Feb 7, 2019


కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్న
చంద్రబాబుకు కృతజ్ఞతలు
కాపు కార్పోరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బరాయుడు
              సచివాలయం, ఫిబ్రవరి 7: కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలకు 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కాపు కార్పోరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బరాయుడు  కృతజ్ఞతలు తెలిపారు. శాసనసభ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద గురువారం రాత్రి ఆయన మాట్లాడారు. ఏ వర్గానికి అన్యాయం జరుగకుండా చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. మిగిలిన అగ్రవర్ణాలకు ఎటువంటి ఇబ్బందీ ఉండదన్నారు. ఈ కులాలు దశాబ్దాలుగా కోరుతున్న రిజర్వేషన్లను చంద్రబాబునాయుడు సాకారం చేశారని కొనియాడారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో హామీని నెరవేర్చిందన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం కాపు కార్పోరేషన్ ఏర్పాటు చేశారని, వెయ్యి కోట్ల రూపాయలు కేటాయిచారని, రిజర్వేషన్ కల్పించారని వివరించారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ తో కలుపుకొని కాపులకు రూ.4100 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. పేద కాపు విద్యార్థులు విదేశాలలో చదువుకుంటే రూ.11.5 లక్షల వరకు ఉచితంగా ఇస్తున్నట్లు తెలిపారు. ఉపాధి అవకాశాల కోసం శిక్షణ ఇప్పిస్తున్నామని, ప్లేస్ మెంట్ ద్వారా ఉద్యోగాలు కల్పిస్తున్నామని చెప్పారు. డ్రైవర్లకు సబ్సిడీపై కార్లు అందజేస్తున్నట్లు తెలిపారు. మహిళలకు కుట్టులో, అల్లికలో శిక్షణ ఇప్పించి, వారికి కుట్టు మిషన్లు కూడా ఉచితంగా అందజేస్తున్నట్లు చెప్పారు. జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కాపు భవనాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇప్సటి వరకు 300 భవనాలు నిర్మించినట్లు సుబ్బరాయుడు  చెప్పారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...