Jan 31, 2019

ఏడు దశాబ్దాల సమస్యకు పరిష్కారం
v సీఎం చంద్రబాబు విప్లవాత్మక  నిర్ణయం
v చుక్కల భూముల రైతుల్లో వెల్లివిరిసిన ఆనందం
v చుక్కల కేసుల్లో గుంటూరు జిల్లా ఫస్ట్
v సెక్షన్ 22-ఏ కేసుల్లో ప్రకాశం జిల్లా ఫస్ట్

            
  దాదాపు ఏడు దశాబ్దాల నుంచి ఉన్న ‘చుక్కల’ భూముల సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించింది.  ఆ రైతుల కళ్లలో ఆనందం కనిపిస్తోంది. దాదాపు 64 ఏళ్లుగా తాతలు, తండ్రులు, తరువాత తాము  సాగు చేసుకుంటున్నా ఆ రైతులకు ఈ భూములపై  హక్కులు లేవు. వారసులకు రాయడానికి గానీ, అవసరాలకు అమ్ముకోవడానికి గానీ అవకాశంలేదు. ఏడు దశాబ్దాలుగా వారు ఎమ్మార్వో, ఆర్డీఓ, కలెక్టర్  కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.  కొందరు కోర్టులను ఆశ్రయించారు. 1954 నుంచి ఈ సమస్య ఉంది. గతంలో ఏ ప్రభుత్వం ఈ భూములపై ఒక నిర్ణయం తీసుకోలేదు. రైతుల బాధలు స్వయంగా తెలుసుకున్న సీఎం చొరవ తీసుకుని విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం వల్ల వేల మంది రైతులు ప్రయోజనం పొందనున్నారు.   సీఎం ఆదేశాల ప్రకారం రిజిస్ట్రేషన్ చట్టం-1908 లోని 22-1లో నిషేధిత ఆస్తుల జాబితా నుంచి చుక్కల భూములను తొలగిస్తూ2017 జూలై 14న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ప్రకారం రైతుల ఆధీనంలో సాగులో ఉన్న చుక్కల భూములను మాత్రం  ఆ తేదీ నుంచి ప్రైవేటు పట్టా భూములుగా పరిగణించాలి. అయితే వివిధ కారణాల వల్ల ఆ ఆదేశాలు అమలుకాలేదు. రైతుల బాధలు తీరలేదు. పరిస్థితులను తెలుసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై, దీనిని తీవ్రమైన సమస్యగా పరిగణించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. దాంతో జనవరి 4న జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.  జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలోని రెవెన్యూ అధికారులకు మార్గదర్శక సూత్రాలు పంపారు. చుక్కల భూముల సమస్య ప్రధానంగా గుంటూరు, అనంతపురం, చిత్తూరు, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, కర్నూలు, వైఎస్ఆర్ కడప జిల్లాలలో ఉంది. ఈ భూముల సమస్యలకు సంబంధించి ఈ జిల్లాల నుంచి జనవరి 25వ తేదీ వరకు 86,307 వినతి పత్రాలు అందాయి. కర్నూలు జిల్లా నుంచి అత్యధికంగా 25,801, ఆ తరువాత గుంటూరు జిల్లా నుంచి 18,260, అనంతపురం జిల్లా నుంచి 15,316 వినతి పత్రాలు అందాయి. ఈ ఫిర్యాదులన్నిటిని రెవెన్యూ సిబ్బంది పరిశీలించింది.   జిల్లా కలెక్టర్లు జారీ చేసి ఆదేశాల ప్రకారం  రెవెన్యూ సిబ్బంది ఈ ఏడు జిల్లాలలో 3,189 గ్రామ సభలు నిర్వహించి, రైతులు, గ్రామస్తుల అభిప్రాయాలు తెలుసుకున్నారు.  అత్యధికంగా కర్నూలు జిల్లాలో 810 గ్రామ సభలు నిర్వహించారు. కడపలో 642, గుంటూరు జిల్లాలో 505 నిర్వహించారు.   