కాపు కార్పోరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ
సచివాలయం, డిసెంబర్ 2: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ నాయకుడు చేయనటువంటి సాహసం చేసి కాపులకు
రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయం తీసుకున్నారని, కాపులకు దీపావళి, దసరాకంటే మించిన
పండుగ ఇదని కాపు కార్పోరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ అన్నారు. శాసనసభ ప్రాంగణం మీడియా పాయింట్ వద్ద సోమవారం ఉదయం
ఆయన మాట్లాడారు. కాపులకు 5 శాతం రిజర్వేషన్
కల్పించాలని మంత్రి మండలిలో నిర్ణయం తీసుకోవడం ద్వారా కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల వారికి చంద్రబాబు నాయుడు ఆరాధ్య దైవం అయ్యారన్నారు. కాపులను బీసీల్లో చేర్చే సాహసం ఇంతకు ముందు ఎవరూ
చేయలేదని చెప్పారు. కాపులది న్యాయమైన
కోరికని, అందువల్లే మంత్రి మండలిలో ఆమోదం పొందిన తరువాత
శాసనసభలో ప్రవేశపెట్టి తన చిత్తశుద్ధి నిరూపించుకున్నారని చెప్పారు. టీడీపీ వచ్చిన తరువాత కాపులకు మంచి అవకాశం
ఇచ్చిందన్నారు. కాపు కార్పొరేషన్
ఏర్పాటు చేసి సహాయం అందిస్తుందని చెప్పారు. ప్రతి కాపు కులస్తుడు దేవాలయాలకు వెళ్లి పూజలు చేస్తున్నారని, చంద్రబాబు నాయుడుని కొనియాడుతున్నారని చెప్పారు.
No comments:
Post a Comment