2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్
ఏప్రిల్ 11న పోలింగ్ - మే 23న ఫలితాలు
ఆంధ్రప్రదేశ్ లో లోక్ సభ, శాసన సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేశారు. ఏప్రిల్ 11న
ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలకు, 25 లోక్ సభ స్థానాలకు
పోలింగ్ జరుగుతుంది. మే 23న ఫలితాలు ప్రకటిస్తారు.
మొదటి దశలోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు
ఏప్రిల్ 11న పోలింగ్.. మే 23న ఫలితాలు
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు
నగారా మోగింది. ఆదివారం (10-03-2019) ఢిల్లీలో లోక్సభతో పాటూ నాలుగు రాష్ట్రాల
ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ
ఎన్నికల విషయానికి వస్తే.. ఏప్రిల్ 11న 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్
జరగనుండగా.. మే 23న ఫలితాలు ప్రకటిస్తారు. షెడ్యూల్ ప్రకటనతో ఎన్నికల నియమావళి
అమల్లోకి వచ్చేసింది.
అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్..
మార్చి
18న ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలవుతుంది
మార్చి 18
నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
మార్చి 25
నామినేషన్లు వేసేందుకు ఆఖరు తేదీ
మార్చి
26న నామినేష్లను పరిశీలిస్తారు
మార్చి 28
వరకు నామినేష్ల ఉపసంహరణకు గడువు
ఏప్రిల్
11న 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్
మే 23న ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తారు
షెడ్యూల్ రావడంతో పార్టీలన్నీ ఎన్నికలపై
ఫోకస్ పెట్టాయి. అలాగే ప్రచారానికి కేవలం 15 నుంచి 20 రోజుల సమయం మాత్రమే ఉంటుంది.
పోలింగ్ జరిగిన 41 రోజుల తర్వాత ఫలితాలు వెల్లడవుతాయి.
లోక్సభతో
పాటూ ఆంధ్రప్రదేశ్,
ఒడిశా, సిక్కిం, అరుణాచల్
ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఖరారయ్యాయి. ఏప్రిల్, మే నెలల్లోనే ప్రక్రియ మొత్తం ముగిసేలా 7 దశల్లో ఎన్నికల్ని
నిర్వహిస్తున్నారు. అంటే దాదాపు రెండు నెలల పాటూ ఎన్నికల హడావిడి ఉంటుంది. మొత్తం
543 లోక్సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు 10 లక్షల పోలింగ్ స్టేషన్లు
అవసరమవుతాయని ఈసీ భావిస్తోంది. అందుకు కావాల్సిన ఈవీఎంలు, ఇతర
ఎన్నికల సామగ్రిని సిద్ధం చేస్తోంది.
No comments:
Post a Comment