25న సీఎం పర్యటన
వివరాలు
సచివాలయం, జనవరి 23: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 25న గుంటూరు, కడప,
విశాఖపట్నం జిల్లాలలో జరిగే డ్వాక్రా సదస్సులలో పాల్గొంటారు. గుంటూరు జిల్లా
తుళ్లూరు మండలం నేలపాడు గ్రామంలో ఉదయం జరిగే సదస్సులో సీఎం పాల్గొంటారు. ఆ తరువాత
హెలీకాప్టర్ లో బయలుదేరి మధ్యాహ్నానికి కడప చేరుకుంటారు. అక్కడ మునిసిపల్ గ్రౌండ్
లో జరిగే డ్వాక్రా సదస్సులో ప్రసంగిస్తారు. ఆ తరువాత అక్కడ నుంచి హెలీకాప్టర్ లో
బయలుదేరి సాయంత్రానికి విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడ ఏయు ఇంజనీరింగ్ కాలేజీ
గ్రౌండ్ లో జరిగే డ్వాక్రా సదస్సులో పాల్గొంటారు. అనంతరం అక్కడ బయలుదేరి రాత్రికి
ఉండవల్లి సెంటర్ సమీపంలోని నివాసానికి చేరుకుంటారు.
No comments:
Post a Comment