సచాలయం, మార్చి 20: ఈ నెల 24 నుంచి 27 వరకు విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో శాసనసభ,
శాసనమండలి సభ్యుల క్రీడల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అమరావతిలోని శాసనసభ స్పీకర్ ఛాంబర్ లో మంగళవారం
ఉదయం స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు
నిర్ణయం తీసుకున్నారు. 24వ తేదీ నుంచి 26 తేదీ వరకు ఆటల పోటీలు నిర్వహిస్తారు. క్రికెట్, బాడ్మింటన్, టెన్నీస్, టగ్ ఆఫ్ వార్, టెన్నికాయిట్, కబాడీ, వాలీబాల్, మ్యూజికల్
చైర్, ఈత, త్రోబాల్ మొత్తం 10 విభాగాల్లో ఆటల పోటీలు నిర్వహిస్తారు. 27న సాంస్కృతిక
కార్యక్రమాలు నిర్వహిస్తారు. సభ్యులు
ఎవరికి ఏ క్రీడలో ప్రావీణ్యం ఉంటే అందులో పాల్గొనే అవకాశం ఉంటుంది. సమావేశంలో
మండలి ఉప సభాపతి రెడ్డి సుబ్రహ్మణ్యం, మంత్రులు యనమల
రామకృష్ణుడు, కాల్వ శ్రీనివాసులు,
అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, కొల్లు
రవీంద్ర, చీఫ్ విప్ పల్లె రఘునాథ రెడ్డి, విప్ కూన
రవికుమార్, ఇన్ చార్జ్ సెక్రటరీ విజయరాజు తదితరులు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు
ఈరోజు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుగంటే...గోంగూర తెలుగంటే...గోదారి తెలుగంటే...గొబ్బిళ్ళు తెలుగంటే...గోరింట తెలుగంటే...గు...
-
నారా చంద్రబాబు : ముఖ్యమంత్రి, లా అండ్ ఆర్డర్ కొణిదెల పవన్ కల్యాణ్ : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి స...
-
పుష్ప- 2: ది రూల్ సినిమా ట్రైలర్ నవంబర్ 17వ తేదీ ఆదివారం బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపైన వి...
-
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన న్యాయవాది, రచయిత సావిత్రీపతి మాదిరాజు గోవర్థనరావు రాసిన ‘మన మంగళగిరి 2.0’ని ఇటీవల స్థానిక శాసనసభ...
No comments:
Post a Comment