జిల్లా
కలెక్టర్స్ కాన్ఫరెన్స్ -25.10.2018 గురువారం
స్థలం
: ఉండవల్లి
కరకట్ట పక్కన ముఖ్యమంత్రి నివాసం వద్ద ప్రజావేదిక
ముఖ్య అంశాలు
ముఖ్యమంత్రి ప్రసంగంలోని ముఖ్య అంశాలు.
Ø నూతనంగా నూర్
బాషా/దూదేకుల
ముస్లిం కోపరేటివ్ సొసైటీ ఏర్పాటు. రూ. 40 కోట్లు కేటాయింపు.
Ø మైనారిటీ
ఫైనాన్స్ కార్పొరేషన్కు రూ. 100 కోట్లు
కేటాయింపు.
Ø నిధులు
ఇస్తున్నా విద్యార్ధులకు సకాలంలో ఉపకారవేతనాలు ఇవ్వకపోవడం సమర్ధనీయం కాదు.
Ø 90 శాతం
సంతృప్తి సాధించకుంటే ఆ శాఖ అధికారులు విఫలమైనట్టే.
Ø డిసెంబర్
కల్లా రాష్ట్రంలో సగం గ్రామాలు స్వచ్ఛంగా కనిపించాలి.
Ø మురుగునీటి
పారుదల వ్యవస్థను అనుసంధానం చేసి, అక్కడ మురుగు
నీటి శుద్ధి నిర్వహణ చేపట్టాలి.
Ø ఈ డిసెంబర్
నాటికి రాష్ట్రంలోని 50 శాతం
గ్రామాల్లో మురుగునీటి ఇంకుడు గుంటలు (సోప్ పిట్స్) తవ్వడం పూర్తి చేయాలి.
Ø 5 వేలకు పైగా
జనాభా ఉన్న గ్రామాల్లో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థను తప్పనిసరిగా ఏర్పాటు
చేయాలి.
Ø పట్టణ
ప్రాంతాలలో డోర్ నెంబర్లు నవంబరు లోపల పూర్తిచేయాలి. వీధి సూచికలను మూడు మాసాల్లో పెట్టాలి.
Ø ప్రతి ఇంటి
నుంచి చెత్త సేకరించి, తరలించాలి.
Ø పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నూరు శాతం ఎల్ఈడి బల్డులు
అమర్చాలి.
Ø రాష్ట్రంలో 5 లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యం(జడ్బీఎన్ఎఫ్-జీరో బడ్జెట్
నేచురల్ ఫార్మింగ్) చేస్తున్నారు.
Ø 2024 నాటికి వంద శాతం రైతులు ఈ
విధానంలోకి రావాలి.
Ø రాష్ట్రంలో 42 లక్షల ఎకరాల్లో ఉద్యానవన పంటలు పండిస్తున్నారు. కోటి ఎకరాలలో పండించాలన్నది లక్ష్యం.
Ø వ్యవసాయ
రంగంలో చేసిన అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఐసీఏఆర్ ప్రతిష్టాత్మక
పాలసీ లీడర్ షిప్ అవార్డు ఇచ్చారు. ఈ అవార్డుని
ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి రాజనాధ్ సింగ్ వ్యవసాయశాఖ మంత్రి చంద్రమోహన రెడ్డికి
అందించారు. ఆ అవార్డ్ ని
కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో ఆయన సీఎంకు అందజేశారు.
Ø ధాన్యం
ఉత్పాదకతలో నెల్లూలు జిల్లా మొదటి స్థానంలో ఉంది.
Ø వ్యవసాయంలో
రసాయనాల వాడకం గణనీయంగా తగ్గింది. రైతులకు
రెండు వేల కోట్ల రూపాయలు ఆదా అయింది.
Ø ఏపీలో
చేపట్టిన జీరో బేస్డ్ నాచురల్ ఫార్మింగ్
ప్రపంచంలోనే అతి పెద్ద అగ్రో ఎకాలజీ ప్రోగ్రామ్ : ప్రకృతి సేద్యంపై ప్రభుత్వ సలహాదారు విజయకుమార్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
---------------------------------
Ø సామాజిక
సాధికారిత కోసం 2 లక్షల మంది
లబ్దిదారులకు రాయితీతో వివిధ రకాల పరికరాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. లక్ష యూనిట్లు బ్యాంకుల ద్వారా కాగా, మరో లక్ష మందికి ఆదరణ పథకం ద్వారా మెగా
గ్రౌండింగ్ మేళాలో డిసెంబర్ 31 నాటికి
అందరికి అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Ø ఎస్పీ
కార్పోరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర రావు కోరిన మేరకు భూములు కొనుగోలు చేసి
ఎస్సీలకు అందజేయాలని సీఎం చెప్పారు.
Ø అన్ని
కార్పోరేషన్లకు ఒక రకమైన నిబంధనలు రూపొందించమని సీఎం ఆదేశించారు.
Ø చంద్రన్న
పెళ్లి కానుకలు అందించే విషయంలో
తలెత్తుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించమని దేశించారు.
