Feb 27, 2020

పౌరసత్వ సవరణ– విశాఖలో చంద్రబాబు పర్యటన - సినీ పరిశ్రమ తరలిరావడం


టీవీ 24X7 - తేదీ: 27.02.2020 గురువారం ఉదయం 7.30 గం. నుంచి
అంశాలు :  పౌరసత్వ సవరణ చట్టం – 27 మంది మృతి -  విశాఖలో చంద్రబాబు పర్యటన —
              సినీ పరిశ్రమ తరలిరావడం --
యాంకర్ :  కృష్ణ సాయి రామ్

చెవుల కృష్ణాంజనేయులు – సీనియర్ జర్నలిస్ట్
ఢిల్లీలో అల్లర్లు దేశప్రజానికాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. శాంతిభద్రతలకు రాజకీయ పార్టీలు కృషి చేయవలసిన అవసరం ఉంది. రెచ్చగొట్టే ప్రసంగాల వల్లే అల్లర్లు జరుగుతున్నాయని బీజేపీ వారు అంటున్నారు. కాని కపిల్ మిశ్రా దగ్గర నుంచి గోలీమార్ అనే నినాధాలతో . కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూడ్, రమేష్ శర్మ వంటి వారు బాధ్యతాయుతంగా రెచ్చగొట్టేవిధంగా మాట్లాడారు. కేంద్రంలో  అధికారంలో ఉన్నవారే ఆ విధంగా మాట్లాడుతున్నారు. కేంద్రం, ఇంటిలిజన్స్ ఫెల్యూర్స్ ఉంటే సరిదిద్దుకోవచ్చు. ఇక్కడ ఫయిల్యూర్ కాదు.కావాలని చేస్తున్నారు. రజనీకాంత్ ఎన్ఆర్సీని సపోర్ట్ చేశారు. కేంద్రం వైఫల్యం ఉంది సరిదిద్దుకోమని ఈరోజు చెబుతున్నారు. కేంద్రం స్పందించాలి. అమిత్ షాని రాజీనామా చేయమనండం రాజకీయం కావచ్చు. వారు ఢిల్లీ వెళ్లి అందరినీ శాంతింపచేయాలి. ఇంకొక్క ప్రాణం కూడా పోకుండా కేంద్రం చర్యలు తీసుకోవాలి.
అభివృద్ధి వికేంద్రీకరణ అనేది వైసీపీ వాదన, దానిని వీరు వ్యతిరేకిస్తున్నారు. ఎవరి వాదన వారు వినిపిస్తారు. చంద్రబాబు పర్యటనని ప్రజలు వ్యతిరేకిస్తుందని, ఘర్షణలు జరుగుతాయని భావిస్తే  పోలీసులు ఆంక్షలు పెట్టవచ్చు. ఇదే జగన్ గారు విశాఖలో పారిశ్రామికవేత్తల సమావేశం జరిగే సమయంలో అడ్డుకోవడానికి వెళ్లి నేను ముఖ్యమంత్రిని కాబోతున్నాను, మీరు ఆపడం సరైనది కాదు. అప్పుడు ప్రభుత్వ తప్పు చేస్తుందని ప్రతిపక్ష నేతగా మాట్లాడారు. ఈ రోజు ఇలా చేయడం మంచిదికాదు. చంద్రబాబు నాయుడు వెళ్లేటప్పుడు అక్కడ కంధకం తవ్వారు. ప్రజలు నిర్ణయించుకుంటారు. మీరెందుకు షరతులు విధించడం. ఈ విషయంలో ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది.  
గత ప్రభుత్వం ప్రతిపక్షనేతని అడ్డుకుందని అంటున్నాం. ఇప్పుడు అదే రకంగా వైసీపీ వ్యవహరించడం ఏమిటీ? రేపు మీ మీద కూడా అలాంటి విమర్శలే వస్తాయి.
సినీప్రముఖులు సీఎంని కలవడం మంచిదే. సినీపరిశ్రమకు అనువైన ప్రాంతం ఉత్తరాంధ్ర. అందరికీ ఉపయోగంగా ఉంటుంది. రాష్ట్రాభివృద్ధికి కూడా ఉపయోగపడుతుంది. విశాఖ, నెల్లూరు రెండు ప్రాంతాలు సినీపరిశ్రమలకు అనుకూలం అన్న ఆలోచనలు వచ్చాయి. నగరానికి దూరంగా, వినియోగంలేని ప్రభుత్వ భూములు వారికి ఇస్తే బాగుంటుంది. సినీపరిశ్రమ, సాఫ్ట్ వేర్, ఆర్థిక పరంగా విశాఖకు అనుకూలంమైన ప్రాంతం. ఆ రకంగా దానిని అభివృద్ధి చేస్తే బాగుంటుంది.  


కాకుమాను రాజశేఖర్ – వైసీపీ
దేశ రాజధాని నడిబొడ్డున 27 మంది మరణించడం దురదృష్టకరం. ఈ ఉద్యమాన్ని ఇంటిలిజన్స్ వర్గాలు ఎందుకు పసిగట్టలేకపోయాయి. రాజధానిలో ఇటువంటి ఘటనలు దేశభద్రతకు సంబంధించినది. కఠిన నిర్ణయాలు, చర్యలు తీసుకుంటే బాగుండేదని మేం భావిస్తున్నాం. రాజకీయ ప్రయోజనాలకు వాడుకోకూడదు. అన్ని పార్టీలు, కులాలు, మతాలు కృషి చేయవలసిన అవసరం ఉంది. 1984 నాటి దాడులను దేశ ప్రజలు మరచిపోలేదు. మిలటరీనైనా రప్పించి అదుపు చేయాలి. ట్రంప్ కూడా అన్ని మతాల అభిప్రాయాలను గౌరవించవలసి ఉంది. చట్టం ప్రవేశపెట్టినప్పుడు లేని పరిస్థితి వచ్చింది.
ముస్లింల మనోభావాలకు అనుగుణంగా మేం విధానం మార్చుకున్నాం. దీనిని తప్పుపట్టవలసిన అవసరంలేదు. రాజకీయప్రయోజనాలు ఆశించవలసిన అవసరంలేదు. గతం 5 ఏళ్లలో జరిగిన అవినీతి, అన్యాయాలకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారు. దీనికి దానికి ముడిపెట్టవలసిన అవసరంలేదు.
చంద్రబాబు నాయుడు యాత్ర ప్రజల కోసం కాదు. పార్టీ ఉనికిని కాపాడుకోవడం కోసం. మునిగిపోయే నావలాంటి పార్టీ నుంచి ఇతర పార్టీలలోకి నేతలు వెళుతున్నారు. జగన్ గారి నాయకత్వంలో 9 నెలల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్ని వర్గాల ప్రజలు సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. గత 5 ఏళ్లలో ఆయన అరాచక పాలన, దౌర్జన్యాలు ఎలా ఉన్నాయో చూసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓడించారు. ఈ రోజుకు కూడా సిగ్గుసెరం లేకుండా, బుద్ది జ్ఞానం లేకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. ఆయన పర్యటన వల్ల మాకేమీ నష్టంలేదు. మూడు రాజధానులపై వ్యతిరేకంగా మాట్లాడటం, జగన్ గారిపై ఇష్టారాజ్యంగా వ్యవహరించడం మేం వ్యతిరేకిస్తున్నాం. ప్రత్యేక హోదా విషయంలో శాంతియుతంగా నిర్వహించే క్యాండిల్ ర్యాలీకి ఆయనని ఎందుకు అడ్డుకున్నారు. రన్ వేపైకి వెళ్లి అడ్డుకున్నారు లోకల్ పోలీసులు. అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టి ప్రజలకు వాస్తవాలను తెలియజేయవలసిన అవసరం ఉంది. ప్రజలు అడ్డుకుంటారు. 5 ఏళ్ల పరిపాలన చూసే ఓడించారు. అయినా మీకు బుద్ది రాలేదు. గతంలో జగన్ ని ప్రజలు అడ్డుకోలేదు. పోలీసులు అడ్డుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు మాటలు ప్రజలు వినడానికి సిద్ధంగా లేరు. మాకు అడ్డుకోవలసిన అవసరంలేదు. పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. అక్కడివారిని మోసం చేసినందుకు వారు చంద్రబాబు పర్యటనని వ్యతిరేకిస్తున్నారు.
సినిమా పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య గ్యాప్ లేదు. వారి వల్ల మేం అధికారంలోకి రాలేదు. మాకు ప్రయోజనంలేదు. గతంలో మాదిరిగా వారిని వాడుకోవలసిన అవసరంలేదు. సినీ పరిశ్రమ రాష్ట్రానికి రావడం మంచి పరిణామం. గతంలో ఒకరితరువాత ఒకరు మద్రాస్ నుంచి హైదరాబాద్ తరలి వచ్చారు. దేశంలో హైదరాబాద్ కు ఒక ప్రాధాన్యత వచ్చింది. జగన్ పరిపాలన నచ్చి, మెచ్చి వారు వచ్చి అడిగారు. వారికి రాయితీలు ఇవ్వడానికి మేం సిద్ధంగా ఉన్నాం. వారి రాకను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోం.  వారి సహకారం అవసరమే. రామానాయుడు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే స్టూడియో నిర్మాణం మొదలు పెట్టారు.

