May 31, 2022

కుల, మత రహిత ధ్రువీకరణ పత్రం

తమిళనాడులో మూడున్నరేళ్ల చిన్నారికి ‘కుల, మత రహిత ధ్రువీకరణ పత్రం’జారీ చేసింది ప్రభుత్వం. తమిళనాడులో ఇటువంటి సర్టిఫికెట్ జారీ చేయటం తొలిసారి కావటం విశేషం.భారతదేశం విభన్న మతాల కలయిక..అందుకే భారత్ ను భిన్నత్వంలో ఏకత్వం. ఏకత్వంలో భిన్నత్వం గల దేశం అంటారు. అటువంటి భారత్ లో ఓ చిన్నారిని స్కూల్లో చేర్పించాలంటే కులానికి, మతానికి సంబంధించి కాలమ్‌ పూర్తి చేయాలి.ఆ చిన్నారి తల్లిదండ్రులు  కులానికి మతానికి సంబంధించి కాలం నింపేదిలేదని, పాపకు సీట్ ఇవ్వాలని అడిగారు. కానీ సదరు స్కూల్ యాజమాన్యం మాత్రం ఆ పాపకు సీట్ ఇవ్వటానికి నిరాకరించింది.అలా మరికొన్ని స్కూళ్లకు వెళ్లినా అదే పరిస్థితి ఎదురైంది వారికి. దీంతో ఆ పాప తల్లిదండ్రులు ప్రభుత్వం నుంచి కుల, మత రహిత (No Religion-No Caste) సర్టిఫికెట్ తీసుకున్నారు. తమిళనాడులో తొలిసారిగా ఆ పాపకు కుల, మత రహిత (No Religion-No Caste) సర్టిఫికెట్ జారీ చేశారు.తమిళనాడు కేకే పుదూర్‌కు చెందిన ఎస్‌ నరేష్‌ కార్తీక్‌-గాయత్రి దంపతులు తమ మూడున్నరేళ్ల పాప  విల్మ కు ‘కుల, మత రహిత ధ్రువీకరణ పత్రం’ పొందారు. ఫలితంగా ఆ చిన్నారి ఏ కులానికి, మతానికి చెందిన మనిషికానట్లే.

సీడ్‌రీప్స్ ఎడ్యుకేషనల్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడైన 33 ఏళ్ల నరేష్ మాట్లాడుతూ.. కులమతాల పేరుతో తమ బిడ్డ ‘విల్మ’ను నిర్బంధించడం ఇష్టం లేక తన పేరున కుల, మత రహిత (No Religion-No Caste) సర్టిఫికెట్ తీసుకున్నామని తెలిపారు. నిజానికి 1973లో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం పిల్లలను స్కూల్లో చేర్చుకునే సమయంలో మతం, కులం తప్పనిసరి కాదు. ఈ విషయం వారికి తెలియదు. స్కూళ్లలో కూడా ఈ ఆదేశాలకు తిలోదకాలు ఇస్తున్నాయి. 1973, 2000వ సంత్సరంలో తమిళనాడు విద్యా శాఖ రెండు వేర్వేరు ఉత్తర్వులు విడుదల చేసింది. అందులోనూ ఇదే విషయాన్ని పేర్కొంది. ‘కులం లేదు, మతం లేదు’ అని తల్లిదండ్రులు చెబితే కనుక ఆ కాలమ్‌ను ఖాళీగా వదిలిపెట్టేందుకు ప్రజలను అనుమతించాలంటూ పాఠశాల విద్యా డైరెక్టర్‌ను ఆదేశించింది.కానీ స్కూళ్లు మాత్రం దానికి వ్యతిరేకంగా ఉన్నాయి.మతం, కులం కాలాన్ని నింపకుండా స్కూల్‌లో చేర్చుకోబోమని స్కూల్ యాజమాన్యాలు అవి నింపటం కచ్చితం అని తేల్చి చెప్పడంతో నరేష్ దంపతులు కోయంబత్తూరు జిల్లా కలెక్టర్ జీఎస్ సమీరన్‌ను సంప్రదించారు. ఆయన కోయంబత్తూరు తహశీల్దారుకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో వారి సమస్య పరిష్కారమైంది. చిన్నారి తల్లిదండ్రులు అఫిడవిట్ సమర్పించడంతో కోయంబత్తూరు నార్త్ తహసీల్దార్ వారికి ‘నో రిలిజియన్-నో క్యాస్ట్’ సర్టిఫికెట్ జారీ చేశారు.

 కాగా, కుల, మత రహిత సర్టిఫికెట్ వల్ల ప్రభుత్వ రిజర్వేషన్లకు తమ కుమార్తె అనర్హురాలిగా మారుతుందని తమకు తెలుసని ఆ అఫిడవిట్‌లో వారు పేర్కొన్నారు.తహసీల్దార్ జారీ చేసిన ధ్రువీకరణ పత్రం ప్రకారం.. బేబీ విల్మ ఏ కులానికి, మతానికి చెందినది కాదు. ‘మతం లేదు, కులం లేదు’ అనే సర్టిఫికేట్‌ను పొందొచ్చన్న విషయం చాలామంది తల్లిదండ్రులకు తెలియదని, ఇటువంటి ధ్రువీకరణ పత్రాన్ని పొందటానికి మరింత మంది తల్లిదండ్రులు ముందుకు వస్తారని ఆశిస్తున్నానని నరేష్ తెలిపారు.

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...