Jan 13, 2024

మలబద్ధకం - చికిత్స

 11 చిట్కాలు

మలబద్ధకం అంటే ఒక వ్యక్తికి మలవిసర్జన అవడం  చాలా కష్టం కావటం.  ప్రాసెస్ చేయబడిన మరియు శుద్ధి చేసిన ఆహారపు అలవాట్లు పెరగడంతో, మలబద్ధకం కూడా ప్రబలమైన సమస్యగా మారుతోంది. ఆహారం పెద్ద ప్రేగు గుండా వెళుతుంది, ఇక్కడ నీటిలో ఎక్కువ భాగం గ్రహించి మలం ఏర్పడుతుంది. ఇది శరీరం నుండి బహిష్కరించబడుతుంది మరియు మలబద్ధకం ఉంటే, ఈ మలం బయటకు వెళ్ళడం కష్టం, బాధాకరమైనది మరియు రక్తస్రావం కూడా కావచ్చు.

పిల్లలతో పాటు వృద్ధులలో మలబద్ధకం సాధారణం. పెద్దలతో పోలిస్తే పిల్లలు చాలా ఎక్కువ జంక్ ఫుడ్  తింటారు. వయస్సు పెరిగేకొద్దీ, పెద్దలు దంతాలు కోల్పోవడం ప్రారంభిస్తారు మరియు వారు తక్కువ నమలడం వల్ల అజీర్ణం మరియు మలబద్దకానికి దారితీస్తుంది. ఫైబర్, నీరు, కెఫిన్ మొదలైన అన్ని అంశాలతో సహా ఆహారo లో  మార్పుల కలయిక మలబద్దకాన్ని సమర్థవంతంగా చికిత్స చేయడంలో సహాయపడుతుంది.

 

1. ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీరు త్రాగటం మంచిది. దీనికి కొంచెం బేకింగ్ సోడా జోడించండి, ఇది ప్రేగులను శుభ్రపరచడంలో సహాయపడుతుంది.

2. ఉదయాన్నే ప్రేగు కదలికలను ప్రేరేపించడానికి అల్లం టీ మరొక గొప్ప నివారణ.

3. కొద్దిగా తేనె లేదా చక్కెరతో ఒక గ్లాసు వెచ్చని పాలు మలబద్దకానికి మంచి ఔ షధంగా చెప్పవచ్చు.

4. సునాముఖి ఆకు పొడి మలబద్ధకాన్ని నివారిస్తుంది.  గోరువెచ్చని నీటిలో ఈ ఆకు పొడిని కలిపి తీసుకోవడం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

5. నిద్రపోయేటప్పుడు నాభిపై కొన్ని చుక్కల గోరువెచ్చని ఆముదపు నూనెను పూయడం వల్ల ఉదయాన్నే మలం తేలికగా బయటకు పోతుంది. 

6. జామ, నారింజ, ద్రాక్ష, బొప్పాయి, ఆపిల్, అరటి  తదితర పండ్లు మలం సులభంగా బయటకు వెళ్ళడానికి సహాయపడతాయి.

7. మలబద్ధకం చికిత్సలో ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్ లేదా బొప్పాయి రసం చాలా ఉపయోగపడుతుంది.

8. మలబద్దకం రాకుండా ఉండటానికి సుమారు 8 నుండి 10 గ్లాసుల నీరు త్రాగాలి..

9. అధిక కొవ్వు, ప్రాసెస్ చేసిన ఆహారాలు,  కెఫిన్ మలబద్దకానికి ప్రధాన కారణాలు. అందువల్ల వాటిని తీసుకోకూడదు.

10.  త్రిఫల సూర్ణంను వెచ్చని నీటితో కలిపి తీసుకుంటే మలబద్దకాన్ని నివారించవచ్చు.  ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ పరాన్నజీవి లక్షణాలను కలిగి ఉంది. ఇది పెద్దప్రేగు మొత్తం ప్రక్షాళనకు సహాయపడుతుంది.

11. పావన ముక్తసనం, యోగా ముద్ర, ధనూర్ ఆసనం, వజ్రాసనం వంటి యోగాసనాలు జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపిస్తాయి.  వీటి ద్వారా పేరుకుపోయిన వాయువును విడుదల చేయడం, మలం బయటకు వెళ్ళడం జరుగుతుంది.

