు. తన భార్య వేమూరి లక్ష్మి, 7 హిల్స్ లాజిస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్  పేరుమీద మరిన్ని భూములు, మొత్తంగా 62.78 ఎకరాలు కొనుగోలు చేశారు.
v రాష్ట్రంలోని తెల్ల రేషన్ కార్డులు 800 మంది రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలు చేశారు.
v తెలంగాణలోని మరో 60 మంది తెల్లరేషన్ కార్డుదారులు కూడా భూమి కొనుగోలు చేశారు.
v అధికార పార్టీ నేతలు వారి బంధువులు, అనుయాయుల భూములు ల్యాండ్ పూలింగ్ లోకి రాకుండా సరిహద్దులను మార్చారు.
v జూన్ 2015న రాజధాని పరిధిని 217 చదరపు కిలోమీటర్లు
v ఆ తరువాత సుర్బానురాంగ్ ప్లాన్ ప్రకారం 319.5 చదరపు కిలోమీటర్లు రాజధాని డ్రాఫ్ట్ ప్లాన్. దానిని పరిగణనలోకి తీసుకోలేదు.
v ఫిబ్రవరి 2016 నోటిఫికేషన్ ప్రకారం 217 చ.కి.మీ.
v రాజకీయంగా తమకు అనుకూలమైన వారికి లబ్ది చేకూరేవిధంగా వారి భూములను మినహాయించి పరిధి నిర్ణయించారు.
v రామకృష్ణ హౌసింగ్ కు లబ్ది. కాజ టోల్ గేట్ వద్ద 136.97 ఎకరాలు. సీఆర్డీఏ జోన్ పరిధిలోకి రాకుండా తప్పించారు.
v బాలకృష్ణ వియ్యంకుడు ఎంఎస్పీ రామారావు వీబీసీ ఫర్టిలైజర్స్ కు  చందర్లపేటలో  కేటాయించిన 498.3 ఎకరాల భూమి విషయంలో వారికి అనుకూలంగా నిర్ణయం.
v సీఆర్డీఏ ప్రాంతాన్ని ఆ ప్రాంతానికి విస్తరించారు.
v సీఆర్డీఏ జోన్ ప్రకటనలో కూడా ఎత్తుడగడలు
v సెప్టెంబర్ 22, 2015న జీఓఎంఎస్ – 207 ప్రకారం సీఆర్డీఏ పరిధిని 7068.2 చ.కి.మీ.ల నుంచి  8352.69 చ.కి.మీ.కు పెంచారు.
v ఇన్నర్, అవుటర్ రింగ్ రోడ్ల అలైన్ మెంట్లు కూడా తమకు అనుకూలంగా చేసుకున్నారు.
v హెరిటేజ్ ఫుడ్ కొనుగోలు చేసిన భూములు ఇన్నర్ రింగ్ రోడ్డు పక్కనే ఉన్నాయి.
v మురళీ మోహన్ కుంచనపల్లి సమీపంలో కొనుగోలు చేసిన 53.28 ఎకరాలకు ఆనుకొని ఇన్నర్ రింగ్ రోడ్డు వచ్చింది.
v లింగమనేనితో క్విడ్ ప్రోకో
v లింగమనేని రమేష్ భార్య సుమన, ఇతరులు ప్రశాంతి, స్వర్ణకూమారి, ఎల్.వి.రమేష్, ఎల్వీఎస్ రాజశేఖర్ పేర్ల మీదే కాకుండా లింగమనేని ఎస్టేట్స్, ఐజెఎం, లింగమనేని ఎడ్యుకేషన్ అకాడమీ ప్రైవేట్ లిమిటెడ్,  లింగమనేని ఇన్ఫోసిటీ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్ ఎల్ఈపీఎల్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్, లౌక్య హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్, స్వర్ణిక ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్, లింగమనేని ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్, కోదల ఎస్టేట్స్, వల్లభ ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, విఘ్నేష్ వెంచర్స్, వైట్ సీటీ ప్రాజెక్ట్స్, ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్లుమీద  భూములు కొనుగోలు. ఈ భూములన్నీ రాజధాని నగర పరిధిలోనికి గానీ, సీఆర్డీఏ పరిధిలోనికి గానీ తీసుకురాలేదు. వారి భూములకు పది గజాల దూరంలో రాజధాని సరిహద్దులు నిర్ణయించారు. ఇందుకు ప్రతిఫలంగా చంద్రబాబుకు లింగమనేని గెస్ట్ హైస్.
