Jan 3, 2024

పీఎఫ్ ఖాతాదారులకు మెరుగైన సేవలందిస్తున్నాం

ప్రాంతీయ కమిషనర్ రాజేశ్వర్ రాజేష్

గుంటూరు, జనవరి 2: ప్రావిడెంట్ ఫండ్ (పిఎఫ్) ఖాతాదారుల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తున్నట్లు గుంటూరు ప్రాంతీయ కమిషనర్ రాజేశ్వర్ రాజేష్ తెలిపారు. ఖాతాదారులు కార్యాలయానికి రాకుండా నేరుగా ఆన్లైన్ ద్వారా సమస్యలను పరిష్కరించుకొనే విధంగా సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకొచ్చినట్లు చెప్పారు. బృందావన్గార్డెన్స్ పి ఎఫ్ కార్యాలయంలో మంగళవారం జర్నలిస్టులు, ఖాతాదారులతో జరిగిన ముఖాముఖి కార్యక్రమం లో ఆయన ప్రసంగించారు. ఖాతాదారులకు ఇ-మెయిల్, ఎక్స్, కుకు., వాట్సాప్ 9494657469 వంటి ప్రచారసాధనాలు, గ్రీవెన్స్సెల్ ద్వారా సేవలందిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ, ప్రైవేట్ సంస్థల యాజమాన్యాలు ప్రతినెల 15వతేదీ లోపు తమ వద్ద పనిచేస్తున్న ఉద్యోగి, కార్మికుల జీతాల నుంచి మినహాయించిన సొమ్ముతోపాటు తమ వాటా ధనాన్ని కూడా పిఎఫ్ కార్యాలయానికి జమ చేయాలన్నారు. దీనిలో ఎవరికి మినహాయింపు లేదన్నారు. చెల్లింపులు ఆలస్యమైతే 33 నుంచి వంద శాతం జరిమానా, 12 శాతం వడ్డీ వసూలు చేస్తామని, కొన్ని సందర్భాలలో శిక్షలు విధిస్తామని ప్రాంతీయ కమిషనర్ రాజేశ్వర్ రాజేష్ హెచ్చరించారు. అసిస్టెంట్ కమిషనర్ జెఆర్ మాధవ శంకర్ మాట్లాడుతూ కనీసం 20 మంది సిబ్బంది పనిచేసే సంస్థలు పిఎఫ్ పరిధిలోకొస్తాయన్నారు. నెలకు రూ. 15 వేల పైన వేతనం పొందే కార్మికుడు, ఉద్యోగి బేసిక్, డిఎ మొత్తంపై యజమాని నుంచి షేర్ధనం పొందిన వారికి హయ్యర్ (అధిక) పెన్షన్ మార్గదర్శకాలు వర్తిస్తాయన్నారు. ఒకవేళ పెన్షనర్ అకాల మరణం చెందితే వారి జీవిత భాగస్వామికి జీవితాంతం కనీసం వెయ్యి రూపాయల పెన్షన్ లభిస్తుందని తెలిపారు.

 టెలికం జిల్లా సలహా కమిటీ సభ్యుడు, సీనియర్ జర్నలిస్ట్ నిమ్మరాజు చలపతిరావు మాట్లాడుతూ వివిధ ప్రాంతాల్లో పత్రికల్లో పనిచేస్తున్న 58 ఏళ్ళు నిండిన వారు సత్వరమే పెన్షన్ పొందటానికి పిఎఫ్ సిబ్బంది సహకరించాల న్నారు. ఈ సందర్భంగా కమిషనర్, సహాయ కమిషనర్లను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు కె శరచ్చంద్రజ్యోతిశ్రీ, కందిమళ్ళ వెంకట్రావు, శిరందాసు నాగార్జున, షేక్ రాజా తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...