సచివాలయం, సెప్టెంబర్ 26: జాతీయ మహిళా పార్లమెంట్ తుది అమరావతి
ప్రకటన విడుదలకు సంబంధించి ఏపీ శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు
అధ్యక్షతన ఈ నెల 27
ఉదయం 11.30
గంటలకు వెలగపూడి శాసనసభా భవనంలోని సమావేశం మందిరంలో సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు డాక్టర్ కోడెల
ఆధ్వర్యంలో మహిళా సాధికారితపై అంతర్జాతీయ స్థాయిలో ‘అమరావతి ప్రకటన’ రూపొందించారు. మహిళా సాధికారితకు కావలసిన అన్ని అంశాలను,
గ్రామీణ మహిళ మొదలుకొని పట్టణ మురికివాడలలో నివసించే
మహిళలు, విద్యార్థులు
ఎదుర్కొంటున్న విద్య,ఆర్థిక, ఆరోగ్యపరమైన అన్ని అంశాలు ఆమూలాగ్రం
చర్చించి దీనిని సిద్ధం చేశారు. తుది ప్రకటన విడుదల సందర్భంగా చేయవలసిన ఏర్పాట్లపై ఈ
సమావేశంలో చర్చిస్తారు. ఈ సమావేశంలో విద్యా శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్,
రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సుమిత దావ్రా, హోం శాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్ అనురాధ, మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ కార్యదర్శి కె.సునిత, దేవాదాయ శాఖ కమిషనర్ వైవీ అనురాధ, పాఠశాల విద్య కమిషనర్
సంధ్యారాణి, ఏపీ స్టేట్ డెవలప్ మెంట్ ప్లానింగ్ సొసైటీ(ఏపీఎస్ డీపీఎస్) డైరెక్టర్ వి.ప్రతిమ, సీనియర్ అసోసియేట్ అలెన్ జాన్, రోడ్లు భవనాల శాఖ
కన్సల్టెంట్ నీరజ్ ఆద్య, యునిసిఫ్ ఏ అండ్ సి స్పెషలిస్ట్ ప్రొసూన్ సేన్, టెక్నికల్ కన్సల్టెంట్
చావా లక్ష్మిసుధ, ఇవి స్వర్ణలత పాల్గొంటారు.
Subscribe to:
Post Comments (Atom)
అసామాన్యుల స్ఫూర్తి గాథలు
రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...
-
ఒకే వేదికపైకి 19 చేనేత కులాలు విజయవాడలో భారీ బహిరంగ సభ ఆలోచన రాజకీయ అధికారం కోసం పోరాటం రాజకీయంగా , ఆర్థికంగా , సామా...
-
తాడి ప్రకాష్ THE ETERNAL SONG OF ELURU ROAD ------------------------------------------------------------------- పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు...
-
v రాయలసీమకు మహర్ధశ v ఆ 4 జిల్లాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ v వ్యవసాయంలో అగ్రగామి శింగనమల v పట్టుదలతో ముచ్చుమర్రి ఎత్తిపోతల...
No comments:
Post a Comment