Ø సూక్ష్మ
నీటిపారుదల పద్దతిలో సాగు చేయడంలో దేశంలో రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచినందుకు ఆ
శాఖ అధికారులను సీఎం అభినందించారు. ఈ రకమైన
సేద్యాన్ని మరింత ప్రోత్సహించాలని చెప్పారు.
అనంతపురం జిల్లా
అనంతపురం జిల్లాలో 19 మండలాలను
కరువు మండలాలుగా గుర్తించాలని కోరగా, కేంద్రం
నిబంధనల మేరకు 17 మండలాలనే
గుర్తించిందని జిల్లా కలెక్టర్ వీర పాండియన్ తెలిపారు. మిగిలిన రెండు మండలాలను కూడా కరువు మండలాలుగా గుర్తించాలని మంత్రి
పరిటాల సునీత కోరారు. రాష్ట్రం
ప్రభుత్వం గుర్తించే విధంగా ప్రతిపాదిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
అనిల్ చంద్ర పునీఠ చెప్పారు.
అనంతపురంలో స్టేడియం నిర్మాణానికి నిధులున్నా స్థలం సమస్య ఉన్నట్లు
జిల్లా కలెక్టర్ వీర పాండియన్ చెప్పారు.
శ్రీకాకుళం జిల్లా
తిత్లీ తుపాను పునరావాస చర్యలు చేపట్టడంలో అధికారులు అందరూ బాగా పని
చేశారని జిల్లా ఇన్ చార్జి మంత్రి పితాని సత్యనారాయణ అభినందించారు. శ్రీకాకుళం జిల్లాలో పేదలు ఎక్కువ మంది
ఉన్నారని, ఇళ్లన్నీ
ఎక్కువగా మట్టితోనే నిర్మించడం వల్ల ఎక్కువగా దెబ్బతిన్నాయని మంత్రి చెప్పారు. వారికి పక్కా ఇళ్లు నిర్మించవలసిన అవసరం
ఉందన్నారు. రాష్ట్రంలో
తీర ప్రాంతం ఎక్కువగా ఉన్నందున తుఫానులు వచ్చే అవకాశం ఉంటుందని, అందువల్ల విపత్తులను సమర్థవంతంగా
ఎదుర్కొనేందుకు కావలసిన పరికరాలు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.
తిత్లీ తుఫాను వల్ల దెబ్బతిన్న పలాస, ఇచ్చాపురం మున్సిపాల్టీలను అమృత్ పథకం నిధులను వినియోగించుకొని పూర్తి
స్థాయిలో అభివృద్ధి చేయాలన్న శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ధనుంజయ రెడ్డి సూచనకు
ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
చిత్తూరు జిల్లా
సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ లో చిత్తూరు జిల్లా మొదటి స్థానంలో
ఉండటంతో ఆ జిల్లా కలెక్టర్ ప్రద్యమ్నను సీఎం అభినందించారు.
రైతులకు అదనపు ఆదాయం కోసం 12
వేల తేనెటీగల పెట్టెలు ఇవ్వాలన్న కలెక్టర్
ప్రద్యమ్న ప్రతిపాదనను సీఎం అంగీకరించారు.
దానిని ఇంకా
పెద్ద ఎత్తున చేపట్టే అంశాన్ని పరిశీలించమని అధికారులను ఆదేశించారు.
కడప జిల్లా
మురుగునీటి ఇంకుడు గుంటలు (సోప్ పిట్స్) తవ్వకానికి స్థలాలు, భూములో రాళ్లు వంటి పలు సమస్యలు జిల్లాలో తలెత్తుతున్నట్లు కడప జిల్లా
కలెక్టర్ సి.హరికిరణ్
సీఎం దృష్టికి తీసుకువెళ్లారు.
గుంటూరు జిల్లా
ఎల్ఈడీ బల్బులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి వాటిని సరఫరా చేసే
వారితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని గుంటూరు జిల్లా కలెక్టర్ కోన శశిధర్
కోరగా, ప్రభుత్వ
ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునీఠ అంగీకరించారు.
ప్రస్తుతం సాగులో ఉన్న పంటలకు ఇంకా 20 నుంచి 25 టీఎంసీల నీటి
లోటు ఉందని, దీనిని
అదిగమించేందుకు వాగుల్లో వృధాగా పోతున్న నీటిని వాడుకునేందుకు రైతులకు ఉచితంగా
తాత్కాలిక విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని కోరారు. ఏ ఏ ప్రదేశాలలో కావాలో తెలియజేస్తే విద్యుత్ కనెక్షన్లు ఇస్తామని ముఖ్య
కార్యదర్శి అజయ్ జైన్ చెప్పారు.
విశాఖ జిల్లా
చెత్త సేకరణకు సంబంధించి జిల్లాల వారీగా ఇచ్చిన స్టార్ రేటింగ్ లో
విశాఖ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది.
నోట్: ఈ వార్తకు ఫొటోలు ఉన్నాయి.
జారీ చేసినవారు: పబ్లిసిటీ
సెల్, ఐ అండ్ పీఆర్, సచివాలయం, అమరావతి.