మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన న్యాయవాది, రచయిత సావిత్రీపతి మాదిరాజు గోవర్థనరావు రాసిన ‘మన మంగళగిరి 2.0’ని ఇటీవల స్థానిక శాసనసభ్యులు, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు. ‘మన మంగళగిరి 2.0’లో మంగళగిరి చరిత్రను సమగ్రంగా రాసినట్లు రచయిత గోవర్థన్ మంగళవారం స్థానిక జర్నలిస్టులకు వివరించారు. స్థానిక విలేకరులకు ఆయన ఈ పుస్తకాన్ని అందజేశారు. మంగళగిరి చరిత్ర అధ్యయనంలో దిట్ట అయిన గోవర్థన్ గతంలో కూడా ‘మన మంగళగిరి’ అనే పేరుతో ఒక పుస్తకం రాశారు. ఈసారి 546 పేజీలతో, మంగళగిరిలోని అన్ని రంగాల సమగ్ర సమాచారంతో దీనిని తీసుకువచ్చారు. ఈ పుస్తకంలోని సమాచార సేకరణ కోసం ఆయన ఎంతో శ్రమించారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వానపల్లి బ్రహ్మనాయుడు, సీనియర్ జర్నలిస్ట్ కొలికపూడి రూఫస్ తదితరులు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు
ఈరోజు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుగంటే...గోంగూర తెలుగంటే...గోదారి తెలుగంటే...గొబ్బిళ్ళు తెలుగంటే...గోరింట తెలుగంటే...గు...
-
నారా చంద్రబాబు : ముఖ్యమంత్రి, లా అండ్ ఆర్డర్ కొణిదెల పవన్ కల్యాణ్ : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి స...
-
పుష్ప- 2: ది రూల్ సినిమా ట్రైలర్ నవంబర్ 17వ తేదీ ఆదివారం బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపైన వి...
-
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన న్యాయవాది, రచయిత సావిత్రీపతి మాదిరాజు గోవర్థనరావు రాసిన ‘మన మంగళగిరి 2.0’ని ఇటీవల స్థానిక శాసనసభ...
No comments:
Post a Comment