Ø రాష్ట్రం నుంచి హస్తినకు
చేరిన చంద్రబాబు ధర్మపోరాట దీక్ష
Ø బీజేపీ వ్యతిరేక ప్రతిపక్ష
పార్టీలను కూడగట్టడంలో విజయం
Ø 68 ఏళ్ల
వయసులో కూడా పోరాట పటిమ ప్రదర్శన
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా
ఉద్యమాన్ని ఉదృతం చేశారు. దేశ
రాజధాని ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా నినాదం మరో సారి మారు మ్రోగింది. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా, తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఆయన ఏపీ భవన్
వేదికగా సోమవారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు ధర్మ పోరాట దీక్ష నిర్వహించారు.
రాష్ట్ర సమస్యకు
జాతీయ స్థాయిలో ప్రచారం కల్పించాలన్న ఉద్దేశంతో ఆయన పట్టువదలసి విక్రమార్కుడిలా
68 ఏళ్ల వయసులో ఈ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి
రాసిన లేఖలో చంద్రబాబు నాయుడు ‘‘నాకు
గౌరవం కాదు నేను కోరుకునేది నా రాష్ట్రానికి గౌరవం. 5 కోట్ల ఆంధ్ర ప్రజల ప్రతినిధిని, 175మంది సభ్యుల శాసనసభకు నాయకుడిని.
నేను కోరేది నాకు
న్యాయం చేయమని కాదు, నా
రాష్ట్రానికి న్యాయం చేయమని. మా హక్కులు నెరవేర్చమని, విభజన చట్టంలో ఉన్న 18 అంశాలు అమలు చేయమని నేను డిమాండ్
చేస్తున్నాను’’ అని
పేర్కొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ఈ ధర్మపోరాట
దీక్షలో పాల్గొనడం విశేషం. చంద్రబాబు దీక్షకు కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, ఆమ్ ఆద్మీ, వామపక్షాలతో సహా దాదాపు 22
రాజకీయ పార్టీలు
మద్దతు తెలుపుతూ సంఘీభావం ప్రకటించాయి. రాహుల్ గాంధీ, ఫరూక్ అబ్దుల్లాతో సహా పలువురు నేతలు కూడా దీక్షా
శిబిరానికి తరలి వచ్చి మద్దతు తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో 2014లో ప్రతిపక్ష నేత హోదాలో ఆంధ్రప్రదేశ్కు
న్యాయం చేయమని ఆయన ఇక్కడ నుంచే
వారం రోజులు దీక్ష చేశారు. ఇప్పుడు సీఎం హోదాలో హామీలు నెరవేర్చమని ఒక రోజు
దీక్ష చేశారు. పార్లమెంట్
సమావేశాలు జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి హోదాలో ఆయన దీక్ష చేసి జాతీయ
స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం విషయంలో
జాతీయ స్థాయిలో అందోళన చేయడంతోపాటు బీజేపీ వ్యతిరేక ప్రతిపక్ష పార్టీలను
కూడగట్టడంలో ఆయన విజయం సాధించారు.
పుట్టిన రోజు విజయవాడలో నిరాహార దీక్ష
సమాఖ్య వ్యవస్థ, రాష్ట్రాభివృద్ధి, ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు నాయుడు
పోరాడుతూనే ఉన్నారు. ముఖ్యంగా
విభజన చట్టంలో పేర్కొన్న హామీలు, ప్రత్యేక
హోదా కోసం ఆయన రాష్ట్రంలోని ప్రధాన నగరాలలో ధర్మపోరాట దీక్షలు చేశారు. ఈ దీక్షలలో మంత్రులు,
ఎమ్మెల్యేలు,
ఎమ్మెల్సీలు,
ఇతర
ప్రజాప్రతినిధులు, పార్టీ
కార్యకర్తలు, ప్రజలు
భారీ స్థాయిలో పాల్గొని మద్దతు తెలిపారు. అన్ని ధర్మపోరాట దీక్ష సభలలో గత లోక్ సభ ఎన్నికల సమయంలో ప్రధాని అభ్యర్ధిగా
వచ్చిన మోడీ తిరుపతిలో ఇచ్చిన హామీలకు సంబంధించి వీడియోను ప్రదర్శించారు. తొలుత సీఎం చంద్రబాబు నాయుడు 2018 ఏప్రిల్ 20 ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7గంటల వరకు విజయవాడ ఇందిరా గాంధీ
స్టేడియంలో ధర్మపోరాట దీక్ష చేశారు. ఆ సందర్భంలో ఆయన మాట్లాడుతూ‘నవ్యాంధ్రకు ఇచ్చినవి చట్టబద్ధమైన, న్యాయమైన హామీలు. వాటిని పూర్తిగా నెరవేర్చడం కేంద్రం
బాధ్యత!’ అని పేర్కొన్నారు. ప్రత్యేక హౌదా, విభజన చట్టం హామీల అమలు విషయంలో కేంద్ర
వైఖరికి నిరసన తెలిపారు. ఐదు
కోట్ల రాష్ట్ర ప్రజల తరఫున ఈ దీక్ష చేపట్టినట్లు చెప్పారు. ఆ రోజు ఆయన పుట్టినరోజు.
