సచివాలయం,
సెప్టెంబర్ 19: ఆంధ్రప్రదేశ్
జలవనరుల విభాగం ఇంజనీర్లకు ఈ నెల 20, 21వ తేదీల్లో రెండు రోజుల పాటు ‘ప్రత్యామ్నాయ వివాద పరిష్కార (ఆల్టర్నేట్ డిస్పూట్ రిజొల్యూషన్ -
ఏడీఆర్) పద్ధతులు’ అనే అంశంపై వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్లు ప్రత్యామ్నాయ
వివాద పరిష్కార అంతర్జాతీయ కేంద్రం(ఐసీఏడీఆర్) కార్యదర్శి జెఎల్ఎన్ మూర్తి ఒక ప్రకటనలో తెలిపారు.
విజయవాడలోని నీటిపారుదల కాంపౌండ్ లోని రైతు శిక్షణ
కేంద్రంలో 20వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు వర్క్ షాప్ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.
ఈ వర్క్ షాప్ కు ముఖ్య అతిధిగా ఏపి జలవనరుల విభాగం
కమిషనర్ ఎం.గిరిధర్ రెడ్డి హాజరవుతారని తెలిపారు. ఐసీఏడీఆర్ సుప్రీం కోర్టు పరిధిలో పనిచేసే స్వయంప్రతిపత్తిగల
సంస్థ అని, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీనికి ముఖ్య నిర్ధేశకులుగా ఉంటారని
తెలిపారు. ప్రత్యామ్నాయ వివాద పరిష్కార పద్ధతులు, ఇటీవల కాలంలో వచ్చిన సవరణలపై ఈ వర్క్ షాప్
నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో ఇంజనీర్లకు మధ్యవర్తిత్వం(ఆర్బిట్రేషన్)కు సంబంధించిన నైపుణ్యతలు, మెళకువలు, లాభాలు ప్రధాన శిక్షకులు వివరిస్తారని మూర్తి
పేర్కొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
గోలి మధు కలానికి పదును, స్పీడు, ఎరుపు ఎక్కువ!
‘ఎదురీత’ పుస్తక సమీక్ష ఎవరు ఏ సమస్య చెప్పినా వెంటనే స్పందించి, ఇట్టే అద్భుతమైన కవిత్వం రాయగల దిట్ట ప్రముఖ అభ్యుదయ కవి గోలి మధు. ఆయన కవిత...
-
పుష్ప- 2: ది రూల్ సినిమా ట్రైలర్ నవంబర్ 17వ తేదీ ఆదివారం బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపైన వి...
-
కేంద్ర నిధులలో అధిక వాటా రాబట్టే విధంగా ప్రణాళికలు రాష్ట్రీయ కృషి వికాస్ యోజనపై సీఎస్ సమీక్ష సచివాలయం, మార్చి 27: రా...
-
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన న్యాయవాది, రచయిత సావిత్రీపతి మాదిరాజు గోవర్థనరావు రాసిన ‘మన మంగళగిరి 2.0’ని ఇటీవల స్థానిక శాసనసభ...
No comments:
Post a Comment