Apr 23, 2025

‘మన మంగళగిరి 2.0’ పరిచయం


మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరికి  చెందిన న్యాయవాది, రచయిత సావిత్రీపతి మాదిరాజు గోవర్థనరావు రాసిన ‘మన మంగళగిరి 2.0’ని ఇటీవల స్థానిక శాసనసభ్యులు, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు. ‘మన మంగళగిరి 2.0’లో మంగళగిరి చరిత్రను  సమగ్రంగా రాసినట్లు రచయిత గోవర్థన్ మంగళవారం స్థానిక జర్నలిస్టులకు వివరించారు. స్థానిక విలేకరులకు ఆయన ఈ పుస్తకాన్ని అందజేశారు. మంగళగిరి చరిత్ర అధ్యయనంలో దిట్ట అయిన  గోవర్థన్ గతంలో కూడా ‘మన మంగళగిరి’ అనే పేరుతో ఒక పుస్తకం రాశారు. ఈసారి 546 పేజీలతో, మంగళగిరిలోని అన్ని రంగాల  సమగ్ర సమాచారంతో  దీనిని తీసుకువచ్చారు. ఈ పుస్తకంలోని సమాచార సేకరణ కోసం ఆయన ఎంతో శ్రమించారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వానపల్లి బ్రహ్మనాయుడు, సీనియర్ జర్నలిస్ట్ కొలికపూడి రూఫస్ తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment

తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు

 ఈరోజు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుగంటే...గోంగూర తెలుగంటే...గోదారి తెలుగంటే...గొబ్బిళ్ళు తెలుగంటే...గోరింట తెలుగంటే...గు...