Oct 23, 2019


ముంచుకొస్తున్న ఆర్థిక మాంద్యం
బ్యాంకింగ్ వ్యవస్థ ప్రక్షాళన తక్షణం అవస్యం

           
  ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ముంచుకొస్తోంది. ముఖ్యంగా అమెరికా, చైనా వాణిజ్య యుద్ధం ప్రభావం యూరప్ మీద పడనుంది. కొన్ని ప్రధాన దేశాలు దిగుమతుల సుంకం పెంచడంతో ఆ ప్రభావం భారత్ పై కూడా పడే అకాశం ఉంది. ఏదైనా ఒక సంవత్సరంలో వరుసగా మూడు త్రైమాసికాలు స్థూల దేశీయ ఉత్పత్తి(జీడీపీ)వృద్ధి రేటు క్షీణిస్తూ ఉంటే ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళుతున్నాట్లు పరిగణిస్తారు. వినియోగదారుల కొనుగోలు శక్తి తగ్గడం వల్ల  వ్యవస్థ మాంద్యంలోకి జారుకుంటుంది. మార్కెట్లో వస్తు, సేవలకు డిమాండ్‌ తగ్గుతుంది. దాంతో కంపెనీలు, పరిశ్రమలు తమ ఉత్పత్తి తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ కారణంగా భారీ సంఖ్యలో ఉద్యోగాలకు కోతపడుతుంది. దేశంలో 2019-20 మొదటి త్రైమాసికంలో ఆర్థిక వృద్ధి రేటు 5 శాతానికి పడిపోయింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే త్రైమాసికంలో వృద్ధి రేటు 8 శాతంగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో  5.8  శాతం వృద్ధి రేటు నమోదైంది. నరేంద్ర మోదీ హయాంలో అతి తక్కువ వృద్ధి ఇదే అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇంత మాత్రాన మాంద్యం ఏర్పడినట్లు కాదు. అయితే దేశ ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి వేగం మందగించింది. దేశం మాంద్యం వైపు వెళుతోంది.   2008లో అమెరికాలో వచ్చిన ఆర్థిక మాంద్యం ప్రభావం ప్రపంచం అంతటిపైనా  పడింది. పటిష్టంగా ఉన్న అప్పటి భారత్ బ్యాంకింగ్ వ్యవస్థ దానిని తట్టుకొని నిలబడగలిగింది. అప్పట్లో ఆర్‌బీఐ కఠిన పరపతి విధానాలు అందుకు దోహదపడ్డాయి. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. ప్రస్తుతం భారత్‌ వివిధ అంశాలలో పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇప్పటికే రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్ ... వంటి రంగాలు బాగా క్షీణించాయి. ఆటోమొబైల్ రంగంలో ఉత్పత్తిని కూడా తగ్గించారు. అమెరికా, చైనా దిగుమతి సుంకాలను పెంచిన ప్రభావం యూరప్ తోపాటు ప్రపంచం అంతటా పడే ప్రమాదం ఉంది. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఈ రెండు ఆర్థిక వ్యవస్థల మధ్య మొదలైన వాణిజ్య యుద్ధం ఎటు దారి తీస్తుందో ఊహించడం కష్టం. 2007-09 మధ్య తలెత్తినటువంటి ఆర్థిక విపత్తు సంభవించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ప్రపంచం వ్యాప్తంగా ఆర్థిక వృద్ధి రేటు పడిపోయింది.  ఆ ప్రభావంతో  భారత్ ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతినే అవకాశం ఉంది.
              దానికితోడు  బడా వ్యాపార వేత్తలు అత్యంత సునాయాసంగా బ్యాంకులను మోసం చేయగలుగుతున్నారు. లక్షల కోట్ల రూపాయలు ఎగవేయగలుగుతున్నారు. బ్యాంకుల మొండి బకాయిలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కొన్ని బ్యాంకులు మొండి బకాయిల ఊబిలో కూరుకుపోయాయి.  దేశంలో రానురాను ఉన్నత వర్గాలుపారిశ్రామికవేత్తలకే బ్యాంకులు ఊడిగం చేస్తున్నట్లు అనిపిస్తోంది. రైతులువ్యవసాయదారులుగ్రామీణ ప్రజానీకానికి సాధారణ ప్రజలకు బ్యాంకింగ్ సేవలు ఆశించిన స్థాయిలో  అందుబాటులో లేవు.  