మానవత్వం పరిమళించిన
మంచి
మనిషి డాక్టర్ సంజీవ్ కుమార్
"వైద్యో నారాయణోహరిః"
అనిఆర్యోక్తి. దానికి నిలువెత్తు రూపకంగా చేతిలో స్టెతస్కోప్ పట్టి రోగాలను నయం
చేసే ఆయన... సమాజంలోని లక్షలాది నిరుపేదల గుండె చప్పుళ్లను సైతం వింటున్నారు.మంచు
తెరలాంటి తెల్లకోటు వేసుకొని పసి పాప బోసినవ్వుల్లాగాచిరునవ్వులు చిందిస్తూ
అందరిని ఆత్మీయులుగా భావించి పలుకరించే ఆయనమనసు సైతం తెల్లన
.ఆపరేషన్ల ద్వారా
ప్రాణాలు పొసేఆయన,సమాజంలోని పేదరికంపై పోరాడుతున్నారు. ఉచిత
ఆపరేషన్లు, ఉచిత పెన్షన్లు, పేద
విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు మొదలగు సేవా కార్యక్రమాలు చేస్తూ సమాజంలోని
దారిద్య్రానికి ఆపరేషన్ చేస్తున్నారు.ఆ డాక్టర్ మరెవరోకాదు....
ఆయనే శ్రీ శింగరిసంజీవ్ కుమార్. ఆయనగురించిసమాజానికితెలియచేసేభాగ్యంమాకుకలిగినందుకుసంతోషిస్తున్నాను.
డాక్టర్ సంజీవ్ కుమార్ గారిబాల్యం:వస్త్ర వ్యాపారరంగములోప్రముఖులైనశ్రీశింగరి
శ్రీరంగం, శ్రీమతి రంగమ్మ గార్ల పుణ్య దంపతులకు1967 వ సంవత్సరము, జనవరి
మాసము 3 వ తేదీన మన కర్నూలు నగరము నందు డాక్టర్ సంజీవ్
కుమార్ గారు జన్మించారు. బాల్యము నుండియు
చాలా హుషారుగా, చురుకుగా ఉంటూ ఆట పాటలంయందు, చదువులంయందు ప్రతిభ కనపరిచేవారు. ఆరుగురి సంతానంలో రెండవ వారు సంజీవ్
కుమార్.
కుటుంబ నేపథ్యం :
·
శింగరి
శ్రీరంగం గారి కుటుంబంలో సంజీవ్ కుమార్ ఒక్కరే డాక్టర్ కాదు. ఆయన ఇద్దరు సోదరులు
గంగాధర్, అచ్చుతరావు, ముగ్గురు సోదరీమణులు మహాలక్ష్మి, ఛాయాదేవి, మంజుల మొత్తం
ఆరుగురూ డాక్టర్లే. విద్య ప్రాధాన్యతను గుర్తించి వారిని చదివించిన ఘనత అంతా వారి మాతాపితలదే.
పిల్లలు అందరూ ప్రభుత్వ కాలేజీలలో MBBS సీట్లు సాధించడం విశేషం. అంతే కాదు, ఇద్దరు
తమ్ముళ్ల భార్యలు పద్మజ, సువర్ణ, ముగ్గురు సోదరీమణుల భర్తలు సందా సూర్య ప్రకాష్,
మందా నాగేశ్వరరావు, కన్నెపల్లి శ్రీనివాస్ లు కూడా డాక్టర్లే. శ్రీరంగం గారి 14
మంది మనవళ్లు, మనవరాళ్లలో ఏడుగురు డాక్టర్లు. ఒక మనవడు, ఒక మనవరాలు డాక్టర్లను
పెళ్లి చేసుకున్నారు. వెరసి 21 మంది డాక్టర్లు. వారిది ఓ
పెద్ద డాక్టర్ల కుటుంబంగా ప్రసిద్ధికెక్కింది. ఒకే కుటుంబములో 21 మంది డాక్టర్లు ఉండడం రాయలసీమలో ప్రప్రథమం. ఇది
బహుశా ఆంధ్ర ప్రదేశ్ వైద్య రంగంలోనే ఒక
అరుదైన రికార్డుగా చెప్పుకోవచ్చు. వీరిలో అత్యధికులు
బంగారు పథకాలు సాధించినవారు కావడముమరొక ఒక విశేషం.
