ü
ప్రతి జిల్లాలో కమాండ్ కంట్రోల్ సెంటర్
ü
రాష్ట్రంలో 17 సీసీసీలు
ü
అమరావతి, విశాఖపట్నంలలో డేటా సెంటర్లు
ఈ
నేపధ్యంలో ప్రతి జిల్లాలో కమాండ్ కంట్రోల్ సెంటర్(సీసీసీ) ఏర్పాటు చేయాలని
ప్రభుత్వం నిర్ణయించింది. 13 జిల్లాలతోపాటు ఒక రాష్ట్ర స్థాయి సెంటర్, 3 పోలీస్
కమిషనరేట్ స్థాయి సెంటర్లు మొత్తం 17 ఏర్పాటు చేస్తారు. అన్ని రకాల సమాచారం ఈ
కేంద్రాలకు చేరేవిధంగా ఏర్పాట్లు చేస్తారు. జిల్లా స్థాయిలో ఆయా జిల్లాల్లో సీసీసీ ఏర్పాటు
చేయడానికి మూడు వేల చదరపు అడుగుల ప్రభుత్వం భవనం సమకూరుస్తారు. విజయవాడ,
విశాఖపట్నం, తిరుపతిలలో కమిషనరేట్ స్థాయిలో సీసీసీలు ఏర్పాటు చేయడానికి అదనంగా మరో
3వేల చదరపు అడుగుల ప్రభుత్వం భవనాలు కేటాయిస్తారు. రాష్ట్ర స్థాయి సీసీసీ
ఏర్పాటుకు అమరావతిలో 8 వేల నుంచి పది వేల చదరపు అడుగుల భవనం సమకూరుస్తారు. ప్రతి
సీసీసీకి అత్యాధునిక కంప్యూటర్లు, సర్వర్లు, నిఘా కెమేరాలు వంటి
వాటిని సమకూరుస్తారు. జిల్లా సీసీసీలు రాజధాని సీసీసీకి అనుసంధానంగా పని చేస్తుంటాయి. సమాచారం
విషయంలో భవిష్యత్ లో వీటిని విస్తృత
స్థాయిలో ఉపయోగించుకునే అవకాశం ఉంది.
అమరావతి, విశాఖలలో డేటా సెంటర్లు
అలాగే రాజధాని అమరావతితోపాటు విశాఖపట్నంలలో రెండు డేటా
సెంటర్లు ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. అమరావతిని ప్రపంచ
ప్రఖ్యాత నగరంగా తీర్చిదిద్దే క్రమంలో అంతర్జాతీయ స్థాయిలో రాజధానిలో డేటా సెంటర్ ను ఏర్పాటు చేయాలన్న
ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించి ఏపీసీఆర్డీఏ(ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్
రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ) వారు ఇంటర్నెట్ ఇన్నొవేటివ్ జపాన్(ఐఐజె) సంస్థతో
సంప్రదింపులు జరుపుతున్నారు. ఆ సంస్థ ప్రతినిధులు అమరావతిలో కూడా పర్యటించారు. వీటితోపాటు
రాష్ట్ర వ్యాప్తంగా 9,500 ప్రాంతాలలో 18 వేల సీసీ కెమెరాలు అమర్చుతారు. క్లౌడ్
ప్రాతిపదికన వీసీఎస్(విర్చువల్ క్లాస్ రూమ్ సిస్టమ్)ప్రవేశ పెట్టడానికి 4వేల తరగతి
గదులను ఎంపిక చేశారు. దాదాపు 5 వేల పాఠశాలలకు ఫైబర్నెట్ సేవలు అందించడానికి
ఏర్పాట్లు చేస్తున్నారు. ఫైబర్ గ్రిడ్
ఫేజ్-1లో భాగంగా దేశ వ్యాప్తంగా 12వేల టెలికమ్ టవర్లను అభివృద్ధి చేస్తారు. ఈ
విధంగా ఫైబర్నెట్ సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఇ-ప్రగతిలో రాష్ట్రం అంతర్జాతీయ స్థాయికి ఎదిగే
అవకాశం ఏర్పడుతుంది.
-
శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ -
9440222914
No comments:
Post a Comment