v జాతీయ హరిత
ట్రైబ్యునల్(ఎన్జీటీ) ఛైర్ పర్సన్ జస్టిస్ స్వతంత్ర కుమార్ నేతృత్వంలోని బెంచ్ నవంబర్
17, 2017న తీర్పు
v
రాజధాని నిర్మాణానికి రాష్ట్ర
పర్యావరణ ప్రభావ అధ్యయన అథారిటీ ఇచ్చిన అనుమతుల్లో ఎటువంటి లోపంలేదు.
v
ఆ ప్రాంతం గత 106 ఏళ్లుగా ఎలాంటి
వరద తాకిడికీ గురికాలేదు.
v
అసాధారణ వరదల సమయంలో కూడా అక్కడ నది
గట్టు దాటి ప్రవహించలేదు.
v
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు,
ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా రాజధాని ప్రాజెక్ట్ ఉంది.
v
రాజధాని ప్రాంతం రాష్ట్రానికి
మధ్యలో ఉండటం వల్ల ఇతర ప్రాంతాలకు సులభంగా అనుసంధానమై ఉంది.
v
ఇప్పటికే పలు సౌకర్యాలు ఉన్నందున
రాష్ట్రంపై అదనపు భారం పడదు.
v
రాజధాని నగర నిర్మాణ ప్రదేశంపై
నిర్ణయం తీసుకునే ప్రత్యేక అధికారం రాష్ట్రప్రభుత్వానికి ఉందని శివరామకృష్ణన్
కమిటీ పేర్కొంది.
v
రాజధానిపై 4,728 స్పందనలు అందగా
విజయవాడ-గుంటూరు ప్రాంతానికి అత్యధిక ప్రజలు ఓటు వేశారు.
v
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం
(సెక్షన్ 5 ప్రకారం) అమల్లోకి వచ్చిన పదేళ్ల తరువాత హైదరాబాద్ కేవలం తెలంగాణ
రాష్ట్రానికి మాత్రమే రాజధాని అవుతుంది. ఏపీకి రాజధాని నగర నిర్మాణం చేయవలసిన
అవసరం ఉంది.
v
అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని
రాష్ట్ర పర్యావరణ ప్రభావ అధ్యయన అథారిటీ రాజధానిగా అమరావతి నగర నిర్మాణానికి
పర్యావరణ అనుమతులు ఇచ్చింది.
v
ప్రవేటు, వాణిజ్య ప్రయాజనాల కోసం
ప్రజావనరులను మళ్లించలేదు.
v
వరద ప్రాంతాలు, మైదానాల హద్దుల్ని
నిర్ణయించేందుకు రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక ప్రకారం కృష్ణా నది
గట్టుల్ని దాటి నీరు ప్రవహించిన సందర్భాలు లేవు. నది గట్టులు దాటి ఉన్న
ప్రాంతాన్ని వరద మైదానంగా పేర్కొనడానికి వీలులేదు.
v
1853, 2009లో కృష్ణా నదికి వచ్చిన
అసాధారణ వరదలను పరిగణనలోకి తీసుకున్నా వరద ప్రభావిత ప్రాంతంలో రాజధాని నగర
నిర్మాణం చేయబోతున్నట్లు పిటిషనర్లు రుజువు చేయలేకపోయారు.
v
పర్యావరణ ప్రభావ అధ్యయన నివేదిక
సైతం రాజధాని నగరం వరద మైదాన ప్రాంతంలోకి వస్తుందని పేర్కొనలేదు.
v
వరద ప్రాంత పరిధిలోకి రాజధాని
విస్తరించి ఉందన్న పిటిషనర్ల అభ్యర్థలను తిరస్కరిస్తున్నాం.
v
రాజధాని ప్రాంతం గత 106 ఏళ్లుగా ఎలాంటి
వరద తాకిడికి గురికాలేదని అధికారులు స్పష్టం చేశారు.
v
కొండవీటి వాగు ఆక్రమణలకు గురికావడం
వల్ల కుంచించుకుపోయింది. వాగుని అభివృద్ధి చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ
వాగు రాజధాని నిర్మాణాలకు అడ్డంకి అని చెప్పలేం.
v
రాజధానికి సంబంధించి ప్రభుత్వం
ప్రతి దశలో ప్రజాప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంది. ప్రజల అభిప్రాయాలు సేకరించి, వారితో
సంప్రదించి, వారి అభ్యంతరాలు స్వీకరించి మాస్టర్ ప్లాన్ రూపొందించి నోటిఫై
చేసింది.