బ్యాంకులు జాతీయం చేసి 50ఏళ్లు గడిచినా  ఏ ఉద్దేశాలతో  జాతీయం చేశారో ఆ ఉద్దేశాలు నెరవేరలేదంటే వ్యవస్థలో లోపాలు ఉన్నట్లు భావించాలి. బ్యాంకింగ్ మోసాలకు అడ్డుకట్ట వేయడానికి, మొండి బకాయిలు ముక్కు పిండి వసూలు చేసే వ్యవస్థ మనదేశంలో లేదు. అందువల్లనే పలువురు పారిశ్రామికవేత్తలు బ్యాంకులను అందినకాడికి దోచుకుంటున్నారు. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నివేదిక ప్రకారం 2018-19 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులను మోసం చేసిన  కేసుల సంఖ్య 15 శాతం పెరిగింది. మోసం చేసిన నగదు విలువ 73.8 శాతం పెరిగింది. 2017-18లో రూ.41,167.04 కోట్లకు బ్యాంకులను మోసం చేయగా, 2018-19కి అది రూ.71,542.93 కోట్లకు పెరిగింది. ఈ మోసాలకు ప్రభుత్వ రంగ బ్యాంకులే ఎక్కువగా నష్టపోతున్నాయి.  2018-19లో బడాబాబుల మోసాల వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.64,509.43 కోట్ల మేర నష్టపోయాయి. రుణాల ఎగవేత సమస్య బ్యాంకింగ్‌ వ్యవస్థను కొంతకాలంగా కుదిపేస్తోంది. నకిలీ పత్రాలు దాఖలు చేసి అధిక మొత్తంలో రుణాలు తీసుకొని ఎగ్గొట్టడం ఆందోళన కలిగిస్తోంది. బ్యాంకులకు సంబంధించి నిరర్ధక ఆస్తుల మొత్తం దాదాపు పది లక్షల కోట్ల రూపాయలు దాటిందని అంచనా.  ఒక వంద మంది లోపే లక్షల కోట్ల రూపాయలు ఎగవేసినట్లు తేలింది. ఈ ప్రకారం అతి కొద్ది మంది మాత్రమే బ్యాంకింగ్ వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తున్నారు. ఈ రకమైన చర్యల వల్ల బ్యాంకింగ్ వ్యవస్థపై సామాన్యులకు నమ్మకం సడలే ప్రమాదం ఉంది. రైతులు, మధ్య తరగతివారు, చిరు వ్యాపారులు రుణం తీసుకోవాలంటే బ్యాంకులు ఎక్కడలేని నిబంధనలు అమలు చేస్తాయి. అదే బడా బాబులకు వచ్చేసరికి ఆ నిబంధనలను తుంగలో తొక్కి వందల కోట్ల రూపాయలు ఇస్తారు. బ్యాంకుల ద్వారా ప్రజాధనాన్ని రుణాలుగా తీసుకొని విదేశాలకు పారిపోయే విజయ మాల్యా, నీరవ్‌ మోడీ ...లాంటి వారు ఎక్కువైపోతున్నారు. మోసపూరిత సంస్థలకు రుణాలు మంజూరు అవుతుండటంతో బ్యాంకింగ్‌ వ్యవస్థ పనితీరు ప్రశ్నార్థకంగా మారింది.  
       ఇదిలా ఉంటే, గత మూడేళ్లలో భారత బ్యాంకింగ్‌ వ్యవస్థలో రూ. లక్షా 76 వేల కోట్ల మొండి బకాయిలను రైటాఫ్‌ (ఖాతాల్లోంచి కొట్టివేయడం) చేశారు. ఈ బకాయిలన్నీ 416 మంది రుణగ్రహీతలు ఎగవేసినవి కావడం గమనార్హం.  వీరంతా రూ.100 కోట్లు, అంతకు మించి ఎగవేసినవారే.  2014-15 నుంచి ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ బ్యాంకుల్లో మొండిబకాయిల కొట్టివేతలు బాగా పెరిగాయి. ఈ రకమైన చర్యలు దేశ ఆర్థిక వ్యవస్థలో చాలా ప్రమాదకరమైన పరిణామాలకు దారి తీస్తాయి. 2015-18 మధ్యకాలంలో షెడ్యూలు కమర్షియల్‌ బ్యాంకులు రూ.2.17 లక్షల బకాయిలను కొట్టివేశాయి. 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత ఈ కొట్టివేతలు బాగా పెరిగాయి. బ్యాంకుల్లో పేరుకుపోతున్న మొండి బకాయిల సమస్య పరిష్కారానికి కేంద్రం రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)కు విశేషాధికారాలు  ఇచ్చినా ఫలితం కనిపించలేదు. ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థను ప్రక్షాళన చేయవలసిన ఆవస్యకత కనిపిస్తోంది. బకాయిల వసూలు విషయంలో చట్టపరమైన అడ్డంకులు తొలగించి, ఉన్న చట్టాల సవరణ  లేదా కొత్త చట్టాల రూపకల్పన చేయవలసిన అవసరం ఉంది.
శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ -9440222914

