24.02.2020:
v కార్యనిర్వాహక రాజధానిని
విశాఖపట్నంలో ఏర్పాటుచేయబోతున్నట్లు
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన
నేపథ్యంలో వైసీపీపీ నేత విజయసాయిరెడ్డి సోమవారం సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం, సీఎంవో/జీఏడీ ముఖ్య
కార్యదర్శి ప్రవీణ్ప్రకాశ్, సీఎం అదనపు కార్యదర్శి ధనుంజయరెడ్డి, డీజీపీ గౌతం సవాంగ్తో
కలిసి విశాఖలో రహస్య పర్యటన జరిపారు.
v విజయనగరంలో ‘జగనన్న విద్యా దీవెన’ పథకం ప్రారంభించేందుకు
ముఖ్యమంత్రి సోమవారం విమానంలో విశాఖపట్నం రాగా ఆయనతో పాటు వీరంతా ఇక్కడ దిగారు.
అనంతరం జగన్ హెలికాప్టరులో విజయనగరం వెళ్లగా వీరు నగరంలోకి వచ్చారు. రుషికొండ ఐటీ
పార్కులోని మిలీనియం టవర్-1కు పది కార్లలో వెళ్లి కాండ్యుయెంట్ సంస్థ నడుస్తున్న
కార్యాలయాన్ని సందర్శించారు. తర్వాత కాపులుప్పాడలో అదానీ కంపెనీ కోసం రూపొందించిన
లేఅవుట్ను పరిశీలించారు. ఆ తర్వాత భీమిలి బీచ్ రోడ్డుకు వెళ్లి చిట్టివలస జూట్
మిల్లు యాజమాన్యానికి ఉన్న గెస్ట్ హౌస్ను చూశారు.
No comments:
Post a Comment