Dec 28, 2020

సీనియర్ సిటిజన్ల పెన్షన్ పథకం

ప్రారంభించిన ఎల్ఐసీ

సీనియర్ సిటిజన్ల కోసం పీఎం వయ వందన యోజన (పీఎంవీవీవై) పెన్షన్ పథకాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ సవరించిన తరువాత, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) కేంద్రం సబ్సిడీతో అనుసంధానించని పెన్షన్ ప్లాన్ ను ప్రారంభించింది. ఇటీవలే 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను, ఆర్థిక మంత్రిత్వ శాఖ పెన్షన్ ప్లాన్ ను 7.40 శాతం వడ్డీ రేటుతో మార్చి 31, 2023 వరకు పొడిగించింది. ఈ ప్లాన్ మూడు ఆర్థిక సంవత్సరాలు అనగా మార్చి 2023 వరకు విక్రయానికి అందుబాటులో ఉంటుందని ఎల్ఐసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పథకాన్ని ఆఫ్‌లైన్‌లో, ఎల్‌ఐసీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు. మొత్తం చెల్లింపును రూ. 15 లక్షలకు మించకుండా అందించే పథకాన్ని అమలు చేసే అధికారం ఎల్‌ఐసీకి మాత్రమే ఉంది. ఈ పాలసీకి 10 సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది. ఈ పథకం సంవత్సరానికి 7.40 శాతం వడ్డీ రేటును అందిస్తుంది, అయితే మొత్తం 10 సంవత్సరాల కాలానికి నెలవారీగా చెల్లిస్తుంది. సీనియర్ సిటిజన్లు ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన మొత్తం ఆధారంగా నెలకు రూ. 1000 కనీస పెన్షన్ పొందవచ్చు. గరిష్ట పెన్షన్ మొత్తం నెలకు రూ. 10,000 గా పరిమితం చేశారు. రాబోయే రెండు ఆర్థిక సంవత్సరాల్లో విక్రయించే పాలసీలకు వర్తించే వడ్డీ రేటు, ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ప్రభుత్వం సమీక్షించి, నిర్ణయిస్తుంది. ఈ పథకం కింద సంవత్సరానికి రూ. 12,000 పెన్షన్ కోసం కనీస పెట్టుబడిని రూ. 1,56,658 గా, అలాగే నెలకు రూ. 1000 పొందటానికి కనీస పెట్టుబడిని రూ. 1,62,162 కు సవరించారు. నెలవారీ మోడ్ కోసం కనీస కొనుగోలు ధర రూ. 1,62,162, త్రైమాసిక పెన్షన్ కోసం రూ. 1,61,074, అర్ధ వార్షిక మోడ్‌కు రూ. 1,59,574, వార్షిక మోడ్‌కు రూ. 1,56,658. ఈ పథకం కింద పొందగలిగే గరిష్ట పెన్షన్ నెలకు రూ. 9,250, త్రైమాసికానికి రూ. 27,750, అర్ధ సంవత్సరానికి రూ. 55,500, వార్షిక చెల్లింపు ప్రాతిపదికన రూ. 1,11,000 అని ఎల్ఐసీ తెలిపింది.

ఈ ప్రణాళికలోని అన్ని పాలసీల కింద మొత్తం కొనుగోలు ధర, సీనియర్ సిటిజన్‌కు అనుమతించిన పథకం మునుపటి సంస్కరణల కింద తీసుకున్న అన్ని పాలసీలు రూ. 15 లక్షలకు మించకూడదు. ఈ పథకాన్ని ఒకేసారి పూర్తి మొతాన్ని చెల్లించి కొనుగోలు చేయవచ్చు. అలాగే పెన్షనర్‌కు పెన్షన్ మొత్తాన్ని లేదా కొనుగోలు ధరను ఎంచుకునే అవకాశం ఉంటుంది. పథకాన్ని కొనుగోలు చేసే సమయంలో పెన్షనర్ నెలవారీ / త్రైమాసిక / అర్ధ వార్షిక లేదా వార్షిక పెన్షన్ మోడ్‌ను ఎంచుకోవచ్చు.