Oct 21, 2019


అల్లక తాతారావుకు ఆత్మీయ సన్మానం
             

         

          చేనేత బతుకు చిత్రాన్ని పాట రూపంలో జైపూర్‌లో ఆలపించిన చేనేత కార్మికులు, కవి, రచయిత, మదుర గాయకుడు అల్లక తాతారావుకు విశ్వశాంతి కళాపరిషత్ ఆధ్వర్యంలో పాత మంగళగిరిలోని పొట్లాబత్తుల లక్ష్మణరావు వస్త్రాలయం పైన  ఆదివారం రాత్రి ఆత్మీయ సన్మానం జరిగింది. రాజస్థాన్‌లోని జైపూర్  ఫెయిర్‌మౌంట్ హోటల్‌లో అక్టోబర్ 4,5,6 తేదీలలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన రేమాండ్ ఎంటీవీ ఇండియా మ్యూజిక్ సమ్మిట్-2019 సందర్భంగా రేమాండ్ వారు చేనేత-ఖాదీ ప్రదర్శనను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలో కశ్మీర్, గుజరాత్, అస్సాం, రాజస్థాన్ చేనేత కళాకారులు చేనేత గీతాలను ఆలపించారు. ప్రముఖ బిల్డర్  ఇంజమూరి శ్రీనివాసరావు ప్రోత్సాహం, సహకారంతో గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన అల్లక తాతారావు  రెండు తెలుగు రాష్ట్రాల తరపున ఆ కార్యక్రమంలో పాల్గొని  చేనేత బతుకు గీతం ఆలపించారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మంగళగిరిలోని కళాకారులు ఆయనకు ఆత్మీయ సన్మానం చేశారు.
            సభా కార్యక్రమానికి ముందు పలువురు కళాకారులు పాటలు, పద్యాలు ఆలపించారు. ఇంజమూరి శ్రీనివాసరావు, అల్లక తాతారావులను జొన్నాదుల బాపూజీ శాలువలతో సన్మానించారు. సభానంతరం అల్లక తాతారావును పలువురు పూలమాలతో, శాలువలతో సన్మానించారు. కథ,నాటక రచయిత, కవి, గాయకుడు, ప్రజా కళాకారుడు, చేనేత కార్మికుడు సందుపట్ల భూపతి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఇంజమూరి శ్రీనివాసరావు, పొట్లాబత్తుల లక్ష్మణరావు, కృష్ణార్జున బోధి, రేఖా కృష్ణార్జున రావు, జొన్నాధుల బాపూజీ, గుత్తికొండ ధనుంజయ, దేవాంగ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాడిశెట్టి శివ శంకరయ్య, గోలి సీతారామయ్య, కంచర్ల కాశయ్య, గోలి మధు తదితరులు పాల్గొన్నారు.