·
సంజీవ్
కుమార్గారు 1992 మార్చి 4న డాక్టర్ బలిమిడి వసుంధరను
పెళ్లి చేసుకున్నారు. వారి కుమార్తె కుమారి సౌమ్య కూడా తండ్రి బాటలోనేపయనించి మొదటి
ప్రయత్నంలో ఓపెన్ క్యాటగిరీలో కర్నూలు మెడికల్ కాలేజీలో MBBS
సీటు సాధించి పూర్తి చేశారు. వారి ఇద్దరు
కుమారులు అక్షయ్, అభిరామ్ 9,8 తరగతులు చదువుతున్నారు.
ప్రతిభాశాలియైనవిద్యార్థి:పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లు
ఆయన తొలి నుంచి చదువులలోప్రతి తరగతిలో ప్రథములుగా నిలుస్తూ, ఉన్నత శిఖరాలు
అధిరోహించారు.
·
1971-1982
మధ్య కాలంలో కర్నూలు సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో చదివారు. అక్కడ
ప్రతి తరగతిలోనూ అగ్రభాగాన నిలిచారు. విద్యార్థి దశలోనే ఆయనకు నాయకత్వ లక్షణాలు
అబ్బడంతో పదవ తరగతిలో స్కూల్ విద్యార్థి
నాయకుడిగా అందరి ప్రశంశలను పొందారు.
·
1982-84లో
కర్నూలు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదివారు. డిస్టింక్షన్ లో
ఉత్తీర్ణులయ్యారు. ఆ పరంపర అలాగే కొనసాగించారు.
·
1984-1990లో
MBBS
చదివారు. మొదటి ప్రయత్నంలోనే కర్నూలు మెడికల్ కాలేజీ నందు MBBS సీటు సాధించారు. అక్కడ కూడా డిస్టింక్షన్ లో ఉత్తీర్ణులయ్యారు.MBBSఫైనల్ పరీక్షలలో గైనెకాలజి
విభాగంలో విశ్వవిద్యాలయ స్థాయిలో 1st Rank తో బంగారు పతకం సాధించారు. జనరల్ సర్జరీ విభాగంలో
ద్వితీయ స్థానంలో నిలిచారు.
·
1992-1995 మధ్య కాలములో కర్నూలు
మెడికల్ కాలేజీలో MS జనరల్ సర్జరీ చదివారు. MSప్రవేశ పరీక్షలో విశ్వవిద్యాలయ స్థాయిలో 5వ ర్యాంక్ సాధించి ఓపెన్
కేటగిరీలో సీటు పొందారు.యూనివర్సిటీ 1st Rank తో MS పూర్తి చేశారు.
·
1998-2000 :MChయూరాలజీసూపర్ స్పెషాలిటీకోర్సుప్రవేశ పరీక్షలో రాష్ట్ర స్థాయి 2nd
Rank సాధించి, హైద్రాబాదులోనిఉస్మానియా మెడికల్ కాలేజీనందుచదివారు.
MCh Finalపరీక్షలందు డిస్టింక్షన్ లో ఉత్తీర్ణులయ్యారు.
·
"ప్రతిభ"
మరియు “అణకువ”
ఉంటే దేనైనా సాధించ వచ్చని మన డాక్టర్ గారు విద్యార్థి దశ నుండే
నిరూపించి ఎందరో భావి విద్యార్థులకు మార్గ దర్శకులైనారు.
వైద్యసేవలోనిష్ణాతుడు :అత్యధిక సంఖ్యలో
లాప్రోస్కోపిక్ ఆపరేషన్లు చేసిన ఘనత ఆయనది. ప్రజల డాక్టరుగా,ఉత్తమ వైద్యులుగా పేరు
గడించారు.