బాబురావు – సీపీఎం
రెచ్చగొట్టిన బీజేపీ నాయకులపై కేసులు నమోదు చేయమని ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. ఆయనను వెంటనే ట్రాన్సఫర్ చేశారు.అది వేరే విషయం. బీజేపీ నేతలు అమిత్ షా మొదలు ఢిల్లీ ఎన్నికలలో ఎలా మాట్లాడారో అందరికీ తెలుసు. సీఏఏ వ్యతిరేకులను పోలీసులు ఖాళీఈ చేయించకపోతే మేమే ఖాళీ చేయిస్తామని బీజేపీ నేత కపిల్ మిశ్రా మాట్లాడారు. ఆయన ప్రకటన తరువాత 48 గంటల్లో ఈ అల్లర్లు జరిగాయి. పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. పోలీసులు బాధ్యత వహిస్తే చాలా మంది ప్రాణాలు కాపాడగలిగేవారని కోర్టు వ్యాఖ్యానించింది. బీజేపీ,ఆర్ఎస్ఎస్ నేతల చర్యలే. సైన్యాన్ని దించి అక్కడ శాంతి భద్రతలు కాపాడాలి. 70 రోజులుగా ఆందోళన జరుగుతున్నా ఇటువంటి ఘటనలు జరుగలేదు. సుప్రీం కోర్టు జడ్జీలతో విచారణ జరిపించాలి. గుజరాత్ మోడల్ అంటే అభివృద్ధి మోడల్ కాదు. మత విధ్వేషాలను రెచ్చగొట్టే మోడల్.

బ్రహ్మం చౌదరి – టీడీపీ
ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన అభిప్రాయాలు ఉన్నాయి. అన్ని మతాలవారిని సంతృప్తిపరవలసిన అవసరం కేంద్రంపై ఉంది. ట్రంప్ పర్యటన సంతోషకరం. 15 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు గారు బిల్ క్లింటన్ ని పిలిపించి, డ్వాక్రా మహిళల పక్కన కూర్చోబెట్టారు. ఆయన దేశంలో పలు ప్రాంతాల్లో పర్యటించారు. అప్పుడు ఇటువంటి సంఘటనలు జరుగలేదు. ట్రంప్ వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడతామంటే ఎవరూ వ్యతిరేకించరు. ఎఆర్సీ, సీఏఏ విషయంలో వైసీపీ రెండు నాలుకల దోరణిలో వ్యవహరిస్తోంది. వైసీపీ వారు అత్యధికంగా మైనార్టీ ఓట్లు వేయించుకున్నారు. ఆ పార్టీ నేతలపై వివిధ ప్రాంతాల్లో దాడులు చేస్తున్నారు.
ఈ రోజు విశాఖలో సదస్సులు ఏమైనా జరుగుతున్నాయా? గతంలో జగన్ హడావుడిగా యుద్ధ విమానం ఏసుకువచ్చి గొడవ చేయడానికి ప్రయత్నించారు. ఆ రోజు 70 దేశాల ప్రతినిధులు పెట్టుబడులు పెట్టడానికి వచ్చారు. పెట్టుబడులు రాకుండా చేయడానికి అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నించారు. ఆ రోజు పరిస్థితులు వేరు. టీడీపీ ప్రభుత్వానికి 6 నెలలు సమయం ఇద్దామనుకుండి. ఈ రోజు 9 నెలల్లో 9 మోసాలతో నయామోసగాడిగా జగన్ నిలిచాడు. చంద్రబాబు అర్ధరాత్రి ఒంగోలులో పర్యటిస్తే  లక్షల మంది జనం వచ్చారు.  రాయలసీమలో కూడా ఆయన పర్యటన విజయవంతమైంది. ఈ రోజు ల్యాండ్ పూలింగ్ రైతులను పరామర్శించడానికి వెళతున్నారు. ఇదే వైసీపీ ల్యాండ్ పూలింగ్ కు వ్యతిరేకం అన్నారు. జగన్ గారు, తన తండ్రి పాదయాత్ర చేసిన సమయంలో టీడీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది, సహకరించింది. రక్షణ కల్పించింది. అవన్నీ మరచిపోయి ఈ రోజు తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయం నుంచి పెందుర్తి నియోజకవర్గ కార్యకర్తలకు చంద్రబాబు పర్యటనను ఎదుర్కోమని లేఖలు రాశారు. మంత్రి ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ప్రతిపక్ష నేతగా నిరసన తెలిపే హక్కు మాకుంది. హుద్ హుద్ తుపాను సందర్భంలో గాని వారిని ఆదుకున్న చంద్రబాబు. గతంలో ఒక్క లాఠీ ఇరక్కుండా అమరావతిలో 33వేల ఎకరాలు సేకరించారు. చంద్రబాబు పర్యటనని అడ్డుకోమని ప్రజలు అధికారం ఇవ్వలేదు. అభివృద్ధి చేయమని ఇచ్చారు. చేతనైతే చేయండి లేదా మూసుకొని కూర్చొండి.
సిగ్గులేనిది, బుద్ధి లేనిది వైసీపీ వారికి. అధికార పార్టీగా ఉండి కార్యకర్తలకు అడ్డుకోమని మెసేజ్ లు పెడతారా? ఉత్తరాంధ్రలో చంద్రబాబుకు బ్రహ్మరథం పడతారని భయంతో చేశారు.
ఎన్టీఆర్ చిత్ర పరిశ్రమ నుంచే వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు కూడా మొదట సినిమాటోగ్రఫీ మంత్రిగా చేశారు. చంద్రబాబు నాయుడు గారు అమరావతి, పోలవరంపై దృష్టి పెట్టారు. చిత్ర పరిశ్రమ తరలించడానికి పలువురు ప్రముఖులతో సమావేశాలు ఏర్పాటు చేసి చర్చలు జరిపారు. ఈస్ట్, వెస్ట్, అరకు, విశాఖ సినీ పరిశ్రమలకు అనుకూలం. ఇక్కడ సినిమాలు తీస్తే రాయితీలు ఇస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. హుద్ హుద్ తుఫాను సందర్భంగా సినీ హీరోలు ఆర్థిక సహాయం చేశారు. వారి సహాయంతో ఇళ్లు నిర్మించారు. ఆ ఇళ్ల ప్రారంభోత్సవానికి జగన్ గారిని ఆహ్వానిస్తున్నారు. దానిని మేం విమర్శించం. సినీపరిశ్రమ విశాఖ వస్తే సంతోషం.

సుందరరామశర్మ – కాంగ్రెస్
ఇది కేంద్ర వైఫల్యం. ఫండ్స్ ఎక్కడ నుంచి వచ్చాయి. ఇంటిలిజెన్స్ ఏం చేస్తున్నారు. ట్రంప్ వస్తున్నారని సంబరాలు చేసుకొని, ప్రతిష్ట దిగజారకుండా చూడవలసిన బాధ్యత వారిపై ఉందా లేదా? కొన్ని రాష్ట్రాలలో వ్యతిరేకంగా తీర్మానాలు చేశారు. ఢిల్లీలో యూపి సరిహద్దులలో అల్లర్లు. ఆ రాష్ట్రానికి కూడా బాధ్యత. మా సోనియా గాంధీ అమిత్ షాని రాజీనామా చేయమనడానికి కారణం కేంద్రం వైఫల్యం. 1984 ఘటనలకు ఇప్పటి ఘటనలకు సంబంధంలేదు. అటువంటి ఘటనలు జరుగకూడదు. అందరూ సంయమనం పాటించాలి. అక్కడ పూర్తి బాధ్యత కేంద్రానిదే. ప్రతిపక్షాలపై విమర్శలు మాని వారిని కలుపుకొని వెళ్లండి. ట్రంప్ పర్యటనలో ప్రసిడెంట్ విందుకు సోనియా గాంధీని పిలవకపోవడం తప్పు.

 కిలారు దిలీప్ – బీజేపీ
దేశ భద్రత విషయంలో ప్రతిపక్షాలు భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. పౌరసత్వ చట్టానికి సవరణ మాత్రమే. వైసీపీ 22 మంది ఎంపీలు సపోర్ట్ చేశారు. తరువాత ముస్లింల పౌరసత్వానికి ఇబ్బంది కలుగుతుందన్నట్లు మాట్లాడు. చట్టం చదవకుండా మాట్లాడుతున్నారు. 27 మంది మృతికి ప్రతిపక్షాలదే బాధ్యత. సీఏఏ అంటే ఏమిటో తెలుసుకోవాలి. డిసెంబర్ 31, 2014 కి ముందు వచ్చిన 6 మతాలవారికి మాత్రమే పౌరసత్వం ఇస్తున్నాం. సీఎంలకు కూడా తెలియకుండా మాట్లాడుతున్నారు. ఈ విషయంలో బీజేపీ వైఫల్యం చెందలేదు. ఆర్టికల్ 370 వంటి విషయాలలో ఎక్కడా అల్లర్లు లేకుండా చేశారు. 125 కోట్లు విదేశాల నుంచినిధులు వచ్చినట్లు బయటపడింది. ఇది దేశంపై దాడి. ముస్లింల ద్వారా గొడవలు తీసుకువచ్చి అలజడి సృష్టిస్తున్నారు. ఢిల్లీలో కూడా ఏనాడు లేని మత విధ్వేషాలు రెచ్చగొడుతున్నారు. అమిత్ షా గారు అక్కడ ఉన్నందుకు దేశంలో శాంతిభద్రతలు ఉన్నాయి. ఇటువంటి అల్లర్లు ఇక జరుగకుండా చూస్తారని నేను హామీ ఇస్తున్నాను. ( యాంకర్ : కపిల్ మిశ్రా వంటి వ్యక్తులను బీజేపీ అదుపు చేయలేకపోతోంది. ఆయన వ్యాఖ్యలే హింసకు దారి తీస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.) కిపిల్ శర్మ ఒక్కరి మాట విషయంలో నేను అంగీకరిస్తాను. సోనియా గాంధీని ట్రంప్ విందుకు పిలవకపోవడం వల్ల అల్లర్లు సృష్టిస్తామన్నట్లు ఉన్నాయి వారి మాటలు. దానిని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి మాటలు మాట్లాడకూడదు.
రాజకీయ నాయకులు ఈ విధంగా మాట్లాడటం సరికాదు. ఓవైసీ మాటలు ఒక్కొక్కొరం నలుగురిని చంపుతాం అంటున్నారు. సెక్యులర్ భావాలు ఉన్న వారు వీటిని ఎలా ఆలోచిస్తారు. టెర్రరిజంపై ఉక్కు పాదం మోపమని ట్రంప్ అన్నారు. ఢిల్లీ అల్లర్లకు కేజ్రీవాల్ పెద్దపీట వేశారు.  షాహీబాగ్ వంటి ఘటనలు.


