Nov 22, 2017

ఇబ్బందులు అదిగమించి 2019కి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి


ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి
    సచివాలయంనవంబర్ 22: అన్ని రకాల ఇబ్బందులు అదిగమించి పోలవరం ప్రాజెక్ట్ ని 2019 నాటికి పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్పారుశాసనసభ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద బుధవారం మధ్యాహ్నం ఆయన మాట్లాడారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్ట కోసం సేకరించిన భూములకు చెల్లించవలసిన నష్టపరిహారం ఎకరానికి రూ.1.50 లక్షలు కాగాఇప్పడు రూ. 10 నుంచి రూ.13 లక్షలకు పెరిందన్నారుదాంతో ప్రాజెక్ట్ వ్యయం పెరిగినట్లు చెప్పారుఈ ప్రాజెక్ట్ విషయమై సీఎం ఎప్పటికప్పుడు కేంద్ర మంత్రులుఅధికారులతో మాట్లాడుతున్నారనిచత్తిస్ గఢ్ఒరిస్సా రాష్ట్రాల నుంచి అడ్డంకులు కూడా ఉన్నాయని చెప్పారురాజధాని లేని సమయంలో ఆత్మగౌరవం నిలబెట్టుకోవడానికి శాసనసభనుసచివాలయంను నిర్మించుకొన్నామనిసచివాలయ ఉద్యోగులు కూడా ఎన్నో ఇబ్బందులు పడుతూ  ఇక్కడికి వస్తున్నారన్నారుపట్టిసీమ ద్వారా గోదావరి నీరు రావడం వల్ల రూ.15వేల కోట్లకు పైగా విలువైన వ్యవసాయ దిగుబడులు వచ్చినట్లు వివరించారు.
రాష్ట్ర విభజన తరువాత ఉమ్మడి ఆస్తుల పంపిణీ జరగలేదనికేంద్రం నుంచి కూడా నిధులు రావలసి ఉందని అన్నారువిభన చట్టంలో హామీల అమలులకు సీఎం కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారని చెప్పారుఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడానికి అప్పులు చేసినావాటిని సద్వినియోగం చేస్తున్నామనిఅందువల్లే రాష్ట్ర జీడీపీతలసరి ఆదాయం పెరుగుతుందన్నారు.
సినిమా పరిశ్రమకు సంబంధించి నంది అవార్డుల అంశం వివాదస్పదం కావడం దురదృష్టం అన్నారుతాను కూడా సినిమా రంగం నుంచే వచ్చాననితాను నిర్మాతనని చెప్పారుఈ విషయంలో కుల ప్రస్తావన తీసుకురావడం భావ్యం కాదనివిధానాల ఆధారంగా అవార్డుల ప్రకటిస్తారని బుచ్చయ్య చౌదరి అన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...