25.02.2020:
v రాజధాని
ప్రాంత అభివృద్ధి మండలి (సీఆర్డీఏ) పరిధిలోని కొన్ని గ్రామాల్లో భారీ ఎత్తున
భూమిని సేకరించడానికి జగన్ సర్కార్ ఉత్తర్వుల(G.O.Ms.No.107 Dated:25.02.2020)ను జారీ చేసింది.
v మెనిఫెస్టోలో
పొందుపరిచిన పేదలకు ఇళ్లు పథకం కింద భూమిని సేకరించడానికి అవసరమైన చర్యలను
తీసుకోవాలని కృష్ణా,
గుంటూరు జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఈ మేరకు మున్సిపల్ పరిపాలన శాఖ
కార్యదర్శి జే శ్యామలరావు నోటిఫికేషన్ను జారీ చేశారు.
v సీఆర్డీఏ పరిధిలో నివసించే పేదలకు సొంత ఇంటి
వసతిని కల్పించడానికి మొత్తం 1251.5065 ఎకరాలను సేకరించాలని ప్రభుత్వం ఆదేశించింది.
దీని కోసం 54,307
మందిని లబ్దిదారులుగా గుర్తించింది.
v భూసేకరణ జరిగే గ్రామాలు: మంగళగిరి మండలం నవులూరు, కృష్ణాయపాలెం,
నిడమర్రు, కురగల్లు, తుళ్లూరు మండలం మందడం, ఐనవోలు.
v ఇళ్ల
స్థలాల కేటాయింపు: ఈ భూములను గుంటూరు జిల్లా
తాడేపల్లి మండలంలోని 11,300 మందికి, పెదకాకాని మండలంలోని 1308 మందికి, మంగళగిరి
మండలంలోని 10,247 మందికి, దుగ్గిరాల మండలంలోని 2500 మందికి, కృష్ణా జిల్లా విజయవాడ
మున్సిపల్ కార్పోరేషన్ లోని 28,952 మందికి కేటాయింస్తారు.
v తాడేపల్లి
మండలంలోని వారికి నవులూరు, కృష్ణాయపాలెంలో, పెదకాకాని మండలంలోని వారికి కృష్ణాయపాలెంలో, మంగళగిరి మండలంలోని వారికి
నిడమర్రులో, దుగ్గిరాల మండలంలోని వారికి కృష్ణాయపాలెంలో, విజయవాడ మున్సిపల్
కార్పోరేషన్ వారికి ఐనవోలు, కృష్ణాయపాలెం, కురగల్లు, నిడమర్రు, మందడం గ్రామాలలో
కేటాయిస్తారు.
v మహిళ
పేరుపై ఒక సెంటు ఇస్తారు.
v లేఅవుట్లను
సీఆర్డీఏ అభివృద్ధి చేసి,ఒక్కో లబ్దిదారునికి ఒక సెంటు చొప్పున నంబర్లు
కేటాయించాలి.
v దీనంతటినీ
పర్యవేక్షించడానికి కృష్ణా,
గుంటూరు జిల్లా కలెక్టర్లు, సీఆర్డీఏ కమిషనర్తో ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు
చేసింది.
v భూసమీకరణలో
తీసుకున్న మొత్తం భూమిలో కనీసం 5శాతం పేదలకు అందుబాటు ధరలో గృహ నిర్మాణం కోసం
కేటాయించాలని సీఆర్డీఏ చట్టంలోని 53(డి) నిబంధనలో పేర్కొన్నారు. ఇప్పటికే ఆ భూమిలో
87.02 ఎకరాలను పేదల గృహ నిర్మాణం కోసం వినియోగించారు.
No comments:
Post a Comment