శాసనసభ చీఫ్ విప్ పల్లె రఘునాధ్ రెడ్డి
Ø జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్ర లో చంద్రబాబు గారిని విమర్శించడానికి సమయం
కేటాయిస్తున్నారు.
Ø తన తండ్రి వయస్సుఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండగా ఆయనపై గౌరవం లేకుండా
వ్యాఖ్యలు
Øచేయడం ప్రజలు హర్షించారు, గుణపాఠం చెబుతారు.
Ø 5 కోట్ల ప్రజల మనోభావమే ప్రత్యేక హోదా.
Ø పార్లమెంట్ లో, అసెంబ్లీలో ఉద్యమాలు
జరుగుతుంటే పట్టించుకోకుండా చంద్రబాబును విమర్శించడం సబబేనా?
Ø రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్లుగా, రాష్ట్రం అట్టుడుకుతుంటే
Øఅదేమి పట్టనట్లుగా ప్రధానిని విమర్శించకుండా చంద్రబాబును విమర్శిస్తే హోదా
వస్తుందా?
Ø జగన్మోహన్ రెడ్డి అనుచరుడు A2 విజయసాయిరెడ్డి ఇండియా
టుడేతో మాట్లాడుతూ మోడీపై నమ్మకం ఉంది, హోదా ఇస్తాడు అంటూనే, 21న అవిశ్వాసం ఏవిధంగా
పెడతాడు.
Ø కంటి తుడుపు చర్యగా హోదా కోసం మాట్లాడుతున్నాడు.
Ø రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల సమయంలో హోదా ఇస్తేనే
మద్దతు ఇస్తామని మాట్లాడకుండా, బేషరతుగా ఎందుకు మద్దతు
ఇచ్చాడు.
Ø ప్రపంచంలో అతి తక్కువ సమయంలో లక్ష కోట్లు సంపాదించిన వారు ఎవరైన ఉన్నారంటే అది
జగన్మోహన్ రెడ్డి ఒక్కరే.
----------------------------------------------
14.03.2018 – బుధవారం – మీడియా పాయింట్- ఆమదాలవలస శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ కూన
రవికుమార్
· విష్ణుకుమార్ రాజు గారు మాట్లాడుతూ YCPతో మాకు ఏ సంబంధాలు లేవు అన్నారు. కానీ నిన్న ఢిల్లీలో తెలుగుదేశం MP లు
·కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ గారిని కలసి రాష్ట్ర ప్రయోజనాల కోసం
మాట్లాడడానికి ఇంటర్వ్యూ అడిగితే ఇవ్వకుండా, YCP పార్లమెంట్ సభ్యునికి ఇంటర్వ్యూ ఇచ్చారు.
· వైసీపీ వాళ్ళు రాష్ట్ర హక్కుల కోసం కాకుండా జగన్మోహన్ రెడ్డి కేసుల మాఫీకోసం, ED అటాచ్ చేసిన ఆస్తులు విడిపించుకోవడం కోసం లాబీయింగ్ చేస్తున్నారు.
· రాష్ట్రానికి రావాల్సిన హోదా, 19 అంశాలు రాకుండా
జగన్మోహన్ రెడ్డి శకుని పాత్ర పోషిస్తున్నారు.
· సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలో బెయిల్ కోసం సోనియా గాంధీ తో కుమ్మక్కై
సమైక్యాంధ్రను మోసం చేశారు.
· ఈరోజు రాష్ట్రానికి హోదా కావాలి, లేకపోతే రాజీనామా చేస్తాం అన్నారు కానీ 2 సం,,
నుండి చేయలేదు.
· ఏ జాతీయ పార్టీ హోదా ఇస్తే వారికి అండగా ఉంటాము అన్నారు కానీ కాంగ్రెస్ పార్టీ
హోదా ఇస్తాను అంటుంది, వారికి మద్దతు ఇస్తారా
అని అడిగితే సమాధానం చెప్పడం లేదు. దీనిని బట్టి చూస్తే BJP YCP లాలూచీ అర్ధం అవుతోంది.
· ఒక ప్రక్క మోడీ పై విశ్వాసం ఉంది, హోదా ఇస్తారు అంటున్నారు, మరో ప్రక్క 21న అవిశ్వాసం ఎలా పెడతారు.
· 5 కోట్ల మంది ప్రజలు పోరాడుతుంటే, TDP మంత్రులు రాజీనామా చేసి బయటకు వచ్చి పోరాడుతుంటే, YCP కేసుల మాఫీ కోసం పోరాడుతున్న ట్లుగాఉన్నది.
· ప్రధాని కార్యాలయం విజయసాయిరెడ్డి కి రెడ్ కార్పెట్ పరుస్తుంది, 11 కేసుల్లో ఆర్థిక ఉగ్రవాదులుగా ఉన్నవారితో BJP కి లాబీయింగ్ ఏమిటి?
---------------------------------------------------------------------------
14.03.2018 – బుధవారం – మీడియా పాయింట్- అమలాపురం ఎమ్మెల్యే
అయితాబత్తుల ఆనందరావు
ü నాడు బెయిల్ పొందడానికి జగన్
కు కాంగ్రెస్ కావాలి...నేడు కేసులు క్లియర్ చేసుకోవడానికి జగన్ కు
బీజేపీ కావాలి.
