Oct 26, 2017

31 రాష్ట్రీయ సంకల్ప దివాస్


           సచివాలయం, అక్టోబర్ 25: దివంగత మాజీ ప్రధాన మంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ వర్ధంతి రోజును ప్రభుత్వం రాష్ట్రీయ సంకల్ప దివాస్నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్వి (సీఎస్) దినేష్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఏడాది ఆమె వర్ధంతి రోజైన 31 అక్టోబర్ నాడు రాష్ట్ర రాజధానుల్లో, జిల్లా కేంద్రాల్లో, ముఖ్యమైన పట్టణాల్లో ర్యాలీలు నిర్వహిస్తుంటారని, అదేమాదిరి ఈ ఏడాది కూడా సచివాలయంలోని అన్ని శాఖల, శాఖాధిపతుల కార్యాలయాల్లో, జిల్లా కేంద్రాల్లో రాష్ట్రీయ సంకల్ప దివాస్ సందర్భంగా ర్యాలీలు, జాతీయ, దేశభక్తి గీతాలు ఆలపించడం, ముఖ్యమైన వ్యక్తులు, యువజన నేతలతో ప్రసంగాలు వంటి కార్యక్రమాలు నిర్వహించాలని ఆ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు స్థానిక అధికారుల, సమాచార, పౌరసంబంధాల శాఖ అధికారుల సమన్వయంతో నిర్వహించడానికి యువజన, పర్యాటక, సాంస్కృతి శాఖ తగిన ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. ఆయా శాఖల బడ్జెట్ లో కేటాయించిన మేరకు శాఖా కార్యాలయాలు, జిల్లాల్లోని అధికారులు  ఈ కార్యక్రమాలకు నిధులు వినియోగించాలని తెలిపారు. సచివాలయంలో రాష్ట్రీయ సంకల్ప దివాస్నిర్వహించడానికి సాధారణ పరిపాలనా శాఖ తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...