Feb 1, 2019


ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో
ఉద్యానవన పంటలకు ప్రాధాన్యత ఎక్కువ
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనీల్ చంద్ర పునీఠ
             సచివాలయం, ఫిబ్రవరి 1: ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఉద్యానవన పంటలకు ప్రాధాన్యత ఎక్కువ ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనీల్ చంద్ర పునీఠ చెప్పారు. . సచివాలయం 1వ బ్లాక్ మొదటి అంతస్తులోని సీఎస్ సమావేశ మందిరంలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఫుడ్ ప్రాసెసింగ్ రాష్ట్ర స్థాయి సాధికారిక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల విషయంలో ఉద్యానవన శాఖ ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపాదించిన  ఫుడ్ పార్కులను, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పేందుకు త్వరితగతిన తగిన చర్యలు తీసుకోవాలని ఆ శాఖ అధికారులను సీఎస్ ఆదేశించారు. జనవరి 30న జరిగిన రాష్ట్ర స్థాయి స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో 28 ప్రాజెక్టులను సాధికారిక కమిటీకి సిఫారసుల చేసినట్లు అధికారులు సీఎస్ కు తెలిపారు. వాటిలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కొత్తవి 21, ప్రాథమిక ప్రాసెసింగ్ సెంటర్లు రెండు,  మోగా పార్క్, ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్, వేస్ట్ ప్రాసిసింగ్ యూనిట్, టెక్ అప్ గ్రేడింగ్ యూనిట్, ష్రిప్పింగ్ ప్రాసెసింగ్ కోసం కోల్డ్ చైన్ యూనిట్ ఒక్కొక్కటి ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు స్థాపించే సంస్థలు, ఉత్పత్తులు, ప్రాజెక్ట్ వ్యయం, ఆ ప్రాజెక్టులకు ఇచ్చే గ్రాంట్, ఉపాధి కల్పన, ప్రాజెక్ట్ స్థాపన కాల వ్యవధి తదితర అంశాలను చర్చించారు. ఈ సమావేశంలో పశుసంవర్ధక, డెయిరీ డెవలప్ మెంట్, ఫిషరీస్  శాఖ ముఖ్య కార్యదర్శి కె.దమయంతి,  పరిశ్రమలు, వాణిజ్య శాఖలోని ఫుడ్ ప్రాసెసింగ్ విభాగం కార్యదర్శి ఎం.గిరిజా శంకర్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కెవివి సత్యనారాయణ, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సీఈఓ వైవీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...