v 2014 జులై 20న నాటి పురపాలక
శాఖ మంత్రి పి.నారాయణ ఆధ్వక్షతన 9 మంది
సభ్యులతో కమిటీ ఏర్పాటైంది. రాజధాని
నిర్మాణం,
డిజైన్ అంశాలకు సంబంధించి
సలహాలు ఇవ్వడానికి ఈ కమిటీని
నియమించారు.
v రాజధాని నగరంలో ప్రజలు సౌకర్యవంతంగా జీవించే పర్యావరణ
వ్యవస్థ,
భూమి, నీరు వంటి సహజ
వనరులు సమర్థవంతంగా వినియోగించడం, అన్ని విధాల నగరం
అభివృద్ధి, నగర ప్రణాళిక విధానాలు, రవాణా కారిడార్లు, కొత్త రాజధానిలో సమర్థవంతమైన నిర్వహణా వ్యవస్థలు, కేంద్ర నిధులతోపాటు ఇతర మార్గాలలో నిధుల సేకరణ వంటి అంశాలలో
సలహాలు ఇవ్వడానికి మాత్రమే ఈ కమిటీని నియమించారు.
v ఈ కమిటీ రాజధాని స్థల ఎంపిక కోసం ఏర్పాటు చేసినది కాదు.
ల్యాండ్ పూలింగ్, మౌలిక వసతుల అభివృద్ధి కోసం వేశారు. వివరాలకు జీఓ నెం.133.
(తేది.20.07.2014)ని పరిశీలించవచ్చు.
v ఈ కమిటీ దేశంలోని చంఢీగడ్, నయా రాయపూర్, నవీ ముంబయితో సహా
పుత్రజయ,
ఆస్టిన్, దుబాయి, సింగపూర్ తదితర ప్రాంతాలలో పర్యటించి అక్కడి రాజధాని
ప్రాంతాలను అధ్యయం చేసింది.
No comments:
Post a Comment