Oct 13, 2019


ఆకురాతి కిషోర్‌కు డాక్టరేట్

       

   
హైదరాబాద్: గుంటూరుకు చెందిన ఆకురాతి వరహా కిషోర్‌కు అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని యోగ సంస్కృతం యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదాన చేసింది. యూనివర్సిటీ 11వ స్నాతకోత్సవం ఆదివారం సాయంత్రం ఖైరతాబాద్‌లోని ఇంజనీర్స్ ఇన్ స్టిట్యూషన్‌లో ఘనంగా జరిగింది. ‘వాలిడేషన్ ఆఫ్ ఎమోషనల్ ఇంటిలిజెన్స్ విత్ ఆస్ట్రోలజీ’ అనే అంశంపై పరిశోధన చేసిన కిషోర్‌కు ఈ స్నాతకోత్సవంలో  డాక్టరేట్ ప్రదానం చేశారు. ఆకురాతి వెంకట కృష్ణారావు, భారత స్వరాజ్యలక్ష్మిల కుమారుడైన కిషోర్ గుంటూరులోనే విద్యాభ్యాసం చేశారు. పాలిటెక్నిక్ పూర్తి చేసిన కిషోర్ ఉద్యోగం చేస్తూనే ఆ తరువాత ప్రైవేటుగా ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేశారు. ఉద్యోగ రీత్యా సుందరం ఫైనాన్స్ కంపెనీలో దేశంలోని వివిధ ప్రాంతాలలో పని చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో సుందరం ఫైనాన్స్ కంపెనీ మేనేజర్‌గా పని  చేస్తున్నారు. కిషోర్-బాల సరస్వతిల కుమార్తె మానస గుంటూరులోనే ఎంబిబిఎస్ చదువుతోంది. ఈ వయసులో కూడా ఉద్యోగం చేస్తూ చదువు, పరిశోధన పట్ల ఆసక్తితో యూనివర్సిటీకి పరిశోధన పత్రం సమర్పించి కిషోర్ డాక్టరేట్ సాధించడం అభినందనీయం.



 యోగ సంస్కృతం యూనివర్సిటీ స్నాతకోత్సవం
            హైదరాబాద్: అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని యోగ సంస్కృతం యూనివర్సిటీ 11వ కాన్వకేషన్ ఆదివారం సాయంత్రం ఖైరతాబాద్‌లోని ఇంజనీర్స్ ఇన్ స్టిట్యూషన్‌లో ఘనంగా జరిగింది. ఈ స్నాతకోత్సవంలో పలువురికి డిగ్రీలు, డాక్టరేట్లు ప్రదానం చేశారు. గుంటూరుకు చెందిన ఆకురాతి వరహా కిషోర్ కుమార్ కు డాక్టరేట్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఛాన్సలర్ డాక్టర్ బివికె శాస్త్రి, వైస్ ఛాన్సలర్ ఎన్.వి.ఆర్.ఏ.రాజా, కిమ్స్ సీఈఓ డాక్టర్ బి.భాస్కర రావు, డాక్టర్ ఎస్. బిక్కం చంద్, వేద, ఆగమ ప్రవీణ అవధూత రాజయోగి, స్కోప్ సంస్థ చైర్మన్ డాక్టర్ కాశ్యప్ కె ప్రభాకర్, తమిళనాడులోని జెకెఆర్ ఆస్ట్రో రీచర్చ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ విజయ లక్ష్మి, వేదిక్ సైన్స్ జాతీయ సంస్థకు చెందిన లక్ష్మీ నారాయణ, చైతన్య గ్లోబల్ ఫౌండేషన్ ప్రతినిధి డాక్టర్ సురేష్, జెకెఆర్ ఆస్ట్రో రీసెర్చ్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ ఎన్ విఆర్టే రాజా తదితరులు పాల్గొన్నారు.

Oct 7, 2019

బలీయమైన సంస్కృతి
Ø గార్బా, దాండియా నృత్యాలు
Ø దసరా సందర్భంగా 28న విజయవాడలో మెగా ఈవెంట్
Ø దుర్గాదేవి-మహిషాసురునికి మధ్య జరిగే యుద్ధానికి ప్రతీకగా దాండియా
       
