రాజధాని కోసం భూ సమీకరణ కింద తమ భూముల్ని స్వాధీనం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఒప్పందం ప్రకారం తమకు అభివృద్ధి చేసిన ప్లాట్లను ఇవ్వాల్సి ఉందని, అయితే ఇప్పటి వరకు అది కార్యాచరణ దాల్చనందున ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ రాజధానికి చెందిన రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు 7 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై సోమవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి ముందు విచారణ జరిగింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్బాబు వాదిస్తూ.. రాజధాని ప్రాంతంలో అభివృద్ధి కార్యకార్యక్రమాలను కొనసాగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని అభ్యర్థించారు. తమ వద్ద తీసుకున్న భూమిని ప్రభుత్వం ఇతరులకు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేపట్టిందని, దీనిని అడ్డుకోవాలన్నారు. సీఆర్డీఏ తరఫున న్యాయవాది కాసా జగన్మోహన్రెడ్డి గడువు కావాలని కోరగా న్యాయమూర్తి.. విచారణను 2 వారాలకు వాయిదా వేశారు.
Subscribe to:
Post Comments (Atom)
తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు
ఈరోజు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుగంటే...గోంగూర తెలుగంటే...గోదారి తెలుగంటే...గొబ్బిళ్ళు తెలుగంటే...గోరింట తెలుగంటే...గు...
-
నారా చంద్రబాబు : ముఖ్యమంత్రి, లా అండ్ ఆర్డర్ కొణిదెల పవన్ కల్యాణ్ : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి స...
-
పుష్ప- 2: ది రూల్ సినిమా ట్రైలర్ నవంబర్ 17వ తేదీ ఆదివారం బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపైన వి...
-
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన న్యాయవాది, రచయిత సావిత్రీపతి మాదిరాజు గోవర్థనరావు రాసిన ‘మన మంగళగిరి 2.0’ని ఇటీవల స్థానిక శాసనసభ...
No comments:
Post a Comment