Feb 3, 2020

జగన్ ఒక్క దెబ్బతో ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని దెబ్బతీశాడు: మోహన్ దాస్ పాయ్


12.11.2019 :
v అమరావతి రాజధాని స్టార్టప్ ఏరియా కాంట్రాక్టును ఆంధ్రప్రదేశ్ రద్దు చేసుకుని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇన్వెస్టర్ల కాన్ఫిడెన్స్ ను దెబ్బతీశారు. ఈ రోజు సింగపూర్ ప్రభుత్వం నుంచి స్టార్టప్ ఏరియా ప్రాజక్టును రద్దు చేసుకోవడం మీద వచ్చిన ప్రకటన అనంతరం ఆయన ఇలా స్పందించారు. సింగపూర్ ప్రభుత్వం చాలా గౌరవప్రదంగా ఈ ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టార్టప్ ఏరియా అభివృద్ధి చేసేందుకు ఏర్పాటయిన సింగపూర్ కన్సార్షియమ్ పరసర్పరాంగీకరాంతోనే కాంట్రాక్టును రద్దు చేసుకున్నాయని సింగపూర్ ట్రేడ్ రిలేషన్స్ మంత్రి ఎస్ ఈశ్వరన్ పేర్కొన్నా అది అంత సుహృద్బావ వాతావరణంలో జరిగి ఉంటుందని ఎవరూ అనుకోరు.ఎందుకంటే, కన్సార్టియమ్ కొన్నిమిలియన్ల డాలర్లను కోల్పోయిందని మంత్రి స్పష్టంగా రాశారు.
v ఈ నేపథ్యంలో పాయ్ తన అభిప్రాయాన్ని ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి స్టార్టప్ ఇన్ ఫ్రా వర్క్ రద్దుచేసుకుంది. సింగపూర్ సంస్థ వెనక్కి వెళ్లిపోయింది. ఇదే మాత్రం మంచిది కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ కు దుర్వార్త. హరాకిరి. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సింగిల్ హ్యాండెడ్ గా ఎపి మీద ఇన్వెస్టర్లకు ఉన్న విశ్వాసాన్ని దెబ్బ తీశారు. ఉద్యోగాలు దెబ్బతిన్నాయి. అభివృద్ధి పోడిపోయింది. ఇక ఇన్వెస్టర్ ఇందుకు అక్కడ పెట్టుబడులు పెడతారు. దురదృష్టం. అని ఆయన వ్యాఖ్యానించారు.
16.08.2019
v కర్నాటకకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, పలు కంపెనీల స్వతంత్ర డైరెక్టర్,  ఆర్యన్ క్యాపిటల్ అధినేత, అక్షయపాత్ర సహ వ్యవస్థాపకుడు  మోహన్ దాస్ పాయ్ ట్వీట్‌ :
v ఏపీ ప్రభుత్వం పీపీఏల సమీక్షపైన తీసుకున్న నిర్ణయాలపైన ఇప్పటికే అనేక అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. జపాన్ కంపెనీలు లేఖ రాసిన తర్వాత అయినా నిర్ణయం మార్చుకోవాల్సింది. ప్రభుత్వమే ఈ విధంగా వ్యవహరిస్తే ఏపీకీ పరిశ్రమలు ఎలా వస్తాయి? పరిశ్రమలను దెబ్బ తీసి ఏపీని కుప్ప కూల్చేలా వ్యవహరిస్తున్నారు. ఏపీ భవిష్యత్ ను ముఖ్యమంత్రి జగన్ నాశనం చేస్తున్నారు.
v కేంద్ర ప్రభుత్వం..జపాన్ కంపెనీలు సైతం.. ముఖ్యమంత్రి జగన్ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలను సమీక్షించాలని నిర్ణయించినప్పటి నుండి అభ్యంతరాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. తొలుత కేంద్ర ఇంధన శాఖ కార్యదర్శి అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆ తరువాత నేరుగా కేంద్ర మంత్రి దీని పైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ నేరుగా ముఖ్యమంత్రికి లేఖ రాశారు. హోం మంత్రి అమిత్ షా కు ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో పవర్ కంపెనీలు హైకోర్టును ఆశ్రయించాయి.
v జపాన్ కంపెనీలు నేరుగా కేంద్ర ప్రభుత్వానికి అదే సమయంలో ఏపీ ప్రభుత్వానికి లేఖలు రాసింది. ఏపీ ప్రభుత్వం లో పీపీఏల మీద సమీక్ష చేస్తే వ్యాపార పరంగా ఇబ్బందులు వస్తాయని అభ్యంతరం వ్యక్తం చేసింది.


No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...