    సంస్కృతి, భాష చాలా బలీయమైనవి. ఏ ప్రాంతం వారైనా వారి సంస్కృతి, సంప్రదాయాలు, భాషకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. జీవితాంతం వాటిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. వారు ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా, బతుకుదెరువు కోసం ఈ ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా వాటిని అనుసరిస్తూ ఉంటారు. మన తెలుగు వారు అమెరికా, దుబాయ్ .. వంటి దేశాలలలో నివాసం ఉంటున్నా సంక్రాంతి, బతకమ్మ వేడుకలు జరుపుకుంటుంటారు. అలాగే గుజరాత్, రాజస్థాన్ ల నుంచి వ్యాపారం, ఉద్యోగ రీత్యా ఆంధ్రప్రదేశ్ కు వచ్చినవారు విజయవాడలో దసర ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడంతోపాటు వారి సంప్రదాయ  గార్బా, దాండియా నృత్యాలను అందరినీ ఆకట్టుకునే విధంగా ప్రదర్శిస్తుంటారు. ఈ కార్యక్రమాలలో పిల్లలు, పెద్దలు, మహిళలు అత్యంత ఉత్సాహంగా పాల్గొంటుంటారు. వారి సంస్కృతిని ముందు తరాలవారికి అందిస్తుంటారు. క్రియేటివ్ సోల్ నేతృత్వంలో దాండియా మెగా ఈవెంట్ పేరుతో రెండేళ్ల నుంచి ఇక్కడ ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 28న విజయవాడ లబ్బీపేట ఎస్ఎస్ కన్వేన్షన్ సెంటర్లో  నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందు కోసం చిన్న పిల్లలు మొదలుకొని  యువతీ యువకులకుపెద్దలకు బెంజి సర్కిల్ సమీపంలోని జ్యోతి కన్వెన్షన్ సెంటర్లో ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నారు. వారిలో ఉత్సాహం నింపడానికి లక్షల విలువైన బహుమతులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. విలువైన బహుమతులు గెలుచుకునేందుకు వారు పోటీలుపడి మరీ వారి సంప్రదాయ నృత్యాలను అభ్యాసం చేస్తున్నారు. ఇందు కోసం జాతీయ స్ధాయిలో గుర్తింపు కొందిన శిక్షకులను రప్పించి వారికి  21 రోజుల పాటు శిక్షణ ఇప్పిస్తున్నారు. ప్రస్తుత ప్రమోషన్ కార్యక్రమంలో పురుషుల విభాగంలో సౌరవ్మహిళల విభాగంలో మయూరిఉత్తమ వేషధారణ విభాగంలో రితిక అగ్రభాగాన నిలిచి బహుమతులు అందుకున్నారు. మెగా ఈవెంట్ లో గుజరాతీ సంగీత కళాకారుల పాటలతోపాటు వాద్య కళాకారులు వీనుల విందైన సంగీతం వినిపిస్తారు. కళ్లు మిరుమిట్లు గొలిపే కాంతులుహోరెత్తించే వాద్యాలతోపాటు  ప్రత్యేకంగా డిజైన్ చేసిన గుజరాతీ దుస్తులువస్త్రాలుఆభరణాలుకళాకృతులుచిత్రలేఖన ప్రదర్శనలను కూడా ఏర్పాటు చేస్తారు.
                సాధారణంగా ఉత్తర భారత దేశానికే పరిమితం అయిన గార్బాదాండియా నృత్యరీతులను ఈ ఈవెంట్ లో ఆంధ్రప్రదేశ్ కు  పరిచయం చేస్తారు. కళలతో దేశసమైఖ్యతను చాటాలన్నది  గుజరాతీరాజస్ధానీ పడతుల ముఖ్య ఉద్దేశం. దుర్గాదేవికి మహిషాసురునికి మధ్య జరిగే యుద్దానికి ప్రతీకగా ఉత్తర భారత దేశంలో దాండియా అడతారు.  అమ్మవారికి హారతి ఇచ్చే ముందు చిన్నాపెద్ద కలిసి అత్యంత ఉత్సాహంగా ఈ నృత్యం చేస్తారు.  క్రియేటివ్ సోల్ వ్యవస్ధాపకులు సుమన్ మీనానేహాజైన్, ప్రధాన టైటిల్  స్పాన్సర్  జిఎం మాడ్యులర్ ఈ ఈవెంట్ నిర్వహణా వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు.
-     శిరందాసు నాగార్జున – 9440222914