చుక్కల భూములను స్వాధీనంలో ఉంచుకుని, సాగుచేసుకుంటున్నవారు ప్రభుత్వం నిర్ణయించిన  పత్రాలలో ఏదోఒకటి చూపిస్తే ఆ భూమి వారికి సంబంధించినదిగా భావించి రిజిస్టర్ లో వారి పేరు నమోదు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్‌లింకు డాక్యుమెంట్‌ పత్రాలు, రిజిస్ట్రేషన్‌ శాఖ నుంచి రికార్డు ఆఫ్‌ హోల్డింగ్సు నమోదు చేసిన పత్రాలు,ఎన్‌క్యూంబరెన్స్‌ పత్రం,10(1) అకౌంట్‌,  భూమి శిస్తు రసీదులు,రెవెన్యూ శాఖ జారీ చేసిన ఆర్‌వోఆర్‌ రికార్డు, న్యాయస్థానాలు,సంబంధిత అధీకృత అధికారి జారీ చేసిన ఉత్తర్వు ప్రతులు వంటి వాటిని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి మార్పులు చేర్పులు చేస్తున్నారు. 2017 జూలై 14వ తేదీకి ముందు 12 ఏళ్లు ఆధీనంలో ఉన్నట్లు ఏవైనా ఆధారాలు చూపినా రిజిస్టర్ లో వారి పేరు నమోదు చేస్తున్నారు. ఆర్వోఆర్ (రికార్డ్ ఆఫ్ రైట్స్)చట్టం ప్రకారం 1బి రిజిస్టర్2వ కాలమ్ లో నమోదైన పట్టాదారు పేరుని సరిచూసుకొని తదనుగుణంగా 1బి రిజిస్టర్ 8వ కాలమ్ లో కొనుగోలు లేదా వారసత్వం లేదా వంశపారంపర్యం అని నమోదు చేసినవాటిని నిషేధిత జాబితా నుంచి తొలగించారు. 8వ కాలమ్ లో ఏమీ రాయకపోయినా పట్టాదారు భూమిగా పరిగణించి నిషేధిత జాబితా నుంచి తొలగించారు. 8వ కాలమ్ లో 1954కు ముందు ఇచ్చిన డి పట్టాడికెటి పట్టాఅసైన్ మెంట్ భూములు అని నమోదు చేసినట్లైతే వాటిని కూడా నిషేధిత జాబితా నుంచి తొలగించారు. 1954తరువాత ప్రభుత్వం ఇచ్చిన భూములు నిషేధిత జాబితాలోనే కొనసాగుతాయి.  నిషేధిత భూముల నుంచి చుక్కల భూములతోపాటు ఇతర భూములను తొలగించి సెక్షన్ 22-1 (ఏ) టు (డి) కొత్త జాబితాని నేరుగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు పంపుతారు. సెక్షన్ 22-1(ఇ) జాబితాని ప్రభుత్వనికి పంపుతారు.  ప్రభుత్వం దానిని గెజిట్ లో ప్రచురిస్తుంది.

అందిన వినతి పత్రాలు, ఫిర్యాదులలో 80,268 అంటే 93 శాతం పరిష్కరించారు. 30,148 వినతులకు సంబంధించిన భూములు వ్యక్తిగతంగా పట్టాలు పొందడానికి అర్హమైనవిగా నిర్ధారించారు. మిగిలిన వాటిని ప్రభుత్వ, అసైన్డ్ భూములుగా తేల్చారు. 928 ఫిర్యాదులు కోర్టు పరిధిలో ఉన్నాయి. 5,052 పరిశీలనలో ఉన్నాయి. వినతులన్నిటినీ వంద శాతం పరిష్కరించి గుంటూరు జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో ఒక్క కేసు కూడా కోర్టు పరిధిలో లేదు. పెండింగ్ లో లేదు. నెల్లూరు జిల్లాలో కూడా ఒక్క కేసు కూడా పెండింగ్ లో లేదు. అయితే ఈ జిల్లాలో 267 కేసులు కోర్టు పరిధిలో ఉన్నాయి.  అనంతపురం జిల్లాలో 98.78 శాతం, చిత్తూరు జిల్లాలో 98.25 శాతం, ప్రకాశంలో 97.65 శాతం, నెల్లూరులో 97.07 శాతం, కర్నూలులో 85.78, కడపలో 81.64 శాతం కేసులు పరిష్కరించారు. మిగిలిన వాటిని కూడా పది రోజులలో  పరిష్కరించే అవకాశం ఉంది.