ü తల్లి కాంగ్రెస్ ను చూస్తే చిందులు వేసే మోడీ పిల్ల కాంగ్రెస్ ను ఎందుకు
చంకనెక్కించుకుంటున్నారు ?
ü మీ చీకటి ఒప్పందాలను తెలుగువారు
గమనిస్తున్నారు.
ü ప్రత్యేక హోదా కోసం దేశ వ్యాప్తంగా ఉన్న 18 కోట్ల తెలుగువారికి బీజేపీ మీద ఉన్న భ్రమలు తొలగిపోయాయి.
ü నాడు దేశంలో బీజేపీ, మోదీ కావాలన్న తెలుగువారు
నేడు దేశంలో బీజేపీనే వద్దనుకునే స్థాయికి రాకుండగా చూసుకోవాలి.
ü తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం.హోదా మా హక్కు. కేంద్రానికి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది
---------------------------------------------------------------------
14.03.2018 – బుధవారం – మీడియా పాయింట్- గజపతి నగరం ఎమ్మెల్యే డాక్టర్
అప్పల నాయుడు
v ప్రత్యేక హోదా కోసం అసెంబ్లీలో 3 వ సారి తీర్మానం చేసి కేంద్రానికి పంపాము.
v TDP 5 కోట్ల మందు ఆంధ్రుల
తరుపున కేంద్రాన్ని నిలదీయాలనుకున్న తరుణంలో కేంద్రం ఈ విధంగా చేస్తుంది.
v విశాఖ రైల్వే జోన్ కు హామీ ఇచ్చారు, ఇప్పుడు అధికారుల ద్వారా అవకాశం లేదు అని చెబుతున్నారు.
v దుగరాజపట్నం సీ పోర్టు హామీ ఇస్తామన్నారు, పోర్టుకి అక్కడ అనువుగా లేదని చెప్పడం ఎంతవరకు సమంజసం.
v 16 కేసులతో A1 ముద్దాయిగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి అవాకులు చవాకులు పేలుతున్నాడు. బాధ్యతలు విస్మరించి
ఏవేవో మాట్లాడుతున్నాడు.
v సభనుండి పారిపోయి ఏవేవో
మాట్లాడుతున్నాడు.
v అటువంటి ముద్దాయికి PMO లో రెడ్ కార్పెట్ వేస్తున్నారు.
v ప్రస్తుత పరిస్థితులలో బిజెపి స్టాండ్ ఏమిటో ప్రజలు ఆలోచించాలి
v గతంలో కాంగ్రెస్ కు పట్టిన దుస్థితే బీజేపీ కి పడుతుంది.
--------------------------------------------------------------------------
14.03.2018
– బుధవారం – మీడియా పాయింట్- పుట్టపర్తి ఎమ్మెల్యే, చీఫ్ విప్ పల్లె రఘునాధ్
జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ Mpలు విజయసాయిరెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి అడ్డదిడ్డంగా
మాట్లాడుతున్నారు. స్థాయి మరచి అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. చంద్రబాబు కు అభద్రతా భావం అని, తొలి నుంచి ప్రత్యేక హోదా గురించి తామే
మాట్లాడుతున్నామని ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారు.
చంద్రబాబు పై ఏ కేసులు లేవు. నలబై యేండ్లు నిప్పులా బ్రతికాడు. కడిగిన ఆణి ముత్యం, కోట్లాదిమంది అభిమాన నాయకుడు, అలాంటి వ్యక్తికి అభద్రతాభావం ఎందుకు ఉంటుంది.
జగన్ 11 కేసులలో A1 ముద్దాయి, ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్ళాలి, ఎప్పుడు శిక్ష పడుతుందోనన్న అభద్రతాభావం ఆయనకు ఉంటుంది.
అవినీతిపరుల ఆస్తుల ED స్వాధీనం చేసుకోవచ్చని పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టారు. దానితో తన ఆస్తులు ఎక్కడ
స్వాధీనం చేసుకుంటారో అని జగన్ కు హదలెత్తుతోంది.
చంద్రబాబు మొదటి నుండి చిత్తశుద్దితో రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఇందుకోసం 29 సార్లు ఢిల్లీ వెళ్లారు.
ప్రపంచ స్థాయిలో కూడా ఆయన ప్రశంసలు అందుకుంటున్నారు.
జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో లేనిపోని హామీలు ఇస్తున్నారు. ప్రజలను ప్రలోభ
పెడుతున్నారు.
విజయ సాయి రెడ్డి ఇండియా టుడే కి ఇంటర్వ్యూ ఇస్తూ మోడీ పై నమ్మకం ఉందని
చెప్పారు, మళ్ళీ 21 న అవిశ్వాస తీర్మానం
పెడతామని అంటున్నారు, వారిది రెండు నాలుకల ధోరణి.
రాష్ట్ర అభివృద్ధిని సయిందవుని మాదిరి అడ్డుకున్నారు.
*********
No comments:
Post a Comment