v న్యూఢిల్లీ:
‘అమరావతి లెజిస్లేటివ్ కేపిటల్ కదా..! అక్కడ నేను 70
రోజులు ఉంటా’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్
జగన్మోహన్రెడ్డి అన్నారు. ఢిల్లీలో శుక్రవారం రాత్రి ఆయన తన అధికార నివాసమైన
1-జన్పథ్ వద్ద ఢిల్లీలోని తెలుగు జర్నలిస్టులతో భేటీ అయ్యారు.
v ముఖ్యమంత్రి వైఎస్
జగన్మోహన్రెడ్డి : ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను
ప్రతిపక్షం అడ్డుకునే ప్రయత్నం చేసి, అపహాస్యం
చేయడం వల్లే శాసనమండలిని రద్దుచేయాలని నిర్ణయించాం. శాసనసభ మూడింట రెండొంతుల
మెజారిటీతో ఈ తీర్మానాన్ని ఆమోదించి.. రద్దుచేయాలని కేంద్రానికి సిఫారసు చేసింది.
మండలి రద్దుకు తదుపరి చర్యలు చేపట్టాల్సిందిగా కేంద్ర న్యాయశాఖను ఆదేశించాలని
కేంద్ర హోం మంత్రి అమిత్షాకు విజ్ఞప్తి.
v ఢిల్లీలో ఆయన శుక్రవారం రాత్రి 9.45 గంటలకు షాను కలిశారు. సుమారు అరగంటసేపు
చర్చలు జరిగాయి. బుధవారం ప్రధాని మోదీకి అందజేసిన వినతిపత్రంలోని అంశాలనే షాకు
కూడా సమర్పించారు.
v ‘కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు, శాసన రాజధానిగా అమరావతిని నిర్ణయించాం.
ఈ ప్రతిపాదనను రాష్ట్ర కేబినెట్, అసెంబ్లీ
ఆమోదించాయి. కర్నూలుకు హైకోర్టును తరలించేందుకు కేంద్ర న్యాయశాఖకు తగిన
ఆదేశాలివ్వండి. రాయలసీమలో శాశ్వత ప్రాతిపదికన హైకోర్టు ఏర్పాటు చేస్తామని బీజేపీ
కూడా 2019
మేనిఫెస్టోలోనే పేర్కొంది’
No comments:
Post a Comment