పుట్టిన
రోజువేడుకలకు దూరంగా ఉండాలని, ఆ
రోజంతా నిరాహారంతో దీక్ష చేశారు. పుట్టినరోజున ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్రం కోసం నిరశన
దీక్ష చేయడం దేశ చరిత్రలో అదే ప్రథమం. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయం, మోదీ సర్కారు వైఖరికి నిరసనగా పుట్టిన రోజున నిరాహార దీక్ష
చేస్తున్నట్లు చెప్పారు. తిరుపతిలో
వెంకటేశ్వరుడి నామాలను చూస్తూ మోదీ మనకు ప్రత్యేక హోదాతో సహా ఎన్నో హామీలు ఇచ్చారు.
వాటికి తిలోదకాలు
ఇచ్చిన తీరును ఎండగడుతూ నమ్మకద్రోహం, కుట్రల నుంచి రాష్ట్రాన్ని
కాపాడుకునేందుకు దీక్ష చేపట్టినట్లు చెప్పారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తే కొరివితో
తలగోక్కున్నట్లేనని కేంద్రాన్ని హెచ్చరించారు. ఓట్లు అడిగేందుకు ప్రతిపక్ష నేత జగన్కు ఏ
అర్హత ఉందని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరుకావడమేనా వారి అర్హత
అని అడిగారు. ‘‘కొన్ని
పార్టీలు ముసుగు వేసుకున్నాయి. ఆ ముసుగు వీరులకు మోదీ అండదండలున్నాయి.
ఏపీ విషయంలో మాటమీద
నిలబడకుండా ముసుగు వీరుల మాటలు విన్నారు. మునిగిపోతారు. ఈ ముసుగు వీరుల బండారం బయటపడుతుంది’’అని చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో మొత్తం 25మంది ఎంపీలు టీడీపీ తరపున గెలిస్తే మనం చెప్పిన ప్రభుత్వమే ఢిల్లీలో
ఉంటుందన్నారు. భవిష్యత్తులో
కేంద్రంలో చక్రం తిప్పేది తెలుగుదేశం పార్టీనేనని చెప్పారు. మనం గొంతెమ్మ కోర్కెలు కోరలేదు.
విభజన చట్టం అమలు
చేయాలని, రాజ్యసభలో ఇచ్చిన హామీల మేరకు ప్రత్యేక
హోదా ఇవ్వాలని మాత్రమే డిమాండ్ చేస్తున్నామని స్పష్టం చేశారు. పసిబిడ్డలాంటి రాష్ట్రానికి సకాలంలో
అందాల్సిన సహాయం అందకపోతే నష్టపోతామన్నదే తన భయంగా పేర్కొన్నారు.
ఆ నాడు చంద్రబాబుకు చంద్రబాబుకు మద్దతుగా 13జిల్లాల్లో మంత్రుల దీక్షలు చేపట్టారు.
పలు ప్రజా సంఘాలు కూడా మద్దతు తెలిపాయి.