పాలసీ కాలపరిమితిలో పెన్షనర్ జీవించి ఉన్నట్లయితే, బకాయిల్లో పింఛను (ఎంచుకున్న మోడ్ ప్రకారం ప్రతి వ్యవధి చివరలో) చెల్లిస్తారని, ఒకవేళ పాలసీ కాలపరిమితిలో పెన్షనర్ మరణించినట్లైతే, కొనుగోలు ధర నామినీకి తిరిగి ఇస్తారని ఎల్ఐసీ తెలిపింది. ఒకవేళ పాలసీ కాలపరిమితి పూర్తి అయ్యే వరకు పెన్షనర్ జీవించి ఉన్నట్లైతే, కొనుగోలు ధర, తుది పెన్షన్ వాయిదా చెల్లించాలి. మూడు పాలసీ సంవత్సరాల తరువాత కొనుగోలు ధరలో 75 శాతం వరకు రుణాన్ని పొందవచ్చు. ఈ పథకం స్వీయ లేదా జీవిత భాగస్వామి క్లిష్టమైన అనారోగ్యానికి చికిత్స కోసం ముందస్తు నిష్క్రమణను అనుమతిస్తుంది, అలాగే చెల్లించాల్సిన సరెండర్ విలువ కొనుగోలు ధరలో 98 శాతంగా ఉంటుంది.

చిన్న పొదుపు ప‌థ‌కాల వ‌డ్డీరేట్లు య‌థాత‌థం

చిన్న పొదుపు ప‌థ‌కాల వ‌డ్డీ రేట్ల‌ను ఆర్థిక మంత్రిత్వ శాఖ త్రైమాసికానికి ఒక‌సారి స‌వ‌రిస్తుంది​​​​​​​.

చిన్న పొదుపు ప‌థ‌కాల‌పై వ‌డ్డీ రేట్ల‌ను య‌థాత‌థంగా కొన‌సాగిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. పీపీఎఫ్‌, ఎన్ఎస్‌సీ ప‌థ‌కాల‌పై అక్టోబ‌ర్‌-డిసెంబ‌ర్ త్రైమాసికానికి వ‌డ్డీ రేట్ల‌ను అదేవిధంగా కొన‌సాగించింది. చిన్న పొదుపు ప‌థ‌కాల వ‌డ్డీ రేట్ల‌ను ఆర్థిక మంత్రిత్వ శాఖ త్రైమాసికానికి ఒక‌సారి మారుస్తుంది. బ్యాంక్ డిపాజిట్ రేట్లు త‌గ్గుతున్న నేప‌థ్యంలో ఈ ప‌థ‌కాల్లో ఎలాంటి మార్పులు చేయ‌లేదు. ప‌బ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్‌), నేష‌న‌ల్ సేవింగ్స్ స‌ర్టిఫికెట్ (ఎన్ఎస్‌సీ) వ‌డ్డీ రేట్లు 7.1 శాతం, 6.8 శాతంగా ఉండ‌నున్నాయి.

ఐదేళ్ల సీనియ‌ర్ సిటిజ‌న్ సేవింగ్స్ స్కీమ్ వ‌డ్డీ రేటు 7.4 శాతం.

ఆడ‌పిల్ల‌ల కోసం ఉద్దేశించిన ప‌థ‌కం సుక‌న్య స‌మృద్ధి యోజ‌న వ‌డ్డీ రేట్లు 7.6 శాతం

కిసాన్ వికాస్ ప‌త్ర (కేవీపీ) వ‌డ్డీ రేట్లు 6.9 శాతం

1-5 సంవ‌త్స‌రాల ట‌ర్మ్ డిపాజిట్ల‌పై వ‌డ్డీ రేట్లు 5.5 శాతం నుంచి 6.7 శాతం మేర‌కు ఉన్నాయి.

ఐదేళ్ల రిక‌రింగ్ డిపాజిట్ రేటు 5.8 శాతంగా ఉన్నాయి.

Dec 10, 2020

కొత్త పార్లమెంట్ భవనం విశేషాలు !

 నేడే శంకుస్థాపన



* 64,500 చ.మీ విస్తీర్ణంలో రూ .971 కోట్లతో కొత్త భవనం పురివిప్పి ఆడుతున్న నెమలి ( జాతీయ పక్షి ) ఆకృతిలో లోక్ స‌భ‌ పైకప్పు.

