Dec 2, 2017

కాపులకు దీపావళి, దసరాకంటే మించిన పండుగ


కాపు కార్పోరేషన్‌ చైర్మన్‌ చలమలశెట్టి రామానుజయ
సచివాలయండిసెంబర్ 2: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ నాయకుడు చేయనటువంటి సాహసం చేసి కాపులకు రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయం తీసుకున్నారనికాపులకు దీపావళిదసరాకంటే మించిన పండుగ ఇదని కాపు కార్పోరేషన్‌ చైర్మన్‌ చలమలశెట్టి రామానుజయ అన్నారు.  శాసనసభ ప్రాంగణం మీడియా పాయింట్ వద్ద సోమవారం ఉదయం ఆయన మాట్లాడారు. కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించాలని మంత్రి మండలిలో నిర్ణయం తీసుకోవడం ద్వారా కాపుతెలగబలిజఒంటరి కులాల వారికి చంద్రబాబు నాయుడు ఆరాధ్య దైవం అయ్యారన్నారు. కాపులను బీసీల్లో చేర్చే సాహసం ఇంతకు ముందు ఎవరూ చేయలేదని చెప్పారు. కాపులది న్యాయమైన కోరికనిఅందువల్లే మంత్రి మండలిలో ఆమోదం పొందిన తరువాత శాసనసభలో ప్రవేశపెట్టి తన చిత్తశుద్ధి నిరూపించుకున్నారని చెప్పారు.  టీడీపీ వచ్చిన తరువాత కాపులకు మంచి అవకాశం ఇచ్చిందన్నారు.  కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి సహాయం అందిస్తుందని చెప్పారు.  ప్రతి కాపు కులస్తుడు దేవాలయాలకు వెళ్లి పూజలు చేస్తున్నారనిచంద్రబాబు నాయుడుని కొనియాడుతున్నారని చెప్పారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...