ఈ చిట్కాలను అనుసరించడం తో పాటు మలబద్ధకం నుండి దీర్ఘకాలిక నివారణను అందించడంలో ఆహారం, జీవనశైలి క్రమశిక్షణ చాలా ప్రభావవంతంగా ఉంటుంది.తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా ఆకు కూరలు తీసుకోవడం మంచిది.

Jan 3, 2024

జాతి రత్నం సావిత్రిబాయి పూలే


మూఢవిశ్వాసాలతో ఛాందస మత గ్రంథాల నిర్బంధాల మధ్య స్త్రీ కి విద్య అవసరం లేదంటూ నిర్బంధాలు విధించిన ఛాందసవాదుల ను ఎదిరించి తానే విద్యకు శ్రీకారం చుట్టి భారతదేశ తొలి ఉపాధ్యయునిగా ఎంపికై భారత దేశ వ్యాప్తంగా విద్యను స్త్రీలకు అందించిన భారతదేశ జాతిరత్నం సావిత్రిబాయి పూలే అని ప్రముఖవైద్యులు కే వి ఎస్ సాయి ప్రసాద్ అన్నారు.. ది 3-1- 2024 బుధవారం ఉదయం పాత మంగళగిరి పొట్లాబత్తుని వెంకటేశ్వరరావు కళానిలయంలో మంగళగిరి సాహితీ కళావేదిక ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటైన తొలి భారతీయ ఉపాధ్యాయుని సావిత్రిబాయి పూలే 193 వ జయంతి సందర్భంగా మంగళగిరి సాహితీ కళా వేదిక కన్వీనర్ గుత్తికొండ ధనుంజయరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు . 190 సంవత్సరాలకు పూర్వం ఆనాటి మత దురంకారులతో అనేక అవమానాలు గురైనా.. మొక్కవోని ధైర్యంతో స్త్రీలు ఎందుకు విద్యను అభ్యసించకూడదు అంటూ తానే విద్యను నేర్చుకుని ఉపాధ్యాయురాలుగా స్త్రీ విద్య వ్యాప్తికి శ్రీకారం చుట్టారన్నారు. నేటి స్త్రీ అభ్యున్నతికి సావిత్రిబాయి పూలే ఆదర్శమన్నారు... కానీ నేడు విద్య వింత పొగడలు పోతోందని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంటూ ప్రజలకు విద్యను దూరం చేయాలని కుట్రలు పన్నుతున్నారన్నారు. వాటిని తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఇటువంటి సమయంలో సావిత్రిబాయి పూలే ఆశయాలు స్ఫూర్తినిస్తాయన్నారు.

మంగళగిరి సాహితీ కళావేదిక కో కన్వీనర్ రేఖా కృష్ణార్జున్ రావు మాట్లాడుతూ నాటి దుర్భర పరిస్థితుల్లో సావిత్రిబాయి పోరాటాన్ని వివరిస్తూ వర్తమానంలోనే దుస్థితికి చైతన్య లోపమే కారణం అని దీనిని మనం అధిగమించాలన్నారు.నవ యువ కవి గోలి మధు మాట్లాడుతూ విద్యా ప్రాధాన్యతను గుర్తించి ప్రతి మహిళ విద్యా వంతురాలు కావాలని ఎన్నో అవమానాలను ఎదుర్కొన్న ఆమె చేసిన, నేడు బ్రష్టు పట్టిన కార్పొరేట్ విధానానికి వ్యత్యాసాన్ని గుర్తించి ఈ పరిస్థితులు మారాలన్నారు. బుద్ధభూమి మాస పత్రిక వర్కింగ్ ఎడిటర్ గోలి సీతారామయ్య ప్రసంగిస్తూ సావిత్రిబాయిపూలే సేవలను తెలుగు రాష్ట్రాల్లో వ్యాప్తి చేసిన వారి కృషి గొప్పదని అన్నారు.కార్యక్రమంలో ముందుగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి డాక్టర్ సాయి ప్రసాద్ , ప్రముఖులు పూలమాలవేసి  ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శిరందాసు నాగార్జున, అవ్వారు శ్రీనివాసరావు,సందుపట్ల భూపతి, ఆకురాతి రత్నరావు, మహమ్మద్ యూసఫ్, జొన్నాదుల నాగమల్లేశ్వరరావు, చిలక వెంకటేశ్వరరావు, కంచర్ల క్రాంతి తదితరులు పాల్గొన్నారు.