 * విరబూసిన కమలం ( జాతీయ పుష్పం ) రూపంలో రాజ్యసభ పైకప్పు

* పార్లమెంట్ అంతర్భాగంలో జాతీయ వృక్షం మర్రిచెట్టు

* నిర్మాణంలో పాల్గొననున్న 200 కు పైగా హస్తకళాకారులు 

*ఒకేసారి 1,224 మంది ఎంపీలు కూర్చునే వెసులుబాటు

 * 2022 అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యం .

పురివిప్పిన నెమలి రూపం.. విరబూసిన కమలం

నూతన లోక్‌సభ, రాజ్యసభల పైకప్పునకు కొత్తరూపు

అణువణువునా భారతీయత

వందేళ్ల అవసరాలకు సరిపోయేలా నిర్మాణం

న్యూ ఢిల్లీ : ప్రజాస్వామ్య దేవాలయంగా పరిగణించే పార్లమెంటు త్వరలో సరికొత్త భవనంలో కొలువుదీరబోతోంది. వచ్చే వందేళ్ల అవసరాలకు సరిపోయేలా నిర్మించబోతున్న నూతన పార్లమెంటు భవనానికి ప్రధాని నరేంద్ర మోదీ గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు శంకుస్థాపన చేయనున్నారు. కొత్త భవనంలో అణువణువునా భారతీయత ప్రతిబింబించనుంది. లోక్‌సభ పైకప్పు పురివిప్పి ఆడుతున్న నెమలి (జాతీయ పక్షి) ఆకృతిలో, రాజ్యసభ పైకప్పు విరబూసిన కమలం (జాతీయ పుష్పం) రూపంలో ఉండనున్నాయి. జాతీయ వృక్షమైన మర్రి చెట్టు పార్లమెంటులో అంతర్భాగంగా నిలవనుంది. శంకుస్థాపన కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం తొలుత భావించింది. సెంట్రల్‌ విస్టా నిర్మాణంపై కేసు నడుస్తున్న నేపథ్యంలో శంకుస్థాపనకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చింది. దీంతో ఈ కార్యక్రమాన్ని నిరాడంబరంగా నిర్వహించనున్నారు. మోదీతోపాటు దాదాపు 200 మంది అతిథులు ఈ వేడుకకు హాజరుకానున్నారు. వీరిలో పలువురు కేంద్ర మంత్రులు, రాజకీయ పార్టీల నేతలు, వివిధ దేశాల రాయబారులు ఉండనున్నారు. కొంతమంది గవర్నర్లు, ముఖ్యమంత్రులు శంకుస్థాపన కార్యక్రమంలో వర్చువల్‌ విధానంలో పాల్గొన్నారు.

నూతన భవన స్వరూపం

* లోక్‌సభ, రాజ్యసభ గ్యాలరీల్లో మీడియా ప్రతినిధులు, సాధారణ ప్రజల కోసం 480 సీట్ల చొప్పున ఏర్పాటు చేయనున్నారు.

* లోక్‌సభలో ప్రస్తుతం సభ్యులు కూర్చొనే సీటు పొడవు, వెడల్పుల నిష్పత్తి 45్ఠ40గా ఉండగా, కొత్త దాంట్లో అది 60్ఠ40గా ఉండనుంది.

* ప్రస్తుతం తొలి రెండు వరుసల్లో కూర్చున్నవారికి తప్ప మిగతావారికి డెస్క్‌లు లేవు. కొత్త భవనంలో అందరికీ ఆ సౌకర్యం కల్పిస్తారు.

* ప్రస్తుత భవనంలో అనలాగ్‌ మైక్‌లు ఉండగా, కొత్త దాంట్లో ప్రతి ఎంపీకీ ఒక టచ్‌ స్క్రీన్‌తో కూడిన డిజిటల్‌ సిస్టమ్‌ను ఏర్పాటుచేయనున్నారు.

* ప్రస్తుత సెంట్రల్‌ హాల్‌ 670 చదరపు మీటర్లలో ఉండగా, కొత్త దాంట్లో లోక్‌సభే సెంట్రల్‌ హాల్‌గా ఉంటుంది. అది 1,315 చదరపు మీటర్లలో వస్తుంది.