శ్రీరామ్ – బీజేపీ
ఎవరైనా, ఎక్కడైనా రాష్ట్రంలో పర్యటించడానికి, అభిప్రాయాలు చెప్పడానికి అవకాశం ఉంటుంది. చంద్రబాబు నాయుడు పర్యటనని అడ్డుకోవడం సరికాదు. గత ప్రభుత్వం అలా చేసి ఉంటే జగన్ గారు పాదయాత్ర చేసి ఉండేవారు కాదు. చంద్రబాబు ప్రజలకు తెలియజెప్పడానికి వెళ్లడం ఆయన బాధ్యత. దానిని అడ్డుకోమని అధికార పార్టీ వారు పిలుపు ఇవ్వడం సరికాదు. 3 రాజధానుల అంశంలో వీళ్లు  ల్యాండ్ పూలింగ్ కు వెళుతున్నారు. కోర్టులు, కేంద్రం ఉన్నాయి. వీరు అనధికారికంగా ఏదో చేస్తున్నారు. పేదలకు పంచుతామని 6వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ కి తీసుకోబోతున్నారు. గతంలో వీరే ల్యాండ్ పూలింగ్ ని వ్యతిరేకించారు. ప్రభుత్వ భూమి ఉంటే రాజధాని ఏర్పాటు చేయమని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎలా తీసుకుంటారు? ప్రభుత్వ భూమి ఉంటే చూడండి. అప్పుడు వ్యతిరేకించి ఇప్పుడు మీరెందుకు పూనుకున్నారు. అసైన్డ్ భూములు పేదలకు ఇచ్చారు. వాటిని తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ ఎవరూ స్వాగతించడంలేదు. అనేక చోట్ల ఇబ్బందులు వస్తున్నాయి. వాటిన కప్పిపుచ్చుకోవడం కోసం బొత్స గారు ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెడుతున్నారు. పేదల గుడిసెలు కూలుస్తున్నారు. పంట పొలాలు స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కన్నా గారు గానీ, చంద్రబాబు నాయుడు గారు గాని వారి అభిప్రాయాలు చెబుతారు. వద్దనడానికి మీరెవరు?
చంద్రబాబు నాయుడు సినిపరిశ్రమని ఇక్కడకు తీసుకురావడంలో విఫలమయ్యారు.ఆయన చొరవ చూపించలేదు. మాకేమిస్తారు అని అడుగుతారు. మద్రాస్ నుంచి హైదరాబాద్ వారికి అలా ఇచ్చే తెచ్చారు. వారి ఆలోచన అలానే ఉంటుంది. సినీపరిశ్రమని ఇక్కడకు తీసుకురావడానికి జగన్ గారు కృషి చేయాలి. చిరంజీవి, సురేష్ బాబు అందరూ ఇక్కడకు రావడానికి ప్రయత్నించండి.
ప్రభుత్వ పరంగా చొరవ తీసుకోవాలి.  ఈ పరిశ్రమ ఇక్కడకు వస్తే  ఉపాధి లభిస్తుంది. విశాఖ అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందుతుంది.


Feb 26, 2020

విశాఖ భూ దందా - సిట్ గడువు పొడిగింపు


26.02.2020:
v విశాఖపట్నం, చుట్టుపక్కల ఉన్న మండలాల్లో జరిగిన భూకుంభకోణంపై సమగ్ర విచారణ నిమిత్తం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) గడువును ప్రభుత్వం మరో మూడు నెలలు పొడిగించింది.
v అక్రమాలను నిగ్గు తేల్చడం కోసం నూతన ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేస్తూ 2019 అక్టోబర్‌ 17న జీవో జారీ చేసింది.
v విశాఖపట్నం, పరిసర మండలాల్లో విలువైన భూములను కొట్టేయడమే లక్ష్యంగా భూ రికార్డులను ట్యాంపరింగ్‌ చేశారని, ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేశారని, ప్రైవేట్‌ భూములకు చెందిన రికార్డులను కూడా తారుమారు చేశారని వచ్చిన అభియోగాలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ప్రభుత్వం జీవోలో పేర్కొంది.
v దర్యాప్తు పరిధి ఎక్కువగా ఉండటం, ఇంకా కొన్ని అంశాలపై సమగ్ర విచారణ జరపాల్సి ఉన్నందున తుది నివేదిక సమర్పణకు మరికొంత సమయం ఇవ్వాలని కోరింది. దీనిని పరిశీలించిన ప్రభుత్వం మరో మూడు నెలలు సిట్‌ను పొడిగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
v  

మంగళగిరిలో ఏపీ ఉన్నత విద్యామండలి కార్యాలయం


v నాలుగేళ్లుగా తాడేపల్లిలో కొనసాగుతున్న ఏపీ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కొత్త భవనంలోకి తరలిపోయింది. బుధవారం నుంచి మంగళగిరి 6వ బెటాలియన్‌ రోడ్డు(శ్రీరామ్‌నగర్‌-ఆత్మకూరు గ్రామం)లోని నీలాద్రి టవర్‌-3,4,5 అంతస్థుల్లో మండలి కార్యకలాపాలు నడుస్తాయి. లీజు ఒప్పందం మేరకు దాదాపు రూ.25 లక్షలు అద్దె కింద అడ్వాన్స్‌ గా చెల్లించిన మండలి, గత డిసెంబరులోనే కొత్తభవనంలోకి తరలించాల్సి ఉంది. రాజధాని తరలింపు నిర్ణయం నేపథ్యంలో కొంత ఊగిసలాడినప్పటికీ ఎట్టకేలకు కొత్త భవనంలోకి మార్చారు.


ట్రంప్ 2 రోజుల భారత్ పర్యటన


టీవీ 24X7  - తేదీ: 26.02.2020 బుధవారం ఉదయం 7.30 గం. నుంచి
అంశాలు :   అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2 రోజుల భారత్ పర్యటన – కాంగ్రెస్ గైర్హాజర్
               అమరావతి రగడ   - 1250 ఎకరాలు పేదలకు కేటాయింపు. మంగళగిరి, పెదకాకాని, విజయవాడ, గుంటూరు, దుగ్గిరాల వారికి
---  పౌరసత్వ సవరణలు - సీఏఏ
యాంకర్ :  కృష్ణ సాయి

  
విక్రమ్ పోల – విశ్లేషకులు
అంతర్జాతీయంగా ట్రంప్ పర్యటనకు ప్రాధాన్యత ఉంది. ఆసియాలో చైనా ప్రాభల్యం. కవ్వింపు చర్యలు.. భారత్ కు అమెరికా సహాయం, మితృత్వం మనకి ఉపయోగం.  చైనా చాలా సంవత్సరాలుగా బెల్ట్ అనే ప్రాజెక్ట్ ని తీసుకుంది. పెద్ద ఎత్తున నిధులు ఖర్చే చేస్తోంది.  ఆసియా ప్రాంతంలోని అనేక దేశాలకు ఉదారంగా నిధులు ఇస్తోంది. భారత్ కు మొదటి నుంచి స్నేహభావంతో ఉన్న శ్రీలంక, మైన్మార్, బంగ్లాదేశ్, నేపాల్ దేశాలలో చైనా పెట్టుబడులు పెడుతోంది. ఆ దేశాలను ఆర్థికంగా లొంగదీసుకునేట్లు కనిపిస్తోంది. పాక్-చైనా ఎకనామిక్ కారిడార్  1.3 ట్రిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. బెల్ట్ అనే ప్రాజెక్ట్ 68 బిలియన్ డాలర్ల వ్యయం. ఆసియా ప్రాంతంలో బలపడటానికి ప్రయత్నం. ఈ పరిస్థితులలో భారత్ కు అమెరికా సహాయం ముఖ్యం. ఈ దశలో రాజకీయంగా చూడటం మంచిదికాదు. అయితే రెండు దేశాల మధ్య విభేదాలు ఉన్నాయి. భారత్ సుంకాలు భారీగా ఉన్నాయని ట్రంప్ గారే చెప్పారు. అమెరికా భారత్ పై డబ్ల్యూటీఓలో 14కేసులు వేయించింది. భారత్ ఉత్పత్తులను డిస్క్రైజ్ చేస్తున్నారు. వాణిజ్యపరమైన కొన్ని వైరుధ్యాలు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితులలో అమెరికా మార్కెట్ మనకి చాలా అవసరం. చైనాలో మార్కెట్ ఉండదు. అక్కడి ఉత్పత్తులు చాలా చౌక. మన దేశం పశ్చిమ దేశాలకు, అమెరికాకు చేయాలి. అమెరికాలో ప్రైవేటు రంగమే ఎక్కువ. అమెరికా నుంచి పెట్టుబడులు వస్తే మంచిది. ముఖ్యంగా ఉగ్రవాదాన్ని పీచమణచడంలో భారత్ ఒక్కటే ఏమీ చేయలేదు. అమెరికా సహాయం కావాలి. 1962లో చైనా వార్ లో అమెరికా సపోర్ట్ చేసింది.  డెమోక్రాట్స్ కంటే రిపబ్లికన్సే మనకి సహాయం చేశారు. జార్జి బుష్ జూనియర్ హయాంలోనే చాలా సహాయం అందించారు. క్లింటన్, ఒబామా స్నేహపూర్వకంగా ఉన్నా మితిమీరిన ఆంక్షలు పెట్టారు. మోడీ-ట్రంప్ వ్యక్తిగత స్నేహం దేశాల మధ్య స్నేహం పెరగడారిని ఉపయోగం. మనలోని వామపక్ష ఆలోచనలు తొలగిపోవలసిన పరిస్థితి ఉంది.
పెట్టుబడులు కావాలి. చైనా పెట్టుబడులు మనకి రావు. ట్రంప్ దేశానికి రావడం ద్వారా మన దేశ ఉన్నతిని, ప్రాముఖ్యాన్ని వివరించడం అంతర్జాతీయంగా మనకి మేలు చేసేదే.
పేదలకు ఇళ్ల స్థలాలు తప్పుపట్టవలసిన అవసరంలేదు. స్థానికులకు ఇవ్వవచ్చు. గన్నవరం విమానాశ్రయానికి భూములు ఇచ్చినవారికి అమరావతిలో భూములు ఇస్తామన్నారు. స్థానికులకు ఇవ్వకుండా ఇతర ప్రాంతాల వారికి ఇస్తే గొడవలు వస్తాయి.
ఢిల్లీలో లా అండ్ ఆర్డర్ చూసేది కేంద్రం. డిసెంబర్ 15 నుంచి అక్కడ సీఏఏకి అనుకూలంగా, వ్యతిరేకంగా ఆందోళనకారులు ఉద్యమాలు చేస్తున్నారు. ట్రంప్ వచ్చే సందర్భంగా ఇంటిలిజన్స్ సమాచారం ఉంటుంది. ఆందోళనలను అణచడానికి యంత్రాంగం ఉంటుంది. ట్రంప్ ఉన్న సమయంలోనే ఈ ఆందోళన జరగడం ఆశ్చర్యం. ఇంటిలిజన్స్ వైఫల్యం కనిపిస్తోంది. సుప్రీం కోర్టు కూడా ఆందోళనని శాంతియుతంగా చేసుకోమని చెప్పింది. ముస్లింలు ఎక్కవగా ఉన్న ప్రాంతంలోనే ఈ గొడవలు జరుగుతున్నాయి. పోలీసులు వారిని కొడుతూ జైభారత్ అనిపిస్తున్నారు. టీడీపీదానికి మద్దతు. కేశినేని నాని ఓవైసీని విజయవాడలో సభ పెట్టించారు. వైసీపీ కూడా అంజాద్ బాషా గారితో ప్రదర్శనలు. కీలకమైన చట్టాన్ని పార్టీపరంగా స్పష్టత ఉండాలి. ప్రజలు గమనిస్తుంటారు.

