ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథ రెడ్డి
సచివాలయం, మార్చి 6:
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో సమానమైన ప్యాకేజీ అంటనే
ఒప్పుకున్నామని ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథ రెడ్డి చెప్పారు. శాసనసభ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద మంగళవారం ఉదయం ఆయన మాట్లాడారు. విభజన చట్టం ప్రకారం, కేంద్రం ఇచ్చిన హామీల ప్రకారం అన్నిటిని అమలు
చేసేవరకు తాము పోరాడతామన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఎంపీలు
పార్లమెంట్ లో నిరసన తెలపాలన్నారు. తమ పార్టీ ఎంపీలు
పార్లమెంటులో పోరాడుతున్నారని పల్లె చెప్పారు.
No comments:
Post a Comment