ü ఒకే రోజు 8
కంపెనీలను ప్రారంభించిన సీఎం
ü
కీలక పాత్ర పోషిస్తున్న ఏపీఎన్ఆర్టీ
ü
వందల కోట్ల పెట్టుబడులతో వేల మందికి ఉపాధి
ü
మైక్రోసాఫ్ట్, హెచ్ సీఎల్ కూడా వచ్చే అవకాశాలు
ü
ఐటీ ఉద్యోగాల కోసం అభ్యర్థులకు వెబ్ సైట్
విజయవాడలో
యాక్సెల్ ఐటీ, హార్జన్ ఐటీ, ఎంఎస్ఆర్ కాస్మోస్, అడాప్ట్ సొల్యూషన్స్, అడ్వాన్స్ సాప్ట్, ఇంటెల్లి సాఫ్ట్, టైమ్స్క్వేరిట్ వంటి ఐటీ
కంపెనీలను ప్రారంభించారు. అమెరికా నుంచి వచ్చే ఐటీ కంపెనీలకు అవసరమైన మానవ వనరులను
కూడా ఏపీఎన్ఆర్టీయే సమకూర్చనుంది. ఈ
కంపెనీల్లో పనిచేయడానికి అనుకూలంగా ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు తగి శిక్షణ
ఇప్పించేందుకు మరో 14 కంప్యూటర్ శిక్షణా కేంద్రాలను ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. కంప్యూటర్ శిక్షణ
కేంద్రాలకు మంగళగిరి వద్ద ఉన్న ఐటీ టవర్లో స్థలం కేటాయించారు. ప్రస్తుతం
ప్రారంభించిన ఐటీ కంపెనీలకు కావలసిన అభ్యర్థులను ఎంపిచేసి వారికి శిక్షణ ఇస్తారు. మూడు
మాసాల్లో శిక్షణ పూర్తి చేసి జూన్ నాటికి వారు ఆయా కంపెనీల్లో ఉద్యోగాలుగా చేరే
అవకాశం ఉంది. అభ్యర్థులు ఐటీసిఇఎన్ టీఆర్ఏఎల్.ఐఎన్( itcentral.in) అనే వెబ్ సైట్ ని
ఓపెన్ చేసి తమ దరకాస్తుని పోస్ట్ చేయాలి.
అర్హులైన అభ్యర్థులను వారు ఇంటర్వ్యూకు పిలిచి, ఎంపికైన వారికి శిక్షణ
ఇస్తారు. అమరావతిని ఐటీ కేంద్రంగా
తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అమరావతి నగరాన్ని పెద్ద ఐటీ హబ్గా రూపొందిస్తే
ఇంజినీరింగ్ యువతకు స్థానికంగానే ఉపాధి
లభించే అవకాశం ఉంది. ఇప్పటికే డిస్ రప్టివ్ సాఫ్ట్ వేర్, వాటర్ స్పోర్ట్స్ సింపుల్
వంటి సంస్థలు ప్రారంభించారు. అత్యధిక మంది రాష్ట్రంలో ఐటీ కంపెనీలను
ప్రారంభించడానికి ఆసక్తి చూపుతున్నారు.
రూ.201.50 కోట్ల పెట్టుబడితో 2615 మందికి ఉపాధి
అమరావతి ఇండస్ట్రియల్ అసోసియేట్స్
ఆధ్వర్యంలో విజయవాడ పరిసర ప్రాంతాలలో దాదాపు రూ.201.50 కోట్ల పెట్టుబడులు,
వర్కింగ్ క్యాపిటల్ తో 75 పరిశ్రమలను నెలకొల్పనున్నారు. వీటి ద్వారా 2615 మందికి
ఉపాధి లభించే అవకాశం ఉంది. ఈ పరిశ్రమల స్థాపనకు 6348.50 యూనిట్ల హెచ్ పీ విద్యుత్,
8,96,976 గ్యాలన్ల నీరు అవసరం ఉంటుందని వారు ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. వాటిలో
లక్ష్మీ ప్లాస్టిక్స్, సంజయ్ టెక్నికల్ సర్వీసెస్, శ్రీభరణి ఎంటర్ ప్రైజెస్, సీ
అండ్ ఎన్ ఇండస్ట్రీస్, ఎస్వీ పాలిమర్స్,మార్క్ ఆంగ్రో ఇండస్ట్రీస్, గౌతమ్
ఇండస్ట్రీస్, జీఎస్ ఎలక్ట్రికల్స్ వంటి కంపెనీలు
ఉన్నాయి. నాలుగు ఐటీ, ఒక ఆటోమొబైల్ కంపెనీలు విశాఖపట్నంలో తమ యూనిట్లను
స్థాపించడానికి వచ్చే ఫిబ్రవరిలో పనులను ప్రారంభిస్తాయి. ఈ యూనిట్ల ద్వారా 600
మందికి ఉపాధి లభిస్తుంది. చిత్తూరు జిల్లా కుప్పంలో ఆటోమోటిక్ రోబోటిక్స్ సంస్థ
రూ.50 కోట్ల పెట్టుబడితో ప్రెసిసింగ్ ఇంజన్ టెస్టింగ్ అండ్ డెవలప్ మెంట్ యూనిట్ ని
స్థాపించాలన్న యోచనలో ఉంది. ఈ యూనిట్ స్థాపిస్తే 400 మందికి ఉపాధి లభించే అవకాశం
ఉంది. అమరావతి, విశాఖలలో వచ్చే మార్చిలో 14 ఐటీ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ లను
ప్రారంభించనున్నారు. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక అంశాలలో శిక్షణ ఇస్తారు.
ఇంతే
కాకుండా దేశంలో ఐటి దిగ్గజాల్లో ఒకటైన అతిపెద్ద ఐటీ సర్వీసెస్ కంపెనీ హెచ్ సీఎల్
టెక్నాలజీస్ కూడా ఇక్కడ తమ యూనిట్ స్థాపించే ప్రయత్నంలో ఉంది. తమ అతిపెద్ద డెవలప్ మెంట్ సెంటర్లలో ఒకదాన్ని ఇక్కడ
30 ఎకరాల స్థలంలో నిర్మించాలన్న ఆలోచనతో ఆ కంపెనీ ఉంది. ఇందు కోసం ఆ కంపెనీ దాదాపు రూ.1000 కోట్ల పెట్టుబడులను
పెట్టే అవకాశం ఉంది. ఈ విషయమై ఆ కంపెనీ ప్రతినిధులు ప్రభుత్వంతో చర్చలు
జరుపుతున్నారు. సాఫ్ట్ వేర్ రంగంలో అగ్రగామిగా ఉన్న మైక్రోసాఫ్ట్ కంపెనీ కూడా తమ యూనిట్
ను అమరావతిలో స్థాపించే అవకాశం ఉంది. ఈ
విషయమై ఏపీకే చెందిన ఆ కంపెనీ సీఈఓ సత్య నాదెళ్లతో సీఎం చంద్రబాబు నాయుడు పలుసార్ల
చర్చలు జరిపారు. ఎలాగైనా ఆ కంపెనీని ఇక్కడకు తీసుకురావాలన్న పట్టుదలతో ఆయన
ఉన్నారు. ఈ కంపెనీలన్నీ అమరావతి వస్తే ఇది పెద్ద సాఫ్ట్ వేర్ హబ్ గా రూపొందే
అవకాశం ఉంది. అలాగే వేల మంది యువతకు ఉపాధి లభిస్తుంది.
- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ –
9440222914