Jan 16, 2020

అమరావతికి వరద ముప్పులేదు



v  జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ) ఛైర్ పర్సన్ జస్టిస్ స్వతంత్ర కుమార్ నేతృత్వంలోని బెంచ్ నవంబర్ 17, 2017న  తీర్పు
v రాజధాని నిర్మాణానికి రాష్ట్ర పర్యావరణ ప్రభావ అధ్యయన అథారిటీ ఇచ్చిన అనుమతుల్లో ఎటువంటి లోపంలేదు.
v ఆ ప్రాంతం గత 106 ఏళ్లుగా ఎలాంటి వరద తాకిడికీ గురికాలేదు.
v అసాధారణ వరదల సమయంలో కూడా అక్కడ నది గట్టు దాటి ప్రవహించలేదు.
v ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా రాజధాని ప్రాజెక్ట్ ఉంది.
v రాజధాని ప్రాంతం రాష్ట్రానికి మధ్యలో ఉండటం వల్ల ఇతర ప్రాంతాలకు సులభంగా అనుసంధానమై ఉంది.
v ఇప్పటికే పలు సౌకర్యాలు ఉన్నందున రాష్ట్రంపై అదనపు భారం పడదు.
v రాజధాని నగర నిర్మాణ ప్రదేశంపై నిర్ణయం తీసుకునే ప్రత్యేక అధికారం రాష్ట్రప్రభుత్వానికి ఉందని శివరామకృష్ణన్ కమిటీ పేర్కొంది.
v రాజధానిపై 4,728 స్పందనలు అందగా విజయవాడ-గుంటూరు ప్రాంతానికి అత్యధిక ప్రజలు ఓటు వేశారు.
v ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం (సెక్షన్ 5 ప్రకారం) అమల్లోకి వచ్చిన పదేళ్ల తరువాత హైదరాబాద్ కేవలం తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే రాజధాని అవుతుంది. ఏపీకి రాజధాని నగర నిర్మాణం చేయవలసిన అవసరం ఉంది.
v అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని రాష్ట్ర పర్యావరణ ప్రభావ అధ్యయన అథారిటీ రాజధానిగా అమరావతి నగర నిర్మాణానికి పర్యావరణ అనుమతులు ఇచ్చింది.
v ప్రవేటు, వాణిజ్య ప్రయాజనాల కోసం ప్రజావనరులను మళ్లించలేదు.
v వరద ప్రాంతాలు, మైదానాల హద్దుల్ని నిర్ణయించేందుకు రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక ప్రకారం కృష్ణా నది గట్టుల్ని దాటి నీరు ప్రవహించిన సందర్భాలు లేవు. నది గట్టులు దాటి ఉన్న ప్రాంతాన్ని వరద మైదానంగా పేర్కొనడానికి వీలులేదు.
v 1853, 2009లో కృష్ణా నదికి వచ్చిన అసాధారణ వరదలను పరిగణనలోకి తీసుకున్నా వరద ప్రభావిత ప్రాంతంలో రాజధాని నగర నిర్మాణం చేయబోతున్నట్లు పిటిషనర్లు రుజువు చేయలేకపోయారు.
v పర్యావరణ ప్రభావ అధ్యయన నివేదిక సైతం రాజధాని నగరం వరద మైదాన ప్రాంతంలోకి వస్తుందని పేర్కొనలేదు.
v వరద ప్రాంత పరిధిలోకి రాజధాని విస్తరించి ఉందన్న పిటిషనర్ల అభ్యర్థలను తిరస్కరిస్తున్నాం.
v రాజధాని ప్రాంతం గత 106 ఏళ్లుగా ఎలాంటి వరద తాకిడికి గురికాలేదని అధికారులు స్పష్టం చేశారు.
v కొండవీటి వాగు ఆక్రమణలకు గురికావడం వల్ల కుంచించుకుపోయింది. వాగుని అభివృద్ధి చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ వాగు రాజధాని నిర్మాణాలకు అడ్డంకి అని చెప్పలేం.
v రాజధానికి సంబంధించి ప్రభుత్వం ప్రతి దశలో ప్రజాప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంది. ప్రజల అభిప్రాయాలు సేకరించి, వారితో సంప్రదించి, వారి అభ్యంతరాలు స్వీకరించి మాస్టర్ ప్లాన్ రూపొందించి నోటిఫై చేసింది.
v పలు అంశాలకు కట్టుబడి ఉంటామని ప్రభుత్వం స్పష్టంచేసిన తరువాతే 90 షరతులు విధించి ఎస్ఈఐఏఏ(స్టేట్ ఎన్విరాన్మెంటల్ ఇంప్యాక్ట్ అసెస్ మెంట్ అథారిటీ) పర్యావరణ అనుమతులు ఇచ్చింది.
v పర్యావరణాన్ని కాపాడటం, రాజధాని నగరం అభివృద్ధి మధ్య రాష్ట్రప్రభుత్వం సమతౌల్యం సాధించాలి.
v రాజధాని ప్రాంతంలో 251 ఎకరాల అటవీ భూములు ఉన్నాయి. వాటిని రాజధాని నగరానికి ప్రాణవాయువు ఇచ్చేవిగా అలాగే ఉంచాలి.
-----------------------------------