పీఎఫ్ ఖాతాదారులకు మెరుగైన సేవలందిస్తున్నాం

ప్రాంతీయ కమిషనర్ రాజేశ్వర్ రాజేష్

గుంటూరు, జనవరి 2: ప్రావిడెంట్ ఫండ్ (పిఎఫ్) ఖాతాదారుల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తున్నట్లు గుంటూరు ప్రాంతీయ కమిషనర్ రాజేశ్వర్ రాజేష్ తెలిపారు. ఖాతాదారులు కార్యాలయానికి రాకుండా నేరుగా ఆన్లైన్ ద్వారా సమస్యలను పరిష్కరించుకొనే విధంగా సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకొచ్చినట్లు చెప్పారు. బృందావన్గార్డెన్స్ పి ఎఫ్ కార్యాలయంలో మంగళవారం జర్నలిస్టులు, ఖాతాదారులతో జరిగిన ముఖాముఖి కార్యక్రమం లో ఆయన ప్రసంగించారు. ఖాతాదారులకు ఇ-మెయిల్, ఎక్స్, కుకు., వాట్సాప్ 9494657469 వంటి ప్రచారసాధనాలు, గ్రీవెన్స్సెల్ ద్వారా సేవలందిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ, ప్రైవేట్ సంస్థల యాజమాన్యాలు ప్రతినెల 15వతేదీ లోపు తమ వద్ద పనిచేస్తున్న ఉద్యోగి, కార్మికుల జీతాల నుంచి మినహాయించిన సొమ్ముతోపాటు తమ వాటా ధనాన్ని కూడా పిఎఫ్ కార్యాలయానికి జమ చేయాలన్నారు. దీనిలో ఎవరికి మినహాయింపు లేదన్నారు. చెల్లింపులు ఆలస్యమైతే 33 నుంచి వంద శాతం జరిమానా, 12 శాతం వడ్డీ వసూలు చేస్తామని, కొన్ని సందర్భాలలో శిక్షలు విధిస్తామని ప్రాంతీయ కమిషనర్ రాజేశ్వర్ రాజేష్ హెచ్చరించారు. అసిస్టెంట్ కమిషనర్ జెఆర్ మాధవ శంకర్ మాట్లాడుతూ కనీసం 20 మంది సిబ్బంది పనిచేసే సంస్థలు పిఎఫ్ పరిధిలోకొస్తాయన్నారు. నెలకు రూ. 15 వేల పైన వేతనం పొందే కార్మికుడు, ఉద్యోగి బేసిక్, డిఎ మొత్తంపై యజమాని నుంచి షేర్ధనం పొందిన వారికి హయ్యర్ (అధిక) పెన్షన్ మార్గదర్శకాలు వర్తిస్తాయన్నారు. ఒకవేళ పెన్షనర్ అకాల మరణం చెందితే వారి జీవిత భాగస్వామికి జీవితాంతం కనీసం వెయ్యి రూపాయల పెన్షన్ లభిస్తుందని తెలిపారు.

 టెలికం జిల్లా సలహా కమిటీ సభ్యుడు, సీనియర్ జర్నలిస్ట్ నిమ్మరాజు చలపతిరావు మాట్లాడుతూ వివిధ ప్రాంతాల్లో పత్రికల్లో పనిచేస్తున్న 58 ఏళ్ళు నిండిన వారు సత్వరమే పెన్షన్ పొందటానికి పిఎఫ్ సిబ్బంది సహకరించాల న్నారు. ఈ సందర్భంగా కమిషనర్, సహాయ కమిషనర్లను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు కె శరచ్చంద్రజ్యోతిశ్రీ, కందిమళ్ళ వెంకట్రావు, శిరందాసు నాగార్జున, షేక్ రాజా తదితరులు పాల్గొన్నారు.

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...