Ø మత్స్య సంపదలో
తిరులేని పురోగతి
Ø అగ్ర
రాష్ట్రాల స్థాయికి ఎగబాకుతున్న ఏపీ
రాష్ట్రంలో ఈ ఏడాది అర్థ సంవత్సరంలో
వ్యవసాయం, దాని అనుబంధ రంగాల ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. ప్రభుత్వం
రాష్ట్రాభివృద్ధికి వ్యూహాత్మకంగా రూపొందించిన ప్రణాళికలు ఫలించాయి. ఈ ఆర్థిక
సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఆరు నెలల కాలంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ. 2,21,907 కోట్ల(2011-12 ధరలలో)తో వృద్ధి
రేటు 12.23 శాతం ఉండగా, వ్యవసాయం, దాని అనుబంధ రంగాలలో రూ. 42,006 కోట్లతో 24.44
శాతంగా ఉంది. జాతీయ స్థూల ఉత్పత్తి వృద్ధి రేటు 7.20 శాతం కాగా, వ్యవసాయం, అనుబంధ
రంగాలలలో 2.51 శాతం మాత్రమే వృద్ధి రేటు నమోదైంది. రెండంకెల సమ్మిళిత వృద్ధిని
సాధించేందుకు ప్రధాన వృద్ధి కారకం (గ్రోత్ ఇంజన్)గా మత్స్య పరిశ్రమను రాష్ట్ర ప్రభుత్వం
గుర్తించింది. ఈ రంగం రూ.17,578 కోట్ల
ఉత్పత్తితో తిరుగులేనివిధంగా 42.57 శాతం
వృద్ధి రేటు సాధించింది. చేపలు, రొయ్యల
ఉత్పత్తిలో దేశంలో అగ్రస్థానంలో రాష్ట్రం
నిలిచింది. అద్వితీయమైన మత్స్య సంపదకు ఏపీ చిరునామాగా మారింది. జాతీయ స్థాయిలో ఈ అర్ధ
సంవత్సరంలో 5.26 శాతం మాత్రమే వృద్ధి రేటు నమోదైంది. ఆ తరువాత పండ్లు, పూలు
ఉత్పత్తి గణనీయంగా పెరగడంతో ఉద్యానవన రంగం లక్ష్యానికి మించి రూ.3,151 కోట్లతో
18.33 శాతం వృద్ధి సాధించింది. ఇక ప్రధానమైన వ్యవసాయ రంగం 759 కోట్ల ఉత్పత్తితో
3.69 శాతం వృద్ధి రేటు నమోదైంది. జాతీయ స్థాయిలో ఈ రంగంలో వృద్ధి రేటు 1.55 శాతం
మాత్రమే నమోదైంది.
పారిశ్రామిక రంగం వృద్ధి రేటు 9.98 శాతం
పారిశ్రామిక రంగంలో ఈ ఏడాది అర్థ సంవత్సరంలో రాష్ట్రం
ఉత్పత్తి రూ.63,229 కోట్లతో 9.98 శాతం
నమోదైంది. జాతీయ స్థాయిలో 5.60 శాతం వృద్ధి రేటు మాత్రమే సాధించింది. పారిశ్రామిక
రంగంలో వివిధ విభాగాలను పరిశీలిస్తే విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా విభాగాలు
రూ.9,125 కోట్లతో 11.70 శాతం, మైనింగ్, క్వారీలు రూ. 5,750 కోట్లతో 12.20 శాతం,
ఉత్పత్తి విభాగం రూ.25,798 కోట్లతో 10.20 శాతం, నిర్మాణ విభాగం రూ.22,556 కోట్లతో
8.52 శాతం వృద్ధి రేటు సాధించాయి.
సేవల రంగం ఈ అర్థ సంవత్సరంలో రూ.1,16,672 కోట్లతో 9.57
శాతం వృద్ధి రేటు సాధించగా, జాతీయ స్థాయిలో 9.20 శాతం వృద్ధి రేటు నమోదైంది. ఈ
రంగంలో వివిధ విభాగాలను పరిశీలిస్తే ఒక్క రైల్వేస్ లో జాతీయ స్థాయి గణాంకాల
ప్రకారం రాష్ట్రంలో మైనస్ 5.30 వృద్ధి
రేటు నమోదైంది. మిగిలిన విభాగాలు 8 నుంచి 10 శాతం పైగా వృద్ధి రేటు నమోదయ్యాయి. రియల్
ఎస్టేట్, వ్యాపార సేవలు రూ.25,212 కోట్లతో 11.11 శాతం, కమ్యూనికేష్స్ విభాగం రూ.4,842
కోట్లతో 8.37 శాతం, రవాణా విభాగం రూ.18,065 కోట్లతో 9.61 శాతం, బ్యాంకింగ్, బీమా వంటి ఆర్థిక సేవలు రూ.11,407
కోట్లతో 8.20 శాతం, వాణిజ్యం, హోటళ్లు, రెస్టారెంట్లు రూ. 22,592 కోట్లతో 9.15
శాతం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగం రూ.12,387 కోట్లతో 9.63 శాతం వృద్ధి రేట్లు
సాధించాయి.
ఈ ప్రభుత్వం ఏర్పడిన రెండున్నరేళ్ల కాలంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి(జీఎస్ డీపీ)లో దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి ఎగబాకింది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో జీఎస్ డీపీ రూ.4,93,641 కోట్లతో 10.99 శాతం వృద్ధి రేటుతో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది అర్థ సంవత్సరంలో కూడా అగ్రభాగానే ఉంది. దాదాపు అన్ని రంగాలలో జాతీయ స్థాయిని మించి అభివృద్ధి నమోదవుతోంది. వృద్ధి రేటు ఇదేవిధంగా కొనసాగితే రాష్ట్ర ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యం మేరకు 2022 నాటికి దేశంలోని మూడు అగ్ర రాష్ట్రాలలో ఏపీ ఒకటిగా నివడం ఖాయం.
ఈ ప్రభుత్వం ఏర్పడిన రెండున్నరేళ్ల కాలంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి(జీఎస్ డీపీ)లో దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి ఎగబాకింది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో జీఎస్ డీపీ రూ.4,93,641 కోట్లతో 10.99 శాతం వృద్ధి రేటుతో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది అర్థ సంవత్సరంలో కూడా అగ్రభాగానే ఉంది. దాదాపు అన్ని రంగాలలో జాతీయ స్థాయిని మించి అభివృద్ధి నమోదవుతోంది. వృద్ధి రేటు ఇదేవిధంగా కొనసాగితే రాష్ట్ర ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యం మేరకు 2022 నాటికి దేశంలోని మూడు అగ్ర రాష్ట్రాలలో ఏపీ ఒకటిగా నివడం ఖాయం.
జారీ చేసినవారు: రీసెర్చ్ అండ్ రిఫరెన్స్ విభాగం, సమాచార, పౌరసంబంధాల
శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
No comments:
Post a Comment