Jan 17, 2020

రాజధాని నేలలకు పటుత్వం ఎక్కువ



§  ఐఐటి మద్రాస్ సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్ మెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సుభదీప్ బెనర్జీ ఎల్ అండ్ టీ కన్ స్ట్రక్షన్ బిల్డింగ్స్ అండ్ ఫ్యాక్టరీస్ వారి ద్వారా ఇచ్చిన నివేదిక ప్రకారం అమరావతిలో హెచ్ఓడి 3వ టవర్‌కు  ఫౌండేషన్ లోతు 10.9 మీటర్లు, 4వ టవర్ కు 10.6 మీటర్లు సరిపోతుంది.
§  అమరావతిలో నేలకి పటుత్వం ఎక్కువ - ఇది చాలా మంచి నేల - బలం వున్న నేల అని నిపుణులు తేల్చారు.
§  అమరావతి ప్రాంతంలో రాకీ స్టార్టా ఎట్‌ 11 మీటర్లలో మొదలవుతుంది. సాయిల్ బేరింగ్ కెపాసిటీ చ.మీ.కు 150 మెట్రిక్‌ టన్నులు ఉంది.
§  చెన్నై నగరంలో బేరింగ్‌ కెపాసిటీ గరిష్టంగా చ.మీ.కు 10 మెట్రిక్‌ టన్నులే. ఫైల్‌ ఫౌండేషన్‌ 30 నుంచి 40 మీటర్ల లోతు నుంచి వేయాలి.
§  హైదరాబాద్‌లో రాతి నేలల  కారణంగా బ్లాస్టింగ్‌ చేయాలి - బేస్‌మెంట్‌ 7.1 మీటర్లు, ఫైల్ ఫౌండేషన్ 4.5 మీటర్లు మొత్తం 11.6 మీటర్లు.  బ్లాస్టింగ్ కు, రాళ్లు తొలగించడానికి అధిక వ్యయం అవుతుంది.
§  అందుకే అమరావతిలో రాఫ్ట్‌ ఫౌండేషన్‌కు ప్రాధాన్యం. అత్యంత ప్రాముఖ్యత కలిగిన సెక్రటేరియట్‌, హెచ్ఓడీ 5 టవర్లను రాఫ్ట్‌ ఫౌండేషన్‌తో నిర్మించాం. మన సెక్రటేరియట్‌ వద్ద బేరింగ్‌ కెపాసిటీ చ.మీ.150 మెట్రిక్‌  టన్నులు ఉంటుంది.
§  అమరావతిలో ఫౌండేషన్ ఖర్చులు హైదరాబాద్, చెన్నై కన్నా ఎక్కువ కాదని  ఇంజనీరింగ్ నిపుణులు నిర్ధారించారు.

నోట్: అమరావతిలో వరద ముంపుపై మేం ఎటువంటి నివేదిక ఇవ్వలేదని ఐఐటి మద్రాస్ కు చెందిన  డాక్టర్ రవీంద్ర గెట్టు, డీన్, ఇండస్ట్రియల్ కన్సల్టెన్సీ అండ్ స్పోన్సర్డ్ రిసెర్చ్, ప్రొఫెసర్ వి.ఎస్.రాజు, చైర్ ప్రెఫెసర్ ,డిపార్ట్ మెంట్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్, ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్  వారు జనవరి 13,14, 2020 తేదీలలో తెలిపారు. ఈ అంశంపై మేం హిందూ దినపత్రికకు ఎటువంటి సమాచార ఇవ్వలేదని తెలిపారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...