* సెంట్రల్‌ లాంజ్‌ / కోర్టు యార్డులో జాతీయ వృక్షం మర్రిచెట్టును యథాతథంగా ఉంచుతారు.

* మంత్రుల కార్యాలయాలు లోయర్‌ గ్రౌండ్‌ ఫ్లోర్‌లో 20, గ్రౌండ్‌ ఫ్లోర్‌లో 18, మొదటి అంతస్తులో 26, రెండో అంతస్తులో 28 ఉంటాయి.

* లోక్‌సభను ఆనుకొనే ప్రధానమంత్రి కార్యాలయం ఉంటుంది.

* కాన్‌స్టిట్యూషన్‌ హాలు ఎత్తు 20 మీటర్లు. దానిపై అశోక స్థూపాన్ని ఏర్పాటుచేస్తారు. ఈ హాలులోనే రాజ్యాంగాన్ని ప్రదర్శనకు ఉంచుతారు.

* ప్రస్తుత పార్లమెంటు భవనానికి ఉన్నట్లుగానే కొత్త భవనానికీ చుట్టూ నిలువెత్తు రాతిస్తంభాలు వస్తాయి.

* సభ్యులు వేసే ఓటు స్పష్టంగా కనిపించేందుకు వీలుగా నూతన భవనంలో 281 అంగుళాల వీడియో వాల్‌ను ఏర్పాటుచేస్తారు.

* గ్యాలరీల్లో కూర్చొనే ప్రజలకు సభా కార్యక్రమాలు కనిపించేలా 165 అంగుళాల తెరలను నెలకొల్పుతారు.

* వీవీఐపీల కోసం 2 గేట్లు, ఎంపీల వాహనాలు రావడానికి 2 గేట్లు, సాధారణ ప్రజలు, సిబ్బంది, మీడియా, సందర్శకుల కోసం 2 గేట్లు కేటాయిస్తారు.

* అడుగడుగునా అధునాతన నిఘా కెమెరాలు ఏర్పాటుచేయనున్నారు.

కొత్త భవనంలో ఉండే విభాగాలు

* లోక్‌సభ

* రాజ్యసభ

* సెంట్రల్‌ హాలు

* సెంట్రల్‌ లాంజ్‌ / కోర్ట్‌ యార్డ్‌

* గ్రంథాలయం

* డైనింగ్‌ హాల్‌

* మంత్రుల కార్యాలయాలు

* ప్రధానమంత్రి కార్యాలయం

* కమిటీ హాళ్లు

* లాంజ్‌

* మరుగుదొడ్లు

* కాన్‌స్టిట్యూషన్‌ హాల్‌

* సెక్యూరిటీ, రిసెప్షన్‌ భవనం

* ప్రెస్‌ లాంజ్‌, సావనీర్‌ షాప్‌

 వివరం  పాత పార్లమెంటు భవనం  కొత్తది

(చదరపు మీటర్లలో) (చదరపు మీటర్లలో)