తిరుపతిలో
రాష్ట్రానికి కేంద్రం
చేసిన అన్యాయంపై 2018 ఏప్రిల్
30న 'నమ్మక ద్రోహం, కుట్రల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం' అనే నినాదంతో తిరుపతిలో ధర్మపోరాట దీక్ష
బహిరంగ సభ నిర్వహించారు. అప్పటికి
సరిగ్గా నాలుగు ఏళ్ల క్రితం ఎన్నికల
ప్రచారంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ పర్యటనకు విచ్చేసిన నరేంద్ర మోడీ 2014
ఏప్రిల్ 30న శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం
ప్రాంగణంలోని తారకరామా స్టేడియంలో ప్రత్యేక హోదా ఇస్తామని, రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలన్నీ అమలు
చేస్తామని హామీ ఇచ్చారు. అందువల్ల
ఆ రోజు
అక్కడ భారీ బహిరంగ
సభ నిర్వహించారు. ఈ
సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ మోడీ రాష్ట్రానికి చేసిన అన్యాయం
గురించి ఎండగట్టారు. ఢిల్లీలో
ప్రధాని ఉలిక్కిపడేలా ఈ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో
ధర్మపోరాట సభలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని హెచ్చరించారు. తాను ప్రధానిపైనా, కేంద్రంపై పోరాడుతుంటే, కలిసి రావాల్సింది పోయి కొందరు తనను
విమర్శిస్తున్నారన్నారు. ఎప్పుడూ
మాట్లాడని పవన్ కల్యాణ్ కూడా తనను విమర్శిస్తున్నారని పేర్కొన్నారు.
టీడీపీకి ఎవరిపైనా
కోపం లేదని,పొట్టకొట్టినప్పుడు
తిరగబడుతామని చంద్రబాబు కేంద్రాన్ని హెచ్చరించారు.
విశాఖపట్నంలో
నమ్మకద్రోహం, కుటిల రాజకీయాలపై ఏపీ సీఎం చంద్రబాబు
నాయుడు 2018 మే 22న విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్
కశాశాల మైదానంలో ధర్మపోరాట దీక్ష నిర్వహించారు. ఈ దీక్షకు మద్దతు తెలుపుతూ పెద్ద ఎత్తున
ప్రజలు తరలి వచ్చారు. రాష్ట్రంలో
కేంద్ర ప్రభుత్వం అలజడి సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నదని, వాటిని తిప్పికొట్టేందుకు ప్రజలంతా మద్దతు
తెలపాలని ఆ సందర్భంగా ఆయన కోరారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వకుండా మోసం చేసి, కుటిల రాజకీయాలు చేస్తున్నారని
విమర్శించారు. రాష్ట్ర
విభజన హామీలను నెరవేర్చకుండా తాత్సారం చేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు
తెలిపారు. రాష్ట్రానికి
ప్రత్యేక హోదా, విశాఖ
కేంద్రంగా రైల్వే జోన్తోపాటు విభజన
హామీలన్నీ నెరవేర్చాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని
అన్ని ప్రధాన కేంద్రాల్లోనూ దీక్షలు నిర్వహించి, కేంద్రంపై ఒత్తిడి పెంచాలని పార్టీ
నిర్ణయించినట్లు తెలిపారు.
కాకినాడలో
రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారంటూ
ఎన్డీఏకు గుడ్బై చెప్పిన తెలుగుదేశం పార్టీ ఆ తరువాత విభజన హామీల అమలుకు
కేంద్రంపై వత్తిడి పెంచుతూ వచ్చింది.
అందులో భాగంగా రాష్ట్రానికి
జరుగుతున్న అన్యాయం, విభజన
చట్టంలోని హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ 2018 జూన్ 29న
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జెఎన్టీయూ ప్రాంగణంలో ధర్మ పోరాట దీక్ష
నిర్వహించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు
నాయుడు మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. భావితరాల భవిష్యత్తు కోసమే ఈ దీక్ష చేస్తున్నట్లు
తెలిపారు. రాష్ట్రానికి
అన్యాయం చేయాలని చూస్తే వదిలే ప్రసక్తే లేదని కేంద్రాన్ని హెచ్చరించారు.