·
1990-1992 మధ్య కాలము :కర్నూలు నగరము నరసింగ రావు పేటలో “బెంగుళూరు హాస్పిటల్”
అను సర్జికల్ క్లినిక్ స్థాపించి, వేల
సంఖ్యలో శస్త్ర చికిత్సలు నిర్వహించారు. “2000 వేల రూపాయలకేఆపరేషన్లు” అన్న నినాదంతో వేల మంది
పేదల గుండెలలో “పేదల డాక్టరు” గా నిలిచిపోయారు.
·
2000-
2005 మధ్య కాలము :కర్నూలు నగరము జిప్సన్
కాలనీలో “బెంగుళూరుసూపర్
స్పెషలిటీ హాస్పిటల్” అను సర్జికల్ హాస్పిటల్స్థాపించి
యూరాలజీ మరియు లాపరోస్కోపీ విభాగాలలో పేరు గడించారు.
·
2006
నుండి ప్రస్తుతము వరకు :పేదలకు తక్కువ ఖర్చుతో
కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలన్న సంకల్పంతో కర్నూలులోని వెంకటరమణ కాలనీ నందు, అత్యాధునిక వసతులతో 50 పడకల “ఆయుష్మాన్ ద ఫ్యామిలీ
హాస్పటల్” స్థాపించారు. ఈ ఆస్పత్రి
ద్వారా కర్నూలు, కడప, అనంతపురం,
చిత్తూరు, ప్రకాశం, మహబూబ్
నగర్ మరియు బళ్ళారి జిల్లాల ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి
తీసుకువచ్చారు. ఇది కార్పోరేట్ ఆస్పత్రి. ఇక్కడ కార్పోరేట్ వైద్యం అందుతుంది.
ఫీజులు మాత్రం అందరికీ అందుబాటులో ఉంటాయి. అదే దీని ప్రత్యేకత. అది డాక్టర్ సంజీవ్
కుమార్ గారికేసాధ్యమయ్యింది. ఇక్కడ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, జనరల్ సర్జరీ,
యూరాలజీ, గైనకాలజీ సంబంధిత వ్యాధులకు ల్యాప్రోస్కోపి పద్ధతిలో శస్త్ర చికిత్సలు
చేస్తారు. అపెండిక్స్, పిత్తాశయంహెర్నియా, కడుపు నొప్పి, అల్సర్, వరిబీజం, గొంతులో
గడ్డలు, మొలలు, కిడ్నీలో రాళ్లు, ఎక్టోపిక్ గర్భం, అండాశయ, గర్భాశయవ్యాధులు ...
మొదలైన అన్ని రకాల వ్యాధులకు శస్త్ర చికిత్సలు చేస్తారు. లేజర్ సర్జరీ కూడా ఇక్కడ
అందుబాటులో ఉంది. ఈ ఆస్పత్రి ద్వారా
ఆయన ప్రజలకు బాగా చేరువయ్యారు. రోగులతో
నవ్వుతూ మాట్లాడుతూ, వారిలో మనోధైర్యాన్ని నింపుతూ ప్రజల మన్నన
పొందుతున్నారు. "హస్తవాసి మంచిది"
అన్న పేరు పొందారు.పేద ప్రజలకు "సంజీవని "
అందిస్తూ, తనపేరును
సార్థకం చేసుకున్నారు.