మొత్తం నిర్మాణ ప్రాంతం 47,443 64,500

బేస్‌మెంట్‌ / లోయర్‌ గ్రౌండ్‌ ఫ్లోర్‌  8,000 13,675

గ్రౌండ్‌ ఫ్లోర్‌  16,540  20,320

మొదటి అంతస్తు 13,248  16,680

రెండో అంతస్తు 2,877 8,100

మూడో అంతస్తు 4,463                

వివరం  పాత పార్లమెంటు  భవనం కొత్తది

గేట్లు (సంఖ్య) 12 6

లోక్‌సభలో సీట్లు 552 888

రాజ్యసభలో సీట్లు 245 384

సెంట్రల్‌ హాల్‌లో సీట్లు 436 1,272

మంత్రుల కార్యాలయాలు 37 92

కమిటీ హాళ్లు 3 6

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు నేటితో 65 వసంతాల పూర్తి

ప్రపంచ రాతి నిర్మాణాల ప్రాజెక్టుల్లో ప్రథమస్థానం

ప్రపంచప్రఖ్యాతి గాంచిన నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు శంకుస్థాపన జరిగి నేటి (డిసెంబర్‌ 10)తో 65 వసంతాలు పూర్తిచేసుకుంది. ఆంధ్రరాష్ట్ర అన్నపూర్ణగా రైతులపాలిట కల్పతరువుగా విరాజిల్లుతున్న నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు తొలి ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ 1955 డిసెంబర్‌ 10న డ్యాం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు రూపకల్పనకు ప్రముఖ ఇంజనీర్‌ కేఎల్‌ రావు, ముత్యాల జమీందార్‌ మహేశ్వరప్రసాద్‌ ఆలోచనలు మూలంగా చెప్పవచ్చు. ప్రాజెక్టు నిర్మాణానికి వేలాది మంది శ్రమజీవుల శ్రమశక్తి, వందలాది మంది ప్రాణార్పణలు నేటికీ మరువలేనివి. ఈ ప్రాజెక్టు నిర్మాణం 1970లో పూర్తయింది. డ్యాం నిర్మాణ దశలో నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు మొట్టమొదటి చీఫ్‌ ఇంజనీరుగా పనిచేసిన మీర్‌జాఫర్‌ అలి నిబద్ధత కొనియాడదగింది. ప్రపంచ రాతినిర్మాణాల ప్రాజెక్టుల్లోకెల్లా నాగార్జునసాగర్‌ డ్యాం పొడవు, ఎత్తుల్లో ప్రథమస్థానంలో ఉండడం విశేషం! నాగార్జునసాగర్‌ రిజర్వాయర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. ఇది 285 చ.కి.మీ. విస్తీర్ణం కలిగి 408 టీఎంసీల నీటి సామర్థ్యాన్ని కలిగివుంది. గత 44 ఏళ్లుగా వచ్చిన వరదలకు రిజర్వాయర్‌లో పూడిక చేరడంతో సాగర్‌లో నీటి నిల్వ సామర్థ్యాన్ని 312 టీంఎసీలుగా ప్రభుత్వం నిర్ధారించింది. అంటే సుమారు 96 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యాన్ని రిజర్వాయర్‌ కోల్పోయింది.

జవహర్‌ కెనాల్‌

కుడికాలువకు అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి 1956 అక్టోబర్‌ 10న శంకుస్థాపన చేశారు. అనంతరం ఈకాలువకు అ ప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 1967 ఆగస్టు 4న నీటిని విడుదలచేసి జాతికి అంకితమిచ్చారు. దీనిని జవహర్‌ కెనాల్‌ అని పిలుస్తారు. ఈ కాలువ గుంటూరు, ప్రకాశం జిల్లా లో సుమారు 203కి.మీ. ప్రవహిస్తూ రైతన్నల ఆశాజ్యోతిగా వెలుగొందుతోంది. ఈ కాలువ కింద 11.74 లక్షల ఎకరాలకు నీరందుతోంది. ఈ కాలువ కింద ఆయకట్టును 22 బ్లాకులుగా విభజించారు. వీటికి 9 బ్రాంచ్‌ కెనాల్స్‌ కలిగి 5342 కి.మీ. పంటలకు నీటిని అందిస్తోంది. దీనికితోడు ఫీల్డ్‌చానల్స్‌ ద్వారా 14,400 కి.మీ. పంటలకు నీరు అందుతోంది.

లాల్‌బహుదూర్‌ కెనాల్‌

జై జవాన్‌.. జై కిసాన్‌ అని నినాదించిన మాజీ ప్రధాని లాల్‌బహుదూర్‌ శాసి్త్ర జ్ఞాపకార్థం సాగర్‌ ఎడమ కాలువకు లాలా బహుదూర్‌ కెనాల్‌ అని నామకరణం చేశారు. ఈ కాలువకు 1959లో అప్పటి రాష్ట్ర గవర్నర్‌ భీమ్‌సేన్‌ సచార్‌ శంకుస్థాపన జరుపగా కుడి కాలువతోపాటే ఇందిరాగాంధీ 1967 ఆగస్టు 4న ప్రారంభోత్సవం చేశారు. ఈ కాలువ ద్వారా 10.38 లక్షల ఎకరాలకు నీటిని అందిస్తోంది. మొత్తం 297కి.మీ. పరిధిలోని పొలాలకు సాగునీరు అందుతోంది. దీనికున్న 7బ్రాంచ్‌ కాలువల ద్వారా 7722 కి.మీ., ఫీల్డ్‌ చానల్స్‌ ద్వారా 9654 కి.మీ. పంట పొలాలను సస్యశ్యామలం చేస్తుంది. వీటికితోడు 26 క్రస్ట్‌గేట్ల ద్వారా విడుదలయ్యే నీటితో కృష్ణాడెల్టా ప్రాంత రైతులకు పంట లు పండించేందుకు ఉపయోగకరంగా ఉంది.

