Mar 28, 2024

లోక్ సభలో డాక్టర్ శింగరి సంజీవ్ కుమార్

2019 ఏప్రిల్ 11న ఆంధ్రప్రదేశ్ లో జరిగిన 17వ సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు లోక్ సభ నియోజకవర్గం నుంచి లక్షా 48వేల ఓట్ల మెజార్టీతో డాక్టర్ శింగరి సంజీవ్ కుమార్ విజయం సాధించారు.

 17వ లోక్‌సభలో డాక్టర్ సంజీవ్ కుమార్ పనితీరు, ఆయన సాధించిన విజయాలు

 వైద్య, ఆరోగ్య శాఖ:

కర్నూలు మెడికల్ కాలేజీలో సూపర్ స్పెషాలిటీ మెడికల్ సీట్లు:

6 సూపర్ స్పెషాలిటీ కోర్సుల అనుమతి కొరకు కృషి చేసి 19 SSPG seats సాధించారు.  10 సంవత్సరాలకు పైగా పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల డిమాండ్‌కు పరిష్కారం లభించింది.

 స్టేట్ క్యాన్సర్ ఆసుపత్రికి నిధులు: కర్నూలు సర్వజన వైద్యశాలలో నిర్మిస్తున్న స్టేట్ క్యాన్సర్ హాస్పిటల్ కొరకు కేంద్ర ప్రభుత్వం నుండి రూ.58 కోట్ల నిధులు విడుదల చేయించేందుకు కృషి చేశారు.

 కర్నూలులో ESI ఆసుపత్రి : కర్నూలు ప్రాంత పరిశ్రమలలో పనిచేస్తున్న శ్రామికుల కొరకు 30 పడకల ESI ఆసుపత్రిని మంజూరు చేయించారు. 

 యునాని క్లినికల్ రీసెర్చ్ యూనిట్:  ఈ యూనిట్ కు రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని ఇప్పించారు.  కేంద్ర ప్రభుత్వ నిధులతో యునాని క్లినికల్ రీసెర్చ్ యూనిట్ స్థాపనకు విశేష కృషి చేశారు. 

 ఆదోని ESI హాస్పిటల్ పునర్నిర్మాణం: శిధిలావస్థలో ఉన్న ఆదోని ESI హాస్పిటల్ భూమి అన్యాక్రాంతం కాకుండా ప్రహరీ గోడ నిర్మాణం చేశారు. కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఆసుపత్రి నిర్వహణ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రతిపాదనలు పంపించగలిగారు.

 రైలు సర్వీసులు :

కర్నూలు - జైపూర్ రైలు : డాక్టర్ సంజీవ్ కుమార్ గారి కృషి వల్ల వారానికి ఒకసారి కర్నూలు నుండి జైపూర్ కు రైలు ప్రయాణం సౌకర్యం.

 కర్నూలు - మచిలీపట్నం రైలు : అనేక విధాలుగా ప్రయత్నించిన ఫలితంగా   కర్నూలు - మచిలీపట్నం  రైలు సేవలు మొదలయ్యాయి. ధోన్ - గుంటూరు డబ్లింగ్ పనుల కారణంగా ఈ రైలుని తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ రైలుని త్వరలో పునఃప్రారంభిస్తారు.

 కర్నూలు రైల్వే స్టేషన్‌కి రెండవ ప్రవేశ ద్వారం: కర్నూలు రైల్వే స్టేషన్ పశ్చిమ గేటు నిర్మాణానికి రూ.43 కోట్లు విలువైన పనులు మంజూరు అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ అధికారులను సమన్వయపరిచి ఈ ప్రాజెక్టును ప్రారంభం చేయించేందుకు డాక్టర్ సంజీవ్ కుమార్ కృషి చేశారు. స్థానిక రాజకీయ నాయకుల ప్రతిఘటనను అధిగమించగలిగారు.

 రైల్వే గూడ్స్ షెడ్డును దూపాడుకు మార్చడం:  కర్నూలు రైల్వే స్టేషన్ ఆవరణలో గూడ్స్ రైల్వే షెడ్డు ఉన్నది. దీని వలన లారీల వంటి భారీ వాహనాల ప్రమాదాలు, ట్రాఫిక్ రద్దీ ఎక్కువైంది. ఈ సమస్య పరిష్కారానికి రైల్వే గూడ్స్‌ షెడ్‌ని దూపాడుకు తరలించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.

 రైల్వే CMLR వర్క్‌షాప్ : పంచలింగాలలో నిర్మాణంలో ఉన్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సామర్థ్యాన్ని పెంచేందుకు కృషి చేశారు.ఈ ప్రాజెక్ట్ సంవత్సరానికి 250 కోచ్‌ల సామర్థ్యంతో, రూ.283 కోట్ల బడ్జెట్‌తో 2014 లో ప్రారంభమైంది. ఇప్పుడు రూ.560 కోట్ల బడ్జెట్‌తో కెపాసిటీని పెంచారు.  తెలంగాణా ప్రభుత్వం ద్వారా రెండు ఎకరాల భూమిని ఇప్పించి ప్రాజెక్ట్ ను త్వరిత గతిన పూర్తి చేయడానికి కృషి చేశారు.

