v రాజధాని
నిర్మాణానికి టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భూసమీకరణ పథకం (ల్యాండ్ పూలింగ్
స్కీం- ఎల్పీఎస్) ఉత్తమమైనదని ఏపీసీఆర్డీయే కమిషనర్ డాక్టర్ పి.లక్ష్మీ నరసింహం
పేర్కొన్నారు.
v డిసెంబర్ 3, 2019న న్యూఢిల్లీలో స్వచ్ఛంద సంస్థ ‘తెరి’ (ది ఎనర్జీ అండ్ రీసోర్సెస్ ఇన్స్టిట్యూట్) ఆధ్వర్యంలో భూసమీకరణపై
నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు.
v అమరావతి
కోసం భూములను పూలింగ్ ప్రాతిపదికన ఇవ్వాలంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు
కోరినంతనే రాజధానిలోని 29 గ్రామాలకు చెందిన వేలాది మంది రైతులు సుమారు 34,000 ఎకరాలను అందించడం చారిత్రాత్మకం.
v ఇంతటి
భారీ ప్రక్రియ, అదీ పూర్తి శాంతియుతంగా జరగడం దేశంలోనే కాదు బహుశా
ప్రపంచంలోనే మరెక్కడా జరిగి ఉండకపోవచ్చు.
v రాజధాని
గ్రామాల్లోని రైతుల కోసం అమలు పరిచిన ఎల్పీఎస్ ప్యాకేజీ వివరాలతోపాటు నిరుపేదలు, ఇతర వర్గాలకు వర్తింపజేసిన సంక్షేమ పథకాలు, భూములిచ్చిన
రైతులకు బదులుగా కేటాయించిన రిటర్నబుల్ ప్లాట్లను ఎటువంటి ఆరోపణలకు ఆస్కారమివ్వని
రీతిలో ఆన్లైన్ లాటరీ ద్వారా కేటాయించారు.
v దేశంలోని
కొన్ని చోట్ల ఎల్పీఎస్ అమలు చేసే క్రమంలో తలెత్తిన అవాంఛనీయ సంఘటనలు, ప్రతికూలత వంటివేమీ అమరావతిలో జరగలేదు. ఈ పథకం ఇక్కడ విజయవంతమైంది.
అన్ని వర్గాల వారిని సంతృప్తి పరచింది.
No comments:
Post a Comment