రాష్ట్రానికి
అన్యాయం చేసినవారికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. దేవుడి పేరు చెప్పుకొని ఓట్లడిగే బీజేపీ
తిరుపతి వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీలను గాలికి వదిలేస్తే ఏమనుకోవాలన్నారు. ఢిల్లీని
తలదన్నే రాజధానికి సహకరిస్తానన్న ప్రధాని మోడి అమరావతి నిర్మాణానికి కేవలం రూ.1500
కోట్లు మాత్రమే
ఇచ్చారని,
సర్దార్పటేల్ విగ్రహానికి
రూ.2500 కోట్లు
ఇచ్చారని వివరించారు. ఆంధ్రప్రదేశ్కు ఎందుకు ఇవ్వరని అడిగారు. పిడికిలి
బిగించి పోరాడుదాం, విజయం
మనదే అని కాకినాడ వేదికగా చంద్రబాబు పిలుపు ఇచ్చారు.
ఒంగోలులో
ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు కోసం 2018
జూలై 29న
టీడీపీ
ఆధ్వర్యంలో ఒంగోలులో ధర్మపోరాట దీక్ష చేశారు. ఈ సందర్శంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ
ప్రధాని నరేంద్ర మోడీ పై మరోసారి
నిప్పులు చెరిగారు. ‘ప్రధాని
మోడీ కంటే ముందే నేను సీఎం అయ్యాను. తొమ్మిదేళ్లు నిరంతరాయంగా ప్రజలకు సేవలందించాను.
ఇప్పుడాయన నాకు
పరిపక్వత లేదంటున్నారు. పరిపక్వత
లేనిది నాకా..
మీకా? ఎవరి పరిపక్వత ఎంతో తేల్చుకుందాం రండి’ అని సవాల్ విసిరారు. గత ఎన్నికలకు ముందు నల్లధనాన్ని వెలికితీస్తానని, అవినీతి సొమ్మును జప్తు చేస్తానని
ప్రగల్భాలు పలికిన మోదీ వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆస్తులను
ఎందుకు జప్తు
చేయలేదని
ప్రశ్నించారు. దెబ్బతగిలిన
చోటే కారంపూసి ఆనందించే శాడిస్టు
మనస్తత్వంతో కేంద్రం వ్యవహరిస్తోందని సీఎం మండిపడ్డారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై రాజీలేని
పోరాటం చేస్తామని
హెచ్చరించారు.
కేంద్రం నమ్మించి
మోసం చేసిందన్నారు. ఈ విషయమై పార్లమెంటు లోపల, వెలుపల బీజేపీ తీరును, మోదీ వైఖరిని ఎండగట్టాం. కుట్ర రాజకీయాలపై ధర్మపోరాటం ప్రారంభించామని, ఒంగోలు సభతో నాలుగు సభలు పూర్తయ్యాయని,12 సభలు పూర్తయ్యేలోపు ఆ
పార్టీలను
బంగాళాఖాతంలో కలిపేద్దామన్నారు. రాష్ట్రానికి చెందిన టీడీపీ ఎంపీలు
పార్లమెంటులో సమర్థంగా తమ గళం వినిపించారని వారిని అభినందించారు.
ఒక రాష్ట్ర సమస్య
కోసం, ఒక ప్రాంతీయ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై
అవిశ్వాస తీర్మానం పెట్టడం దేశంలోనే మొదటిసారని చెప్పారు. టీడీపీ ఈ చరిత్రను సృష్టించిందన్నారు. తెలుగుదేశం పార్టీ ఏమిటో, తెలుగోడి సత్తా ఏమిటో మోడీకి కర్ణాటక
ఎన్నికల్లో కొద్దిగానే కనిపించిందని, 2019 ఎన్నికల్లో పూర్తిగా చూపిస్తామని
హెచ్చరించారు.
తాడేపల్లిగూడెంలో
ఆంధ్రప్రదేశ్కు
ప్రత్యేక హోదా, విశాఖ
రైల్వేజోన్ సాధన, రాజధానికి
నిధుల విడుదల కోరుతూ 2018 సెప్టెంబర్
29న టీడీపీ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెంలో ధర్మపోరాట సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ
విభజన చట్టంలోని హామీలన్నింటినీ నెరవేరుస్తామని చెప్పి, కేంద్రం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని
అన్నారు. హోదా
ఇస్తామని చెప్పి కేంద్రం మోసం చేసిందని,
నాలుగేళ్లుగా ప్రత్యేక
హోదా ఉండి ఉంటే 90 శాతం
గ్రాంటు వచ్చేదని, రాష్ట్రానికి ఇచ్చిన రూ.1500
కోట్లతో
ఎలక్ట్రిసిటీ కేబుల్ కూడా రాదన్నారు.
