సచివాలయం, సెప్టెంబర్ 26: జాతీయ మహిళా పార్లమెంట్ తుది అమరావతి
ప్రకటన విడుదలకు సంబంధించి ఏపీ శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు
అధ్యక్షతన ఈ నెల 27
ఉదయం 11.30
గంటలకు వెలగపూడి శాసనసభా భవనంలోని సమావేశం మందిరంలో సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు డాక్టర్ కోడెల
ఆధ్వర్యంలో మహిళా సాధికారితపై అంతర్జాతీయ స్థాయిలో ‘అమరావతి ప్రకటన’ రూపొందించారు. మహిళా సాధికారితకు కావలసిన అన్ని అంశాలను,
గ్రామీణ మహిళ మొదలుకొని పట్టణ మురికివాడలలో నివసించే
మహిళలు, విద్యార్థులు
ఎదుర్కొంటున్న విద్య,ఆర్థిక, ఆరోగ్యపరమైన అన్ని అంశాలు ఆమూలాగ్రం
చర్చించి దీనిని సిద్ధం చేశారు. తుది ప్రకటన విడుదల సందర్భంగా చేయవలసిన ఏర్పాట్లపై ఈ
సమావేశంలో చర్చిస్తారు. ఈ సమావేశంలో విద్యా శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్,
రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సుమిత దావ్రా, హోం శాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్ అనురాధ, మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ కార్యదర్శి కె.సునిత, దేవాదాయ శాఖ కమిషనర్ వైవీ అనురాధ, పాఠశాల విద్య కమిషనర్
సంధ్యారాణి, ఏపీ స్టేట్ డెవలప్ మెంట్ ప్లానింగ్ సొసైటీ(ఏపీఎస్ డీపీఎస్) డైరెక్టర్ వి.ప్రతిమ, సీనియర్ అసోసియేట్ అలెన్ జాన్, రోడ్లు భవనాల శాఖ
కన్సల్టెంట్ నీరజ్ ఆద్య, యునిసిఫ్ ఏ అండ్ సి స్పెషలిస్ట్ ప్రొసూన్ సేన్, టెక్నికల్ కన్సల్టెంట్
చావా లక్ష్మిసుధ, ఇవి స్వర్ణలత పాల్గొంటారు.
Subscribe to:
Post Comments (Atom)
తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు
ఈరోజు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుగంటే...గోంగూర తెలుగంటే...గోదారి తెలుగంటే...గొబ్బిళ్ళు తెలుగంటే...గోరింట తెలుగంటే...గు...
-
నారా చంద్రబాబు : ముఖ్యమంత్రి, లా అండ్ ఆర్డర్ కొణిదెల పవన్ కల్యాణ్ : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి స...
-
పుష్ప- 2: ది రూల్ సినిమా ట్రైలర్ నవంబర్ 17వ తేదీ ఆదివారం బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపైన వి...
-
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన న్యాయవాది, రచయిత సావిత్రీపతి మాదిరాజు గోవర్థనరావు రాసిన ‘మన మంగళగిరి 2.0’ని ఇటీవల స్థానిక శాసనసభ...
No comments:
Post a Comment