Mar 27, 2019


కేంద్ర నిధులలో అధిక వాటా రాబట్టే విధంగా ప్రణాళికలు
రాష్ట్రీయ కృషి వికాస్ యోజనపై సీఎస్ సమీక్ష

              సచివాలయం, మార్చి 27: రాష్ట్రీయ కృషి వికాస్ యోజన(ఆర్ కెవివై)కు కేంద్ర నుంచి అధిక నిధులు రాబట్టడానికి వీలుగా ప్రణాళికలు రూపొందించాలని సంబంధిత అధికారులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) అనిల్ చంద్రపునీఠ సూచించారు. సచివాలయం 1వ బ్లాక్ మొదటి అంతస్తులోని సీఎస్ సమావేశ మందిరంలో ఆర్ కెవివై రాష్ట్ర స్థాయి నిధుల మంజూరు కమిటీ సమాశం సీఎస్ అధ్యక్షతన జరిగింది.  సమావేశంలో  2018-19 ప్రగతిని, 2019-20 ప్రతిపాదనలను సమీక్షించి, కేంద్ర పథకాలకు సంబంధించి కేంద్ర నిధులలో అధిక వాటా రాబట్టడానికి సీఎస్ సలహాలు ఇచ్చారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి నిధుల మంజూరు, విడుదల, వినియోగం, అదనపు నిధుల మంజూరు గురించి సంబంధిత అధికారులు సీఎస్ కు వివరించారు. వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, పట్టుపురుగుల పెంపకం, మత్స్య, జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయం(జడ్ బీఎన్ఎఫ్), ఆచార్య ఎన్జీ రంగా, ఉద్యానవన, పశువైద్య విశ్యవిద్యాలయాలు, ఆత్మ(అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్ మెంట్ ఏజన్సీ) తదితర శాఖల నిధుల వినియోగం, ప్రతిపాదనలపై చర్చించారు. చిరుధాన్యాల ఉత్పత్తి, వివిధ జిల్లాలలో ప్రకృతి వ్యవసాయం తీరుని సమీక్షించారు.  పశుసంవర్ధక శాఖ పరిధిలో 8 ప్రాజెక్టులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆరు వెటర్నరీ డిస్పెన్సరీలను ప్రతిపాదించారు. ఈ సమావేశంలో కేంద్ర వ్యవసాయ శాఖ జాయింట్ సెక్రటరీ నీర్జా, ప్రభుత్వ సలహాదారు విజయకుమార్, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్, హార్టీ కల్చర్, సెరీకల్చర్ కమిషనర్ చిరంజీవి చౌదరిఫిషరీస్ శాఖ కమిషనర్ రామ్ శంకర్ నాయక్, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి బి.శ్రీధర్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కెవివి సత్యనారాయణ, వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ డి.మురళీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...