11 రాష్ట్రాలకు
ప్రత్యేక హోదా ఇచ్చారని, ఏపీకి
ఎందుకివ్వరు? అని ప్రశ్నించారు. విశాఖ రైల్వేజోన్, కడప ఉక్కు కర్మాగారం రాకుండా బీజేపీ అడ్డుపడుతోందని
విమర్శించారు. ఇతర నగరాల్లో ర్యాపిడ్, బుల్లెట్ రైళ్లు ఏర్పాటు చేస్తున్నారని, విజయవాడ, విశాఖ మెట్రో రైళ్లకు మాత్రం ప్రాధాన్యం
ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హక్కుల కోసం తాము చేసే పోరాటంలో అంతిమంగా గెలిచేది
ధర్మం,
న్యాయమేనని
చంద్రబాబు పేర్కొన్నారు. అభివృద్ధిలో దేశంలోని అన్ని రాష్ట్రాల
కంటే ఏపీ ముందంజలో ఉందన్నారు. దేశంలో ఎవరికీ సాధ్యం కానివిధంగా నదులను అనుసంధానం
చేసి చరిత్ర సృష్టించామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం
చేస్తామన్నారు. మన కలల రాజధాని అమరావతిని దేశంలో అన్ని
నగరాల కంటే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. తాడేపల్లిగూడెం సభకు టీడీపీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. జనం
భారీగా రావడంతో పట్టణం చివరన పొలాల్లో సభ పెట్టుకోవాల్సి వచ్చిందన్నారు.
ప్రొద్దుటూరులో
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విభజన సందర్భంగా
పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలను గాలికొదిలేసి జనాల్ని మభ్యపెట్టిన కేంద్రానికి
చెంపపెట్టులా 2018 అక్బోబర్
30న టీడీపీ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు
నాయుడు కడప జిల్లా ప్రొద్దుటూరులో
ధర్మపోరాట దీక్ష చేశారు. పట్టణంలోని బొల్లవరం సమీపంలో 86
ఎకరాల విస్తీర్ణంలో
ఏర్పాటు చేసిన భారీ సభావేదిక వద్దకు అధిక సంఖ్యలో జనం తరలి వచ్చి దీక్షకు మద్దతు
తెలిపారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ
తిరుపతిలో శ్రీవెంకటేశ్వరుని సాక్షిగా ఏపీకి అండగా ఉంటానని మోదీ హామీ ఇచ్చారని, కానీ మోదీ ఏపీకి అన్యాయం చేశారని ఆవేదన
వ్యక్తం చేశారు. మోదీ చేసింది ముమ్మాటికీ నమ్మక ద్రోహమేనని
తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు.
తాము కొత్తగా ఏమీ
కోరటంలేదని, విభజన చట్టంలోని హమీలను అమలు చేయాలని కోరుతున్నామన్నారు.
రాష్ట్రం కోసం
పార్లమెంట్లో పోరాడిన ఏకైక పార్టీ టీడీపీనేనని తెలిపారు. ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని
ఆనాడు పార్లమెంటులో బీజేపీ డిమాండ్ చేసిందని,
ఐదేళ్లు ప్రత్యేక
హోదా ఇస్తామని ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటించారని వివరించారు. ఒక
ప్రధాని ఇచ్చిన హామీని మరో ప్రధాని నెరవేర్చవలసిన బాధ్యత లేదా? అని
ప్రశ్నించారు. రాజధానికి
రూ.1500 కోట్లు
ఇచ్చి ప్రధాని మోడీ చేతులుదులుపుకున్నారన్నారు. విశాఖ
రైల్వేజోన్ విషయలో కూడా మోసం చేశారని
మండిపడ్డారు. 11 విద్యాసంస్థలకు
భూమి కేటాయించినా వాటి నిర్మాణానికి అరకొర నిధులు మాత్రమే ఇస్తున్నట్లు తెలిపారు.