రాజీవ్ గాంధీ – వైసీపీ
మన దేశంలో మన తల్లి భూమి భారతిని పొగడటం చాలా సంతోషం. జగన్ గారిని పిలవకపోవడానికి రాష్ట్రపతి మార్గదర్శకాలు, అమెరికా విధివిధానాలు, సంఖ్యని పరిమితిని చేయడం.. రాజకీయాలు చూడకూడదు. మన రాష్ట్రంలో పచ్చ మీడియా జగన్ కు ఆహ్వానంలేదు, కేసీఆర్ ని పిలిచారు అని ప్రచారం. కేజ్రీవాల్ ని ఎందుకు పిలవలేదు. . దేశ భద్రత, దౌత్యపరంగా ఫలితం ఉంటుంది. ఆయన ప్రసంగం ద్వారా దేశ ఔన్నత్యాన్ని పెంచారు.
నవరత్నాలలో భాగంలో 1250 ఎకరాలు పేదలకు ఇస్తున్నాం. (సీఆర్డీఏ చట్టం  53డీ  ప్రకారం)  భూములు కావాలనుకుంటే రైతులకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. రాజధాని ప్రాంతానికి, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి చాలా వ్యత్యాసం ఉంది. పేదలకు ఇళ్లు ఉండాలి. రైతుల ప్రతిపాదనలు పరిశీలిస్తాం. పేదలకు అంత తెలివితేటలు ఉండవు. అక్కడ ఉద్యమం పది శాతం మాత్రమే. చంద్రబాబు నాయుడు గారి మాయలో పడవద్దు. రాజధానిపై అందరికీ స్పష్టత వచ్చింది. మూడు రాజధానులతో అభివృద్ధి. జాస్తి కిషోర్ కుమార్ విషయంలో విచారణ చేసుకోవచ్చని కోర్టు చెప్పింది.
చనిపోయినవారి జాబితా చూద్దాం. ఎవరెవరు ఏ కారణంతో చనిపోయారో వివరాలు మా వద్ద ఉన్నాయి. ఈ విధంగా చెప్పమని టీవీ వారు చనిపోయినవారి బంధువులకు చెప్పారు. తులసి రెడ్డి గారు వైఎస్ గారికి మీకు కక్షలు ఉండవచ్చు.  మా మీద బురద చల్లకండి. ఫ్యాక్షనిస్ట్ మెంటాలిటీ అన్నారు. ఆ ప్రాంతాన్ని ఫ్యాక్షనిస్ట్ ప్రాంతం అంటారు. మా నాయకుడినికి ఆ బుద్దులులేవు. మీకేమైనా ఉన్నాయోమో.
వరద ముంపు ప్రాంతంలో చంద్రబాబు నాయుడు కట్టారని తులసిరెడ్డి గారు ఒప్పుకుంటారా? కుల, మతాలకు అతీతంగా పాలన చేసే పార్టీ మాది. అక్రమార్కులను, అవినీతిపరులను, అరాచక వ్యక్తులను అణగదొక్కుతాం.
పౌరసత్వ సవరణని మా పార్టీ సమర్ధించింది. తరువాత ప్రజలలో భయాందోళనలు వచ్చాయి. దాంతో మా పార్టీ స్టాండ్ మార్చుకుంది. దీనికి వ్యతిరేకంగా ఉంటామని జగన్ గారు చెప్పారు. ప్రజలలో భయాందోళనలు తొలగించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. హోం శాఖ మంత్రి మరింత లోతుగా చర్చించాలి. ప్రజా వ్యతిరేకతని నియంత్రించాలి. ఉద్యమకారులపై షూట్ అండ్ సైట్ ఆర్డర్ ఇవ్వడం మంచిదికాదు.

గొట్టిపాటి రామకృష్ణ - టీడీపీ
అగ్రరాజ్యాధినేత ప్రసంగం సంతోషం. 1991 తరువాత తెలుగు బిడ్డ పీవీ సంస్కరణల తరువాత దేశాన్ని అనేక అంశాల్లో విస్మరించలేని పరిస్థితి. వాణిజ్యపరమైన అంశాలు. ట్రంప్ పర్యటన, ప్రసంగం, పరస్పర అవగాహన దేశానికి మంచిది. దీనిని రాజకీయ చేయకుండా ఉంటే మంచిది. రాజీవ్ గాంధీ గారు వాజ్ పాయ్ గారిని యుఎన్ కు తీసుకువెళ్లారు. అదే వాజ్ పాయ్ పాకిస్తాన్ యుద్ధం తరువాత ఇందిరా గాంధీని కాళీ మాతగా వర్ణించారు. వ్యక్తిగతంగా కొన్ని ఇబ్బందులు ఉన్నా దేశ గౌరవం కాపాడటంలో ... ఏ ప్రొటోకాల్ ప్రకారం పిలుపులు పిలిచారో తెలియదు. మాజీ ప్రధాని అనుకుంటే దేవగౌడ్ గారు కూడా ఉన్నారు. సోనియా  గాంధీని పిలవకపోవడాన్ని రాజకీయంగా భావించకూడదు. ఏ రాజకీయ పార్టీ అయినా, అమెరికాని వ్యతిరేకించే పార్టీలు కూడా ఆ దేశంతో మంచి సంబంధాలు ఉండాలనే కోరుతున్నాయి. ఈ పర్యటన మన దేశానికి కొంత ఉపయోగపడుతుంది. అమెరికాలోని భారతీయులలో అభద్రతా భావంలో కొంత మార్పు వస్తుంది.
పేదలకు అవకాశాలు అందరూ హర్షిస్తారు. ఆ భూములు మునిగిపోతాయని చెప్పారు. ఒక ఎకరాకి రెండు కోట్లు ఖర్చు పెట్టాలని చెప్పారు. 1250 ఎకరాలు ఇస్తున్నారు. ఆ భూమికి వైసీపీ వారు చెప్పిన లెక్క ప్రకారం రూ.2500 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ రోజు డబ్బులు లేవంటున్నారు.  భూమి రైతులది. వారికి రూపాయి ఇవ్వలేదు. అవసరమైతే రైతులకు భూములు తిరిగి ఇస్తాం అని మంత్రులే చెబుతున్నారు. పెనమలూరులో కట్టపై నివాసాలను ఖాళీ చేయించడానికి ప్రభుత్వాలు ప్రయత్నించాయి. వాస్తవానికి వారు అక్కడ ఉండటం ఇబ్బందికరమే. అయితే వారు అక్కడకు దగ్గరలో పనులు చేసుకుంటారు. వారికి అమరావతిలో భూములు ఇస్తే అక్కడ నుంచి రావడం ఇబ్బంది. వారే చెప్పారు, అది శ్మశానం, ఎడారి అని, మనిషి అనేవాడు వెళ్లే పరిస్థితి ఉందా? అన్నారు. మంత్రులు బాధ్యతాయుతంగా మాట్లాడాలి. పేదలను తీసుకువెళ్లి ఒకచోట పెట్టడం. రెచ్చగొట్టే పద్దతి. లీగల్ గా సాధ్యం కానివి చెప్పడం. తెలుగుని తీసివేసి ఇంగ్లీష్ పెడతామంటే కోర్టులు అంగీకరించవు. సీఆర్డీఏ చట్టం రద్దు  అసెంబ్లీలో ఆమోదించి, కౌన్సిల్ లో త్రిశంకు స్వర్గంలో ఉంది. సెలెక్ట్ కమిటీ అన్నారు. అది జరుగుతూ ఉంది. 5 శాతం భూమిని పేదలకు ఇవ్వాలని ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ. ప్రభుత్వ విధానం ఏంటి? రైతులకు ఏ విధంగా న్యాయం చేస్తారోచెప్పలేదు. మిగిలిన భూమి ఏం చేయబోతున్నారు. కాని పనులు వివాదాలు సృష్టించడానికి ఈ పనులు చేస్తున్నారు. సీఆర్డీఏ చట్టం ప్రకారం స్థానిక పేదలకు  5 శాతం భూములు ఇవ్వవచ్చు. ప్రతిచోట ఎసైన్డ్ భూమి సమస్య. పీపీఏలను రద్దు చేయబోతే కోర్టులు కొట్టివేశాయి. కేంద్రం చెప్పింది. అంతర్జాతీయ సమస్య అయింది.
ఢిల్లీ లాంటి రాజధానిలో ఇంత గొడవ జరిగిందంటే మిగతా ప్రాంతాల్లో ఇంక ఎలా ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వ విఫలమైంది. కేశినేని నాని గారు ఆ చట్టాన్ని వ్యతిరేకించారు. క్రమంగా సమస్య పెద్దదైపోయింది. ప్రతి పౌరుడూ నిరూపించుకోవడం కష్టం. ప్రజల్లో భయాందోళనలు ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రంలో ఒక కుంటుంబంలో ముగ్గురిలో  ఇద్దరికి పౌరసత్వం ఇచ్చారు. మరొకరికి ఇవ్వలేదు. చట్టంలో ఉన్న విషయానికంటే ప్రజల మనోభావాలు ముఖ్యం. వారి భయాందోళనలు ముఖ్యం.
370 చట్టానికి అందరూ మద్దతు తెలిపారు. రామజన్మభూమి విషయంలో వ్యతిరేకత రాలేదు. వెంటవెంటనే చట్టాలు తీసుకురావడం వల్ల ప్రజలలో భయాందోళన వ్యక్తమవుతుంది.