సేవా
తత్పరత వంశపార్యంపరంగావచ్చింది: "మానవ
సేవ్ మాధవ సేవ" అను సూక్త్యానుసారం సేవా దృక్పథం అనేది వారి రుధిరంలోనే
ఉంది. జననీజనకులనుండి ఆయనకు వారసత్వముగా సంక్రమించింది. సమస్త
దానాలలోకెల్లా గొప్ప దానం భూదానం. దాని ప్రాముఖ్యతను గుర్తించిశ్రీశ్రీరంగం గారు
తన సోదరులతో కలిసి పత్తికొండ గ్రామములోని పెద్దల ఆస్తి అయిన 7 ఎకరాల భూమిని 145 కుటుంబాలకు ఉచితంగా
ఇచ్చారు.“అంజనేయ
నగర్”అని
పిలువబడే ఆ కాలనీ పత్తికొండ పాత పేటలో ఉన్నది. సమాజములో వెనుకబడిన
వర్గాల వారినిఆదరించడములో తాము ముందుంటామనినిరూపించుకున్న కుటుంబం డాక్టర్ గారిది.
పేదప్రజల గుండె చప్పుడుడాక్టర్శింగరిసంజీవ్కుమార్ : తండ్రి లక్షణాలు
పుణికిపుచ్చుకున్న డాక్టర్ సంజీవ్ కుమార్గారు పేద ప్రజల గుండె చప్పుడై
చేపడుతున్న సే
వా కార్యక్రమాలు :
v
పెన్షన్లు
: మిత్రుడు
వేమయ్య మరియు సోదరుడు అచ్యుతరావుతో కలిసి గత రెండున్నర సంవత్సరములుగా 30 నిరుపేద కుటుంబాలకు నెలకు రూ. 1000/- చొప్పున
పెన్షన్ అందిస్తున్నారు.
v
ఉచిత
వైద్య శిబిరములు:
·
"ఆరోగ్యమే మహాభాగ్యము"అన్న సూత్రాన్ని గుర్తించి 2008 నుండి2016 వరకుఆయుష్మాన్ ఫ్యామిలీ హాస్పిటల్
ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా వ్యాప్తంగా 416 ఉచిత మెడికల్
క్యాంపులు నిర్వహించి, ఉచితంగా మందులు పంపీణీ చేశారు.
·
2016లో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి రోజున ఆనంద జ్యోతి సేవా ట్రస్ట్మరియు బుట్టా ఫౌండేషన్వారిఆధ్వర్యములో
ఒకే రోజు 7 ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహించి 7520మందికి ఉచిత వైద్యం అందించారు. వలసలకు పేరొందిన
కర్నూలు, కల్లూరు, కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆదోని, దేవనకొండ
మరియు పత్తికొండ గ్రామాలలో ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు.
·
2018
ఆగష్టు నుండి 2019 జనవరి వరకు :“ఆనంద జ్యోతి 100 ఉచిత
క్యాంపులు 500 ఉచిత ఆపరేషన్లు” అను
పథకంలో భాగంగా 62 ఉచిత సర్జరీ క్యాంపులు నిర్వహించి, 375
ఉచిత ఆపరేషన్లు చేయడం విశేషం.ఆరోగ్యశ్రీ పథకంలో లేని వ్యాధులకు కూడా ఆనంద జ్యోతి
సేవా ట్రస్ట్ ద్వారా ఉచితంగా శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. హాస్పటల్ బెడ్
ఛార్జీలు, ఆపరేషన్ థియేటర్ చార్జీలు, ఆక్సిజన్, డాక్టర్ ఫీజులు, నర్సు ఫీజు, రక్త పరీక్షలు అన్నీ ఉచితం. రోగులు
మందుల ఖర్చు మాత్రమే భరించవలసి ఉంటుంది.
v
విద్యార్థులకు
ప్రోత్సాహకాలు:
·
మనిషిలోని
అంతర్గతంగా దాగిన శక్తులను వెలికి తీయటానికి గల ఏకైక మార్గం ప్రోత్సాహకాలివ్వడం. ప్రతిసంవత్సరం పదవ
తరగతి, ఇంటర్మీడియట్
మరియు డిగ్రీ కోర్సులలో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ప్రోత్సహకాలు అందిస్తూ వారికి బాసటగా నిలుస్తున్నారు.