v 158 ఎకరాలకు సంబంధించి అక్రమాలు జరిగాయి.
v ప్లాట్ల కేటాయింపులో దళితులు, నిరుపేదలు దారుణంగా మోసపోయారు.
v అసైన్డ్ భూముల వ్యవహారంలో భారీ అక్రమాలు. అసైన్డ్ దారులకు బెదిరింపులు. పథకం ప్రకారం ఒకే సామాజిక వర్గంవారు అధికంగా ఈ భూములను  కారు చౌకగా కొనుగోలు చేసి, తరువాత వాటిని పూలింగ్ పరిధిలోకి తీసుకువచ్చారు.
v  నారా లోకేష్ సన్నిహితులు కొల్లి శివరామ్ 47.39 ఎకరాలు, గుమ్మడి సురేష్ 42.92 ఎకరాలు,  బలుసు శ్రీనివాసరావు 14.07 ఎకరాలు మొత్తంగా 338.88 ఎకరాల అసైన్డ్ భూమి కొనుగోలు చేశారు. ప్లాట్లు పొంది లబ్ది పొందారు.
23.01.2020 : అమరావతిలో భూముల కొనుగోలుకు సంబంధించి 796 తెల్ల రేషన్ కార్డు దారులపై సీఐడీ కేసు నమోదు.
v ల్యాండ్ పూలింగ్‍పై కేసు నమోదు చేసి విచారిస్తున్న సీఐడీ.
v  రూ.3 కోట్లకు ఎకరం భూమి కొనుగోలు చేసిన తెల్లరేషన్ కార్డు దారులు.
v  రూ.300 కోట్లతో భూమి కొనుగోలు చేసినట్టు గుర్తించిన సీఐడీ.
v  విచారణ కోసం నాలుగు బృందాలను ఏర్పాటు.
v  మొత్తం 129 ఎకరాలు కొన్న 131 మంది తెల్లరేషన్ కార్డుదారులు.
v  పెద్దకాకానిలో 40 ఎకరాలు కొన్న 43 మంది.
v తాడికొండలో 180 ఎకరాలు కొనుగోలు చేసిన 188 మంది.
v తుళ్లూరులో 243 ఎకరాలు కొన్న 238 మంది.
v మంగళగిరిలో 133 ఎకరాలు కొనుగోలు చేసిన 148 మంది.
v తాడేపల్లిలో 24 ఎకరాలు కొన్న 49 మంది తెల్ల రేషన్ కార్డు దారులు.
v తమను బెదిరించి భూములు లాక్కొన్నారని సీఐడీకి ఫిర్యాదు –
v అన్యాయం చేశారంటూ ఫిర్యాదు చేసిన వెంకటపాలెంకు చెందిన పోతురాజు బుజ్జమ్మ - బుజ్జమ్మకు చెందిన 99 సెంట్ల అసైన్డ్ భూమిని కొనుగోలు చేసిన టీడీపీ నేతలు
v మాజీ మంత్రులు నారాయణ, ప్రతిపాటి, నరసింహరావులపై కేసు నమోదు - సెక్షన్ 420, 506, 120/Bతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
v  విచారణ కోసం నాలుగు బృందాలు :  సీఐడీ ఎస్పీ మేరీ ప్రశాంతి
24.01.2020:
ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ మాటేలేదు – ఇష్టపడే అమ్ముకున్నాం: రాజధాని దళిత అసైన్డ్‌ రైతులు
v గత ప్రభుత్వం ఇచ్చిన 41జీవో దళిత రైతులు అసైన్డ్‌ భూములను అమ్ముకునే హక్కు కల్పించింది.