భానుప్రకాష్ – బీజేపీ
కాంగ్రెస్ అంటే సోనియా, రాజీవ్, రాహుల్, ప్రియాంక గాంధీ వీళ్లేనా. పదేళ్లు దేశాన్ని పరిపాలించిన ప్రధాని మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ నాయకులు కాదా? దేశాధ్యక్షుని విందుని ఇంట్లో పెళ్లితో పోల్చితే ఎలా? భారత్-అమెరికా సంబంధాలు గతంలోకి ఇప్పటికి వచ్చిన మార్పులు.. దేశ భద్రత, ఆంతరంగిక విషయాలలో మనందరం ఒకటి అవుదాం. కొన్ని నిబంధనలు, ప్రొటోకాల్ ప్రకారం కొద్దిమందిని పిలిచారు. ట్రంప్ సందర్శన వల్ల ప్రపంచం మొత్తం ... అమెరికాలోని వారు ఉప్పొంగిపోతున్నారు. అమెరికాలో వారు ఇండియాని గూగుల్ లో వెతుకుతున్నారు. ఆయన ప్రసంగం వల్ల మంచి ప్రచారం జరిగింది.  ఆంతరంగిక విషయాలు బయటకు రావు. కొన్ని సుహ్రుద్బావ వాతావరణంలో చర్చలు జరిగాయి. ఒక పక్క చైనా, ఒక పక్క పాకిస్తాన్ ఉగ్రవాదం.... శక్తివంతమైన దేశంగా భారత్ ఉంది. ట్రంప్ మద్దతు ఉంది.  సోనియా గాంధీని పిలవలేదని చర్చ వచ్చింది గదా.
రాజధాని వ్యవహరాం త్రిశంకు స్వర్గంలో ఉంది. చంద్రబాబు 5 ఏళ్లు వృధా చేశారు. జగన్ గారు మూడు రాజధానులు అంటున్నారు. కోర్ క్యాపిటల్ అమరావతిలోనే ఉండాలి. గొడవలు జరగాలనే ఉద్దేశం తప్ప ప్రజలకు మేలు జరగాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. ఒక కులంపై కక్ష. ప్రతిపక్షం వారిని, వారికి ఫైనాన్స్ చేసినవారిని అణగదొక్కాలన్న ఉద్దేశం తప్ప మరొకటిలేదు. వారిది దురుద్దేశంతో చేస్తున్నారు.  అక్కడ భూములు ఇచ్చినవారు చాలా బాధపడుతున్నారు. పేదలకు భూములు ఇవ్వడం మంచిదే. ఏ ప్రాంతం వారికి ఆ ప్రాంతంలో భూములు ఇవ్వడం మంచిది.
మీరు రండి, గంటలో కుల రాజకీయాలు నిరూపింస్తాను. ఉద్దేశపూర్వకంగా టీటీడీలో కాంట్రాక్టులు రద్దు చేశారు. చేసేదంతా తప్పులు సమర్ధించుకుంటారు. మీ మాదిరి కమిషన్ తీసుకోవలసిన అవసరంలేదు.  మా గురించి తెలుసుకొని మాట్లాడు. మీ పార్టీ మాదిరిగా కమిషన్ తీసుకునే అలవాటు లేదు. ధైర్యం ఉంటే తిరుపతి రండి నిరూపిస్తా. బెదిరించే ప్రయత్నం. నా గురించి తెలుసుకొని మాట్లాడు. టీటీడీకి ఆర్టీఏ వర్తించదు. తెలిసి మాట్లాడండి. జాగ్రత్తగా మాట్లాడండి. రాజధాని ఎందుకు మారుస్తున్నారు.
ఈ ఉద్యమం ఉద్దేశపూర్వకంగా జరిగిందే. అగ్రరాజ్యనేత వచ్చినప్పడు రెండు రోజుల్లో ఇలా చేయడం అసాంఘీక శక్తుల పాత్ర ఉంది. కారకులను హోం శాఖ పట్టుకుంటుంది. సీఏఏ వల్ల ఎవరికీ నష్టంలేదు. ఇది చాలా మంచిది. బీజేపీ దేశవ్యాప్తంగా అవగాహన కల్సిస్తోంది.  ప్రతి ఇంటికి వెళ్లి చెబుతున్నాం. కొందరు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు. వాస్తవాలు తెలియకుండా అపోహలు నమ్మవద్దని ప్రజలను కోరుతున్నాను. ఎట్టిపరిస్థితులలో ఈ దేశంలో సీఏఏ అమలు అవుతుంది. ఎన్నికష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఇది మా అమిత్ షా గారు చెప్పారు.

తులసి రెడ్డి – కాంగ్రెస్
పారిశ్రామికవేత్తలను పిలిచారు. సోనియా గాంధీ గారిని పిలవకుండా మిగిలినవారిని పిలిస్తే వెళతారా? ముఖ్యమంత్రులను అందరినీ ఎందుకు పిలవలేదు? సీఎంలు వస్తే ఎక్కువైపోతుందా? బీజేపీ తెలిసి చేసినా తెలియకచేసినా తప్పే. కొందరిని పిలిచి మిగతావారిని పిలవలేదు. గతంలో చైనా, రష్యా అధ్యక్షులు వచ్చారు. అమెరికావారికి ఆడంబరం ఎక్కువ. ఫోజులు ఎక్కువ. ప్రచారం, ఆర్భాటం. ట్రంప్ కు రెండు విధాల లాభం. నవంబర్ లో ఎన్నికలు. ఆ దేశ కంపెనీలకు రూ.21వేల కోట్ల వ్యాపారం. మనకి పెద్దగా ఒరిగిన ప్రయోజనం ఏమీ లేదు. నమస్తే ట్రంప్ లో ఆయన ప్రసంగం అనేక కోణాల్లో భారతదేశానని ఆవిష్కరించారు. స్వామి వివేకానంద తరువాత భారత దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. అమెరికా అధ్యక్షుడు ముఖ్యంగా దేశం గురించి వసుదైక కుటుంబం, భిన్నత్వంలో ఏకత్వం,వేద విజ్ఞానం, పురాణ విలువలు, పవిత్ర గంగానది, స్వర్ణ దేవాలయం, జమా మసీదు, హిమాలయాలు, గోవా, క్రికెటర్లు, హోలీ .... వంటి వాటి గురించి చెప్పారు. ఆ విధంగా మేలు చేశారు. వాణిజ్య ఒప్పందాలు బైయింగ్ సెల్లింగ్ పద్దతిలో జరిగింది.
ప్రభుత్వానిది ఫ్యాక్షనిస్ట్ మెంటాలిటీ. కక్ష. దానికి అర్ధంలేదు. గెలిసింది వైసీపీ. మీకే ఓటు వేశారు. భూములు వేరే చోట ఇచ్చే అవకాశం ఉంది. సీఆర్డీఏ పరిధిలో ఉన్నదానిని ఇవ్వడం ఏమిటి? ఇప్పటికి 28 మంది చనిపోయారు. అవన్నీ ప్రభుత్వ హత్యలే. ఏ విధంగా సమర్థనీయం కాదు. దీనివల్ల ఎంతమంది చనిపోతారో.  పేదవారికి స్థలాలు ఇవ్వాలి. మరోచోట ఇవ్వాలి. మునక ప్రాంతం అన్నారు. పేదలు మునిగిపోవచ్చా. ఇది రెచ్చగొట్టే పనే. పుండుమీద కారం చల్లుతున్నారు.  నాకు గన్ మేన్ కూడా లేడు.
పౌరసత్వ సవరణ ఆందోళన హింసాత్మకం 18 మంది చనిపోయారు. 200 మంది క్షతగాత్రులు. సమస్య- ఘర్షణ. దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతున్నాయి. రెండు నెలల నుంచి జరుగుతోంది. ట్రంప్ ఉన్నప్పుడే ఢిల్లీలో జరగడం యాదృచ్ఛికం గావచ్చు. ఉద్యమ తీవ్రత బాగా ఉంది. అనవసరమైన సమస్య. అవసరంలేని సమస్య. దొంగతనం జరిగితే దొంగని పట్టుకోవాలి. గ్రామంలో అందరూ దొంగ కాదని నిరూపించుకోండి అన్నట్లు ఉంది. కొత్తగా సీఏఏ, ఎన్ఆర్ సీ ఏంటి? పదివేల కోట్లు ఖర్చు పెట్టి లేని సమస్య. అస్సాంలో ఎఆర్సీ  గొడవ. ప్రజాస్వామ్యం, సామ్యవాదం, లౌకికవాదం,  గణతంత్ర రాజ్యం.
లౌకితవాదం అని రాసుకున్న తరువాత మతం ప్రాతిపదిక ఏంటి. ఇది దేశానికి, బీజేపీకి మంచిదికాదు. వైసీపీ, టీడీపీ ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్యలా వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీలో ఉన్నది వారిద్దరేగదా వ్యతిరేకిస్తూ తీర్మానం చేయవచ్చుగదా.

