గుంటూరు జిల్లా తాడేపల్లి మున్సిపాలిటీలో పెనుమాక, ఉండవల్లి, పాతూరు, గుండెమెడ, వడ్డేశ్వరం, ఇప్పట్నం, మల్లెంపూడి, చిర్రావూరు గ్రామాలను విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ గ్రామాలను విలీనం చేస్తూ ప్రభుత్వం ఈ నెల 6న జీవో 97ను జారీ చేసింది. దీనిని సవాల్ చేస్తూ గుంటూరుకు చెందిన కళ్లెం రాజశేఖర్రెడ్డితో పాటు మరికొందరు హైకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. ల్యాండ్పూలింగ్ కింద ఇప్పటికే తాము ఎంతో విలువైన భూమిని కోల్పోయామని, ఆ భూమికి బదులుగా ఇవ్వాల్సిన ప్లాట్లు కూడా ప్రభుత్వం ఇంత వరకు ఇవ్వలేదని పిటిషనర్లు వాపోయారు. ఆ ప్లాట్ల కోసం తాము పోరాటం చేస్తున్నామన్నారు. ఉగాదినాడు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని, అయితే, తాడేపల్లి మండల పరిధిలో పంపిణీకి భూమి లభించకపోవడంతో తమ గ్రామాలను ఆ మండలంలో విలీనం చేశారని తెలిపారు. పెనుమాక, ఉండవల్లి గ్రామాలు సీఆర్డీఏ చట్ట ప్రకారం రాజధాని పరిధిలోనివని, అందువల్ల వాటిని డీనోటిఫై చేయకుండా మున్సిపాలిటీలో కలపలేరని పేర్కొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు
ఈరోజు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుగంటే...గోంగూర తెలుగంటే...గోదారి తెలుగంటే...గొబ్బిళ్ళు తెలుగంటే...గోరింట తెలుగంటే...గు...
-
నారా చంద్రబాబు : ముఖ్యమంత్రి, లా అండ్ ఆర్డర్ కొణిదెల పవన్ కల్యాణ్ : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి స...
-
పుష్ప- 2: ది రూల్ సినిమా ట్రైలర్ నవంబర్ 17వ తేదీ ఆదివారం బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపైన వి...
-
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన న్యాయవాది, రచయిత సావిత్రీపతి మాదిరాజు గోవర్థనరావు రాసిన ‘మన మంగళగిరి 2.0’ని ఇటీవల స్థానిక శాసనసభ...
No comments:
Post a Comment