పేజీలు 49, 50లలో 77వ పేరా: రాజధాని ప్రాంతంలో గట్లు ఉన్న కారణంగా కృష్ణా నది నుంచి ఎలాంటి వరద ప్రమాదం లేకపోవడం వల్ల ఈ ప్రాంతాన్ని వరద ముంపు ప్రాంతంగా పేర్కొనలేం. తరచూ వరదలకు గురయ్యే ప్రాంతాలను వరద ముంపు ప్రాంతాలుగా పేర్కొనవచ్చు. అయితే ప్రతిపాదిత రాజధానికి కృష్ణా నది నుంచి ఎలాంటి వరద ముప్పు లేకపోవడం చేత, ఈ ప్రాంతాన్ని వరద ముంపు ప్రాంతంగా పరిగణించడానికి వీల్లేదు.
పేజీ 49లో 79వ పేరా: ఈ ప్రాంతంలో జరిగే నిర్మాణ కార్యకలాపాలు ఇక్కడి భూ జలస్వరూపం మీద ఎలాంటి దుష్ప్రభావమూ చూపవని చెప్పవచ్చు.
పేజీ 53లో 80వ పేరా: 2009 వరదలు రాజధాని నగరంలో ఎలాంటి పరిమితినీ దాటలేదని ట్రైబ్యునల్ నియమించిన నిపుణుల కమిటీ తేల్చింది. నదికి అడ్డుకట్టలు, గట్లను దాటి ఉన్న ప్రాంతాన్ని వరద ముంపు ప్రాంతంగా పరిగణించలేము.
పేజీ 53లో 81వ పేరా:  1853, 2009లో వచ్చిన అసాధారణ  వరదల సందర్భంగా కూడా ప్రతిపాదిత రాజధాని ప్రాంతం వరద ముంపునకు గురికాలేదని తెలుస్తోంది. ఈఐఏ నివేదిక ఆధారంగా, ఇతర సుదీర్ఘ వివరణ ఆధారంగా రాజధాని ప్రాంతాన్ని వరద ముంపు ప్రాంతంగా పరిగణించలేం.

పేజీ 57లో 82వ పేరా: 1853లో వచ్చిన వరదలను చరిత్రాత్మకంగా భావిస్తుంటారు. ఆ వరదలు కూడా ప్రస్తుత రాజధాని ప్రాంతంమీద ఎలాంటి ప్రభావమూ చూపలేదు.
పేజీ 68లో 96వ పేరా: శివరామకృష్ణన్ కమిటీ రాజధాని ఎక్కడ ఉండాలో నిర్ధిష్టమైన సిఫార్సు ఏమీ చేయలేదు(పేజీ5). జిల్లా, రాజధాని మండలానికి తగిన సూచీని అనుసరించి ‘‘రాజధాని కావడానికి అనువుగా ఉన్న ప్రాంతాలను’’ మాత్రమే సూచించింది. అందులో విజయవాడ-గుంటూరు ప్రాంతం అత్యంత అనువైదిగా అవతరించింది.
పేజీ 70లో 100వ పేరా: భూ సమీకరణ పథకంలో ఏక పక్షంగా గానీ, రైతుల ప్రయోజనాలకు భంగం కలిగించే అంశాలు కాని లేవని నిర్ధారణకు వచ్చాం. రైతులు స్వచ్ఛందంగా భూములు అప్పగించడానికి ముందుకు వచ్చారు. భూ సమీకరణ పథకం రైతులకు మేలే చేస్తుందని రుజువు అవుతోంది.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...