Feb 25, 2020

రాజధానిలో రైతు అరెస్టు


25.02.2020: 
v తుళ్లూరులో రైతుల ధర్నాను చిత్రీకరిస్తున్న కానిస్టేబుల్‌పై దాడిచేసిన కేసులో ఆలూరి వెంకటేశ్వరరావు అనే రైతును మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 20వ తేదీన తుళ్లూరులో జరిగిన రైతుల ధర్నాను కానిస్టేబుల్‌ నాగూర్‌వలి డ్రోన్‌ ద్వారా చిత్రీకరించారు. ఆయనపై ఆలూరి వెంకటేశ్వరరావు దాడి చేశారని కేసు పెట్టారు.
v నా భర్త ఆచూకీ చెప్పండి: వెంకటేశ్వరరావు భార్య సరోజినీదేవి
మంగళవారం తెల్లవారుజామున పోలీసులు వచ్చి మా ఇంట్లో సోదా చేశారు. వెం కటేశ్వరరావు ఎక్కడని ఆరా తీసారు. లేరనడంతో వెళ్లిపోయారు. కొద్దిసేపటికే నా భర్త ను పోలీసులు తీసుకువెళ్లినట్టు స్థానికులు నాకు చెప్పారు. నోటీసు ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారు? ఆయన ఆచూకీ చెప్పండి.

అమరావతి అంగుళం కదలదు: స్వామి కమలానంద భారతి


v ‘‘పార్లమెంటు నుంచి మట్టి, నీరు వచ్చింది. అమరావతి రాజధాని అంగుళం కూడా కదలదు’’ మందడం, వెలగపూడి రాయపూడి, తుళ్లూరు, పెదపరిమి గ్రామాల్లో జరిగిన ధర్నా కార్యక్రమాల్లో ఆయన  పాల్గొని రైతులు, రైతు కూలీలకు సంఘీభావం తెలిపారు. ప్రధాని మోదీ పార్లమెంటు నుంచి నీరు, మట్టి తెచ్చారు. ఆయనే స్వయంగా శంకుస్థాపన చేశారు. ఎవరూ అధైర్యపడొద్దు. పార్టీల గురించి మాకు అవసరంలేదు. మేం సమాజం గురించే మాట్లాడతాం. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు 13 జిల్లాల ప్రజలు కోరుతున్నారు. దేశానికి రెండో రాజధాని అవుతుందనుకుంటే, అలా జరుగుతుందా అని కళ్లు కుట్టి అమరావతి ఇలా అయ్యింది. లాఠీతో కొట్టి, పోలీసులు ఇంటికెళ్లి బాధపడతారు. వారూ మనుషులే, డ్యూటీలో పైవారు చెప్పినట్టు నడుచుకోవాలి. పోలీసు ఉన్నతాధికారులు ఆ పాపం తొలగిపోవటానికి హోమాలు చేసుకుంటున్నారు.

పేదల ఇళ్ల స్థలాల కోసం 1251 ఎకరాల రాజధాని భూముల సేకరణ

25.02.2020:
v రాజధాని ప్రాంత అభివృద్ధి మండలి (సీఆర్‌డీఏ) పరిధిలోని కొన్ని గ్రామాల్లో భారీ ఎత్తున భూమిని సేకరించడానికి జగన్ సర్కార్ ఉత్తర్వుల(G.O.Ms.No.107 Dated:25.02.2020)ను జారీ చేసింది.
v మెనిఫెస్టోలో పొందుపరిచిన పేదలకు ఇళ్లు పథకం కింద భూమిని సేకరించడానికి అవసరమైన చర్యలను తీసుకోవాలని కృష్ణా, గుంటూరు జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఈ మేరకు మున్సిపల్ పరిపాలన శాఖ కార్యదర్శి జే శ్యామలరావు నోటిఫికేషన్‌ను జారీ చేశారు.
v  సీఆర్డీఏ పరిధిలో నివసించే పేదలకు సొంత ఇంటి వసతిని కల్పించడానికి మొత్తం 1251.5065 ఎకరాలను సేకరించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీని కోసం 54,307 మందిని లబ్దిదారులుగా గుర్తించింది.
v  భూసేకరణ జరిగే గ్రామాలు:  మంగళగిరి మండలం నవులూరు, కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు, తుళ్లూరు మండలం మందడం, ఐనవోలు.
v ఇళ్ల స్థలాల కేటాయింపు: ఈ భూములను గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని 11,300 మందికి, పెదకాకాని మండలంలోని 1308 మందికి, మంగళగిరి మండలంలోని 10,247 మందికి, దుగ్గిరాల మండలంలోని 2500 మందికి, కృష్ణా జిల్లా విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ లోని 28,952 మందికి కేటాయింస్తారు.
v తాడేపల్లి మండలంలోని వారికి నవులూరు, కృష్ణాయపాలెంలో, పెదకాకాని మండలంలోని వారికి  కృష్ణాయపాలెంలో, మంగళగిరి మండలంలోని వారికి నిడమర్రులో, దుగ్గిరాల మండలంలోని వారికి కృష్ణాయపాలెంలో, విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ వారికి ఐనవోలు, కృష్ణాయపాలెం, కురగల్లు, నిడమర్రు, మందడం గ్రామాలలో కేటాయిస్తారు.
v మహిళ పేరుపై ఒక సెంటు ఇస్తారు.
v లేఅవుట్లను సీఆర్డీఏ అభివృద్ధి చేసి,ఒక్కో లబ్దిదారునికి ఒక సెంటు చొప్పున నంబర్లు కేటాయించాలి.
v దీనంతటినీ పర్యవేక్షించడానికి కృష్ణా, గుంటూరు జిల్లా కలెక్టర్లు, సీఆర్డీఏ కమిషనర్‌తో ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది.

v భూసమీకరణలో తీసుకున్న మొత్తం భూమిలో కనీసం 5శాతం పేదలకు అందుబాటు ధరలో గృహ నిర్మాణం కోసం కేటాయించాలని సీఆర్డీఏ చట్టంలోని 53(డి) నిబంధనలో పేర్కొన్నారు. ఇప్పటికే ఆ భూమిలో 87.02 ఎకరాలను పేదల గృహ నిర్మాణం కోసం వినియోగించారు. 

70వ రోజు రాజధాని రైతుల ఆందోళనలు


25.02.2020: 

vరాజధాని రైతుల ఆందోళనలు 70వ రోజుకి చేరుకున్నాయి.మందడం, తుళ్లూరులో ధర్నాలు కొనసాగుతున్నాయి. వెలగపూడిలో 70వ రోజు రిలే దీక్షలు కొనసాగనున్నాయి. పెనుమాక, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, రాయపూడి, నేలపాడు, పెదపరిమి తాడికొండ అడ్డరోడ్డు, 14వ మైలులో రైతులు ధర్నాలు నిర్వహిస్తున్నారు. మిగతా రాజధాని గ్రామాల్లోనూ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన


