Dec 2, 2017

ముందుగానే వచ్చిన సంక్రాంతి


ఎంపీ అవంతి శ్రీనివాసరావుఎమ్మెల్యేలు బొండా ఉమఅప్పల నాయుడుసుగుణమ్మసత్యప్రభ,
సచివాలయండిసెంబర్ 2: కాపులకు రిజర్వేషన్ కల్పించాలని శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టడం అంటే కాపులకు ముందుగానే సంక్రాంతి వచ్చిందనిసువర్ణక్షరాలతో లిఖించదగ్గ రోజని ఎంపీ అవంతి శ్రీనివాసరావుఎమ్మెల్యేలు బొండా ఉమఅప్పల నాయుడుసుగుణమ్మసత్యప్రభ అన్నారు. సచివాలయం ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద సోమవారం మధ్యాహ్నం వారు మాట్లాడారు. పాదయాత్ర సమయంలో చంద్రబాబు నాయుడు కాపుల స్థితితగులు తెలుసుకొని  రిజర్వేషన్ కల్పిస్తామని పిఠాపురంలో ప్రకటించారనిదానిని ఈ రోజు అమలు చేసి చూపారన్నారు. కాపు సామాజిక వర్గంకాపు జాతి ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడుని మరువదన్నారు. ఆయనకు పాదాభివందనం చేస్తున్నామన్నారు. న్యాయపరంగాసాంకేతికంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా శాసనసభలో బిల్లు తీసుకురావడం ద్వారా చంద్రబాబు కాపులకు న్యాయం చేశారని ఆనందం వ్యక్తం చేశారు. మంత్రి మండలి ఆమోదించిన తరువాత ఒక్క రోజు వ్యవధిలోనే శాసనసభలో ప్రవేశపెట్టడం ఓ రికార్డుగా వారు అభివర్ణించారు. బీసీ వర్గాల వారు కూడా దీనిని ఆమోదించడం సంతోషంగా ఉందన్నారు. బీసీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు.  ఎన్టీఆర్ హయాంలోఇప్పుడూ కాపులకు మంత్రి పదవులుకార్పోరేషన్ పదవుల విషయంలో న్యాయం చేస్తున్నారన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...