Jan 23, 2019


25న సీఎం పర్యటన వివరాలు
                     సచివాలయం, జనవరి 23: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 25న గుంటూరు, కడప, విశాఖపట్నం జిల్లాలలో జరిగే డ్వాక్రా సదస్సులలో పాల్గొంటారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం నేలపాడు గ్రామంలో ఉదయం జరిగే సదస్సులో సీఎం పాల్గొంటారు. ఆ తరువాత హెలీకాప్టర్ లో బయలుదేరి మధ్యాహ్నానికి కడప చేరుకుంటారు. అక్కడ మునిసిపల్ గ్రౌండ్ లో జరిగే డ్వాక్రా సదస్సులో ప్రసంగిస్తారు. ఆ తరువాత అక్కడ నుంచి హెలీకాప్టర్ లో బయలుదేరి సాయంత్రానికి విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడ ఏయు ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్ లో జరిగే డ్వాక్రా సదస్సులో పాల్గొంటారు. అనంతరం అక్కడ బయలుదేరి రాత్రికి ఉండవల్లి సెంటర్ సమీపంలోని నివాసానికి చేరుకుంటారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...