Jan 14, 2020

ఏపీలో పోలీసుల అరాచకాలపై రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కేంద్ర హోం మంత్రికి లేఖ



v రాజధాని అమరావతిలోనే కొనసాగాలని ఇచ్చాపురం నుంచి తడ వరకు శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నవారిని అక్రమంగా అరెస్ట్ చేస్తూ ఉద్యమాన్ని అణచివేయాలని ప్రభుత్వం కుట్ర చేస్తోంది.
v రాజధాని గ్రామాల్లో నిరసన తెలిపేందుకు టెంట్లు వేసుకోవడానికి కూడా పోలీసులు అనుమతించడంలేదు.
v అర్దరాత్రుల్లో ఇళ్లలోకి చొరబడి సంక్రాంతికి వచ్చిన బంధువుల వివరాలు చెప్పాలని సోదాలు చేస్తూ భయానక వాతావరణం సృష్టించి మహిళలను ఇబ్బంది పెడుతున్నారు.
v భూములు ఇచ్చిన రైతులు పట్ల పోలీసులు క్రూరంగా ప్రవర్తిస్తున్నారు.
v అధికార పార్టీ వారి ప్రదర్శనలకు అనుమతి ఇస్తూ, అమరావతి పరిరక్షణ సమితి వారికి  శాంతియుత ప్రదర్శనలకు అనుమతి ఇవ్వడంలేదు.
v మొక్కులు తీర్చుకోవడానికి అమ్మవారి గుడికి వెళ్లే మహిళలను కూడా అడ్డుకొని పోలీసులు చితకబాదారు.
v మహిళలను, పిల్లలకు కూడా ఈడ్చుకువెళ్లి పోలీస్ వ్యాను ఎక్కించారు.
v మహిళలను బూటు కాళ్లతో అమానుషంగా తన్నారు.
v శాంతియుతంగా నిరసన తెలిపే మహిళలను మగ పోలీసులు అరెస్ట్ చేశారు.
v మహిళలను రాత్రి 8 గంటల వరకు పోలీస్ స్టేషన్లలో అక్రమంగా నిర్బంధించారు.
v ప్రభుత్వం పోలీసుల ద్వారా రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టించింది.
v రాజధాని తరలిపోతుందన్న మనస్తాపంతో 15 మంది గుండె ఆగి మరణించారు.
v షాపింగ్ కు వెళ్లిన మహిళలను కూడా పోలీస్ వ్యాన్ ఎక్కించారు.
v రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసు చట్టం సెక్షన్ 144, సెక్షన్ 30 లను ప్రయోగిస్తున్నారు.
-------------------------------------------------------------------------------------------------------------------------

తేది : 14.01.2020

To, 
గౌరవనీయ హోంమంత్రి మంత్రి,
భారత ప్రభుత్వం,
నార్త్ బ్లాక్, న్యూ ఢిల్లీ-110 001
 
From,
అనగని సత్య ప్రసాద్,
శాసనసభ సభ్యుడు,
రేపల్లె నియోజకవర్గం,
ఆంధ్రప్రదేశ్.

విషయం: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి - అక్రమ నిర్బంధాలు - కేసులు - మహిళలపై శారీరక వేధింపులు - సెక్షన్లు 144 30 - పొలిటికల్ వెండెట్టా.
ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతి సమస్యపై శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు, ప్రజలు, ముఖ్యంగా మహిళల పట్ల అమానుషంగా, అసభ్యకరంగా ప్రవర్తిస్తూ బీభత్సం, భయానక వాతావరణం సృష్టిస్తూ, చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడుతున్నా పోలీసు సిబ్బంది అమానవీయ ప్రవర్తనను నేను మీ దృష్టికి తీసుకువస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మానవ హక్కుల పరిరక్షణ విషయంలో మీరు జోక్యం చేసుకోవాలని మిమల్ని ప్రార్ధిస్తున్నాను. ఇక్కడి గ్రామాలలోని పరిస్థితులను తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జనవరి 13, 2020న ‘‘గ్రామాల్లో 200 మంది పోలీసులతో కవాతు చేయిస్తారా? ఆ గ్రామాల్లో ఏమైనా కర్ఫ్యూ విధించారా? ప్రశాంతంగా నిరసన తెలియజేస్తుంటే పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారు? మహిళల్ని మగ పోలీసులు అరెస్టు చేస్తారా? చట్ట నిబంధనలు ఇలా చేయమని చెబుతున్నాయా? ఇదంతా ప్రభుత్వానికి ఓ నవ్వులాటలా ఉన్నట్లుంది. మనం ప్రజాస్వామ్యదేశంలో ఉన్నామనేది మరిచిపోయారా? పౌరులకు నిరసన తెలిపే హక్కు ఉందన్న విషయం గుర్తుందా?’’ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

