Jan 2, 2017

ఫిన్ టెక్ సిటీగా విశాఖ అభివృద్ధి

·       పెట్టుబడులు పెట్టడానికి బహుళజాతి కంపెనీల ఆసక్తి
·       పెరుగుతున్న ఉద్యోగ అవకాశాలు

         విశాఖ నగరాన్ని ఫిన్ టెక్(ఫైనాన్షియల్ టెక్నాలజీ) సిటీగా అభివృద్ధి కానుంది. ఈ సిటీకి కావలసిన అన్ని రకాల రోడ్డు, వాటర్, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు, అనువైన వాతావరణం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ నెల 19న రుషికొండ సైబర్ వ్యాలీలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఫిన్ టెక్ టవర్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ప్రభుత్వం కల్పించే రాయితీలు, ప్రోత్సహకాలు, కొత్త కంపెనీల స్థాపనకు వీలుగా విధానాల సడలింపు, సౌకర్యాల వల్ల ఇప్పటికే పలు సంస్థలు పెట్టబడులు పెట్టాయి. తమ బ్రాంచ్ లను ప్రారంభించాయి. ఇంకా అనేక బహుళజాతి కంపెనీలు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. దాంతో రాష్ట్రంలోని యువతకు వేల ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది.
       ఇటలీకి చెందిన పార్టీటు42 ఇన్నొవేషన్స్ రీసెర్చ్ ల్యాబ్ సహకారంతో సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ విశాఖలో తమ బ్రాంచ్ ని స్థాపించనుంది. ఎలక్ట్రానిక్స్, ఉత్పత్తి రంగంలో లీడింగ్ లో ఉన్న తైవాన్ పెట్టుబడులు పెట్టడానికి భారత్ ఉత్తమమైనదిగా భావిస్తోంది. ఇండియన్ ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీకండక్టర్ అసోసియేషన్(ఐఈఎస్ఏ) ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ లో తైవాన్ డెస్క్ ను కూడా ఏర్పాటు చేశారు. అనేక ఫిన్ టెక్ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయి.
         విశాఖ ఫిన్ టెక్ టవర్ లో పలు సంస్థలు ప్రారంభమైయ్యాయి.  పేటీఎంలో 200 మంది ఉద్యోగం చేస్తున్నారు. జీఎంఎస్ స్టాఫ్ట్ వేర్ లో వంద మంది ఉద్యోగులు ఉన్నారు. మరో నాలుగు కొత్త కంపెనీలలో 60 మంది పని చేస్తున్నారు. విశాఖ వీఐపీ రోడ్డులోని డిజైనేటెడ్ టెక్నాలజీ పార్క్(డీటీపీ)లో జిగాకామ్, స్పిండర్ సాఫ్ట్ ఎల్ఎల్ సీ, మైలాస్ టెక్నాలజీ, బీ సెక్యూర్, వీఎస్ టీ, అవని సాఫ్ట్ వేర్, సీజీఎస్ ఐటీ టెక్నాలజీ మొత్తం 7 కంపెనీలను స్థాపించారు. వీటిలో 526 మందికి ఉపాధి లభిస్తోంది. టెక్ మహేంద్ర డీటీపీ బిల్డింగ్ లోని మూడు కంపెనీలలో మొత్తం 230 మందికి ఉపాధి లభించింది.

ఐటీ కంపెనీలు: విశాఖలోని వీఐపీ రోడ్డులో 35 వేల చదరపు అడుగులు వివిధ ఐటీ కంపెనీ కార్యాలయాలకు కేటాయించారు. ఉడా కాంప్లెక్స్ లో 24 వేల చదరపు అడుగులు కేటాయించారు. ఇక్కడ తుది దశ పనులు జరుగుతున్నాయి. విప్రో బిల్డింగ్ లో 2,12,000 చదరపు అడుగులలో విప్రో సంస్థ వచ్చే ఏడాది మార్చి నాటికి  స్వాధీనంలోకి తీసుకుంటుంది. వారు సెజ్(ప్రత్యేక ఆర్థిక మండలి)గా మార్పు చేయాలని దరకాస్తు చేయనున్నారు. హిల్-2 (ప్రైవేట్-మహతి) లో 65 వేల అడుగుల కార్యాలయాల స్థలం ఖాళీగా ఉంది. హిల్-3 (ఇంక్యుబేషన్ టవర్)లో నూతన కంపెనీలను ప్రారంభించారు. ఈ కంపెనీల స్వాధీనంలో 6500 చదరపు అడుగులు ఉంది. మిగిలిన  చదరపు అడుగులు ఖాళీగా ఉన్నాయి. హిల్-3(మిలినియం) భవనం నిర్మాణంలో ఉంది. ఇక్కడ రెండు లక్షల అడుగుల ఎవరికీ కేటాయించలేదు. దీని నిర్మాణం వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి అవుతుంది. ఇక్కడ కూడా కార్యాలయాలు ప్రారంభిస్తే మరిన్ని ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...