·
7 రోజుల పాటు ప్రసంగాలు, చర్చలు, సాంస్కృతిక కార్యక్రమాలు
వెలగపూడి,
జూన్ 1
: నవనిర్మాణ దీక్ష జూన్ 2 నుంచి 8వ తేదీ వరకు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
నిర్ణయించింది. ప్రతి యేటా జూన్ 2న ఈ దీక్షా దినోత్సవంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే.
విజయవాడ బెంజ్ సర్కిల్ లో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు
నవనిర్మాణ దీక్ష జరుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నవనిర్మాణ
దీక్షను ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా సీఎం ప్రసంగం, ప్రతిజ్ఞ కార్యక్రమాలు
ప్రత్యక్ష ప్రసారం జరుగుతాయి. జిల్లా స్థాయిల్లో కూడా
బహిరంగ సభలు జరిగే ప్రదేశాల్లో నవనిర్మాణ
దీక్షా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆయా ప్రాంతాల్లో ఉదయం జరిగే కార్యక్రమంలో
ప్రజలంతా పాల్గొని ప్రతిజ్ఞ చేయాలి. అలాగే కుటుంబ సభ్యులంతా కూడా ఇళ్ల వద్ద ప్రతిజ్ఞ కార్యక్రమంలో
పాల్గొనాలి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిజ్ఞా కార్యక్రమం విజయవంతం చేయడానికి జిల్లా
యంత్రాంగం అవసరమైన ఏర్పాట్లు చేసింది. నవనిర్మాణ దీక్ష సందర్భంగా
రాష్ట్రంలోని అన్ని శాసనసభా
నియోజకవర్గాల్లో వారం రోజుల పాటు ప్రతిరోజూ ప్రజల భాగస్వామ్యంతో
వివిధ అంశాలపై ప్రసంగాలు, చర్చా
కార్యక్రమాలు ఈ కింద తెలిపినవిధంగా నిర్వహిస్తారు.
జూన్ 2 : ముఖ్యమంత్రి
ప్రతిజ్ఞా
కార్యక్రమం
జూన్ 3 : రాష్ట్ర
పునర్విభజన చట్టం – హామీలు –
అమలు పరిశీలన
జూన్ 4 : ప్రజలే
ముందు (పీపుల్ ఫస్ట్) – పారదర్శకత,
జవాబుదారీ
పాలన – అన్ని స్థాయిల్లో అవినీతి నిర్మూలన.
జూన్ 5 : రైతుల
ఆదాయం రెట్టింపు చేయడం – స్థిరమైన అభివృద్ధి విధానాలు, ఏకీభవించే
విధానం – జీవనోపాధి మెరుగుపరచడం, జాతీయ
ఉపాధి హామీ పథకం (ఎంజిఎన్ఆర్ఈజిఎస్)
– కరువు నివారణ
– పోలవరం సాగునీటి ప్రాజెక్టు పూర్తి.
జూన్ 6 : పరిశ్రమలు,
పెట్టుబడుల
ఆకర్షణ, రెండు విడతలు నిర్వహించిన పెట్టుబడి సదస్సుల
ద్వారా వచ్చిన ప్రతిపాదనలకు మద్దతు కూడగట్టడం –
ఉద్యోగావకాశాలు
మెరుగుపరచడం – నైపుణ్యత
జూన్
7 : అభివృద్ధితో కూడిన సంక్షేమం, వెనుకబడిన, పేద
వర్గాలకు అభివృద్ధి ఫలాలు చేరేలా తీసుకోవాల్సిన చర్యలు – సంక్షేమం, అభివృద్ధి
పథకాలపై చర్చ – ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం – సామాజిక
వర్గాల అభివృద్ధి.
జూన్
8 : మహా సంకల్పం
జూన్ 8న కాకినాడలో జరిగే మహాసంకల్పం కార్యక్రమంలో
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటారు.
జూన్ 3 నుంచి 7వ తేదీ వరకు
విజయవాడలో 10 వేల మంది ప్రజలు పాల్గొనే విధంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అంశాల
వారీగా ప్రతిరోజూ ప్రజా ప్రసంగాలు, చర్చలు నిర్వహించడంతో పాటు, ఆయా అంశాల
ఆధారిత సాంస్కృతిక కార్యక్రమాలు కూడా సాయంత్రం వేళల్లో నిర్వహిస్తారు.
జిల్లాల ఇన్ చార్జ్ మంత్రులు ఆయా జిల్లాల్లో
నవనిర్మాణ దీక్షా కార్యక్రమాల్లో ముఖ్యఅతిధులుగా పాల్గొంటారు. దీక్ష జరిగే వేదిక వద్ద ఆయా అంశాల ఆధారిత ఫొటో
ఎగ్జిబిషన్ కూడా నిర్వహిస్తారు. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు, జిల్లాల
అధికార యంత్రాంగంతో నవనిర్మాణ దీక్షా కార్యక్రమాలను ఇన్ చార్జ్ మంత్రులు సమన్వయం
చేస్తారు. ఇందుకోసం నియోజకవర్గాల వారీగా ఓ ప్రత్యేక అధికారిని ఇన్ చార్జ్ గా
జిల్లా కలెక్టర్ నియమించారు. ప్రజలను సమీకరించి విజయవంతం చేయడంలో స్థానిక
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బాధ్యత వహిస్తారు. నవనిర్మాణ దీక్షా కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఒక్కో జిల్లాకు
ఒక్కో సీనియర్ ఐఏఎస్ అధికారిని ఇన్ చార్జ్ గా నియమించారు.
వారు ఈ కార్యక్రమాలను జిల్లా
కలెక్టర్ లతో సమన్వయం చేసుకుంటూ వారికి కేటాయించిన జిల్లాల్లో ఈ వారం రోజుల
పాటు అందుబాటులో ఉంటూ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
No comments:
Post a Comment