·
"విద్యార్జనకు
పేదరికం అడ్డు కాదు".నిరుపేద కుటుంబములో జన్మించి 2016 MBBS ప్రవేశ
పరీక్షలో రాష్ట్ర స్థాయి 1ST RANK సాధించిన మాచాని హేమలత గారికి, మిత్రులతో
కలిసి, పౌర సన్మానం చేశారు. రాజకీయ ఉద్దండులు, మేధావులుమరియువేలాది మంది జొహరాపురంప్రజలు
పాల్గొన్న ఆ కార్యక్రమము గ్రామీణ పేద ప్రజలలో ఆత్మస్థైర్యాన్ని నింపింది.
v
ఉద్యోగ
మేళాలు: నిరుద్యోగ అభ్యర్థులకు ఉద్యోగ మేళాలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించేందుకు
పలు సార్లు ఉద్యోగ మేళాలు నిర్వహించారు.
v
ప్రవేశ
పర్రేక్షలకు కోచింగ్:
ప్రతిభావంతులైన విద్యార్థులకు బ్యాంకింగ్ మరియు సివిల్స్ ప్రవేశ
పరీక్షలకోచింగ్ఇప్పిస్తూ అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నారు.
v
వివాహ
పరిచయ వేదికలు: గత మూడు సంవత్సరాలుగా అన్ని వర్గాల ప్రజలకు ఉచిత వివాహ పరిచయ వేదికలు
నిర్వహించారు.
v ఆపత్కర సమయాలలో మానవత్వం:"ఆపద సమయాలలో వెన్ను తట్టి నిలిచి ఆదుకున్నవాడే నిజమైన
మిత్రుడు" అని గ్రహించిన వారు కావటం
చేత, కర్నూలువరదలసమయములోవందల మందికిఆయుష్మాన్ఆసుపత్రిలోఆశ్రయంకల్పించిభోజనవసతిసమకూర్చారు.ఉచిత వైద్య సేవలు
అందించారు.
v సంఘ సేవ: కుల సంఘాలలో మరియు బలహీన వర్గాలలో ఐకమత్యం సాధించేందుకు ఆంధ్ర
ప్రదేశ్ లోని 13 జిల్లాలు
పర్యటించి సంఘీయులను విశేషంగా చైతన్య పరిచారు.
v కర్నూలు ఫోర్ట్ లయిన్స్ క్లబ్ ఉపాధ్యక్షుడిగా సేవలు అందించారు.
v లలిత కళలలో ఉచిత శిక్షణ : తన చుట్టూ
ఉన్న ప్రజలు సంతోషంగా ఉండాలన్న మనస్తత్వం వారిది. కుల మతాలు, ఆర్ధిక స్తోమతలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు లలిత కళలలో, POPA ద్వారా, ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు.జిల్లా
స్థాయి ఉద్యోగస్తులు కూడా తమ పిల్లలను ఈ
శిక్షణా తరగతులకు పంపిస్తున్నారంటే శిక్షణా ప్రమాణాల స్థాయిని మనం అర్థం
చేసుకోవచ్చు.
ఈ విధంగా ఆయన
అన్ని వర్గాల వారికి ఆత్మబంధువయ్యారు.
ప్రజలజీవితాలలో వెలుగు నింపేందుకు, మహోన్నత
విలువలతోసేవలు అందిస్తూ, సమాజ నిర్మాణానికి నడుంకట్టి
ముందడుగు వేస్తున్న డా. సంజీవ్ కుమార్ గారు ఆదర్శనీయులు.
రాజకీయరంగప్రవేశం :
శింగరి
శ్రీరంగ వంశబ్దశింగరిసంజీవ కుమార్నామధేయా ! శ్రీరంగం రంగమ్మల పుత్ర
రత్నమా ! మీ పేరులోనే ఆదర్శం,
సేవా గుణం సమ్మిళతములై ప్రకాశించినవి. అందుకే జీవం పొసే "సంజీవ
కుమార్" గా ప్రముఖ వైద్యులుగా కీర్తి గడించావు. దాదాపు 27 సంవత్సరాలు మీ శ్రీమతి వసుంధరతో కలిసి కుటుంబ భారాన్ని మోశారు.