జలవిద్యుత్కేంద్రాలు

నాగార్జునసాగర్‌ బహుళార్థ సాధక ప్రాజెక్టుగా సేద్యపు నీటినే కాకుండా జలవిద్యుదుత్పత్తి చేసే కేంద్రంగా కూడా ప్రాధాన్యం పొందింది. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుపై నిర్మించిన 410 మెగావాట్ల ప్రధాన జలవిద్యుత్కేంద్రం, కుడి కాలువపై 90 మెగావాట్ల జలవిద్యుత్కేంద్రం, ఎడమ కాలువపై 60మెగావాట్ల జలవిద్యుత్కేంద్రాలను నిర్మించారు. వీటికితోడు కుడికాలువపై హైడల్‌ పవర్‌ ద్వారా విద్యుదుత్పత్తి చేస్తూ రాష్ట్రంలో సాగు, తాగునీటితోపాటు విద్యుత్‌ కొరతను కూడా తీరుస్తోంది. అందుకే దీనిని బహుళార్థ సాధక ప్రాజెక్టు అని కూడా అంటారు.

ప్రపంచ పర్యాటక కేంద్రంగా...

నాగార్జునసాగర్‌ ప్రపంచ పర్యాటక కేంద్రంగా కూడా పేర్గాంచింది. కృష్ణానది లోయలో మహాయాన బౌద్ధమత విస్తరణకు ఆచార్య నాగార్జునుడు నెలకొల్పిన యూనివర్సిటీ ప్రపంచంలో బౌద్ధ మత వ్యాప్తికి ఎంతో దోహదం చేసింది. క్రీస్తు శకం రెండవ శతాబ్ధంలోని శాతవాహన కాలంనాటి జీవనశైలి, మూడవ శతాబ్ధం నాటి ఇక్ష్వాకుల రాజధానిగా విజయపురి ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలోని ఏకైక ఐలాండ్‌ మ్యూజియంగా ఉన్న నాగార్జునకొండ, అనుపు, ఎత్తిపోతల, ప్రధాన జలవిద్యుత్కేంద్రాలను, కుడి, ఎడమ కాలువలను, మోడల్‌ డ్యాంను చూసేందుకు ప్రతిరోజూ వందలాది మంది దేశవిదేశీ పర్యాటకులు నాగార్జునసాగర్‌ రావడంతో ఇది ప్రపంచ పర్యాటక కేంద్రంగా భాసిల్లుతోంది.

నాగార్జున సాగర్ ప్రాజెక్టు

10 వేల మంది కూలీల ప్రాణ త్యాగం
కొన్ని వేల మంది నిరంతర కృషి
తెలుగుజాతి స్వప్నసాకారం

నల్గొండ  వరం

ప్రపంచంలోనే మానవ నిర్మిత అతిపెద్ద‌ రాతి కట్టడం నాగార్జున సాగర్

కృష్ణా నదిపై నిర్మించబడ్డ ఆనకట్టల్లో నాగార్జునసాగర్ ప్రాజెక్టు అతి పెద్దది. ఇది ఒక బహుళార్థసాధక ప్రాజెక్టు. తెలంగాణలో నల్గొండ జిల్లా నందికొండ వద్ద నిర్మించిన ఈ ఆనకట్టను మొదట్లో నందికొండ ప్రాజెక్టు అని పిలిచేవారు. ఈ ప్రాంతానికున్న చారిత్రక ప్రాధాన్యం వలన ఈ ప్రాజెక్టుకు నాగార్జునసాగర్ ప్రాజెక్టు అని పేరుపెట్టారు.

నందికొండ గ్రామం నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలో ఉంది. ప్రాజెక్టు నిర్మాణానంతరం నాగార్జునసాగర్‌గా ప్రసిద్ధి చెందింది. నాగార్జునసాగర్ పట్టణము మూడు భాగములుగా విభజించబడింది. ఆనకట్టకు దక్షిణాన విజయపురి సౌత్ (వీ.పీ.సౌత్) (గుంటూరు జిల్లా), ఆనకట్ట దాటిన వెంటనే ఉత్తరాన పైలాన్ (నల్గొండ జిల్లా), ఉత్తరాన కొండ మీద హిల్ కాలనీ (నల్గొండ జిల్లా) ఉన్నాయి.

