Feb 3, 2020


ప్రస్తుతం దేశంలో అమలులో ఉన్న శాసన మండళ్లు

       రాష్ట్రం మండలి
        సభ్యుల సంఖ్య
1
ఆంధ్రప్రదేశ్‌   
58
2
ఉత్తరప్రదేశ్‌   
100
3
మహారాష్ట్ర    
78
4
కర్ణాటక       
75
5
బీహార్‌
75
6
తెలంగాణ    
40




v భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 168 ప్రకారం శాసన మండలి ఏర్పాటు చేశారు.
v ఆర్టికల్ 171 ప్రకారం శాసన మండలి సభ్యులు శాసనసభ సభ్యులకు మూడవ వంతు మించి ఉండరాదు. ఆ ప్రకారం ఏపీ మండలి సభ్యుల సంఖ్య 58.
v జూలై 1, 1958న దీనిని ఏర్పాటు చేశారు.
v మే 31, 1985న రద్దు చేశారు.
v మార్చి 30, 2007న పునరుద్దరించారు.
v ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో పార్టీల బలాబలాలు..
v టీడీపీ: 28  -  వైసీపీ: 9  - స్వతంత్రులు :3 - పీడీఎఫ్‌: 5 – నామినేటెడ్ :8  బీజేపీ: 2 - ఖాళీలు: 3 - మొత్తం: 58
v టీడీపీ నుంచి శివనాథరెడ్డి, పోతుల సునీత వైసీపీకి మద్దతు ఇచ్చారు. డొక్కా మాణిక్య వరప్రసాద్‌ పార్టీకి దూరంగా ఉన్నారు.  
v టీడీపీకి మద్దతు పలికేవారు 34 మంది.    




       

1.     కౌన్సిల్స్‌ను రద్దు చేసి తిరిగి ప్రవేశపెట్టేందుకు అసెంబ్లీలలో తీర్మానం చేసిన రాష్ట్రాలు
        1. అస్సాం
        2. మధ్యప్రదేశ్‌
        3. పంజాబ్‌
        4. తమిళనాడు
        5. పశ్చిమ బెంగాల్‌

2.    కొత్తగా కౌన్సిల్‌ పెట్టుటకు తీర్మానం చేసిన రాష్ట్రాలు
        6. ఢిల్లీ
        7. హిమాచల్‌ప్రదేశ్‌
        8. ఒడిషా
        9. రాజస్థాన్‌
        10. ఉత్తరాఖండ్‌
గమనిక : 10 రాష్ట్రాలు కౌన్సిళ్లు కావాలని కేంద్రాన్ని కోరుతుంటే, ఏపీ కౌన్సిల్‌ రద్దు తీర్మానాన్ని కేంద్రం ఎలా ఆమోదిస్తుంది?

v అస్సాం కౌన్సిల్ బిల్లు 2013 ని రాజ్యసభలో డిసెంబర్ 3, 2013న ప్రవేశ పెట్టారు.
v మధ్య ప్రదేశ్  కౌన్సిల్ ఏర్పాటుకు 1967లో శాసనసభలో రిజల్యూషన్ పాస్ చేశారు. ఇది కేంద్రం వద్ద పెండింగ్ లో ఉంది.
v పంజాబ్ లో కౌన్సిల్ ని జనవరి 1, 1970న రద్దు చేశారు.
v తమిళనాడు కౌన్సిల్ 1861లో ఏర్పాటు చేశారు. 1986లో రద్దు చేశారు. దానిని మళ్లీ పునరుద్దరించాలని ఫిబ్రవరి 20, 1989న, జూలై 26, 1996న, 2012లో  శాసనసభలో రిజల్యూషన్స్  ఆమోదించారు. దానిని రాజ్యసభ ఆ బిల్లుని డిఎంకె వ్యతిరేకించింది.
v పశ్చిమ బెంగాల్ లో 1969లో కౌన్సిల్ ని రద్దు చేశారు. 42 ఏళ్ల తరువాత జనవరి 20, 2013న దానిని పునరుద్దరించాలని శాసనసభలో తీర్మానం చేశారు.
v ఒడిషాలో కౌన్సిల్ ఏర్పాటు చేయాలని సెప్టెంబర్ 7, 2018న రిజల్యూషన్ ఆమోదించారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...