Feb 19, 2019

ఏపీ టైలరింగ్ ఫెడరేషన్ ఏర్పాటు చేసినందుకు 
సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ఆకాశపు స్వామి

   
     సచివాలయం, ఫిబ్రవరి 19 :  టైలర్ల సమస్యల పరిష్కారానికి భారతదేశంలోనే
మొదటిసారిగా ఫెడరేషన్ ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి
చంద్రబాబునాయుడుకు ఏపీ టైలరింగ్ ఫెడరేషన్ ఛైర్మన్  ఆకాశపు స్వామి
కృతజ్ఞతలు తెలిపారు.  రెడీమేడ్ రంగం వల్ల దర్జీలకు సగం రోజులు పనిలేకుండా
పోతోందని వారి సమస్యలు పరిష్కరించేందుకు సీఎం సానుకూలంగా స్పందించారని 
సచివాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆకారపు స్వామి వెల్లడించారు.
దర్జీలకు వంద యూనిట్ల కరెంటు ఉచితంగా ఇవ్వాలని, 50 సంవత్సరాలకే
ఫించను, రాయితీపై మెటీరియల్ సరఫరా, దర్జీలకు ప్రభుత్వ రాయితీతో ఇళ్ల
నిర్మాణాలు చేపట్టడానికి సీఎం అంగీకరించారని స్వామి తెలిపారు.  ఆధునిక కుట్టు
మిషన్లతో టెక్స్ టైల్ పార్కులు ఏర్పాటు చేసి, బ్రాండింగ్ చేసేందుకు కూడా సీఎం
అంగీకరించినందుకు ఫెడరేషన్ సభ్యులు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. దర్జీల
సంక్షేమం కోసం త్వరలో ఫెడరేషన్ కు తగినన్ని నిధులు కేటాయించేందుకు సీఎం
అంగీకరించారని స్వామి తెలిపారు. సీఎం చంద్రబాబునాయుడును మరలా
గెలిపించేందుకు ప్రతిఒక్కరు కృషి చేయాలని ఏపీ టైలరింగ్ ఫెడరేషన్ ఛైర్మన్
ఆకాశపు స్వామి కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ వృత్తిపై 11 లక్షల మంది
జీవిస్తున్నారని యూనియన్ ప్రధాన కార్యదర్శి లాలం శ్రీనివాసరావు గుర్తుచేశారు.
దర్జీ వృత్తి అంతరించిపోకుండా రాయితీతో ఆధునిక పరికరాలు సరఫరా చేయాడానికి
సీఎం అంగీకరించినందుకు యూనియన్ ప్రధాన కార్యదర్శి లాలం శ్రీనివాసరావు
సీఎం కు కృతజ్ఞతలు తెలిపారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...