 సాగర్‌ డ్యామ్‌ విశేషాలు

మొత్తం రాతి కట్టడం పొడవు - 4,756 అడుగులు
ఎడమ వైపు మట్టికట్ట పొడవు - 8,400 అడుగులు

కుడి వైపు మట్టి కట్ట పొడవు - 2,800 అడుగులు
మొత్తం ఆనకట్ట పొడవు - 15,956 అడుగులు
రేడియల్‌ క్రస్ట్‌ గేట్లు - 26
ఒక్కొక్క దాని ఎత్తు, పొడవు - 4,445 అడుగులు
గరిష్ఠ నీటి మట్టం - 590 అడుగులు
డెడ్‌ స్టోరేజీ లెవల్‌ - 490 అడుగులు
సాగర్‌ వద్ద సముద్ర మట్టం - 246 అడుగులు
స్పిల్‌వే వరకు డ్యామ్‌ ఎత్తు - 546 అడుగులు
రిజర్వాయరు వైశాల్యం - 110 చదరపు మైళ్ళు
జల విద్యుదుత్పాదన కేంద్రాలు
ప్రధాన జలవిద్యుదుత్పాన కేంద్రం - 1
110 మెగావాట్లు - 7

సగటున ఏడాదికి విద్యుదుత్పాదన - 1,230 మిలియన్‌ యూనిట్లు

కుడి కాల్వ జలవిద్యుదుత్పాదన కేంద్రం 3130 మెగావాట్లు

సగటున ఏడాదికి విద్యుదుత్పాదన - 292 మిలియన్‌ యూనిట్లు

ఎడమ కాల్వ జలవిద్యుదుత్పాన కేంద్రం - 230 మెగావాట్లు

సగటు విద్యుదుత్పాదన - 127 మిలియన్‌ యూనిట్లు

 

డ్యామ్‌ నిర్మాణంలో ముఖ్యమైన సంఘటనలు

 

1903 - కృష్ణానదిపై డ్యామ్‌ నిర్మాంచాలన్న ఆలోచన

1-4-1954 - ఆలోచనకు తుదిరూపం

10-12-1955 - ప్రాజెక్టుకు శంకుస్థాపన

10-2-1956 - డ్యామ్‌ నిర్మాణ పనులు ప్రారంభించింది.

5-1967 - స్పిల్‌వే వరకు డ్యామ్‌ నిర్మాణం పూర్తి

4-8-1967 - ఎడమ కుడి కాల్వలకు నీటి విడుదల

15-5-1968 - రాతి కట్టడానికి ఆఖరి రాయి వేసిన రోజు

17-10-1974 రిజర్వాయరు 590 అడుగుల వరకు నింపిన తేదీ

 

డ్యామ్‌ నిర్మాణంలో నమ్మలేని నిజాలు

 

* నాగార్జున సాగర్‌ డ్యామ్‌ నిర్మాణానికి అయిన ఖర్చు కేవలం 73 కోట్ల రూపాయలు మాత్రమే

రోజుకు 45వేల మంది కార్మికులు 12 ఏళ్ళపాటు శ్రమించి ప్రాజెక్టు నిర్మించారు.

సుమారు 10వేల మంది కార్మికులు మృతి చెంది ఉండవచ్చని అంచనా

జలాశయం విస్తీర్ణంలో ప్రపంచంలోనే మూడవ స్థానం ఆక్రమించింది. రాతి కట్టడాలలో ప్రపంచంలోనే మొదటి స్థానం

నీటి విడుదలలో సాగర్‌ కుడి కాల్వ ప్రపంచంలో మొదటిది

పురావస్తు తవ్వకాలలో బుద్దుని ధాతువు(శరీరంలో ఒక భాగం) సాగర్‌ రిజర్వాయరు ప్రాంతంలో లభించింది. ప్రస్తుతం నాగార్జున కొండ మ్యూజియంలో భద్రపరిచారు.