                ఇక సెక్షన్ 22-ఏ((1)(), (1)(బి), (1)(సి), (1)(డి), (1)()) కి సంబంధించి 13 జిల్లాల్లో జనవరి 25 నాటికి మొత్తం 15,850 కేసులు ఉండగా, 14,948 అంటే 94.31 కేసులు పరిష్కరించారు. సీఎం ఆదేశాల ప్రకారం మిగిలిన కేసులను కూడా త్వరగా పరిష్కరించడానికి రెవెన్యూ సిబ్బంది చురుకుగా పని చేస్తోంది.  ఇంకా 902 కేసులు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయి. ఈ కేసుల పరిష్కారంలో ప్రకాశం జిల్లా 98.97 కేసులు పరిష్కరించి మొదటి స్థానంలో నిలిచింది. ఆ తరువాత వరుసగా కృష్ణా (98.29) ద్వితీయ, శ్రీకాకుళం (97.77) తృతీయ స్థానాల్లో నిలిచాయి. 78.07 శాతం కేసులు పరిష్కరించి కర్నూలు జిల్లా చివరి స్థానంలో ఉంది. కోర్టు పరిధిలో లేని మిగిలిన వాటిని కూడా సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడానికి రెవెన్యూ యంత్రాంగం కృషి చేస్తోంది. అన్ని తాజా జాబితాలను జిల్లా కలెక్టర్లు ఆయా రిజిస్ట్రార్ కార్యాలయాలకు పంపుతారు. దాంతో జిల్లా కలెక్టర్లు అనుమతించిన భూములపై సాగు చేసుకునేవారికి హక్కు లభిస్తుంది. వారు ఆ భూములను అమ్ముకోవడానికి, వారసులకు రాసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది.  దీర్ఘకాలంగా ఉన్న ఈ భూ సమస్యలను పరిష్కరిస్తున్నందువల్ల అనేక మంది రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
-         శిరందాసు నాగార్జునసీనియర్ జర్నలిస్ట్ –9440222914

Jan 29, 2019


ఫిబ్రవరి 5న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్
శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల
Ø నేటి నుంచి శాసనసభ సమావేశాలు
Ø ఇవే 14వ శాసనసభ చివరి సమావేశాలు
          సచివాలయం, జనవరి 29:  14వ శాసనసభ 13వ సెషన్ సమావేశాలు ఈ నెల 30వ తేదీ నుంచి మొదలవుతాయని  శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద రావు చెప్పారు. అసెంబ్లీ భవనంలోని తన ఛాంబర్ లో మంగళవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. 5 సంవత్సరాల కాలానికి ఇవే చివరి సమావేశాలని తెలిపారు. మొదటి రోజు ఆంధ్రప్రదేశ్‌ ఉభయసభల సంయుక్త సమావేశంలో గవర్నర్‌ ఈఎస్ఎల్  నరసింహన్‌ ప్రసంగిస్తారని చెప్పారు. 31వ తేదీ ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని, సభ్యులు కిడారి సర్వేశ్వర రావు మృతికి సంతాప తీర్మానం ప్రవేశ పెడతారని, చర్చ జరిగిన తరువాత సంతాపం తెలుపుతారని, ఆ తరువాత సభ వాయిదా పడుతుందని వివరించారు. సభకు 1,2,3,4 తేదీలు సెలవులని చెప్పారు. మళ్లీ 5 నుంచి 8వ తేదీ వరకు నాలుగు రోజులు సభ జరుగుతుందన్నారు. 5వ తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపిన తరువాత  ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతారని చెప్పారు. ఆ తరువాత రోజుల్లో ప్రభుత్వ బిల్లులు, ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ నిర్వహిస్తామన్నారు. మార్చి 31 తరువాత కొత్త ప్రభుత్వ ఏర్పడే వరకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతారని చెప్పారు. ఓట్ ఆన్ అకౌంట్ పేరుతో పూర్తి బడ్జెట్ ప్రవేశ పెట్టడం రాజ్యాంగంలోని 16వ ఆర్టికల్ లోని నిబంధనలకు విరుద్దమని తెలిపారు.
           
             శాసనసభ సమావేశాలకు అందరు సభ్యులు హాజరైతే మంచిదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అందరు సభ్యులు హాజరు కాకపోతే, స్పీకర్ కు అసంతృప్తి ఉంటుదని చెప్పారు. సభ్యులందరికీ సమాన అవకాశాలు ఇచ్చానన్నారు. ప్రజా సమస్యలు చర్చించడానికి శాసనసభ సరైన వేదిక అని పేర్కొన్నారు. ప్రధాన ప్రతిపక్షం వారు దానిని ఉపయోగించుకోలేదన్నారు. సమావేశంలో శాసనసభ డిప్యూటీ సెక్రటరీ కె.సత్యనారాయణ రావు కూడా పాల్గొన్నారు.

