డాక్టర్
కోడెల, ఫరూక్
సచివాలయం, డిసెంబర్: 24: క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ
స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద రావు, శాసన మండలి చైర్మన్ ఎస్ఎండీ ఫరూక్ లు వేరు వేరు
ప్రకటనల్లో క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు జన్మదినం రోజున జరుపుకునే ఈ పండుగ శాంతిని
కోరుకునే పండుగ అని, మానవాళికి క్రీస్తు అందిచిన బోధనలు శాంతి సౌభాగ్యాలకు ప్రతీకలని పేర్కొన్నారు.
క్రైస్తవ సోదరులు చేసే ప్రత్యేక ప్రార్థనలు సకల
మానవాళికి ఉపయోగపడతాయని, ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ పర్వదినం సందర్భంగా క్రిస్టియన్ సోదరులు,
అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో వర్థిల్లాలని వారు
ఆకాంక్షించారు.
No comments:
Post a Comment