2019 ఏప్రిల్ 11న ఆంధ్రప్రదేశ్ లో జరిగిన 17వ సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు లోక్ సభ నియోజకవర్గం నుంచి లక్షా 48వేల ఓట్ల మెజార్టీతో డాక్టర్ శింగరి సంజీవ్ కుమార్ విజయం సాధించారు.
17వ
లోక్సభలో డాక్టర్ సంజీవ్ కుమార్ పనితీరు, ఆయన సాధించిన విజయాలు
కర్నూలు మెడికల్
కాలేజీలో సూపర్ స్పెషాలిటీ మెడికల్ సీట్లు:
6 సూపర్ స్పెషాలిటీ కోర్సుల అనుమతి కొరకు కృషి చేసి 19 SSPG seats సాధించారు. 10 సంవత్సరాలకు పైగా
పెండింగ్లో ఉన్న విద్యార్థుల డిమాండ్కు పరిష్కారం లభించింది.
ఆదోని ESI హాస్పిటల్ పునర్నిర్మాణం: శిధిలావస్థలో ఉన్న ఆదోని ESI హాస్పిటల్ భూమి అన్యాక్రాంతం కాకుండా ప్రహరీ గోడ నిర్మాణం చేశారు. కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఆసుపత్రి నిర్వహణ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రతిపాదనలు పంపించగలిగారు.
కర్నూలు - జైపూర్ రైలు : డాక్టర్
సంజీవ్ కుమార్ గారి కృషి వల్ల వారానికి ఒకసారి కర్నూలు నుండి జైపూర్ కు రైలు
ప్రయాణం సౌకర్యం.
రైల్వే గూడ్స్ షెడ్డును దూపాడుకు మార్చడం: కర్నూలు రైల్వే స్టేషన్ ఆవరణలో గూడ్స్ రైల్వే షెడ్డు ఉన్నది. దీని వలన లారీల వంటి భారీ వాహనాల ప్రమాదాలు, ట్రాఫిక్ రద్దీ ఎక్కువైంది. ఈ సమస్య పరిష్కారానికి రైల్వే గూడ్స్ షెడ్ని దూపాడుకు తరలించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
ఆదోని బైపాస్ రోడ్ : పలు దఫాలు కేంద్ర ప్రభుత్వ అధికారులను
సంప్రదించి, ఆదోని ప్రజల చిరకాల కోరిక అయిన ఆదోని బైపాస్
రోడ్డు సాధించ కలిగారు.
MPLADS ద్వారా జరిగిన అభివృద్ధి పనులు : అంబులెన్సు, శ్మశానవాటికల
పనులు, కమ్యూనిటీ హాల్స్, కోవిడ్
మహమ్మారి సమయంలో అందించిన వైద్య పరికరాలు, ప్రభుత్వ భవనాలకు ప్రహరీ గోడలు, విద్యాలయాలలో
డిజిటల్ పరికరాలు, దివ్యాంగుల కొరకు డిజిటల్ లైబ్రరీ, మురికి
కాలువలు, గ్రామాలలో విద్యుత్ పరికరాలు, పోలీసు
జీపులు, పోలీస్ ఆఫీసులో గదులు, బోరుబావులు, గ్రామాలలో
సిమెంటు రహదారులు, విద్యాలయాలలో తరగతి గదులు, గ్రామాలలో
నీటి సరఫరా కొరకు పైపు లైన్లు తదితర పనులను MPLADS
నిధులతో చేశారు.
కర్నూలు నియోజకవర్గంలో రూ.2
కోట్ల 17 లక్షల ఖర్చుతో 19
పనులు జరిగాయి.
కోడుమూరునియోజకవర్గంలో రూ.2
కోట్ల 40 లక్షల ఖర్చుతో 31 గ్రామాలలో 95
పనులు జరిగాయి.
పత్తికొండ నియోజకవర్గంలో రూ.3
కోట్ల 18 లక్షల ఖర్చుతో 44 గ్రామాలలో 108
పనులు జరిగాయి.
ఆలూరు నియోజకవర్గంలో రూ.4
కోట్ల 27 లక్షల ఖర్చుతో 100 గ్రామాలలో 196
పనులు జరిగాయి.
ఎమ్మిగనూరు నియోజకవర్గంలో రూ.కోటి 62
లక్షల ఖర్చుతో 39 గ్రామాలలో 69 పనులు జరిగాయి.
ఆదోని నియోజకవర్గంలో రూ. కోటి 23 లక్షలు ఖర్చుతో 24
గ్రామాలలో 37 పనులు జరిగాయి.