 

ఆయకట్టు వివరాలు

ప్రాజెక్టు కింద 5 జిల్లాల్లో తయారైన ఆయకట్టు వివరాలు ఇలా ఉన్నాయి.

కుడి కాలువ

జిల్లా ఆయకట్టు,   ఎకరాల్లో

గుంటూరు జిల్లా     6,68,230

ప్రకాశం జిల్లా          4,43,180

మొత్తం               11,11,410

 

ఎడమ కాలువ:-

 

జిల్లా ఆయకట్టు,   ఎకరాల్లో

నల్గొండ జిల్లా        3,72,970

ఖమ్మం జిల్లా         3,46,769

కృష్ణా జిల్లా           4,04,760

మొత్తం              11,24,500

పెద్ద మొత్తం       22,35,910

ప్రాజెక్టు గణాంకాలు

డ్యాము పొడవు: 15,956 అ. (4863.388 మీ.)

ప్రధాన రాతి ఆనకట్ట పొడవు: 4756 అ. (1449.628 మీ.

మొత్తం మట్టికట్టల పొడవు: 11,200 అ. (3413.76 మీ.)

ఎడమ మట్టికట్ట పొడవు: 8400 అ. (2560.32 మీ.)

కుడి మట్టికట్ట పొడవు: 2800 అ. (853.44 మీ.)

మొత్తం క్రెస్టుగేట్ల సంఖ్య: 26

కుడి కాలువ పొడవు: 203 కి.మీ.

ఎడమ కాలువ పొడవు: 179 కి.మీ.

జలాశయ సామర్థ్యం

నాగార్జున సాగర్ జలాశయం

పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం: 408 టి.ఎం.సి. (శతకోటి ఘనపుటడుగులు-థౌజండ్ మిలియన్ క్యూబిక్ ఫీట్)

కనీస స్థాయి నిల్వ: 213 టి.ఎం.సి.

విద్యుదుత్పత్తి సామర్థ్యం

నాగార్జున సాగర్ జలాశయము

విద్యుదుత్పత్తికై నాగార్జున సాగర్ ప్రాజెక్టులో మూడు కేంద్రాలున్నాయి. వీటి మొత్తం ఉత్పాదక సామర్థ్యం 960 మె.వా. (మెగా వాట్లు)

నది దిగువకు నీరు విడుదలయ్యే చోట నిర్మించిన కేంద్రంలో: 810 మె.వా.,

కుడి కాలువకు నీరు విడుదలయ్యే చోట: 90మె.వా.,

ఎడమకాలువకు నీరు విడుదలయ్యే చోట: 60 మె.వా.

ఉత్పత్తి సామర్థ్యం గల కేంద్రాలు ఉన్నాయి.

 ఆధునిక ప్రపంచములోని మానవనిర్మిత నీటిపారుదల ప్రాజెక్ట్ లలో ''అత్యధ్భుతమైన'' నిర్మాణం..నాగార్జునసాగర్ డ్యాం.ఈప్రాజెక్ట్ నల్గొండ..గుంటూరు జిల్లాల సరిహద్దులలో నిర్మించబడినది. 1955 డిసెంబరు 10 వ తేదీ మన మొదటి ప్రధానమంత్రి శ్రీజవహర్ లాల్ నెహ్రూ గారు ఈప్రాజెక్ట్ కు శంకుస్ధాపన చేశారు.1967 వ సం.లో నాటి ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ చేత ఈడ్యాం  ప్రారంభించబడినది.

         ఈ అధ్భుత నిర్మాణం ఎత్తు 124 మీటర్లు. పొడవు 1550 మీటర్లు.ఈడ్యాం నిర్మాణానికి అయిన మొత్తం ఖర్చు 132 కోట్ల రూపాయలు. దీనికి చీఫ్ ఇంజనీరు గా కృష్ణా జిల్లా కు చెందిన కె.యల్ రావు గారు పనిచేశారు.

             1964 సం.లో తీసిన ''రాముడు భీముడు'' సినిమాలో యన్.టి.రామారావు గారితో చిత్రీకరించిన "దేశమ్ముమారిందోయ్.. కాలమ్ము మారిందోయ్.." అను పాట నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణసమయంలో అక్కడే షూ టింగ్ చేశారు.

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...