            రాజధానిని మూడు భాగాలుగా విభజించాలన్న ఆంధ్రపప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రాజధాని అమరావతి ప్రాంతంలోని వ్యవసాయ కుటుంబాలు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నాయి. రాజధాని నిర్మాణానికి 29 వేల మంది రైతులు 34వేల ఎకరాల  వ్యవసాయ భూములను ల్యాండ్ పూలింగ్ కు ఇచ్చిన ఇప్పుడు పోలీసు క్రూరత్వాన్ని ఎదుర్కొంటున్నారు. శాంతియుత ప్రదర్శనలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీనికి విరుద్ధంగా రాజధాని మార్చాలనే ప్రభుత్వ నిర్ణయానికి మద్దతుగా కర్నూలు, విశాఖపట్నం, అనంతపురం, రాజమండ్రిలలో కౌంటర్ ఊరేగింపులు తీసుకోవడానికి అధికార పార్టీ మంత్రులు, నాయకులకు పోలీసులు అనుమతి ఇచ్చారు. అదే రోజున రాజమండ్రిలో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడి ప్రజా ర్యాలీకి వ్యతిరేకంగా పోలీసులు అధికార పక్షానికి కూడా అనుమతులిచ్చి ఉద్రిక్తతలకు పురికొల్పారు.
            ఈ సమస్య నేపథ్యాన్ని మే 2019లో అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఆకస్మికంగా, అహేతుకంగా తీసుకున్న నిర్ణయం నుండి తెలుసుకోవచ్చు. AP రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ప్రత్యామ్నాయాలను అధ్యయనం చేయడానికి భారత ప్రభుత్వం 2015 మార్చి 28న పట్టణాభివృద్ధి మాజీ కార్యదర్శి శ్రీ కె.సి.శివరామకృష్ణన్ అధ్యక్షతన నిపుణుల కమిటీని నియమించింది. సాధ్యమయ్యే అన్ని ఎంపికలను పరిగణనలోకి తీసుకుని, ఆంధ్రప్రదేశ్ శాసనసభ 04.09 2014న అమరావతిని కొత్త రాజధానిగా ఎంపిక చేస్తూ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. 22.10.2015న ప్రధాని నరేంద్ర మోడీ పునాది రాయి వేశారు. ఏకగ్రీవ అసెంబ్లీ తీర్మానాన్ని పరిగణనలోకి తీసుకొని, కేంద్ర ప్రభుత్వం, ప్రధాని ఇచ్చిన హామీల నేపధ్యంలో ల్యాండ్ పూలింగ్ పథకం కింద రైతులు 34,000 ఎకరాల భూమిని స్వచ్ఛందంగా అందించారు. సిఆర్‌డిఎ యాక్ట్ కింద అవసరమైన ఒప్పందాలు జరిగాయి.
            అమరావతిలో వివిధ నిర్మాణాలకు భారత ప్రభుత్వం నిధులు సమకూర్చింది. గౌరవ భారత రాష్ట్రపతి గెజిట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఇక్కడే ఏర్పాటు చేశారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ లో కూడా అమరావతిని ఎపి రాజధానిగా చేర్చింది. ఇప్పటి వరకు ఇక్కడ అభివృద్ధి కార్యకలాపాలకు పది వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారు.  