Jan 3, 2024

జాతి రత్నం సావిత్రిబాయి పూలే


మూఢవిశ్వాసాలతో ఛాందస మత గ్రంథాల నిర్బంధాల మధ్య స్త్రీ కి విద్య అవసరం లేదంటూ నిర్బంధాలు విధించిన ఛాందసవాదుల ను ఎదిరించి తానే విద్యకు శ్రీకారం చుట్టి భారతదేశ తొలి ఉపాధ్యయునిగా ఎంపికై భారత దేశ వ్యాప్తంగా విద్యను స్త్రీలకు అందించిన భారతదేశ జాతిరత్నం సావిత్రిబాయి పూలే అని ప్రముఖవైద్యులు కే వి ఎస్ సాయి ప్రసాద్ అన్నారు.. ది 3-1- 2024 బుధవారం ఉదయం పాత మంగళగిరి పొట్లాబత్తుని వెంకటేశ్వరరావు కళానిలయంలో మంగళగిరి సాహితీ కళావేదిక ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటైన తొలి భారతీయ ఉపాధ్యాయుని సావిత్రిబాయి పూలే 193 వ జయంతి సందర్భంగా మంగళగిరి సాహితీ కళా వేదిక కన్వీనర్ గుత్తికొండ ధనుంజయరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు . 190 సంవత్సరాలకు పూర్వం ఆనాటి మత దురంకారులతో అనేక అవమానాలు గురైనా.. మొక్కవోని ధైర్యంతో స్త్రీలు ఎందుకు విద్యను అభ్యసించకూడదు అంటూ తానే విద్యను నేర్చుకుని ఉపాధ్యాయురాలుగా స్త్రీ విద్య వ్యాప్తికి శ్రీకారం చుట్టారన్నారు. నేటి స్త్రీ అభ్యున్నతికి సావిత్రిబాయి పూలే ఆదర్శమన్నారు... కానీ నేడు విద్య వింత పొగడలు పోతోందని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంటూ ప్రజలకు విద్యను దూరం చేయాలని కుట్రలు పన్నుతున్నారన్నారు. వాటిని తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఇటువంటి సమయంలో సావిత్రిబాయి పూలే ఆశయాలు స్ఫూర్తినిస్తాయన్నారు.

మంగళగిరి సాహితీ కళావేదిక కో కన్వీనర్ రేఖా కృష్ణార్జున్ రావు మాట్లాడుతూ నాటి దుర్భర పరిస్థితుల్లో సావిత్రిబాయి పోరాటాన్ని వివరిస్తూ వర్తమానంలోనే దుస్థితికి చైతన్య లోపమే కారణం అని దీనిని మనం అధిగమించాలన్నారు.నవ యువ కవి గోలి మధు మాట్లాడుతూ విద్యా ప్రాధాన్యతను గుర్తించి ప్రతి మహిళ విద్యా వంతురాలు కావాలని ఎన్నో అవమానాలను ఎదుర్కొన్న ఆమె చేసిన, నేడు బ్రష్టు పట్టిన కార్పొరేట్ విధానానికి వ్యత్యాసాన్ని గుర్తించి ఈ పరిస్థితులు మారాలన్నారు. బుద్ధభూమి మాస పత్రిక వర్కింగ్ ఎడిటర్ గోలి సీతారామయ్య ప్రసంగిస్తూ సావిత్రిబాయిపూలే సేవలను తెలుగు రాష్ట్రాల్లో వ్యాప్తి చేసిన వారి కృషి గొప్పదని అన్నారు.కార్యక్రమంలో ముందుగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి డాక్టర్ సాయి ప్రసాద్ , ప్రముఖులు పూలమాలవేసి  ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శిరందాసు నాగార్జున, అవ్వారు శ్రీనివాసరావు,సందుపట్ల భూపతి, ఆకురాతి రత్నరావు, మహమ్మద్ యూసఫ్, జొన్నాదుల నాగమల్లేశ్వరరావు, చిలక వెంకటేశ్వరరావు, కంచర్ల క్రాంతి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...