సామాన్యుల
కష్టాలు గుర్తెరిగిన కుటుంబం మీది. అందుకే పరంపరగా వచ్చిన పొలాన్ని నిలువ నీడ లేక
నిరాశ్రయులైన వారికి ధారాదత్తం చేశారు మీ పెద్దలు. రెక్కాడితే కానీ డొక్కాడని పేద
ప్రజల ఇళ్లలో దీపం వెలిగించారు.
నిజాయితీగా
వైద్య సేవలు చేస్తూ ‘సామాన్యులకు కూడా వైద్యము భారము కాదు’అని
నిరూపించారు. నిరూపిస్తూ ఉన్నారు. వైద్య శాస్త్ర సాంకేతికకు మారు పేరుగా కర్నూలు
నగరములో వెలిసింది‘ఆయుష్మాన్ హాస్పిటల్’. గతములో ‘బెంగళూరు హాస్పిటల్’పేరుతొ
రెండు వేలకే శస్త్ర చికిత్సలునిర్వహించి రాయలసీమలోనే అతి తక్కువ ధరకే ఆపరేషన్ చేసే
"పేదల డాక్టరు"గా ఖ్యాతి
గడించారు. పేదల డాక్టరుగా చిన్న-పెద్ద,
బీద-ధనిక, అను వ్యత్యాసము చూప కుండా,
'నేను మీ అందరి వాడిని' అని ముందుకు వెళ్తున్నారు.
అందరి గుండెల్లో నిలిచి పోయారు.
భాయి
భాయి అన్న నినాదాముతో అన్ని కులాలను,
మతాలను, వర్గాలను ఏకం చేసి ముందుకు
నడిపిస్తున్నారు. ఎందరో కళాకారులను, సామాజిక కార్యకర్తలను,
యువతరాన్ని ప్రోత్సహిస్తున్నారు. విద్యార్థులకు చేయూత నిస్తున్నారు.
పేద రోగుల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేసారు. చేస్తూనే వున్నారు. అందుకే గాంధీ
జయంతి రోజున గాంధేయ వాదిగా 'ఆనంద జ్యోతి ట్రస్ట్' నెలకొల్పి సేవా కార్యక్రమాలు చేపట్టారు.
మిమ్ములను ప్రోత్సహించడం, ముందుకు నడిపించడం మా
బాధ్యత, కనీస కర్తవ్యం..
అన్యాయాన్ని
అరికట్టడం కోసం... దగా పడ్డ తమ్ముళ్లు చెల్లెళ్లకు చేయూతనివ్వడం
కోసం.....నిద్రాణమైయున్న మన సమాజాన్ని మేల్కొల్పడం కోసం.....అన్న పూర్ణ దేశంగా
పేరు గాంచిన మన సమాజములోని కటిక పేదల కోసం.... అభాగ్యులను, నిరుపేదలను ఆదుకోవడం
కోసం .....విద్య వైద్యం అందరి హక్కు అనిచెప్పడం కాదు చేసి చూపించే ఉత్తమ నాయకుల కొరకు
ఎదురు చూసే ఈ సమాజము కోసం…. మీలాంటి వారు రాజకీయ ప్రవేశం
చేసి చట్ట సభల్లో మీ గళం వినిపించాలి. సామాన్య ప్రజల అభివృద్ధి కోసం పాటు పడుతున్న
మీ లాంటి వారు ప్రజా క్షేత్రములోకిరావాలనియువకులు, మహిళలు, బడుగు బలహీన వర్గాల వారంతా మీకు జేజేలుపలుకుతున్నారు. రాజకీయ నాయకునిగా
మాకు అండగా నిల్చోమని సాదరంగా మన సమాజం అంతా మీకు ఆహ్వానం పలుకుతుంది.
డాక్టర్ సంజీవ్ కుమార్ అభిమాన సేవా సంఘం, కర్నూలు జిల్లా.