v  మా భూములకు మంచి రేట్లు వచ్చాయి.  ఇష్టపూర్వకంగానే వాటిని అమ్ముకున్నాం.
v సీఎం జగన్‌ ఆ జీవోను రద్దు చేసి అసైన్డ్‌ భూముల అమ్మకాలు, కొనుగోళ్లు జరపొద్దని మరొక జీవో తెచ్చారు.
v 41 జీవోని పునరుద్ధరిస్తే పేద దళిత రైతులు పైకొస్తారు. కొనుగోలు చేసేవారు ముందుకొస్తారు. అదికూడా అమరావతి అభివృద్ధి జరిగితేనే న్యాయం జరుగుతుంది. లేదంటే అన్యాయమైపోతారు. భూముల్ని లాక్కున్నారనే ఆరోపణల్లో నిజం లేదు. మంచి ధరలు వచ్చాయి కాబట్టే దళితులు స్వచ్ఛందంగా అమ్ముకున్నారు. చిన్నకారు రైతులకు ఐటీ నోటీసులు జారీ చేస్తారని ప్రచారం చేస్తున్నారు. రాజధానికి 1.74 ఎకరాల అసైన్డ్‌ భూమినిచ్చాను. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోతో భూములు కొనేవారు లేకుండాపోయారు. - మట్టుపల్లి గిరీశం; అసైన్డ్‌ రైతు, తాళ్లాయపాలెం.
v మా భూములు ఎవరూ లాక్కోలేదు. అప్పట్లో రేట్లు బాగున్నాయని అమ్ముకున్నాం. అది కూడా ఇష్టపడే అమ్ముకున్నాం. అప్పుడు అమ్ముకోలేని కొంత మంది రైతులు ఇప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారు. ఆ పాపం మనకొద్దని మనవి చేస్తున్నాం. మనం ఇష్టపడితేనే కొన్నారు. ఎవరూ లాక్కోలేదు. రాజకీయాల కోసం దళితులను అన్యాయం చేయవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. రాజధాని కోసం అర ఎకరం అసైన్డ్‌ భూమి ఇచ్చాం. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అనేది భూములు అమ్మకాల్లో ఉండదు. షేర్‌ మార్కెట్‌లో జరగుతుంది. దీనిని రాజధానికి ఆపాదించటం మంచిది కాదు. - గోచిపాతల నాగులు; దళిత అసైన్డ్‌ రైతు, తాళ్లాయపాలెం.
v  
ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌
ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్: అసెంబ్లీలో చెప్పిన విషయాలు: జూన్ 1, 2014 నుంచి  ఆరు నెలల లోపల  4070 ఎకరాలు వాళ్లకు, వాళ్లకు కావలసిన వారికి కొని పెట్టుకున్నారు. రాజధాని పెట్టబోతున్నట్లు తెలిసి వాళ్లు భూములు కొన్నారు. కురగల్లు, యరబాలెం, నవులూరుకు చెందిన  ఎస్సీ, ఎస్టీల భూములు కొనుగోలు చేశారు. 900 ప్లాట్లు ఈ రకమైన భూములే. లేని లంక భూములు ఉన్నట్లు రాసి, వారికి ప్లాట్లు ఇచ్చారు.

వాస్తవం: జూన్ 1, 2014 నుంచి సెప్టెంబర్ 4 వరకు రాజధాని పేరు ప్రకటించక ముందు 128 ఎకరాలు మాత్రమే అమ్మకాలు కొనుగోళ్లు జరిగాయి. రోడ్లు వేశారు.