ప్రతి శాఖలో సమాధానాలకు
ఒక ఉద్యోగిని నియమించండి
ఉన్నతాధికారుల సమన్వయ కమిటీ సమావేశంలో స్పీకర్ కోడెల
                       సచివాలయం, జనవరి 29: శాసనసభలో సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు సిద్ధం చేయడానికి ప్రభుత్వంలోని ప్రతి శాఖలో ప్రత్యేక ఒక ఉద్యోగిని నియమించుకుంటే మంచిదని శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద రావు సూచించారు. శాసనసభా భవనం మొదటి అంతస్తులోని సమావేశ మందిరంలో మంగళవారం ఉదయం జరిగిన ప్రభుత్వ ఉన్నతాధికారులు, శాసనసభ అధికారుల సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. 14వ శాసనసభ సమావేశాలు విజయవంతంగా నిర్వహించడానికి ప్రభుత్వంలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో పోలీస్ అధికారులు, సిబ్బంది చాలా బాగా కృషి చేశారని వారందని అభినందించారు. కొత్త మంత్రులకు కూడా ఆయా శాఖల సిబ్బంది బాగా సహకరించారని ప్రశంసించారు. శాసనసభ సమావేశాలు ఈ నెల 30 నుంచి మొదలై ఫిబ్రవరి 8వ తేదీ వరకు జరుగుతాయని చెప్పారు. దాదాపు ఇవే 14వ శాసనసభ చివరి సమావేశాలన్నారు. ప్రభుత్వంలోని అన్ని శాఖలు బాగా పని చేసిన్పటికీ చాలా ప్రశ్నలకు సమాధానాలు రాలేదన్న భావన ఉందని చెప్పారు. అందువల్ల ప్రతి శాఖలో ఒక ఉద్యోగిని నియమించితే ఎక్కవ ప్రశ్నలకు సమాధానాలు సిద్ధం చేయడానికి అవకాశం ఉంటుందని డాక్టర్ కోడెల అన్నారు.
            శాసన మండలి ఇన్ ఛార్జి చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సమావేశాలు సక్రమంగా నిర్వహించడానికి సహకరించిన అధికారులకు, శాంతిభద్రతల విషయంలో పోలీసులు నిర్వహించిన పాత్రకు అభినందనలు తెలిపారు.  ప్రజాస్వామ్యంలో మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానాలు చెప్పవలసిన అవసరం ఉందన్నారు.  పలు ప్రశ్నలకు సమాధానాలు రాలేదని చెప్పారు. పాఠశాల విద్య, వైద్య ఆరోగ్య శాఖలకు సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. సభకు ప్రధాన ప్రతిపక్షాలు హాజరుకాకపోవడం సరైన విధానం కాదని, వారు కూడా వస్తే బాగుంటుందని సూచించారు. ప్రొటోకాల్ ఉల్లంగన జరుగకుండా శ్రద్ధ వహించాలన్నారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనీల్ చంద్ర పునీఠ మాట్లాడుతూ అన్ని శాఖల వారు ప్రశ్నలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రొటోకాల్ ని గౌరవించవలసిన అవసరం ఉందని ఆయన చెప్పారు. శాంతిభద్రతల విభాగం అడిషనల్ డీజీ డాక్టర్ రవి శంకర్ అయ్యనార్ మాట్లాడుతూ సభ్యులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా జాగ్రత్త వహిస్తామని చెప్పారు. హోం శాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్ అనురాధ మాట్లాడుతూ తమ శాఖకు సంబంధించిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు అందజేస్తామని చెప్పారు. సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు డాక్టర్ డి.సాంబశివరావు, ఆదిత్యనాథ్ దాస్, నీరబ్ కుమార్ ప్రసాద్, ఎల్.వి.సుబ్రహ్మణ్యం, బుదితి రాజశేఖర్, ముఖ్య కార్యదర్శలు కె.దమయంతి, జి.అనంత రాము, అజయ్ జైన్, కె.ప్రవీణ్ కుమార్, కెఎస్ జవహర్ రెడ్డి, కార్యదర్శులు శశిభూషణ్ కుమార్, ముఖేష్ కుమార్ మీనా,  డి.వెంకట రమణ, హెచ్.అరుణ్ కుమార్, గుంటూరు రూరల్ ఎస్పీ రాజశేఖర్ బాబు, అర్బన్ ఎస్పీ విజయరావు, ఏపీ లెజిస్లేచర్ కార్యదర్శి ఎం. విజయరాజు, డిప్యూటీ సెక్రటరీ కె.సత్యనారాయణ రావు తదితరులు పాల్గొన్నారు.