Oct 6, 2019

ఏపీలో గ్రామ పాలన
            
 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ పాలనకు పెద్ద పీట వేసింది. గ్రామవార్డు స్థాయిలో శాశ్వతంగా సచివాలయాలను ఏర్పాటు చేసి ప్రజలకు తమ గుమ్మం వద్దే పూర్తి స్థాయి సేవలు అందించాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. సంక్షేమ పథకాలను పారదర్శకంగా అర్హులైన పేదలకు అందించడంతోపాటు ప్రభుత్వ సేవల్లో జాప్యం జరగరాదనే సదుద్దేశంతో ప్రభుత్వం సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. జాతిపిత మహాత్మా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన ఆశయాలకు అనుగుణంగా గ్రామస్వరాజ్యానికి రూపొందించిన ఈ వ్యవస్థను ఈ ఏడాది అక్టోబర్ 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తీసుకువస్తారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘నవరత్నాల’ ద్వారా ప్రభుత్వ పథకాలు, ఇతర సేవలు ప్రజలకు పారదర్శికంగా అందించడానికి చర్యలు చేపట్టారు.

       సచివాలయ వ్యవస్థ ద్వారా ఒకేసారి లక్షా 34 వేల ఉదోగాలు భర్తీ చేయడం ఓ రికార్డ్ అయితే, ఇందుకోసం నిర్వహించిన పరీక్షలు కూడా మరో రికార్డ్. ఇప్పటి వరకు యూపీపీఎస్‌సీ ద్వారా 14 లక్షల మంది పరీక్షలు రాసిన రికార్డు ఉంది. హాజరు శాతం 50 వరకు ఉంది. అయితే గ్రామ, వార్డు సచివాలయ పోస్టుల భర్తీకి నిర్వహించిన పోటీ పరీక్షలకు దేశంలోనే తొలిసారిగా 20 లక్షల మందికి పైగా అభ్యర్థులు పరీక్షలు రాశారు.  88 శాతంకు పైగా హాజరయ్యారు.
రాష్ట్ర వ్యాప్తంగా క్రొత్తగా 11,158 గ్రామ, 3,786 వార్డు సచివాలయాలు ఏర్పాటు చేస్తారు. ఈ సచివాలయాల్లో  పింఛన్లురేషన్ కార్డులువిద్యార్థుల ఉపకార వేతనాలుఇంటి పన్ను చెల్లింపుకులనివాస ధృవీకరణ పత్రాలతోపాటు వివిధ ప్రభుత్వ పథకాలకు సంబంధించి దాదాపు 35 రకాల సేవలు అందుబాటులోకి వస్తాయి. వ్యవసాయంపశుసంవర్థకరెవెన్యూవైద్యంఉద్యానఅటవీసంక్షేమంపంచాయతీరాజ్‌, మున్సిపాలిటీ... వంటి శాఖలకు సంబంధించిన సేవలన్నీ ఇక్కడే అందుబాటులో ఉంటాయి.  ప్రభుత్వ పథకాలు, సేవలు లబ్దిదారులకు అందడాన్ని మరింత సులభతరం చేస్తారు. తొలి దశలో 1500 చోట్ల సచివాలయ భవనాలను కూడా నిర్మిస్తారు. ఇప్పటికే ఆగస్ట్ 15 నుంచి గ్రామ వలంటీర్ల వ్యవస్థ ప్రారంభమైంది. లక్షా 93వేల మంది గ్రామ, వార్డు వలంటీర్లను నియమించారు. ప్రతి 50 కుటుంబాలకు ఒక్కరి చొప్పున ఈ వలంటీర్లు సేవలందిస్తారు. కుటుంబం, ఆ కుటుంబంలోని ప్రతి వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలు వారు సేకరించి ప్రభుత్వానికి అందజేస్తారు. ఆ వివరాల ఆధారంగా ఇల్లు లేనివారికి ప్రభుత్వం ఇంటి స్థలం కేటాయిస్తుంది. అలాగే ఇతర ప్రభుత్వ పథకాలు మంజూరు చేస్తారు. ప్రభుత్వం అందజేసే రేషన్ బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులు వీరే ఇంటింటికి తిరిగి అందజేస్తారు. అగ్రిగోల్డ్ బాధితులకు చెక్కులు కూడా వీరే ద్వారానే అందజేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉంది.   ప్రభుత్వానికిప్రజలకు మధ్య వారధులుగా ఈ వలంటీర్లు పనిచేస్తున్నారు. ఈ వ్యవస్థ మొత్తం సమర్థవంతంగా పని చేసిననాడు గ్రామస్వరాజ్యం సాధించినవారమవుతాము.
-శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914
Attachments area

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...