మంత్రాలయం నియోజకవర్గంలో రూ.4
కోట్ల 10 లక్షల ఖర్చుతో 27 గ్రామాలలో 71
పనులు జరిగాయి.
17వ లోక్సభ సభ్యుడిగా సభలో డాక్టర్
సంజీవ్ కుమార్
డాక్టర్ సంజీవ్ కుమార్ గారు లోక్ సభలో 22 చర్చలలో పాల్గొన్నారు. 1952
నుండి 19 సార్లు కర్నూలు లోక్ సభకు ఎన్నికలు
నిర్వహించారు. 12 మంది ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతము 17వ
లోక్ సభ పని చేస్తున్నది. 18వ లోక్ సభ కొరకు 13.5.24న
ఎన్నికలు నిర్వహించనున్నారు.
డాక్టర్ సంజీవ్ కుమార్ గారు 12 ప్రైవేట్ మెంబెర్స్ బిల్లుల కోసం దరఖాస్తు
చేశారు. అందులో 6 బిల్లులు లోక్సభలో ప్రవేశ పెట్టారు. పార్లమెంట్
72 సంవత్సరాల చరిత్రలో కర్నూలు ఎంపీగా
డాక్టర్ సంజీవ్ కుమార్ రికార్డు ఇది. కర్నూలుకు
సంబంధించి లోక్ సభ చరిత్రలో ఇది ఒక రికార్డు. అంటే గతంలో కర్నూలు నుంచి ఎన్నికైన
ఎవరూ సభలో ఇన్ని ప్రైవేటు బిల్లులు ప్రవేశపెట్టలేదు.
2. భారతీయ మెడిసిన్ వ్యవస్థకు సంబంధించిన జాతీయ
కమిషన్ బిల్లు ( National Commission for
Indian System of Medicine Bill 2022-(109/2022)
3. న్యాయ ప్రమాణాలు, జవాబుదారీ బిల్లు (Judicial Standards and Accountability Bill 2022-
(110/2022)
4.భారతీయ వైద్యసేవలకు సంబంధించి రాజ్యాంగ సవరణ బిల్లు (Constitution Amendment Bill for Indian Medical Service
(23/2023)
5. దివ్యాంగుల హక్కుల బిల్లు (The Rights of Persons with Disabilities Bill (12/2023)
6. చేనేత కార్మికుల సంక్షేమ అథారిటీ బిల్లు (Handloom Weavers Welfare Authority Bill (58/2023)
డాక్టర్ సంజీవ్ కుమార్ లోక్
సభలో లేవనెత్తిన ప్రశ్నలు
17వ లోక్ సభలో డాక్టర్ సంజీవ్ కుమార్ 225
ప్రశ్నలు లేవనెత్తగలిగారు.
300 రోజులు మాత్రమే లోక్ సభ నిర్వహణ
సంవత్సరానికి 100
రోజుల చొప్పున 500 రోజులు లోక్ సభ నిర్వహించ వలసి ఉంది. అయితే, కోవిడ్
కారణంగా 300 రోజులు మాత్రమే లోక్ సభ నిర్వహించారు. పూర్తి
స్థాయిలో లోక్ సభ నిర్వహణ జరిగి ఉంటే డాక్టర్ సంజీవ్ కుమార్ గారి పని తీరు ఇంకా
మెరుగ్గా ఉండేది.
లోక్ సభలో డాక్టర్ సంజీవ్ కుమార్ గారి పనితీరు గతంలో ఎంపికైన 12 మంది పూర్వ లోక్ సభ సభ్యుల కంటే మెరుగ్గా ఉందన్న ప్రశంసలు అందుకున్నారు. కర్నూలు ఎంపీగా ప్రశ్నలు అడగడంలో, ప్రైవేటు బిల్లులు ప్రవేశపెట్టడంలో, చర్చలలో పాల్గొనడంలో ఆయన ఓ రికార్డును స్థాపించ గలిగారు. ఒక పద్మశాలి లోక్ సభ సభ్యుడు ఈ స్థాయిలో ప్రశ్నించడం, చర్చలలో పాల్గొనడం, ప్రశ్నలు లేవనెత్తడం చేనేత వర్గాలకు గర్వకారణంగా ఉంది. ఉన్నత చదువులు చదివిన నిజాయితీపరులు లోక్ సభకు ఎన్నికైతే దేశానికి ఎంత ప్రయోజనకరమో డాక్టర్ సంజీవ్ కుమార్ చేసి చూపించారు.