 ధూళిపాళ్ల నరేంద్ర: మాకు భూములు ఉన్నాయి. ఆ భూములను రాజధాని ప్రకటన తరువాత రాష్ట్రం మీద ప్రేమతో, చట్టబద్ధంగా కొన్నాం. ‘‘మా కొనుగోళ్లలో అక్రమాలు, తప్పులేవైనా వుంటే విచారించి చర్యలు తీసుకోండి. అమరావతిలో భూములు కొనుగోలు చేసినవారి ఇళ్లకు సీఐడీ అధికారులను పంపించి విచారించారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందా? జరిగి ఉంటే చర్యలెందుకు తీసుకోవడంలేదు?’’
మాజీ మంత్రి నారాయణ :  రాజధానిలో తనకు 3,129 ఎకరాలున్నాయన్న ఆరోపణలను కొట్టివేశారు.
పట్టాభిరాం:   4070 ఎకరాలపై రికార్డులు బయట పెట్టాలి. ఆధారాలు చూపించకపోతే సభాహక్కులు నోటీసు ఇస్తాం.
టిడిపి నేతలు: అమరావతి, విశాఖలలో ఇన్ సైడ్ ట్రేడింగ్ పై న్యాయ విచారణకు డిమాండ్.

06.02.2020: అమరావతిలో అసైన్డ్‌ భూములపై ఐటీశాఖకు సీఐడీ లేఖ
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో అసైన్డ్‌ భూముల కొనుగోలులో నగదు లావాదేవీలపై విచారణ జరపాలని ఐటీ చీఫ్ కమిషనర్‌కు ఏపీ సీఐడీ అడిషనల్ డైరెక్టర్ సునీల్ కుమార్ లేఖ రాశారు. 2018 నుంచి 2019 వరకు 106 అనుమానాస్పద భూ లావాదేవీలు జరిగినట్లు ఈ లేఖలో సునీల్ తెలిపారు. వీటిలో రూ.2 లక్షలకు మించి నగదు లావాదేవీలు జరిగినట్లు తెలిపారు. ఈ లావాదేవీలపై ఆదాయపు పన్ను చట్టం ప్రకారం విచారణ జరపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఐటీ చట్టాలను ఉల్లంఘిస్తూ అసైన్డ్‌ భూముల అమ్మకాలు, కొనుగోళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఐటీ శాఖను ఆయన కోరారు. దర్యాప్తు వివరాలను తమకు తెలియజేస్తే, తాము తదుపరి చర్యలను చట్టపరంగా తీసుకుంటామని పేర్కొన్నారు. కాగా.. ఈ లేఖతో పాటు అసైన్డ్‌ భూముల  కొనుగోలులో ఉన్న 106 మంది వ్యక్తుల పూర్తి వివరాలు, అడ్రస్‌లు, భూముల సర్వే నెంబర్లతో సహా ఐటీ చీఫ్ కమీషనర్‌కు సీఐడీ పంపింది.
v అమరావతి గ్రామాల్లో 796 మంది తెల్లరేషన్ కార్డుదారులు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసులు నమోదు చేసింది.
v మాజీ మంత్రులు పి.నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, తాడికొండ వ్యవసాయ మార్కెటి కమిటీ మాజీ చైర్మన్ బెల్లకొండ వెంకట నరసింహారావులపై కేసులు నమోదు చేశారు.
v ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలకు సంబంధించి కృష్ణా జిల్లాలో ఏడుగురిపై సీఐడీ అధికారులు కేసులు నమోదు చేశారు. పెనమలూరు మండలానికి చెందిన వీరు తెల్లకార్డుదారులు. అమరావతిలో భూములు కొన్నారు. భూక్యా నాగమణి, మండవ నాగమణి, బొల్లినేని నరసింహారావు(పోరంకి), అబ్దుల్ జమేదార్ (గంగూరు), పోలినేని కొండల రావు(యనమలకుదురు), మండవ అనురాధ, వెనిగళ్ల ఉష(కానూరు), 2014లో జూన్ నుంచి డిసెంబర్ మధ్య వీరు భూములు కొనుగోలు చేశారు.


No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...