శాసనసభ, శాసనమండలి, సచివాలయం, హైకోర్టు మొదలైనవి అమరావతి నుండి సజావుగా పనిచేస్తున్నాయి. ఎటువంటి వివాదాలు లేకుండా అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారు. కానీ అకస్మాత్తుగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మంత్రులు రాజధాని నగరాన్ని విభజించే ప్రకటనలు చేస్తున్నారు. రాజకీయ ప్రాతిపదికన, అమరావతి నుండి విశాఖపట్నంకు రాజధానిని మార్చాలని ప్రభుత్వం తమ నిర్ణయాన్ని ప్రకటించడంతో గత 28 రోజులుగా రాజధాని ప్రాంత గ్రామాల్లో రైతులు, మహిళల ఆందోళనకు దారితీసింది. ల్యాండ్ పూలింగ్ పథకం కింద 34వేల  ఎకరాల పంట భూమిని ఇచ్చిన తరువాత రాజధానిని మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాజధాని 29 గ్రామాల్లో ప్రజలపై పోలీసుల దారుణంగా వ్యవహరిస్తున్న తీరు మొత్తం రాష్ట్రంలోని సామాన్య ప్రజలను భయాందోళనలకు గురిచేస్తుంది. శాంతియుత నిరసన తెలుపుకునేందుకు రోడ్డు పక్కన గుడారాలు వేయడానికి అనుమతించకుండా ఎర్రటెండలో కూర్చునే పరిస్థితులు కల్పస్తూ మహిళలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అర్ధరాత్రి ఇళ్లలోకి వెళ్లి సోదాలు చేస్తున్నారు. కారణం చెప్పకుండా అరెస్టులు చేస్తున్నారు. పెద్ద ఎత్తున పోలీసు కవాతులు నిర్వహిస్తూ భయభ్రాంతులు సృష్టిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి న్యాయం కోరుతూ నినాదాలు చేసినందుకు వారిపై శారీరకంగా లారీలతో దాడి చేస్తూ వ్యాన్లలోకి ఎక్కించి అక్రమనిర్భందాలు చేస్తున్నారు. ఈ గ్రామాల్లో పోలీసుల బీభత్సం కారణంగా ఇద్దరు మహిళలతో సహా 15 మంది రైతులు, రైతు కూలీలు మనస్తాపానికి గురై గుండె ఆగి ప్రాణాలు కోల్పోయారు. ఈ గ్రామాల మహిళలు పవిత్ర దేవత దుర్గమ్మను ప్రార్థించడానికి దేవాలయానికి వెళుతున్నా అడ్డంకులు సృష్టిస్తూ కొడుతున్నారు. సోషల్ మీడియాలో ఈ మహిళలపై, వారి దుస్తులు, ఉపకరణాలపై ఘోరమైన అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారు.
            గత కొన్ని రోజులుగా ఈ గ్రామాల్లోని సమీప పరిసరాల్లో జరుగుతున్న సంఘటనలు, మహిళల దుస్థితి ఎంతో దయనీయంగా, బాధాకరంగా ఉంది. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, సామాజిక సమూహాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న గొడుగు సంస్థ అమరావతి పరిరక్షణ సమితి- శాంతియుత ర్యాలీలు నిర్వహించడానికి పోలీసుల అనుమతి కోరింది. పొరుగున ఉన్న గుంటూరులో, వైద్యులు, న్యాయవాదులు, గృహిణులు, విద్యార్థినులతో కూడిన 5000 మంది మహిళలు ఎంతో శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. శాంతియుతంగా ర్యాలీలు నిర్వహిస్తున్నప్పటికీ చాలా ఆశ్చర్యకరంగా పోలీసులు వారిపైకి దూసుకెళ్లి, అమానుషంగా ఈడ్చుకువచ్చి లారీలు, వ్యాన్లలోకి ఎక్కించి అక్రమ నిర్బంధాలు చేస్తున్నారు. ఈ చట్టవిరుద్ధమైన అరెస్టులను ప్రశ్నించినప్పుడు, మహిళలను అసభ్యపదజాలంతో బూతులు తిడుతూ బెదిరిస్తున్నురు.
సమావేశమైన మహిళలను పోలీసులు బలవంతంగా ఎత్తివేసి, తరలించి, వాహనాల్లోకి విసిరివేయడం చాలా సిగ్గుచేటు. మహిళల చేతుల్లో ఉన్న పిల్లలను కూడా విడిచిపెట్టడం. షాపింగ్ కోసం ఆ ప్రాంతానికి వచ్చిన వారిని, అటుగా వెళుతున్న చాలా మందిని కూడా అదుపులోకి తీసుకుంటున్నారు. అనేక చోట్ల దుకాణం లోపల మహిళలను ఉంచి షాపులకు తాళాలు వేశారు. దాదాపు 1500 మంది మహిళలను అదుపులోకి తీసుకొని వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు.