v
పలు అంశాలకు కట్టుబడి ఉంటామని
ప్రభుత్వం స్పష్టంచేసిన తరువాతే 90 షరతులు విధించి ఎస్ఈఐఏఏ(స్టేట్ ఎన్విరాన్మెంటల్
ఇంప్యాక్ట్ అసెస్ మెంట్ అథారిటీ) పర్యావరణ అనుమతులు ఇచ్చింది.
v
పర్యావరణాన్ని కాపాడటం, రాజధాని
నగరం అభివృద్ధి మధ్య రాష్ట్రప్రభుత్వం సమతౌల్యం సాధించాలి.
v రాజధాని
ప్రాంతంలో 251 ఎకరాల అటవీ భూములు ఉన్నాయి. వాటిని రాజధాని నగరానికి ప్రాణవాయువు
ఇచ్చేవిగా అలాగే ఉంచాలి.
-----------------------------------
పేజీలు 49, 50లలో 77వ పేరా: రాజధాని
ప్రాంతంలో గట్లు ఉన్న కారణంగా కృష్ణా నది నుంచి ఎలాంటి వరద ప్రమాదం లేకపోవడం వల్ల
ఈ ప్రాంతాన్ని వరద ముంపు ప్రాంతంగా పేర్కొనలేం. తరచూ వరదలకు గురయ్యే ప్రాంతాలను
వరద ముంపు ప్రాంతాలుగా పేర్కొనవచ్చు. అయితే ప్రతిపాదిత రాజధానికి కృష్ణా నది నుంచి
ఎలాంటి వరద ముప్పు లేకపోవడం చేత, ఈ ప్రాంతాన్ని వరద ముంపు ప్రాంతంగా
పరిగణించడానికి వీల్లేదు.
పేజీ 49లో 79వ పేరా: ఈ
ప్రాంతంలో జరిగే నిర్మాణ కార్యకలాపాలు ఇక్కడి భూ జలస్వరూపం మీద ఎలాంటి
దుష్ప్రభావమూ చూపవని చెప్పవచ్చు.
పేజీ 53లో 80వ పేరా: 2009
వరదలు రాజధాని నగరంలో ఎలాంటి పరిమితినీ దాటలేదని ట్రైబ్యునల్ నియమించిన నిపుణుల
కమిటీ తేల్చింది. నదికి అడ్డుకట్టలు, గట్లను దాటి ఉన్న ప్రాంతాన్ని వరద ముంపు
ప్రాంతంగా పరిగణించలేము.
పేజీ 53లో 81వ పేరా: 1853, 2009లో
వచ్చిన అసాధారణ వరదల సందర్భంగా కూడా
ప్రతిపాదిత రాజధాని ప్రాంతం వరద ముంపునకు గురికాలేదని తెలుస్తోంది. ఈఐఏ నివేదిక
ఆధారంగా, ఇతర సుదీర్ఘ వివరణ ఆధారంగా రాజధాని ప్రాంతాన్ని వరద ముంపు ప్రాంతంగా
పరిగణించలేం.
పేజీ 57లో 82వ పేరా: 1853లో
వచ్చిన వరదలను చరిత్రాత్మకంగా భావిస్తుంటారు. ఆ వరదలు కూడా ప్రస్తుత రాజధాని
ప్రాంతంమీద ఎలాంటి ప్రభావమూ చూపలేదు.
పేజీ 68లో 96వ పేరా: శివరామకృష్ణన్
కమిటీ రాజధాని ఎక్కడ ఉండాలో నిర్ధిష్టమైన సిఫార్సు ఏమీ చేయలేదు(పేజీ5). జిల్లా,
రాజధాని మండలానికి తగిన సూచీని అనుసరించి ‘‘రాజధాని కావడానికి అనువుగా ఉన్న
ప్రాంతాలను’’ మాత్రమే సూచించింది. అందులో విజయవాడ-గుంటూరు ప్రాంతం అత్యంత
అనువైదిగా అవతరించింది.
పేజీ 70లో 100వ పేరా: భూ సమీకరణ
పథకంలో ఏక పక్షంగా గానీ, రైతుల ప్రయోజనాలకు భంగం కలిగించే అంశాలు కాని లేవని
నిర్ధారణకు వచ్చాం. రైతులు స్వచ్ఛందంగా భూములు అప్పగించడానికి ముందుకు వచ్చారు. భూ
సమీకరణ పథకం రైతులకు మేలే చేస్తుందని రుజువు అవుతోంది.
No comments:
Post a Comment