 కర్నూలు నుండి భోపాల్ వరకు ఇజ్తిమా ప్రత్యేక రైలు: ముస్లిం సోదరుల కొరకు ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు.

 బెంగుళూరుకు వందేభారత్ రైలు : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వందే  భారత్ రైలు ప్రాజెక్టులో  ఆ రైలు కర్నూలుకు కూడా వచ్చేవిధంగా కృషి చేశారు.

 కోసిగి రైలు ఆగేవిధంగా చేశారు.

 కర్నూలు - ముంబై రైలు : హైదరాబాదు నుండి ముంబైకి నడుస్తున్న హుస్సేన్ సాగర్ ఎక్స్ ప్రెస్ రైలును కర్నూలు నుండి ముంబై వరకు నడపవలసిందిగా పలుమార్లు ప్రతిపాదనలు సమర్పించారు. దూపాడు రైల్వే పనులు పూర్తి అయిన తరువాత, కర్నూలు ముంబై రైలు నడిపే అవకాశం ఉంది.

 జాతీయ రహదారులు :

ఆదోని బైపాస్ రోడ్ : పలు దఫాలు కేంద్ర ప్రభుత్వ అధికారులను సంప్రదించి, ఆదోని ప్రజల చిరకాల కోరిక అయిన ఆదోని బైపాస్ రోడ్డు సాధించ కలిగారు.

 మంత్రాలయం బైపాస్ రోడ్ : మంత్రాలయం బైపాస్ రోడ్డు కోసం పలు వినతి పత్రాలు సమర్పించి సాధించారు.

 జాతీయ రహదారుల క్రింద వంతెన రహదారులు (RUB): కర్నూలు నగరంలోని ITC జంక్షన్ లో RUB డాక్టర్ సంజీవ్ కుమార్ కృషి వల్ల వచ్చింది. ఆ పని సకాలంలో పూర్తి అయింది.  అలాగే, నన్నూరు సమీపంలో చిన్నటేకూరు దగ్గర ఫుట్ ఓవర్ బ్రిడ్జి (FUT) మంజూరు చేయించారు. కర్నూలులోని వెంకటరమణ కాలనీ సమీపంలోని RUBని త్వరగా పూర్తి చేయించేందుకు కృషి చేశారు.

 కర్నూలు - బళ్ళారి రోడ్డును జాతీయ రహదారిగా మార్చుట: ఇందుకోసం డాక్టర్ సంజీవ్ కుమార్ గారు ఎంపీగా ఎన్నికైన మొదటి రోజు నుండి కృషి చేశారు. ప్రతిపాదనలు కేంద్ర మంత్రికి చేరాయి.అసూయతో ఒక రాజకీయ నాయకుడు ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అయ్యేందుకు ప్రయత్నం చేశాడు. 

 మైనారిటీస్ వెల్ఫేర్ :

MPLADS ద్వారా జరిగిన అభివృద్ధి పనులు : అంబులెన్సు, శ్మశానవాటికల పనులు, కమ్యూనిటీ హాల్స్, కోవిడ్ మహమ్మారి సమయంలో అందించిన వైద్య పరికరాలు, ప్రభుత్వ భవనాలకు ప్రహరీ గోడలు, విద్యాలయాలలో డిజిటల్ పరికరాలు, దివ్యాంగుల కొరకు డిజిటల్ లైబ్రరీ, మురికి కాలువలు, గ్రామాలలో విద్యుత్ పరికరాలు, పోలీసు జీపులు, పోలీస్ ఆఫీసులో గదులు, బోరుబావులు, గ్రామాలలో సిమెంటు రహదారులు, విద్యాలయాలలో తరగతి గదులు, గ్రామాలలో నీటి సరఫరా కొరకు పైపు లైన్లు తదితర పనులను MPLADS నిధులతో చేశారు.

 నియోజకవర్గాలవారీగా జరిగినపనులు :

కర్నూలు నియోజకవర్గంలో రూ.2 కోట్ల 17 లక్షల ఖర్చుతో 19  పనులు జరిగాయి.

కోడుమూరునియోజకవర్గంలో రూ.2 కోట్ల 40 లక్షల ఖర్చుతో 31 గ్రామాలలో 95 పనులు జరిగాయి.

పత్తికొండ నియోజకవర్గంలో రూ.3 కోట్ల 18 లక్షల ఖర్చుతో 44 గ్రామాలలో 108 పనులు జరిగాయి.

ఆలూరు నియోజకవర్గంలో రూ.4 కోట్ల 27 లక్షల ఖర్చుతో 100 గ్రామాలలో 196 పనులు జరిగాయి.

ఎమ్మిగనూరు నియోజకవర్గంలో రూ.కోటి 62 లక్షల ఖర్చుతో 39 గ్రామాలలో 69 పనులు జరిగాయి.

ఆదోని నియోజకవర్గంలో రూ. కోటి  23 లక్షలు ఖర్చుతో 24 గ్రామాలలో 37 పనులు జరిగాయి.