గృహ నిర్మాణంకేటాయింపులపై
 ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
Ø  జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు
Ø   బ్యాంకర్లపై పెంచిన వత్తిడి
Ø నిర్మాణాలలో పెంచిన వేగం
Ø  ఫిబ్రవరి 94 లక్షల గృహప్రవేశాలు
            
   పేదలకు సొంత ఇల్లు అనేది ఓ కల. అది ఓ జీవితాశయం.అటువంటిదానిని వాస్తవంలో నిజం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గట్టి పట్టుదలతో కృషి చేస్తోంది. రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించింది. ఆ దిశగా చాలా పెద్ద ప్రాజెక్ట్ చేపట్టింది. దానిని ఓ పవిత్ర యజ్ఞంలా భావించింది. షీర్ వాల్ టెక్నాలజీతో శరవేగంగా నిర్మాణాలు కొనసాగిస్తూ  దేశానికే ఆదర్శంగా నిలిచింది. రూ.80 వేల కోట్ల అంచనా వ్యయంతో 20లక్షల ఇళ్లు నిర్మించాలని నిర్ణయించింది.  2022 నాటికి పేదలందరికీ ఇళ్లు సమకూర్చాలన్నది ప్రభుత్వ లక్ష్యం.  రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ,గ్రామీణ గృహ నిర్మాణ పథకాలుపీఎంఏవై-ఎన్టీఆర్ కాలనీలు(అపార్ట్ మెంట్లు) వంటి వివిధ పథకాల కింద మొత్తం 19,57,429 ఇళ్లు నిర్మించాలని నిర్ణయించారు. అవసరమైతే మరో 5 లక్షల ఇళ్లు నిర్మించడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రస్తుతానికి13,61,252 మంజూరు చేశారు. వీటిలో 11,51,465  పనులు ప్రారంభించారు. 2018 డిశంబర్ 29 నాటికి 7,20,113 ఇళ్ల నిర్మాణం పూర్తి అయింది. పీఎంఏవై-ఎన్టీఆర్ నగర్(ఏహెచ్‌పీ) పథకం కింద5,29,786 ఇళ్లు మంజూరు చేశారు. వాటిలో 3,60,365 ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు. 1,42,061 ఇళ్లకు శ్లాబుల నిర్మాణం పూర్తయింది. 75,284 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. ఎన్టీఆర్ పట్టణ గృహనిర్మాణం  (బీఎల్‌సీ) కింద 4,28,444 ఇళ్లు మంజూరు చేశారు. 1,11,613 ఇళ్ల నిర్మాణం ప్రారంభమైంది. 73,752 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. పట్టణ ప్రాంతంలో ఫిబ్రవరి నెలాఖరుకు లక్షా 75 వేల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా ప్రభుత్వం నిర్ధేశించింది. పట్టణాలలో పీఎంఆర్ వై-ఎన్టీఆర్ ఇళ్లను టిడ్కో(ఆంధ్రప్రదేశ్ టౌన్ షిప్ అండ్ ఎన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్) నిర్మిస్తోంది. ఇళ్లుఅపార్ట్ మెంట్ల నిర్మాణంబ్యాంకులు రుణాలు మంజూరు ప్రక్రియజిల్లా స్థాయిమునిసిపల్ స్థాయి ఎంపిక కమిటీల లబ్దిదారుల ఎంపిక వంటి విషయాలలో ఎక్కడ జాప్యం జరుగుతుందో తెలుసుకొని త్వరితగతిన లబ్దిదారులకు ఇళ్లు కేటాయించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. భూమిబ్యాంకు రుణాలుఇళ్ల కేటాయింపు వంటి విషయాలలో ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. లబ్దిదారుల ఎంపిక పూర్తి చేయాలనిపీఎంఏవై పోర్టల్ లో లబ్దిదారులను పేర్లు పొందుపరచాలనిజిల్లా స్థాయి ఎంపిక కమిటీల ద్వారా లబ్దిదారులకు ఫ్లాట్లు కేటాయించాలనిభూములకు సంబంధించి పట్టణస్థానిక సంస్థలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోమనిబ్యాంకు రుణాల అంశంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్లకు ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొంది. తరచూ ఇళ్ల నిర్మాణ ప్రదేశాలను తనిఖీ చేసి అక్కడ పని చేసే ఇంజనీర్లకు తగిన సూచనలు సలహాలు ఇవ్వాలని ఆదేశించింది. నిర్మాణ పనులు త్వరితగతిన జరగడానికిఇసుక,విద్యుత్నీటి సరఫరా వంటి సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్లు ఏపీ టిడ్కో ఇంజనీర్లుమునిసిపల్ కమిషనర్లుప్రజారోగ్య ఇంజనీర్లు,డిస్కమ్గనుల శాఖ అదికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహిస్తారు. ఈ పథకాలకు సంబంధించి ఇతరత్రా సమస్యలను కూడా జిల్లా కలెక్టర్లు పరిశీలించితగిన చర్యలు తీసుకుని పరిష్కరిస్తారు. ఇళ్ల నిర్మాణానికి స్థలం సమకూర్చడంతోపాటు అపార్ట్ మెంట్ల నిర్మాణంఅనుమతులువిద్యుత్ కనెక్షన్తాగునీటి సౌకర్యంరోడ్ల నిర్మాణంపరిసరాలు పచ్చదనంతో నింపడంమురుగునీటిపారుదల వ్యవస్థ ఏర్పాటు తదితర మౌలిక సదుపాయాలను ప్రభుత్వమే సమకూరుస్తోంది.
             ప్రభుత్వం భూమిమౌలిక సదుపాయాలు సమకూర్చడంతోపాటు రూ.3 లక్షల వరకు సబ్సిడీ ఇస్తూ ఇళ్ల నిర్మాణం కూడా పూర్తి చేసినందున  బ్యాంకులు సామాజిక బాధ్యతగా భావించి వేగంగా రుణాలు మంజూరు చేయాలన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. నిర్మాణం పూర్తి అయిన ఇళ్లకు రుణాలు మంజూరు చేసి లబ్దిదారులకు ఇళ్లను అప్పగించడానికి ప్రభుత్వం బ్యాంకులపై వత్తిడి పెంచింది. చాలా బ్యాంకులు నిబంధనలమేరకు రుణాలు మంజూరు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. రుణాల మంజూరును వేగవంతం చేయడానికి రాష్ట్రంలోని 44 బ్యాంకులు ప్రత్యేకంగా నోడల్ ఆఫీసర్లను నియమించే అవకాశం ఉంది. ఇప్పటివరకు రుణాలు ఇచ్చేందుకు ముందుకు రాని బ్యాంకులు తమ విధానాలను వెళ్లడించమని ఆయా బ్యాంకులకు ప్రభుత్వం సూచించింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో ఒకే పద్దతిలో జీ+3విధానంలో మూడు కేటగిరీలుగా ప్రభుత్వం అపార్ట్ మెంట్లను నిర్మిస్తోంది. 300365 చదరపు అడుగుల సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు465 చదరపు అడుగుల డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు నిర్మిస్తున్నారు.  ఇళ్ల నిర్మాణంలో వెర్టిఫైడ్ టైల్స్సెరామిక్ టైల్స్గ్లేజ్ సెరామిక్ టైల్స్బ్లాక్ గ్రానైట్సాల్ ఉడ్ తలుపులుప్లాస్టిక్ ఎమల్సన్ పెయింటింగ్ వంటి వాటిని వాడుతున్నారు. విశాలమైన రోడ్లతో గేటెడ్ కమ్యూనిటి తరహాలో ఇవి ఉంటాయి.   నిర్మాణంకేటాయింపులు,రుణాల ప్రక్రియ వేగవంతం చేసి లబ్దిదారులకు ఇళ్లను త్వరగా అందించడానికి కావలసిన అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకుంటోంది. ఫిబ్రవరి 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 4 లక్షల ఇళ్లలోకి లబ్దిదారులు గృహప్రవేశం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ లక్ష్యం మేరకు ఇళ్ల నిర్మాణం పూర్తి అయితే బడుగులు కళ్లలో  ఆనందం కనిపిస్తుంది. వారు పూర్తి స్థాయిలో సంతృప్తి చెందుతారు.
-         శిరందాసు నాగార్జునసీనియర్ జర్నలిస్ట్ - 9440222914

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...