సచివాలయం,
సెప్టెంబర్ 19: ఆంధ్రప్రదేశ్
జలవనరుల విభాగం ఇంజనీర్లకు ఈ నెల 20, 21వ తేదీల్లో రెండు రోజుల పాటు ‘ప్రత్యామ్నాయ వివాద పరిష్కార (ఆల్టర్నేట్ డిస్పూట్ రిజొల్యూషన్ -
ఏడీఆర్) పద్ధతులు’ అనే అంశంపై వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్లు ప్రత్యామ్నాయ
వివాద పరిష్కార అంతర్జాతీయ కేంద్రం(ఐసీఏడీఆర్) కార్యదర్శి జెఎల్ఎన్ మూర్తి ఒక ప్రకటనలో తెలిపారు.
విజయవాడలోని నీటిపారుదల కాంపౌండ్ లోని రైతు శిక్షణ
కేంద్రంలో 20వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు వర్క్ షాప్ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.
ఈ వర్క్ షాప్ కు ముఖ్య అతిధిగా ఏపి జలవనరుల విభాగం
కమిషనర్ ఎం.గిరిధర్ రెడ్డి హాజరవుతారని తెలిపారు. ఐసీఏడీఆర్ సుప్రీం కోర్టు పరిధిలో పనిచేసే స్వయంప్రతిపత్తిగల
సంస్థ అని, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీనికి ముఖ్య నిర్ధేశకులుగా ఉంటారని
తెలిపారు. ప్రత్యామ్నాయ వివాద పరిష్కార పద్ధతులు, ఇటీవల కాలంలో వచ్చిన సవరణలపై ఈ వర్క్ షాప్
నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో ఇంజనీర్లకు మధ్యవర్తిత్వం(ఆర్బిట్రేషన్)కు సంబంధించిన నైపుణ్యతలు, మెళకువలు, లాభాలు ప్రధాన శిక్షకులు వివరిస్తారని మూర్తి
పేర్కొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
అసామాన్యుల స్ఫూర్తి గాథలు
రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...
-
ఒకే వేదికపైకి 19 చేనేత కులాలు విజయవాడలో భారీ బహిరంగ సభ ఆలోచన రాజకీయ అధికారం కోసం పోరాటం రాజకీయంగా , ఆర్థికంగా , సామా...
-
తాడి ప్రకాష్ THE ETERNAL SONG OF ELURU ROAD ------------------------------------------------------------------- పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు...
-
v రాయలసీమకు మహర్ధశ v ఆ 4 జిల్లాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ v వ్యవసాయంలో అగ్రగామి శింగనమల v పట్టుదలతో ముచ్చుమర్రి ఎత్తిపోతల...
No comments:
Post a Comment