మంత్రాలయం నియోజకవర్గంలో రూ.4 కోట్ల 10 లక్షల ఖర్చుతో 27 గ్రామాలలో 71 పనులు జరిగాయి. 

  

17వ లోక్‌సభ సభ్యుడిగా సభలో డాక్టర్ సంజీవ్ కుమార్

 లోక్ సభలో చర్చలు :

డాక్టర్ సంజీవ్ కుమార్ గారు  లోక్ సభలో 22 చర్చలలో పాల్గొన్నారు. 1952 నుండి 19 సార్లు కర్నూలు లోక్ సభకు ఎన్నికలు నిర్వహించారు. 12 మంది ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతము 17వ లోక్ సభ పని చేస్తున్నది. 18వ లోక్ సభ కొరకు 13.5.24న ఎన్నికలు నిర్వహించనున్నారు.

 ప్రైవేటు మెంబెర్స్ బిల్లులు:

డాక్టర్ సంజీవ్ కుమార్ గారు  12 ప్రైవేట్ మెంబెర్స్ బిల్లుల కోసం దరఖాస్తు చేశారు. అందులో 6 బిల్లులు లోక్‌సభలో ప్రవేశ పెట్టారు. పార్లమెంట్ 72 సంవత్సరాల చరిత్రలో కర్నూలు ఎంపీగా  డాక్టర్ సంజీవ్ కుమార్ రికార్డు ఇది. కర్నూలుకు సంబంధించి లోక్ సభ చరిత్రలో ఇది ఒక రికార్డు. అంటే గతంలో కర్నూలు నుంచి ఎన్నికైన ఎవరూ సభలో ఇన్ని ప్రైవేటు బిల్లులు ప్రవేశపెట్టలేదు.

 1. నేత కార్మికుల సంక్షేమానికి సంబంధించిన జాతీయ కమిషన్ బిల్లు (National Commission for Weavers Welfare Bill 2022 -(108/2022)

2. భారతీయ మెడిసిన్ వ్యవస్థకు సంబంధించిన జాతీయ కమిషన్ బిల్లు ( National Commission for Indian System of Medicine Bill 2022-(109/2022)

3. న్యాయ ప్రమాణాలు, జవాబుదారీ బిల్లు (Judicial Standards and Accountability Bill 2022- (110/2022)

4.భారతీయ వైద్యసేవలకు సంబంధించి రాజ్యాంగ సవరణ బిల్లు (Constitution Amendment Bill for Indian Medical Service (23/2023)

5. దివ్యాంగుల హక్కుల బిల్లు (The Rights of Persons with Disabilities Bill (12/2023)

6. చేనేత కార్మికుల సంక్షేమ అథారిటీ బిల్లు (Handloom Weavers Welfare Authority Bill (58/2023)

  

డాక్టర్ సంజీవ్ కుమార్ లోక్ సభలో లేవనెత్తిన ప్రశ్నలు

  17వ లోక్ సభలో డాక్టర్ సంజీవ్ కుమార్ 225 ప్రశ్నలు లేవనెత్తగలిగారు.

 300 రోజులు మాత్రమే లోక్ సభ నిర్వహణ

సంవత్సరానికి 100 రోజుల చొప్పున 500 రోజులు లోక్ సభ నిర్వహించ వలసి ఉంది. అయితే, కోవిడ్ కారణంగా 300 రోజులు మాత్రమే లోక్ సభ నిర్వహించారు. పూర్తి స్థాయిలో లోక్ సభ నిర్వహణ జరిగి ఉంటే డాక్టర్ సంజీవ్ కుమార్ గారి పని తీరు ఇంకా మెరుగ్గా ఉండేది.

 కర్నూలు ఎంపీగా ఓ రికార్డ్

లోక్ సభలో డాక్టర్ సంజీవ్ కుమార్ గారి పనితీరు గతంలో ఎంపికైన  12 మంది పూర్వ లోక్ సభ సభ్యుల కంటే మెరుగ్గా ఉందన్న ప్రశంసలు అందుకున్నారు. కర్నూలు ఎంపీగా ప్రశ్నలు అడగడంలో, ప్రైవేటు బిల్లులు ప్రవేశపెట్టడంలో, చర్చలలో పాల్గొనడంలో  ఆయన ఓ రికార్డును స్థాపించ గలిగారు. ఒక పద్మశాలి లోక్ సభ సభ్యుడు ఈ స్థాయిలో ప్రశ్నించడం, చర్చలలో పాల్గొనడం,  ప్రశ్నలు లేవనెత్తడం చేనేత వర్గాలకు గర్వకారణంగా ఉంది. ఉన్నత చదువులు చదివిన నిజాయితీపరులు లోక్ సభకు ఎన్నికైతే దేశానికి ఎంత ప్రయోజనకరమో డాక్టర్ సంజీవ్ కుమార్ చేసి చూపించారు.

No comments:

Post a Comment

తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు

 ఈరోజు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుగంటే...గోంగూర తెలుగంటే...గోదారి తెలుగంటే...గొబ్బిళ్ళు తెలుగంటే...గోరింట తెలుగంటే...గు...