Jan 2, 2020

సైబరాబాద్ – అమరావతి



v         ఆ నాడు హైదరాబాద్ కు   హైటెక్ టవర్ నిర్మాణం, మైండ్ స్పేస్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలను చంద్రబాబు నాయుడు గారు రప్పించడం వల్ల  సైబరాబాద్ నగర నిర్మాణం జరిగింది.
v         సాఫ్ట్ వేర్ రంగం అభివృద్ధి అభివృద్ధి చెందింది. ఆ నాడు  ప్రభుత్వం రూ.2 వేల కోట్లు ఖర్చు చేస్తే ఈ నాడు అక్కడ నుంచి రూ.1.3 లక్షల ఆదాయం వస్తుంది. 13 లక్షల మందికి ఉపాధి లభిస్తోంది. ఏడాదికి రూ.లక్ష కోట్లకు పైగా ఐటీ ఎగుమతులు జరుగుతున్నాయి.
v         అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణం, హైదరాబాద్‌లో ఫ్లై ఓవర్ల నిర్మాణం, 5వేల ఎకరాలలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం జరగడంతో ఆదాయం బాగా పెరిగిపోయింది.
v         తెలంగాణ బడ్జెట్‌లో 60 శాతం ఆదాయం అక్కడ నుంచే వస్తోంది.
v         హైదరాబాద్ ఆదాయంతోనే తెలంగాణ జిల్లాల అభివృద్ధి జరగడం మనం చూస్తూనే ఉన్నాం. వికేంద్రీకరణ పేరుతో వైసీపీ వికేంద్రీకరణకు నిధులు లేకుండా చేస్తోంది.
v         మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతి నిర్మాణం, సింగపూర్ అంకుర పరిశ్రమల ప్రాజెక్ట్ నిర్మాణం జరిగితే 2.5 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి, 10 లక్షల మందికి పరోక్ష ఉపాధి లభించేది.
v         9 ప్రత్యేక నగరాల నిర్మాణం జరిగితే ఏపీ బడ్జెట్‌కి 60 శాతం ఆదాయం అమరావతి నుంచి వచ్చి ఉండేది. 
v         సింగపూర్ అంకుర పరిశ్రమల ఒప్పందం రద్దుతో పెట్టుబడులు వెనక్కు వెళుతున్నాయి.
v         అవుటర్, ఇన్నర్ రింగ్ రోడ్ల పనుల నిలిపివేత కూడా అభివృద్ధికి విఘాతంగా మారింది.
v         సింగపూర్ 50 ఏళ్లకు పూర్వమే 12 వరుసల రోడ్ల  నిర్మాణం చేసింది.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...