కేంద్రం ఈ విధంగా
నిధులు ఇస్తే 30 ఏళ్లయినా
నిర్మాణాలు పూర్తి కావని సీఎం అన్నారు.
నెల్లూరులో
నెల్లూరు ఎస్
విజీఎస్ కాలేజ్ గ్రౌండ్లో 2018 నవంబర్ 20న టీడీపీ
ఆధ్వర్యంలో
ధర్మపోరాట దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రానికి బీజేపీ చేసిన అన్యాయాన్ని ప్రజలకు తెలపడానికే దీక్ష
చేపట్టినట్లు తెలిపారు. తెలుగు
రాష్ట్రాన్ని విడగొట్టడంలో సహకరించిన బీజేపీ హామీలను అమలు
చేయడంలో విఫలమైందన్నారు.
ఈ సభకు జనం భారీ సంఖ్యలో ప్రత్యేక వాహనాలలో తరలి వచ్చి సంఘీభావం తెలిపారు.
సభా ప్రాంగణం
కిక్కిరిసిపోవడంతో కొందరు జాతీయ రహదారిపై నిలబడగా, మరి కొందరు వెనుతిరిగి వెళ్లిపోయారు.
అంటే ఆ స్థాయిలో
జనం హాజరయ్యారు.
అనంతపురంలో
ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో కేంద్ర ప్రభుత్వం
చేస్తున్న అన్యాయానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 2018
డిసెంబర్ 26న అనంతపురంలో ధర్మపోరాట దీక్ష
నిర్వహించారు. దీక్షలో
పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఏపీకి కేంద్రం ప్రభుత్వం
అన్యాయం చేసిందన్నారు. విభజన తర్వాత రాష్ట్రం తీవ్రంగా
నష్టపోయిందన్నారు. రాష్ట్ర
ప్రయోజనాల కోసమే అప్పట్లో బీజేపీతో చేయి కలపాల్సివచ్చిందని చెప్పారు. విభజన
హామీల అమలు కోసం నాలుగేళ్ల పాటు వేచి చూశామన్నారు. రోజులు గడుస్తున్నా మోడీ ప్రభుత్వం
రాష్ట్రానికి సాయం అందించలేదని చెప్పారు.
ఇక ఉపేక్షిస్తే
లాభం లేదనే ఉద్దేశంతోనే ఎన్టీయే నుంచి
బయటికి వచ్చామని వివరణ ఇచ్చారు.
ప్రత్యేక హోదా
అడిగితే ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని మాయ మాటలు చెప్పారన్నారు. విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ అడిగితే
ఇప్పటి వరకు స్పందించలేదని మండిపడ్డారు. ఢిల్లీని
తలదన్నే విధంగా ఏపీ రాజధాని నిర్మిస్తామని ధీమాగా చెప్పారు. మట్టి
నీరు ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వసతులు
కల్పిస్తామన్నా కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించలేదని చెప్పారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సమస్యలను
పరిష్కరించలేదన్నారు. రాష్ట్ర హక్కుల గురించి మాట్లాడితే ఐటీ
అధికారులతో దాడులు నిర్వహిస్తున్నారని విమర్శించారు. ప్రధాని
మోడీ మన మీద పెత్తనం మాత్రమే కోరుకుంటున్నారని, మనం బాధ్యత తీసుకోవాలని అడుగుతున్నామని చంద్రబాబు
చెప్పారు. రాష్ట్ర
వ్యాప్తంగా దీక్షలు చేసిన చంద్రబాబు నాయుడు హస్తినలో కూడా దీక్ష చేసి తెలుగువారి
సత్తా చాటారు. యావత్
దేశం దృష్టి ఏపీకి ప్రత్యేక హోదాపై నిలిచేలా చేశారు. ఢిల్లీలో చంద్రబాబు చేపట్టిన దీక్షకు
మద్దతుగా రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాలు, అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు,
కార్యకర్తలు వేల
మంది దీక్షలో పాల్గొన్నారు.
-
శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ –
9440222914