టీవీ డిబేట్ :  ఏపీ 24X7 - తేదీ: 25.02.2020 మంగళవారం ఉదయం 7.30 గం. నుంచి
అంశాలు :  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన – 
                రాష్ట్రంలో ప్రధాన నేతల విమర్శలు
యాంకర్ :  కృష్ణ సాయి
లక్ష్మీనారాయణ – విశ్లేషకులు
అలీన విదేశాంగ విధానం సందర్భంగా ఏకాభిప్రాయం. విదేశీ ప్రముఖుడు భారతదేశానికి వచ్చినప్పుడు భిన్న దృక్పదాలు మంచిది కాదు. అదరినీ తన వెంట తీసుకువెళ్లవలసిన అవసరం పాలకపక్షంపై ఉంటుంది. దౌత్యసంబంధాల విషయంలో మేమంగా ఒక్కటే అనే భావన కనిపించాలి. భిన్నాభిప్రాయాలు మంచిది కాదు. ట్రంప్ పర్యటన సందర్భంగా అధ్యక్షుని విందుకు   93 మందిని పిలిచారు. మరో 15మందిని పిలిస్తే కొంపలేమి మునగవు. అక్కడ చర్చలు ఏమీ జరగవు. ఢిల్లీలో పాఠశాల సందర్శనకు ట్రంప్ భార్య వెళుతున్నారు. స్థానిక సీఎంకి ఆహ్వానంలేకపోవడం మంచిదికాదు. ప్రధాన ప్రతిపక్షం తరపున సోనియా గాంధీకి ఆహ్వానంలేదని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ సీఎంలు రావడంలేదు. ఆ పరిస్థితి రాకుండా చూడాలి.    ఇది వ్యక్తిగత సంబంధాల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలా కనిపిస్తోంది. వాణిజ్య బృందాలు రాలేదు. మోడీ ట్రంప్ ని పొగిడితే, ట్రంప్ మాత్రం అమెరికా విధానాలు తెలియజేశారు. పాకిస్తాన్ తో మంచి సంబంధాలు ఉన్నాయి. భారత్ సంబంధాలు ...అనేక విషయాలు ప్రస్తావించారు. గోల్డన్ టెంపుల్, గంగానది... పక్కపక్కనే మత ప్రాదిపదికన ప్రార్ధనలు చేస్తారని చెప్పారు. ఇరుగుపొరుగుతో సంబంధాలు మెరుగుపడాలి అదే ముఖ్యం. టార్గెట్ చైనా అనే ఆలోచన, అమెరికాతో ఉంటే మంచిదన్న ఆలోచన అత్యంత ప్రమాదరకం. చైనాని కట్టడి చేయాలంటే భారత్ తో మంచిగా ఉంటే బెటర్ అని అమెరికా అనుకుంటుంది.
విదేశాంగ నీతికి భారత దేశ ప్రయోజనాలే కొలబద్ద. నౌకాదళాన్ని హిందూ మహాసముద్రంలోకి పంపిది ఎవరు. నిన్నటికి వరకు పాకిస్తాన్ పెంచి పోషించింది ఎవరు, బిన్ లాడెన్ పెంచి పోషించింది ఎవరు? చైనా ని బూతంగా చూపించడం మంచిది కాదు. చైనా చేసేవాటినీ ఎదుర్కోవాలి.
బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సమావేశంలో సుప్రీం కోర్టు  దీపక్ గుప్త ప్రసంగం. రాజకీయ పక్షాలు అధినేతలు అధ్యయనం చేయాలి. ఓటర్లు పాలకపక్షానికి, ప్రతిపక్షానికి ఓట్లు వేశారు. విద్యకు బడ్జెట్ లో 30 శాతం అన్నారు. 20 శాతం అయినా మంచిదే. విద్యా ద్వారా సంపద అందస్తానని జగన్ గారు అన్నారు. మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయుల నియామకం కోసం వనరులు ... బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించాలి. జాతీయ నిరక్షరాశ్యత 27, రాష్ట్రంలో 37 శాతం. సంక్షేమపథకాలు ఎంత నిర్వహించినా సమర్థనీయం.
టీడీపీ – పట్టాభి
దేశాల మధ్య సత్సంబంధాలు ఉండటం మంచిది. నిన్నటి కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నాం. రాజకీయాలు మాట్లాడకూడదు. జాతీయ ప్రయోజనాలు మాట్లాడాలి. అమెరికాలో హౌడీ మోడీ గానీ, ఇక్కడ నమస్తే ట్రంప్ జరిగినా  మంచివి. ట్రంప్ మన దేశానికి వచ్చిన  7వ అధ్యక్షుడు. గతంలో ఆరుగురు అధ్యక్షులు వచ్చారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా వచ్చారు. అమెరికాతో సత్సంబంధాలు జరపడానికి ఎవరి స్థాయిలో వారు చేశారు. ఈ రోజు చైనా పెద్ద ఎత్తున పాకిస్తాన్ కు సహాయం చేస్తోంది. బిలియన్స్ డాలర్లు. చైనా నుంచి పాకిస్తాన్ కు రోడ్డు నిర్మిస్తోంది. చైనా నుంచి త్రెట్. అంతర్జాతీయంగా అగ్రరాజ్యాల మద్దతు అవసరం. గతంలోలా అమెరికా, రష్యా మధ్య శత్రుత్వంలేదు. గతంలో మనం అమెరికాతో సన్నిహితంగా ఉంటే రష్యా అభ్యంతరం చెప్పేది. భారత్ ఎక్కువగా రష్యాకి సన్నిహితంగా ఉండేది. ఈ రోజు సీన్ మారిపోయింది. చైనా పాకిస్తాన్ కు సపోర్ట్. రష్యా, యుఎస్ఏ కలిసి పనిచేయడం. ఐసిస్ లీడర్ బద్దాబి ని సిరియాలో చంపారు. అది రష్యా, యుఎస్ జాయింట్ ఆపరేషన్. గతంలో ఇటువంటి పరిస్థితిలేదు. వాజ్ పాయి గారు గతంలో పాకిస్తాన్ కు బస్ యాత్ర చేశారు. మోడీ గారు లాహోర్ లో నవాజ్ షరీఫ్ గారి ఇంటికి వెళ్లారు. ప్రస్తుతం మనకి యుఎస్ సపోర్ట్ అవసరం. చైనా శ్రీలంకలోకి ఎంటర్, టిబెట్, నేపాల్ లో చైనా ప్రభావం.
ఇరాన్ పై యుఎస్ ఆంక్షలు. ఇరాన్ నుంచి చములు కొనవద్దని యుఎస్ చెబుతోంది. అటువంటి వాటికి లొంగకుండా ఉంటే మంచిది. యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో స్థానం కోసం మనం ప్రయత్నిస్తున్నాం. దానికి యుఎస్ మద్దతు చేయవలసిన అవసరంలేదు. సీఎంలకు ఆహ్వానం కేసీఆర్, కేసీఆర్ వెళితే జగన్ వెళ్లినట్లే,  నవీన్ పట్నాయక్, ఉద్దవ్ థాక్రే, అమరేంద్ర సింగ్ ని పిలిచారు. మన్మోహన్ సింగ్ గారిని పిలిచారు. దీనిని ఎక్కువగా చేయకూడదు. అమెరికాలో శ్వేత కేశినేని గారు ప్రచారం చేసిన మాట వాస్తవం. వీసా విషయంలో ప్రవాస భారతీయులు ఆందోళనగా ఉన్నారు. ఆ విషయంలో ఆ ఆందోళన తగ్గేవిధంగా ఉంటే మంచిది. మోడీ గారు కూడా అలా చేస్తే మంచిదే.
చైనా అధ్యక్షుడు జిపింగ్ ని పిలిచి ఎంత మర్యాద చేసినా ఆయన పద్దతి మార్చుకోవడంలేదు. మాల్దీవులలో కూడా ఎంటర్ అయిపోయారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్.....వంటి చోట్లకు ఎంటర్ అయిపోతున్నాయి.
భాష ప్రయోగంని ప్రజలు గమనిస్తున్నారు.
విజయనగరంలో వసతి దీవెన కార్యక్రమం జగన్ గారు ప్రారంభించారు. భారీగా కోతలు. పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ తోపాటు ప్లస్ 20వేలు ఇస్తామని మేనిఫెస్టోలో రాశారు. మన రాష్ట్రంలో 17,70,000 ఉన్నత విద్యార్థులు ఉన్నారు. ఎస్టీఎస్సీ,బీసీ, మైనార్టీలు 12 లక్షల మంది ఉన్నారు. ఆ విద్యార్థులకు లబ్ది, అమ్మ ఒడి పథకానికి 80 లక్షల మందికి లబ్ది చేకూర్చాలంటే దాదాపుగా 30వేల కోట్లు అవసరం ప్రతి సంవత్సరం. వీరు చెప్పేది 12వేల కోట్లు అంటే దాదాపు 18వేల కోట్లు కోత విధించారు. ప్రజలను ఈ విధంగా మోసం చేస్తున్నారు. వీరి నిర్ణయాల వల్ల విద్యా వ్యవస్థ సర్వనాశనం అవుతుంది. రాష్ట్రంలో 25,021 కాలేజీలు ఉన్నాయి. ఫీజు రీయింబర్స్ మెంట్ ని పూర్తిగా ఆపేశారు. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. గతంలో మేం 4వేల కోట్లు ఫీజు రీయింబర్స్ మెంట్ కు ఇచ్చాం. 12 రకాల స్కాలర్ షిప్స్ ఆపేశారు. మెస్ ఛార్జీలు, కాస్మోటిక్ కోసం 19వేలు ఇచ్చేవారం. ఒక వెయ్యి పెంచారు. భారీగా కోత విధించారు. పాత పథకాలకు కొత్త ముసుగు వేశారు. .ఫీజు రీయింబర్స్ మెంట్ ఆపడం వల్ల కాలేజీలు మూతపడే పరిస్థితి ఉంది. కాలేజీలకు అటాచ్ డ్ గా హాస్టళ్లు ఉండేవి. తల్లి ఖాతాలోకి వెళ్లడంతో  కాలేజీలకు నిధులు వెళ్లడంలేదు. కాలేజీ యాజమాన్యాలను బెదిరించి గతంలో ఇచ్చిన 40వేలనే ఫీజులుగా ఫిక్స్ చేయమంటున్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ ఎందుకు ఆపారు. నేను అడిగిన రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఏదేఏదో చెబుతున్నారు.
సుందర రామశర్మ – కాంగ్రెస్