            పురుషులు, మహిళలకు పశువుల మాదిరిగా పడవేసి త్రాగేందుకు నీళ్లు కూడా ఇవ్వలేదు. వారికి మరుగుదొడ్లు అందుబాటులో లేవు. మహిళలను మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు, కొన్ని ప్రదేశాలలో రాత్రి 9 గంటల వరకు అదుపులోకి తీసుకున్నారు. సూర్యాస్తమయం తరువాత నిర్బంధించడం చట్టవిరుద్ధం అని వారు విజ్ఞప్తి చేసినా వినిపించుకోవడం లేదు. ఆలస్యంగా మహిళలను విడుదల చేయడమే కాకుండా చట్టవిరుద్ధంగా మహిళల కుల వివరాలను అడుగుతున్నారు. నగరం మధ్యలో, పరేడ్ మైదానంలో, స్థానిక ఎంపి,  ఇతర నాయకులు సూర్యాస్తమయం దాటినందున మహిళలను విడుదల చేయాలని కోరుతూ ప్రధాన రహదారిపై ధర్నా చేయవలసి  వచ్చింది. పోలీసులు లాఠీచార్జ్ చేస్తూ ప్రతినిధులను అదుపులోకి తీసుకున్నారు. 
            మొత్తం ఎపిసోడ్ అధికారమదంతో చట్టాన్ని ఉల్లంఘింస్తూ ప్రాథమిక హక్కులను ఉల్లంఘన చేస్తూ పోలీసు సిబ్బంది అధికారాన్ని దుర్వినియోగం పాల్పడుతున్నారు. సరళమైన భాషలో చెప్పాలంటే ఇక్కడ పోలీసు రాజ్యం నడుస్తోంది. పోలీసులు తమ రాజకీయ యజమానులను ప్రసన్నం చేసుకోవడానికి వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఇటువంటి కఠినమైన చట్టాలు, చర్యలను రాష్ట్రం ఎన్నడూ చూడలేదు. పోలీసు వ్యవస్థ చట్టపరమైన నిబంధనలను పూర్తిగా విస్మరించింది. అంతేకాకుండా అధికార పార్టీ మంత్రులకు రాష్ట్రంలోని వివిధ నగరాల్లో ఊరేగింపులు చేయడానికి అనుమతిస్తూ రాజకీయ ప్రత్యర్ధుపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. కానీ ప్రజాస్వామ్యబద్ధంగా నోటికి రిబ్బన్‌ కట్టుకుని శాంతియుతంగా నిశ్శబ్ద ప్రదర్శనల ద్వారా తమ బాధను వ్యక్తం చేయడానికి నిరసన తెలిపే ప్రజలుకు మాత్రం అనుమతులు నిరాకరిస్తున్నారు.
            సాధారణ ప్రజలు, మహిళల ప్రజాస్వామ్య, రాజ్యాంగబద్ధ హక్కులు ప్రమాదంలో ఉన్నాయి. చాలా జిల్లాలలో పోలీసు చట్టం సెక్షన్ 144, సెక్షన్ 30 లను రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఎటువంటి సమర్థనీయమైన కారణాన్ని పేర్కొనకుండా ఉపయోగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు శాఖ మానవ హక్కుల ఉల్లంఘనపై నిష్పాక్షిక విచారణను జరిపాలని కోరుకుంటూ రాష్ట్రంలో చట్ట నియమాలను పునరుద్ధరించడానికి పరిష్కార చర్యలు తీసుకోవాలని నా మనవి.
                                                                         
                                                                                     మీ భవదీయుడు
 
                                                                                     (అనగాని సత్య ప్రసాద్)

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...