ఉన్నతాధికారులకు సీఎస్ ఆదేశాలు
సచివాలయం,
ఫిబ్రవరి 1:శాసనసభ, శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలను ఈ నెల 4వ
తేదీ నాటికి సిద్ధం చేయమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) అనీల్ చంద్ర పునీఠా
సంబంధిత శాఖల ఉన్నతాధికారులను అదేశించారు. సచివాలయం 1వ బ్లాక్ మొదటి అంతస్తులోని
సీఎస్ సమావేశ మందిరంలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో ఆయన
మాట్లాడారు. పాఠశాల విద్య, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, పట్టణ పరిపాలన, పట్టణ
అభివృద్ధి, ఉన్నత విద్య శాఖలలో అందజేయవలసిన సమాధానాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. మిగిలిన అన్ని శాఖల
వారు పెండింగ్ లో ఉన్న అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వమని సీఎస్ సూచించారు. వైద్య
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, పాఠశాల
విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ముఖ్య
కార్యదర్శులు కె.దమయంతి, కెఎస్ జవహర రెడ్డి, ఏఆర్ అనురాధ, మునిసిపల్,
పట్టణాభివృద్ధి శాఖ డైరెక్టర్ కె.కన్నబాబు తదితరులు తమతమ శాఖల తరపున ఈ శాసనసభ
సమావేశాలకు అందించిన సమాధానాల వివరాలను తెలియజేశారు. 4వ తేదీ నాటికి పెండింగ్ లో
ఉన్న అన్ని సమాధానాలను అందజేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక
ప్రధాన కార్యదర్శులు డాక్టర్ మన్మోహన్ సింగ్, నీరబ్ కుమార్ ప్రసాద్, ముఖ్య
కార్యదర్శలు కె.ప్రవీణ్ కుమార్, కార్యదర్శులు
శశిభూషణ్ కుమార్, ముఖేష్ కుమార్ మీనా, కాలేజీ విద్యా శాఖ ప్రత్యేక కమిషనర్ సుజాత శర్మ తదితరులు
పాల్గొన్నారు.
No comments:
Post a Comment