అమెరికా ప్రసిడెంట్ ట్రంప్ రావడం విషయం కాదు. ప్రొటోకాల్ సరిగా పాటించలేదు. అంతర్జాతీయ కార్యక్రమాలు జరిగినప్పుడు 8 మంది సీఎంలను పిలిచారు. సోనియాని పిలవకపోడం ...ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారిని గౌరవించవలసిన అవసరంలేదా? సోనియా గాంధీ అంతర్జాతీయంగా తెలిసిన వ్యక్తి. ఆమెని పిలవకపోవడం తప్పు. అది మంచి పద్దతి కాదు. ప్రతి దాన్ని రాజకీయం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వారిని కూడా పిలిచి మేమంతా ఒక్కటే అని చూపించకుండా చేస్తున్నారు. సోనియా గాంధీని పిలవలేదని అమెరికాలో పేపర్లో వస్తే ఎలా ఉంటుంది? దేశ గౌరవాన్ని కాపాడటానికి కాంగ్రెస్ ముందుంటుంది. ట్రంప్ పర్యటనని మేం తప్పు పట్టడంలేదు. వారిని కించపరచాలనిలేదు. వారు చేసింది తప్పు. రాజకీయం చేశారు.
విష్ణు – బీజేపీ
ఇక్కడ మంచి పరిణామం జరుగుతోంది. అందరూ పోజిటివ్ గా మాట్లాడారు. మోడీ గారు ప్రపంచ దేశాలలో సక్సెస్ ఫుల్ గా విజయం సాధించారు. యుఎన్ కౌన్సిల్ లో మెంబర్ విషయంలో చైనా తప్ప అందరూ మద్దతు పలికారు. ప్రపంచ దేశాల్లో 2,3 స్థానాల్లో  ఉండబోతున్నాం. ఒక మంచి అవగాహనతో మోడీ గారు ముందుకు వెళుతున్నారు. మన్మోహన్ సింగ్, పీవీ హయాంతో బాగానే చేశారు. మన్మోహన్ సింగ్ ఇచ్చిన జీఓని రాహుల్ గాంధీ చించివేశారు.  మన్మోహన్ సింగ్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అద్వానీ హోం మినిస్టర్, డిప్యూటీ పీఎం సీఏఏపై చట్టం తీసుకురమ్మని అడిగారు. సోనియా నాయకత్వం రాగానే దేశంలో అశాంతి రెచ్చగొడుతున్నారు. వారి వెనుక పాకిస్తాన్ ఉంది. వారికి సోనియా గాంధీ బొమ్మ తప్ప మిగిలిన వారు మనుషులు కారు. .  మన్మోహన్ సింగ్ కూడా సోనియా ముందు నిలబడాలి.  అది కాంగ్రెస్ పరిస్థితి. ట్రంప్ పెద్ద బిజినెస్ మేన్. మోడీ టీ అమ్ముకునే చిన్న బిజినెస్ మేన్. ఇద్దరూ తెలివైనావారే. టఫ్ పీపుల్సే. స్నేహంలోనే ఫలితం ఉంటుంది. అమెరికా, రష్యాతో స్నేహం అవసరం. చైనా మనకి చాలా ఇబ్బంది కలిగిస్తుంది. చైనాలో కరోనస్ వైరస్ వచ్చినా మనం సాయం చేస్తున్నా మార్పులేదు. ఈ సారి మన దేశస్తుల ఓట్లు వారు అడుతున్నారు. మేం 70 ఎళ్లు ఉంటామని అనడంలేదు. వారు మంచి పనులు చేస్తే మళ్లీ రావచ్చు. స్నేహంగా ఉండి మనకి మంచి జరిగే విధంగా చూడాలి. రేపు అక్కడ పార్టీ మారితే వారితో కూడా స్పేహంగా ఉందాం.  మనం బలంగా ఉండటం ముఖ్యం. మేకిన్ ఇండి ఇక్కడ చేస్తే వారే ఇక్కడికి వచ్చి కొనుక్కుపోతారు. అమెరికాలో భారతీయుల సమస్యలు ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. ట్రంప్ గారు కూడా చాలా కామెంట్లు చేశారు. ఇప్పుడు ట్రంప్ దిగివచ్చారు. మోడీ ఏం మాట్లాడలేదు.ఆయన పని ఆయన చేసుకుంటూ పోయారు. స్నేహంలో విజయం.  అమెరికా శత్రువు కాదు, మిత్రుడు కాదు. చైనా మాత్రం శత్రువే.
తెలుగు మాతృ భాష తీసివేస్తున్నారనేది బాధ. పాఠశాలలు మెరుగుపరచడం మంచిదే. ఇంటింటి పథకాలు మంచిదే. కొన్ని అంశాలలో వారి ఆలోచన విధానం మంచిదే. మొట్టమొదటిసారిగా ప్రజావేధికని కూల్చవేశారు. చంద్రబాబుపై కసిని ఇంకో రకంగా చూపించడం వల్ల రాష్ట్రానిక నష్టం. వారిని తొక్కుతాం అనడం మంచిది కాదు. రాష్ట్రం నుంచి వలసలు ఎక్కువగా ఉన్నాయి. పిల్లలు స్కూల్ కు రావాలంటే వారు సౌకర్యంగా ఉండాలి. ప్రతి నెలా డబ్బు ఇస్తామంటే కుదరదు. వారికి పని కల్పించాలి.
శంకర్  - వైసీపీ
అధ్యక్షుడు విందుకు జగన్ గారిని పిలవకపోవడం పెద్దగా ఆలోచన చేయవలసిన అవసరంలేదు.
కేజ్రీవాల్ 3 సార్లు గెలిచారు. ఆయనకు ఆహ్వానంలేదు. అక్కడ ఏం ఉందో తెలియదు. బెంగాల్ అతి పెద్ద రాష్ట్రం గదా. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ట్రంప్ సందర్శించడం శుభపరిణామం. ఆయన మన దేశం గురించి అన్ని రంగాల గురించి చెప్పడం భారత కీర్తి ఔన్నత్యాన్ని చాటింది. మోడీ టఫ్ నెగోషియేటర్ అని ట్రంప్ చెప్పారు. ఏ అధ్యక్షుడు కూడా ఆ విధంగా పేరుపెట్టి పొగడటం నేను చూడలేదు. మోడీ అంటే మన దేశాన్ని చూడాలి. చాలా ఆప్యాయంగా మాట్లాడారు. భారత దేశం అతిపెద్ద పవర్ ఫుల్ అని చెప్పారు. ఈ స్నేహం రక్షణ, వాణిజ్య పరంగా మనకి ప్రయోజనం. అమెరికాలో మనకి 40 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అతనికి లబ్ది జరగాలి. మనకి లబ్ది జరగాలి. తమ దేశ భద్రతకు ఇబ్బందిలేకుండా ఇమిగ్రేషన్ యాక్ట్ ఉంటుదని ట్రంప్ గతంలో చెప్పారు.  పౌల్ట్రీ, డెయిరీ పరంగా లక్షల మంది ఆదారపడి ఉన్నారు. అమెరికాలో లెగ్ పీస్ లు తినరు. అవన్నీ ఇక్కడకు తీసుకురావడానికి ఒప్పందంలో ఉందంటున్నారు. మిలియన్ టన్నులు అక్కడ ఉంటాయి. అటువంటి ఒప్పందం ఉంటే రైతులు రోడ్డున పడే అవకాశం ఉంది. వ్యక్తిగత పూజ ఎక్కవనిచింపించింది. సబర్మతి ఆశ్రమంలో మోడీ గారు మంచి మిత్రుడు అని రాశాడు. ప్రపంచానికే స్పూర్తి అని ఒబామా రాశారు. మేనిఫెస్టో బైబిల్, ఖురాన్, భగవత్గీత. దీనిని అందరూ పట్టుకొని తిరుగుతాం. విద్య వైద్యంపై మేం చేసే నిధులు రిఫార్మ్స్. ఏపీలో 33 శాతం నిరక్షరాశ్యత. పేదవాడు బలపడాలంటే విద్య ముఖ్యం. విద్య ఉంటే కుటుంబం బాగుంటుంది. ట్రైబల్స్ డ్రాప్ అవుట్స్ ఎక్కువ. వలస వల్ల డ్రాప్ అవుట్స్. పేదరికంలో మూలుగుతా ఉంటారు. అమ్మఒడి కార్యక్రమం దేశంలో అత్యుత్తమ కార్యక్రమం. తల్లులకు ఇస్తే ఫలితం ఉంటుంది. పిల్లలకు పౌష్టికాహారం. బాలికలకు బాత్ రూమ్స్ లేవు. సిగ్గుతో తలదించుకోవాలి. నారాయణ, చైతన్య స్కూల్స్ లో కనీస సౌకర్యాలు లేవు. మేం చేసే కార్యక్రమాలు చెబితే రెండు రోజులు పడుతుంది.
బొలిశెట్టి సత్యనారాయణ – జనసేన
ట్రంప్ ప్రసంగంలో ఒక్క మాట కూడా తీయడానికి వీలులేకుండా మాట్లాడారు. మన దేశం గురించి ఎవరూ చెప్పనివిధంగా చెప్పారు. ప్రపంచం జియోగ్రాఫికల్ కంటే ఎకనామిక్ వార్ ఎక్కువైంది. ట్రంప్ దేశానికి అధినేతే కాకుండా సుపీరియర్ పవర్. జన బలాన్ని మోడీ ప్రదర్శించారు. భారతదేశానికి పనికివచ్చేవిధంగా నిర్ణయం తీసుకుంటే మంచిదని చూపించారు. అందరినీ కలుపుకుపోవడంలో మోడీ ఫెయిల్. సోనియా గాంధీ, కేజ్రీవాల్ ను కూడా పిలవాలి. మోడీ ప్రజాస్వామ్యానికి పెద్ద ప్రధాన్యత ఇచ్చే వ్యక్తి కాదు. ఈ రోజు జరిగే డీల్ ని చూస్తే దేశానికి మంచి జరుగుతుందో ఏందో చూడాలి. బీజేపీ వైపు నుంచి ఇంకా మంచిగా జరగాలి. ఉన్నంతో మోడీ భాగానే చేశారు. ఆయన ఎన్నికలకు వెళుతున్నారు. మన ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారు.  
విద్య కోసం ఎంత చేసినా అభినందిస్తారు. బేసిక్ ఎమినిటీస్ లేవు. బాలికల స్పూల్స్ లో టాయిలెట్స్ లేవు. ప్రైవేటు పాఠశాలలు మెరుగు గా ఉన్నాయి. ఢిల్లీలో కేజ్రీవాల్ లా చేస్తే బాగుండేది. పంచాయతీలకు రంగులు మార్చే ఖర్చు పాఠశాలలకు ఖర్చు పెడితే బాగుండేది. మళ్లీ ఆయన అధికారంలోకి రావడానికి అవకాశం ఉండేది. ఎక్కువ ఖర్చు పాఠశాలలపై ఖర్చు పెట్టాలి. ప్రైవేటు పాఠశాలలు తీసివేయాలి. తెలుగు మీడియం రద్దు మంచిది కాదు.


అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...